మత్స్య మహా పురాణము
247 - వరాహోత్పత్తి-ధరణీ సముద్ధరణము.
శౌనకుడర్జునునితో ఇట్లు చేప్పేను: ఈ జగమంతయు పూర్వము హిరణ్మయమగు అండముగ నుండెను; ప్రజాపతి మూర్తి ఇదియే అని వేదమున వినబడుచున్న దీ; వర్ష సహస్రానంతరమా విభుడు దానిని సృష్టిని మీ తమే మొదట ఊర్ధ్వాధః. కపాలములుగా భేదించెను; లోక జన్మకర్తయగు విష్ణుడు దానిని మరల ఎనిమిది గా విభజించెను; విభాగకర్తయగు అతడు దీనియందు జగద్విభాగ మొనర్చెను; వానితో ఊర్ధ్వముఖావకా రంధ్ర మాకాశమును ఆధోరంధ్రము రసాతలమునుగా విశ్వ యోగయోగియగు ఆ దేవుడు ఏర్పరచెను; ఆ దేవుడు లోక సృష్టి సంకల్పముతో నిర్మించిన యండముతో ఏర్పడిన మావి బ్రహ్మాండాశ్రయమగు సలిలమందుపడి స్వర్ణమయ (మేరు) పర్వతమయ్యెను; వేలకొలది పర్వతములతో గహనమును విషమమునునగు మేదిని (భూమి) ఏర్పడెను; బహుయోజన విస్తరములును బరువునునగు సహస్ర పర్వతగణ సమూ హముతో పీడితయై భూదేవి పీడిత యయ్యెను; భూరి బలయుతమును దివ్యమును నారాయణాత్మక మును హిరణ్యమయ మును సువర్ణ రూపమునునగు విష్ణు సృష్టమయిన ఆ తేజస్సును మోయజాలక ఆ భగవ త్తేజః పీడితయగు క్షితిదేవత క్రిందకు క్రుంగి పోయెను; పాతాళమున ప్రవేశించేను; మధుసూదనుడట్లామే అధఃప్రవిష్టయగుచుండుట చూచి ఆమెకు హితమాచరించు తలంపుతో ఆమెను ఉద్దరించ (పైకేత) దలచెను; అతడామెతో ఇట్లనెను: వసుధా దేవీ! పాపము (తప స్విని –దయనీయ-జాలిపడదగినది ఆగు) ఈ నీవు నా తేజస్సు నీయందు నిలువగా మోయజాలక దుర్బలయగు గోవు బురదయందువలే రసాతలమందు దిగబడితివి; అన పృథివి విష్ణునిట్లు స్తుతించెను.
భుదేవీకృతవిష్ణుస్తుతిః.
(*తవ క్రోధాద్ధి బలవా జనార్దన జితో బలిః)
త్రివిక్రమా! అమిత పక్రనూ! మహావరాహా! సురోత్తమా! శ్రీ శార్జచ క్రాసిధరాః గదాధరా; నీకు నమస్కారము; దేవో తమా! ప్రసన్నుడవుగమ్ము; దేవా! నీ దేహమునుండి జగము జనించినది; పుష్కర ద్వీపము ఉత్తీతమయినది: లోకము లను సృష్టించు బ్రహ్మయు సకల భూతములతో శాశ్వతుడవును నీవే యని వేదములనును; నీయనుగ్రహముననే ఈ పురందరుడు స్వర్గమనుభవించుచున్నాడు. జనార్ధనా! నీక్రోధముననే సర్వదే శ్యులును (బే) చెదరిపోవుచున్నారు; ధాత (సష్ట) విధాత (స్థితికర్త) సంహర్త.ఇందరును ఇదియంతయు నీయందే నిలిచియున్నది; మనువు యముడు ఆగ్ని వాయుపు పర్జన్యుడు వర్ణములు ఆశ్రమ ధర్మములు సాగరములు పర్వతములు వృక్షములు నదులు ధర్మము కాముడు యజ్ఞములు యజ్ఞ క్రియలు విద్యయు తెలియవలసినది) సత్వము.ప్రీ-శ్రీ -కీర్తి ధృతి -క్షమ పురాణములు వేదములు వేదాం గములు సాంఖ్యము యోగము భవము (సృష్టి) ఆభావము (ప్రళయము) స్థావర జంగమ (చర) భూతములు భూతము వర్తమానము భవిష్యము ఇంకను త్రిలోకముల యందున్న దంతయును నీ ప్రభావమును ఆశ్రయించియున్నవి; త్రిదశుల (దేవతల)నేడు ఉదార ఫలమునిచ్చునదియును స్వర్గస్త్రీలనేడు మనోహర పల్లవములుకలదియును సర్వలోకమనోహరమును విమానములను అనేక శాఖలు కలదియు మేఘజలమను తేనెను స్రవించునదియు దివ్యలోక ములను మహాస్కంధము ( పెద్ద బోదె) సత్యలోక మను చిగురు కొమ్మ సాగర జలములనేడు నిర్యాసము (జిగురు ఊట) రసాతలమనెడు పొతు ఆది