మత్స్య మహా పురాణము
160 - హిరణ్యకశిపూపాఖ్యానము - ఆరంభము - నరసింహ ప్రాదుర్భావము - హిరణ్యకశిపు సభా వర్ణనము॥
ఋషులు సూతు నిట్లడిగిరి: ఇపుడు మేము హిరణ్యకశిపు వధమును పాపనాశ కమగు నర సింహదేవ మాహాత్మ్య మును విన కుతూహలపడుచున్నాము॥ అన సూతు డిట్లు చెప్పనారంభించెను: విప్రులారా! పూర్వము కృతయుగమున దైత్యుల మొదటి తరమువాడు( ఆదిపురుషుడు)ను దైత్యప్రభువు నగు హిరణ్యకశిపుడు పదునొకండు వేల ఏండ్లపాటు జల వాసియై స్నాన దృఢ మౌన వ్రతములు శమదమ బ్రహ్మచర్యములు అనుష్ఠించుచు సుమహాతపమాచరించెను॥ అతని తపమును నియమములను బ్రహ్మ మెచ్చి ప్రీతుడై ఆ స్వయంభూ భగవానుడు స్వయముగా అచ్చటికి రవితేజోయుత మయి హంసలను పూన్చినదై ప్రకాశించు వీమాసముపయి ఆదిత్యవసు మరుద్ రుద్ర విశ్వదేవ ఖేచర మహాగ్రహదిక్ విదిక్ నదీసాగర నక్షత్ర ముహూర్త యక్షరాక్షస పన్నగ దేవర్షి బ్రహ్మర్షి సిద్దన పర్షి (పుణ్యకృత్) రాజర్షి గంధర్వాప్సరోగణము లతో వచ్చెను॥ యజ్ఞత త్వ మేరిగినవారి లో శ్రేష్ఠుడు చరాచర లోక పితగురుడు) ఆగు శ్రీమద్ బ్రహ్మ సర్వదేవతా పరి వృతుడయి ఇట్లు వచ్చి ఆ దైత్యునితో సువతా! (ఉ త్తమ నియమ తపముల ననుష్ఠించినవాడా!) భక్తుడవగు నీ ఈ తప ముతో ప్రీతుడనయినాను॥ నాయనా! వరము కోరుము; ఇష్టముల నీడేర్చుకొనుము; అనగా హిరణ్యకశిపు డిట్లనెను: దేవ శ్రేష్టా! దేవాసుర గంధర్వ యక్షపన్న గ రాక్షస మానవ పిశాచు లేవ్వరును నన్ను చంపగలుగరాదు; ప్రపితామహా! ఋషు లై నను నన్ను శపింపగలుగరాదు; భగవానులగు తమకు నా పై ప్రీతి కలిగినచో నేను మిమ్ము కోరు వర మిదియే॥ శస్త్ర ముతో అస్త్రముతో పర్వతముతో వృక్షముతో ఎండినదానితో తడిగనున్న దానితో పగటియందు రాత్రియంగు నన్నెవరును చంపగలుగరాదు; నేనే రవిచంద్ర వాయు వహ్ని జలాంతరిక్ష నక్షత్రదశ దిశా క్రోధ కామ వరుణేంద్ర యమ కుబేర ధనపతి యక్ష కింపురుషాధిపతులుగా కావలయును॥
తాతా! (నాయనా!)॥ ఈ అద్భుత దివ్యవరములు నేను నీ కిచ్చుచున్నాను॥ వత్సా! నీవు సదా సర్వకామముల (సంకల్పముల) నీడేర్చుకొనగలవు॥ ఇది నిస్సంశయము॥" ఇట్లు పలికి ఆ భగవానుడు అంతరిక్షమును ప్రవేశించి అటనుండి విరాట్ రూపత త్త్వాతీతమయి విశేషముగ విరాజిల్లుచు బ్రహ్మర్షి గణ సేవిత మగు వై రాజమనెడు బ్రహ్మ సదన(లోక మును చేరెను॥