శేషుడ నేడు తల్లివేరు జంతువులు పక్షులు ననెడు ఆశ్రితులు శీలము ఆచారము ఆర్యులు అనేడు సుగంధము కలదియు నగు దివ్య నర్వలోక మయ వృక్షరూపుడవు నీవు; ద్వాదశార్కులనేడు ద్వీపములు ఏకాదశ రుద్రులనేడు పత్తనములు అష్ట వసువులనేడు పర్వతములు త్రైలోక్యమనేడు నీరు సిద్దసాధ్యులనేడు జలోర్ములు సుపర్లు గరుడు)లనెడు వాయువులు యజ్ఞోరగ దైత్యలోక గణమనేడు మహాగ్రాహములు పితామహుడు (బ్రహ్మ) అనేడు మహా ధీరత్వము స్వర్గస్త్రీలనేడు రత్నములు ధీహీ శ్రీకాంతులనెడు నదులు కాలాంశములు యోగములు మహాపర్వములు ఆనేడు ప్రయోగములు పొటులు పోటులు) ఆత్మయోగమనేడు మహావీర్యము కల ఏకరాట్ ధర్మముతో నుండు నారాయణుడను మహా సముద్రమవు; లోక తయమును నీచే సృష్టింపబడును; లయింపబడును; సర్వయోగులును నీచే బయటికి తేబడి నిన్నే ప్రవేశింతురు; యుగ యుగమందును నీవే ప్రళయకాలాగ్ని మేఘరూపుడవగుదువు.
దేవా! నీవు యుగయుగమున మహీభారావతారణమునకై ఆవతరింతువు; కృత త్రేతా ద్వాపర కలియుగములందు వరుసగా శుక్ల (చంపక కుసుమ) హరితరక్త కృష్ణవర్ణుడవు: ఆయా యుగ సంధికాలములు వచ్చినపుడు వై వర్ణ్యము నుదుదువు; వేదవేత్తవయి ఆయా కాలములందు సర్వధర్మములకును వైవర్ణ్యము సాంకర్యము కూడ కలిగింతువు; నీవే ప్రకాశింతువు వీచెదవు తపింపజేయుదువు రక్షింతువు కృత్యము లాచరింతువు క్రుద్ధుడవగుదువు క్షాంతినందుదువు దీపింపజేయుదువు వర్పింతువు విడుతువు వెలువడుదువు చల్లార్చేదవు మేలుకొందువు; యుగక్షయమున కాలుడవయి సకల భూతములను నిః శేష మొనరింతువు; అదే కాలరూపుడవై తేటయగు నీటితో ఆనంద పర చేదవు; సర్వభూతములును యుగాం తాగ్ని చే నాకీ వేయ (దహించ) బడగా అన్ని యు పోగా నీవే శేషింతువు; కనుకనే సంతతమును శేషుడవనబడేదవు; శేషించిన ఆత్మను నీ స్వస్వరూపమును చూచికొని మరల విశేష (భేద)మును నీరూపమునందును కలిగించుకొందువు; ఈ హేతువుచేతను నీవు (వి) శేషుడవు; బ్రహ్మేంద్ర వరుణాదులు చ్యవనము (చ్యుతి-నాశము) - ఉత్పత్తి కలవారు. నీవు మాత్రము స్థానమునుండి చ్యుతుడవుకావు. కనుక అచ్యుతుడవు. బ్ర హ్మేంద్ర రుద్ర యమ వరుణులను గూడ నిగ్రహించి హరింతువు కావున హరివి. సనా (ఎల్లపుడు) భూతములను శ రీరకీర్తి శ్రీలతో కూర్చుచు నీవు చిరస్థాయి వపువు (శరీ రము)తో కూడియుందువు. కావున నీవు 'సనా(దా)తనుడు' (ఎల్లపుడు ఉండువాడు) అయితివి. బ్రహ్మాది దేవతలును ఉగ్ర తేజస్కులగు మునులును నిన్ను అందుకొనజాలరు. కావున అనంతుడవు (అంతము-అంతకము- సమీపమునకు వచ్చుట) శతకోటి కల్పములకయిన నీవు క్షయించవు-క్షరించవు-(కరుగపు-తరుగవు) కావున అక్షరుడవు. స్థావర జంగ మాత్మక జగత్తును విష్టబము (నిలుపబడినది)గా చేయుదువు కావునను సచరాచర త్రైలోక్యమును విష్టంభించి (ఆశ్ర యముగా చేసికొని) ఉందువు.యక్ష గంధర్వ నగరములతో మ హాభూత నాగులతో నిండిన సచరాచర త్రైలోక్యమును వ్యా ప్రమయి నీయందు ప్రవేశించియున్నది కావునను నీవు విష్ణుడవు (విశంతి సర్వభూతాని ఏనం-విశంతి సర్వభూతానీ ఆయమ్) 'సర్వభూత ములును ఇతనియదు ప్రవేశించును. సర్వభూత ములదు ఇతడు ప్రవేశించును.' అని స్వయం భువు చేప్పేను.