ఇట్టి వరప్రదానమును విని దేవనాగ గంధర్వ ఋషులు పితామహుని ఎదుటికి పోయిరి॥ అట్టి దేవతలు బ్రహ్మతో “భగవన్! ఆ అసురుడు నీ వరప్రదానముతో మమ్ములను వధించును॥ కావున మీ రనుగ్రహ ముంచి శీఘ్రమే హని వధము నాలోచింప ప్రార్థించుచున్నాము॥ తాము॥ సర్వభూతములకు ఆదికర్తయు స్వయముగ సర్వ సమర్థులును ఆగు సృష్టి కర్తయు హవ్యకవ్యములను వ్యవస్థ చేసినవారును అగు భగవానులు ఆవ్య క్తత త్వము ప్రకృతి (జన్మ వ్యక్తి హేతువు)గా గల పండితులు మీరు॥" - అనగా ప్రజాపతి దేవుడు సర్వలోక లోకహితమగు ఈ వాక్యము విని శీతల వచన జలములతో దేవతల నోదా ర్చెను: దేవతలారా! వాడు తపమాచరించినందులకు తత్పల మాతడు పొందవలయును॥ తప శిఫలము ముగియగానే విష్ణు భగవానుడు వీనిని చంపును॥ అనిన పంకజగర్బుని వాక్యమును విని దేవతలు (నుఋషు లును) సంతోషయుక్తులయి తమ తమ దివ్యస్థానముల కేగిరి॥
ఆ హిరణ్యకశిపు దైత్యుడును॥ వరము లభించినంతనే దర్పితుడై సర్వ ప్రజలను బాధించేను॥ ఆ దానవుడు ఉత్తమ కర్మానుష్టానములతో సత్యధర్మపరులం దమముతో ఉండు (దాంతులు బహిరింద్రియ ప్రవృత్తులను అదుపులో ఉంచుకొనినవారు) ఆశ్రమములందలి మునులను బాధించుచు భయ పెట్టుచునుండెను॥ త్రిభువన పతులయియున్న) దేవతలను ఓడించి ఆ మహాసురుడు తే లోక్యమును వశీకరించికోని స్వర్గమందు వసింపసాగేను॥ ఎపుడు వరమద గర్వితుడై వాడు కొలకర్మములచే పేరితుడై దైత్యులను యజ్ఞ భాగభోక్తలనుగాను దేవతలను ఆ అధికారములేని వారిని గాను చేసెనో అపుడు ఆదిత్య సాధ్య విశ్వదేవ వసు రుద్ర నాయక దేవగణ-యక్ష సోమ దేవతాభేద ద్విజమహర్షులు మహాబలుడు దేవదేవుడు యజ్ఞమయుడు (యజ్ఞమునకు సంబంధించిన ఉపకరణములు మంత్రములు॥యజ్ఞ కర్మ ప్రకి యలు-ఋత్విక్కులు పశువు యజమానుడు॥ యజ్ఞభాగముల ననుభవించువారు యజ్ఞ ఫలముల నిచ్చు వాడు॥యజ్ఞ ఫలము - ఇట్టివన్ని యు తానే యైనవాడు) వాసుదేవుడు (సర్వము తనయందు వసింపగా॥॥ సర్వమునందు తాను వసించువాడు) సనాతనుడు (ఎల్లపుడు నుండువాడు) శరణ్యుడు నగు విష్ణుని శరణు కోరి ఆతని ఎదుటికి పోయిరి॥
దేవతలు॥ విష్ణు నిట్లు ప్రార్థించిరి: నారాయణా! మహాభాగా!॥ దేవతలు నిను శరణు జొచ్చినారు; ప్రభూ! సురోత్తమా! రక్షించుము; దైత్యేంద్రుడగు హిరణ్యకశిపుని చంపుము॥ నీవే బ్రహ్మాదులమగు మాకు ఉత్తముడగు పోషకు డపు; రక్షకుడవు; నీవే మాకు పరమగురువు; తల్లిదండ్రులు॥ హితము తెలుపు-చేయువాడు) నీవే మాకు పరమ దైవతము; అనగా విని విష్ణువు “అమరులారా! భయము విడువుడు; మీకు అభయ, మిచ్చుచున్నా ను॥ ఆపై త్వరలో దేవులారా! మీరు స్వర్గమును తిరిగి పొందగలరు; ఇదిగో! నేను వర దానదర్పితుడు అను రెంద్రులకును చంపనలవి కానివాడు దైత్యుడు నగు ఆ దానవేంద్రుని సపరివారముగా చంపబోవుచును॥ అని పలికి ఆ భగవానుడు దేవ! శేష్టుల ననుమతించి పంపివే నేను॥ తరువాత హిరణ్యకశిపుని వధించు సంకల్పముతో సత్వరుడై॥ ఓం కారమును సహాయునిగా తీసికొని ప్రభువు భగవానుడు అవ్యయుడు (ఏ మార్పును లేని వాడు) విష్ణువు (ప్రతి వస్తువునందును వ్యాపించియుండువాడు) ఈశ్వరుడు భగవానుడు నగు హరీ హిరణ్యకశిపు స్థానమున కేగెను॥ "హరి అపుడు తేజస్సున భాస్కరుడు కాంతియందు చంద్రుడు తేజము॥తీక్లము; కాంతి మనస్సున కింపయినది) అయి సగము శరీరమున నరుడు అర్థ తనువున సింహమునై ఎడమ చేతిని (కుడి చేతితో తాకుచు నార సింహ శరీరముతో నుండెను॥ అచట ఆ దేవునకు వి సీరము -దివ్యము హాయి గొలుపునది మనస్సున కింపగు నదీ అన్ని కోరికలను తీర్చగల సౌకర్యములు గలది స్వచ్చమయినది అగు హిరణ్యకశిపు సభ కనబడెను॥ ఆది నూరు యోజనములు పొడవై ఏబది యోజనములకు తక్కువ కాని వెడల్పయినది; ఆకాశమునందు ఎగురుచు కోరిన చోటికి పోగలదీ; ఐదు జనముల ఎత్తయినది; వార్ధకము శోకము శ్రమ లేనిది; శిథిలపరచ (కంపింపజేయ) నలవి కానిది; శుభకరము సుఖకరమునై గదులు ఆసనములు కలిగి రమ్యమై తేజస్సుతో మండుచున్నట్లు కనబడుచు అంతర్భాగ మున నీరుండునట్లు విశ్వకర్మ నిర్మించినది; దివ్య పుష్పమాల్యములతో పుష్పములతో కూడి ఫలముల పుష్పముల నిచ్చు వృక్ష ములు కలది॥
నీలములు పచ్చనివి తెల్లనివి నల్లనివి ఎర్రనివి ఆగు తీగల పందిళ్లు గుబురులు వందల కొలది మంజరులు (తీగ వెంట ఒక దాని ప్రక్క నొక పూవుగా నుండు పూగుత్తులు మంజరులు; ఒకేచోటినుండి అన్ని వైపులకు వ్యాపించినట్లుండు పూగుత్తులు స్తబకములు లేదా గుచ్చములు అని భేదము) కలిగి॥ ఆ సభ తేలిపోవుచున్న తెల్లని మేఘముల గడవలే కన బడుచుండెను॥ ఆది కిరణములు కలిగి ప్రకాశించుచు క్రొత్త వాసనలతో మనోరమమయి సుఖములతో నిండి , దుఃఖములు లేక ఎక్కువ చలిగాని వేడిమిగాని కలిగించక యుండెను॥ - అచటికి పోయినవారికి దానియందున్నంత సేపును ఆకలి దప్పులు బడలికయుండవు॥ వారు మిగుల విచిత్రములును మీగుల ప్రకాశించునవియు నగు నానా రూపములు గల" సుఖ సాధనముల వలన ఉపకారముల నందుదురు॥ అది స్తంభములతో నిలిపి ఉంచబడినది కాదు॥ శాశ్వతమయినది; రాత్రియే ఎరుగనిది; చంద్రసూర్యాగ్ను లను మించి స్వయం సిద్ధములగు తేజః ' కాంతులు గలది; స్వర్గపు ఉన్నత స్థానమందుండి అది తాను ప్రకాశించుచు సూర్యుని కూడ ప్రకాశింప జేయుచున్న దో యగు నట్లుండెను॥ " దేవ మానుష సంబంధులును ॥ ( చేష్ట ములును గుచి గలవియు సమృద్ధములు నగు అన్ని కోరికలకు తగిన సామగులును ఉత్తమములగు భక్ష్యభోజ్యములును పవిత్రమగు వాసనగల పూలమాలలును సదా కోరిన పండ్ల నిచ్చు వృక్షములును ॥వేడిమి వేళ ల చల్లనే చల్లని కాలములం దుష్ణముగా నుండు నీరును అచ్చట గలవు॥ పూచిన కొనలు గల పెద్ద కొమ్మలును వాటియందు చిగురాకుల మొలకలు॥ను కలిగి తీగల పందిళ్లతో కప్పబడినవయి సరస్సులయు నదులయు సమీపములయందు పెరిగిన బహు" వీధ వృక్షములును వాటియందు సుగంధ పుష్పములును రసవంతములగు ఫలములును 'ఆంతగ వెచ్చనివి చల్లనివి కాని సరస్సులును సర్వ తీర్థములును ఆ నరసింహ దేవున కచ్చట' కనబడెను॥ అచటి ఆ సరస్సులును తీర్థములును సుగంధ యుతములగు పద్మ ములతో శతపత్ర పుండరీక ములతో ఎర్రని_నీలపు॥కలువలతో కప్పబడి మనోహరములగు ధార్తరాష్ట్ర ॥ (ఒక విధమగు హంసలు) ములతో మిగుల ప్రీతి గొల్పు రాజహంసములతో కారండ వము (నీటి కాకు : లతో చక్రవాకములతో బేగ్గురు పక్షులతో కుర రము ( ఒక విధమగు నీటి పక్షు) లతో స్పటిక లవలె ప్రకాశించుచు నిర్మలములయి తెల్లని రెక్కలుకల (మరికొన్ని జల) పక్షులతో కూడి బహు హంసార సముల కూతలతో నిండియుండెను॥
ఆ దేవునకు అచటి పర్వతాగ్రములందు సువాసన కల పుష్పమంజరుల ధరించి నానా పుష్పములతో నిండిన శుభ లతలును పెద్ద బోదేలును॥ చక్కని కొమ్మలును అనేక లతలును గల ఎత్తయిన కేతకాశోక ॥ సరళ నాగతిలకార్జున శోకకర్లలకుచ చీన వృక్ష చూత నీపనాగ వృక్షకదంబ వకుళ ధవ ప్రియంగుపాటల శాల్మలిహరిద్రక సాలతమాలతాల చంపక వృక్షములును ఇంక ను మనోహరములయి పూచి ప్రకాశించు మహాశాఖలు గల వృక్షములును మం డెడి ఆగ్నివంటి పగడపు చెట్లును వరుణ వత్సనాభ చందన సుమనస నింబాశ్వతతిందుక పారిజాత లోధ్ర మల్లికా భద్రదారు కామలకీ జంబూవృక్ష ములును లకుచ శైలవాలుక మందారకుస్తుంబరక కదంబకుటజ రక్షకురువక - నీలకురువ కాగురు కుసుంభ దాడిమ బీజపూరక కాలేయక దుకూలపొంగు తైలపతక ఖర్జూర నారికేళ హరీతక,విభీతక మధూక న ప్రపర్ల బిల్వపారా వత వృక్షములును అసనతమాల వృక్షములును పలు విధములగు గుబురులు తమ చుట్టు, నున్న మరి వేరు వేరు చేట్టును పూవులు పండ్లు ఆకులు కలిగి వాటి కై ఉపయోగపడు వివిధాకార లతలును నానా పుష్పఫలయుతములగు ఇవియు ఇంకను అనేక వృక్షములును లతలును ఆ సభకు చుట్టుప్రక్కల సన్ని వైపులను కనబడెను॥ చకోరములును సితపత్రములు (తెల్లని రెక్కలు గల ఒక జాతి పక్షులు మ త్తిల్లిన కోకిలలు గోరువంకలును పుష్పించిన చెట్ల పై పూచిన రేమ్మల కొన లందు కూర్చుండేను॥ చకోరములు సంతోషముతో అట్లు కూర్చుండి పరస్పరము చూచుకొనుచుండెను॥
అపుడా నభయందు గే త్యేంద్రుడగు హిరణ్యకశిపుడు వేలకొలది స్త్రీలు తను పరివేష్టించియుండ విచిత్ర ప్రలు విధములగు) వస్త్రాభరణముల ధరించి వెల ఇంత నరాని మణుల॥వజ్రముల-జ్వాలల కొనలతో ప్రకాశించు కుండలములు దాల్చి రవివలె ప్రకాశించుచు దివ్యము లగు పరపులు పరచినదయి పది నల్వముల ఘన పరిమాణము (నల్వము –నాలుగు వందల మూరలు) గల చిత్రమగు పలు విధముల అమరికలు అలంకరణములు గల) ఆసనమందు కూర్చుండెను॥ (20 మూరలు వెడల్పుx20 మూ॥ పొ॥ X 10 మూ॥ ఎత్తు = 4000 ఘన మూరలు ఆచట దివ్య గంధములతో మిగుల హాయి గొలుపు గాలి వీచుచుండెను॥ అట ఇట్లు జ్వలించు కుండలములతో కూర్చున్న మహాదైత్యుడగు హిరణ్యకశిపుని కొలుచుచు గంధర్వ సత్తములు దీవ్య గానములందలి గీతములు పొడుచుండిరి॥ విశ్వాచీ సహజన్య ప్రమ్లోచంతీ సౌర భేయి సమీచీ పుంజికస్థల మీశ్రకేశి రంభా మిత్రలేఖ శుచిస్మిత చిరునేత్ర అగు, ఘృతాచీ॥ మేనక ఊర్వశి-వీరును ఇంకను వేలకొలది నృత్యగీత విశారదలగు దేవ స్త్రీలును రాజగు హిరణ్యకశిపుని సేవించుచుండిరి॥