తత్త్వదర్శులగు ఋషులు అప్పు(జలము)లను 'నారములు' ఆందురు; (సృష్టికి) పూర్వమతనికవి ఆయనము (ఆశ్రయ - లయ - స్థానము) కావున నారాయణుడవు; యుగయుగమునందును ప్రణాశ మందిన గోవును (ధర్మమును - భూమిని - నన్ను ) తాత్వికముగా యథాస్థితిని పొందింతువు; (గో-విద్) కావున నీవు ఋషులచే గోవిందుడనబడెదవు; త త్వన విశారదులు ఇంద్రియములను హృషీకములందురు; వానికి ఈ గుడవై వర్తిల్లుదువు కావున హృషీ కేశుడవు; యుగ క్షయమందును బ్రహ్మాది భూతములు నీయందు వసించును; నీవును వానియందు వసింతువు; కావున వాసుదేవుడవు; ప్రతికల్పమునందును భూతములను సంకర్షింతువు (దగ్గరకు లాగిందువు -లయింతువు) కావున సంకర్షణుడవు అని తత్వజ్ఞాన విశారదులందురు; దేవాసుర రాక్షసులు ప్రతివ్యూహము (అమరిక)తో నీబలముననే యున్నారు: సర్వధర్మ ముల తత్వములను ఎరుగుచున్నారు: కావున (ప్ర-దివ్: ప్ర-విద్) ప్రద్యుమ్నుడవు; భూతములయందు ఏయొకడును ఇతని కంటేమించి నిరోధము (ఆటంకము) ఒనరించువాడు తన ఆదుపునందుంచుకొవాడు) లేడు కావున మహర్షులచే అనిరుద్ధుడన బడెదవు; విశ్వము నీదే ధరించబడును; సంహరించబడును; నీవు భూతములను ధరింతువు - భువనమును భరింతువు; ఏ కొంచె(తత్వ)మయినను తేజము చేకాని బలము చేకాని మొదట నీచే ధరించబడును; తరువాత నాచే ధరించబడును: నీచే ధరించబడనీదే నాచే ధరించబడదు; ఈ విశ్వమందు నీచేత ధరించబడనిది ఏదియు లేదు;నారాయణా! యుగయుగమునను జగములకు హితము చేయు కామనతో నీవే మహీభారమునవతరించ(దీగునట్లు) చేయుదువు: నీ తేజస్సుతోనే ఆక్రాంతికై (వ్యాప్తికై) రసాతలతలమును చేరియున్న నన్ను రక్షించుము; సుర శేషా! నిన్నే శరణందితిని: క్రోధతత్పరులగు దానవులచే రాక్షసులచే పీడింపబడుచున్న నేను సనాతనుడవగు నిన్నే శరణు పొందుచున్నాను: కకుద్మి (దేవవృషభుడు) అగు నీన్ను మనసా శరణందనంతవరకు నాకు భయము ఉండనేయున్నది. నూరు విధములుగా ఆలోచించినను నీకు ఉపమానము నాకు కనబడుటలేడు. ఇంద్రాది దేవతలును నిన్నే వరితోను పోల్చుటకును శక్తులు కారు. ఎల్లపుడును ఈ విషయము లన్నియు నీవే ఎరుగుదువు. ఇక మీదట (ఇంతకుమించి) పైగా చెప్పవలసినది ఏమియులేదు.
వరాహోత్పత్తిః.