నిరుపమానములగు పనులు చేయ సమర్థుడగు ఆ దైత్యేంద్రుని హిరణ్యకశిపుని ప్రా ప్రవరులగు వందల కొలది వేల కొలదిగ దితిజులు సేవించుచుండిరి॥ బలి విరోచనుడు పృథివీ పుత్తుడగు నరకుడు ప్రహ్లాదుడు విప్రచి త్తి మహాసురు డగు గవిష్ఠుడు దశగ్రీవుడు (రావణుడు) వాలి (దైత్యుడు) చేరుటకు అలవికాని మేఘవాససుడు ఘటాస్యుడు అకంపనుడు ప్రజానుడు ఇంద్రజాపనుడు తీవ్ర పరాక్రములగు ఇట్టి దైత్యదానవ సంఘములవారును సురహంత దుఃఖహంత సునామన్ వరుడు ఘటోదరుడు మహాపార్శ్వుడు కథనుడు కఠినుడు విశ్వరూపుడు సురూపుడు మహాబలుడగు స్వవలుడు ఈ మొద లగు వారును వారిలో నుండిరి॥ వీరేకాక ఇంకను ఇతరు లనేకులు మహాత్ముడును ప్రభుడు నగు హిరణ్యకశిపుని సేవించు చుండిరి॥ వీరందరును పూలమాలలు దాల్చినవారు చక్కగ మాటాడువారు గొప్ప నియమముల పాటించువారు॥ వరముల పొందినవారు శూరులు మృత్యువు లేనివారు దివ్యములగు సాధనములును ఆలంకరణములును కలవారు వివిధాకారములు గలిగి అగ్ను లవలె ప్రకాశించు విమానముల పై సంచరించువారు మహేంద్రుని దేహమువంటి దేహములు కలవారు పలు విధములయి విచిత్రములగు భుజకీర్తుల దాల్చినవారు ఆయా అవయవములందు కూడ ఆలంకరణములుకలవారు కొండల వvటి దృడ శరీరములు కల వారు బంగారువలే మెరయు శరీరములవారు రవివలే వెలుగువారు నయి యుండిరి॥ దైత్యసింహుడు మహాత్ముడు నగు హిరణ్యకశిపునకు వలె నుండు ఐశ్వర్యము మరేచ్చట నెవ్వరికిని ఉండుట కనబడదు; వినబడదు॥ చక్కగ రచించిన రత్న గవాక్షములతో శోభిల్లు సభయందు చక్కగ తాపించిన రత్న ములతో ఆచ్చెరువు గోలుపు ఆసనముల వరుసలు కలిగి వెండితో బంగారుతో నిర్మించిన చిత్ర వేదికయందు విమల కనక హారములతో భూషి తొంగుడయి రవికిరణ తేజోవంతుడయి జ్వలించుచు వందల కొలది దైత్యుల సేవలందుకొనుచున్న హిరణ్యకశిపుడు ఇట్లు నర సింహ దేవునకు కనబడెను॥ (గమనిక :- హిరణ్యకశిపుని కొలువులో ప్రహ్లాద విరోచన బలి ప్రభృతి దైత్యులున్నా రని ఇచట చెప్పబడినది॥ దీనిని బట్టి ఈ కథ యందలి ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతమునందు వలె పసివాడు కాడు॥)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున హిరణ్యకశిపుపాఖ్యానమున నరసింహ ప్రాదుర్భావ హిరణ్యకశిపు సభావర్ణన నిరూపణమను నూట ఆరువదియవ అధ్యాయము॥