అంతట జార్జ్గచక్రధారియగు భగవానుడు హరి పృథివియందు ప్రీతుడే ఆమె కామములను యథాకామముగ పూరించెను. అంతేకాక - మహాదేవీ! మాధవుని ఈ సవో తమమును మనస్సున ధరించు మర్త్యుడు పరాభవమునందడు; నిష్కల్మషములగు వైష్ణవ లోకమునందును. ఆపురుషుడు వేదముల నధ్యయనము చేసినంతటి వాడును ప్రీతచిత్తుడును మునియంతటి వాడునగును. ఏలయన ఈ మాధవీయ స్తవోత్తమము మహాశ్చర్యకర విషయ సర్వస్వము. కల్యాణీః ధరణీ! నాముందుగా నడువుము. భయమందకుము. ఇదిగో! ఇపుడే నిన్ను నీకు ఈప్సితమగు సముచిత స్థానమునకు చేర్చెదను. అని మహాత్ముడు విష్ణుడు ‘నేను ఏరూపమును ధరించి ఈ ధరను ఉద్దరించగలను.’ అని తదనుకూలమగు దీవ్యరూపమును గూర్చి యేజించేను. వెంటనే మొదటినుండియు జలమున విహరించుటయందు ఆస క్తికల ఆ నారాయణుడు తదనుకూలమగు వారాహరూపము దాల్చేను. ఆరూపము ఏ భూతములకును కనరానిది. వాగ్రూపమయినది - పరబ్రహ్మ మందు నిలుచునది. శతయోజన విస్తీర్ణము - ద్విశతయోజనోన్న తము. నీలమేఘ సమానము మేఘగర్జిత సమానధ్వని, యుక్తము - పర్వతమువలె దృఢనిర్మాణయుతము –భయంకరము- శ్వేత తీక్ష భయంకర దంష్ట్రాయు క్తము- విద్యుదగ్నులతో సమానము - రవి సమాన తేజనము , బలిసిగుండ్రనే పొడవైన భుజమూలములు కలది. గర్వించిన పులివలే నడుచు నది. పీనమయి ఉన్నతమయిన కటిప్రదేశము కలది. మహావృషభలక్షణయుక్తము. ఊర్జితము (పుష్టికలది). పృథివి నుద్దరించదలచి నారాయణుడు అమిత శక్తిమంతము విపులమునగు ఇట్టి వారాహరూపము ధరించి రసాతలమును ప్రవేశించెను.
ఈ వరాహుడు యజ్ఞరూపుడు. అందుచే అతనికి వేదములు పాదములును యూప స్తంభములు దంష్ట్రాలును క్రతువులు దంతములును వేదిక ముఖమును అగ్నులు జిహ్వయును దర్భలు రోమములును బ్రహ్మము (ప్రణవము) శీరమును అహోరాత్రములు కన్నులును వేదాంగములు కర్ణాభరణములును ఆజ్యము నాసికయు సువము తుండమును సామ ధ్వని సత్యధర్మములును క్రమగతములగు పాదవిన్యాసములును ప్రాయశ్చిత్తములు గోళ్లును యజ్ఞపశువులు జానువులును యజ్ఞము శరీరాకృతియు ఉద్దాతయు హోతయు లింగమును బీజములును ఓషధులును మహావృణములును వాయువు అంతరాత్మయు యజ్ఞ విశేషములు వివిధాస్థులును సోమము రక్తమును వేదివి శేషములు స్కంధములును హవ్యకవ్యరూప. హవిస్సులు గంధమును ద్యుతిమంతమును నానా దీక్షాయుతమునగు ప్రాగ్వంశము కాయమును దక్షిణలు హృదయమును ఉపాక రాష్టకము రుచకములుఅను ఆభరణములును ప్రవర్గ్యావృత్తులు భూషణములును నానా ఛందోగతులు మార్గములును గుహ్య(రహస్య)ములగు ఉపనిషత్తులు ఆసనమును ఛాయయను పత్నియునయ్యెను. ఇట్టి మహాసత్ర (యాగ) మయుడగు ప్రభుడా వరాహుడు ఉన్నతమయిలేచిన మణిశృంగమువలె ఉన్న తుడై లేచి రసాతలతలమునమునిగి ఆడుగువరకు చేరిన ధరణిని తన కోర కోనతో లోక హితార్థమయి పైకి లేవనే త్రేను. తరువాత ఆ పృథివీధరుడు వసుంధరయగు పృథివిని మనస్సుతో ధరించి తరువాత ఆమెను స్వస్థానమునకుతెచ్చి విడిచెను. ఆ దేవుడు ధరించినందున మేదినీ సుఖమునందెను. మొదటశంభు (సుఖకారణు)డగు ఆ దేవునకు నమస్కారము చేసెను.
ఇట్లు పూర్వము భూత హితార్థియగు యజ్ఞ వరాహుడు సాగరాంతర్గత యగు. పృథివిని ఉద్దరించెను; ఇట్లా దేవుడును అంబుజనేత్రుడునగు విష్ణుడు జగత్సంస్థావన వాంఛతో భూమినుద్దరించి యనంతరము పృథివిని ప్రభక్తమొనరించ సంకల్పించేను. ఆతులాచింత్య విక్రముడును సురోత్తముడును ఉత్తమ యజ్ఞ వరాహ రూపధారియునగు పృషాకపి (ధర్మరక్షకుడు) నారాయణుడు ఒకేకోరతో మహాబలముతో ధరణీ నిట్లుద్దరించేను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వరాహావతార చరితమున ధరణీ సముద్ధరణమను రెండు వందల నలువది ఏడవ అధ్యాయము.
