మత్స్య మహా పురాణము
9 - మన్వంతర వివరణము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : మనువు (సత్యవ్రతుడు) మత్స్యనారాయణుడు చెప్పిన ఈ విషయమును విని ఆ స్వామితో ఇంకను ఇట్లు పలికెను: మధుసూదనా! పూర్వులగుమనువుల చరితమును నాకు విని పింపుము. అన మత్స్యమూర్తి ఇట్లు పలికెను: సూర్యపుతా: అన్ని మన్వంతరములను మనువుల చరితమును మన్వంతర కాల పరిమాణమును వారి ఉత్పత్తిని సం క్షేపముగా అంతయు తేలి పెదను. ఏక చితుడవయి ప్రశాంతమగు మనస్సుతో వినుము.
(ప్రతి మన్వంతరమునకు మనువుల భేదమును బట్టి ఆ కాలమున ఆరాధ్యులగు దేవతలును వేదములను విద్యలను యజ్ఞాది కర్మానుష్ఠానములను ప్రవర్తిల్లజేసిన ఋషులును సృష్టిని సాగించిన మను పుత్తూలును వేరు వేరుగా ఉందురు. అనువాదకుడు.)
స్వాయంభువ మన్వంతరమున యాములు అనువారు దేవతలు. లోగడ తెలిపిన మరీచి మొదలుగా నారదుని వరకును గల పది మందియు ఋషులు. ఆ గ్నీధ్రుడు అతి బాహుడు. పుత్రుడు సవనుడు(లు) జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యుడు మేధ మేధాతిథి వసువు అను పది మంది కుమారులు. వీరు ప్రతిసర్గమును (పాంచ భౌతికములగు శరీరములు గల ఆయా ప్రాణి విశేషముల సృష్టిని) జరిపి వీరు పరమ పదమున కేగిరి.
స్వారోచిషమనువునకు నభుడు నభస్యుడు ప్రభృతి భరతుడు అను నలుగురు కుమారులు. దత్తుడు నిశ్చ్యవనుడు స్తంబుడు ప్రాణుడు కాశ్యపుడు ఊర్వుడు బృహస్పతి అనువారు ఏడు మంది ఋషులు. తుషితులు అనువారు దేవతలు. వసిష్ఠుని కుమారులగు హవి ఇంద్రుడు సుకృతుడు మూర్తి ఆపుడు జ్యోతి అయస్మయుడు అను ఏడుగురును సృష్టిని కొనసాగించు ప్రజాపతులు. ఉత్త్రముడు మనువుగా ఉండగా ఆయన కుమారులు పది మందియు ప్రజాపతులు. వారు ఇషుడు. సహస్యుడు ఊర్జుడు శుచి శుక్తుడు మధుడు మాధవుడు నభ స్యుడు నభుడు సహుడు అనువారు. ఈ కడపటి వాడు .ఉదారుడు చాల కీర్తి శాలియును. భానువులు అనువారు ఊర్డులు అను గణము వారు సప్తఋషులు. వారి పేరులు కౌకరండికుడు కురండి దాఖ్యుడు ఖండి ప్రవాహణుడు మీతుడు సంహితుడు అనునవి.
నాలుగవది యగు తామసమన్వంతరమున కవి పృథువు అగ్ని అశ్వుడు కపిలుడు జన్యుడు ధీమాన్ అనువారు సప్తఋషులు. సాధ్యులు అను గణమువారు దేవతలు. అకల్మషుడు ధన్వి తపోబలుడు తపోధనుడు తపోరతి తపస్యుడు సుతపుడు తపోధ్యుతి తపోనాథుడు అను తామసుని కుమారులు పది మందియు యుద్ధ విద్యల నెరిగిన వారిలో శేషు లను వంశవృద్ది చేయు వారును ఐరి.
రైవత మన్వంతరమున దేవ బాహుడు సుబాహుడు పర్జన్యుడు సోమపుడు ముని హిరణ్యరోముడు సప్తాకుడు అనువారు సప్త ఋషులు. భూతరజసులు అను గణము వారు దేవతలు. రైవతుని కుమారులు అరుణుడు తత్వ దర్శి ధృతీమాన్ హవ్యపుడు స్వజిత్ యుక్తుడు నిరుత్సుకుడు సత్యుడు నిమేషుడు అంతఃప్రకాశకుడు అను వారు పదిమందియు ధర్మము వీర్యము బలము కలవారు. వీరు ఆ మన్వంతరమున ప్రజావృద్ధి చేయువారు.
చాక్షుష మన్వంతరమున లేఖులు వస్తువులు ప్రవాదులు పారిస్తూవులు దివౌక సులు అను ఏడు తెగల దేవత లుందురు. భృగువు సుధాముడు వీర జుడు సహిష్ణుడు నాదుడు వివస్వాన్ అత్రి అనువారు సప్త ఋషులు. లోగడ అధ్యా, 4) తెలిపిన ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్ కవి అగ్ని పోముడు అతిరాత్రుడు సుదృష్టి అభి మన్యుడు అను పది మంచియు బొమషుని కుమారులు ప్రజావృద్ధి చేయువారు.
వైవస్వత మన్వంతరమున ఆత్రి వసిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్ని అనువారు సప్త ఋషులు. సాధ్యులు వి శ్వేదేపులు రుద్రులు మరుత్తులు వస్తువులు అశ్వినులు ఆదిత్యులు అను ఏడు దేవ గణములు ఉండును. ఇక్ష్వాకువు మొదలగు కుమారులు ప్రజావృద్ధి చేయు వారు.
అన్ని మన్వంతరములందును ఏడేసి మంది మహర్షులు ధర్మ వ్యవస్థ చేసి పరమ పదమును చేరెదరు.
సావర్ణి మన్వంతరమున అశ్వత్థామ శరద్వాన్ కౌశికుడు గాలవుడు శతానందుడు కాశ్యపుడు రాముడు అనువారు సప్త ఋషులు. ధృతి వరీయాన్ పవనుడు సువర్ణుడు విష్ణుడు చరిష్ణుడు ఇజ్యుడు సుమతి బృహత్ క్షత్తుడు వీర్యవాన్ అనువారు పది మంది సావర్ణి కుమారులును ప్రజావృద్ధి చేయు వారు.
వీరు కాక రౌచ్యుడు మొదలగు మరికొందరు మనువులును కాబోవుదురు. రుచి అను ప్రజాపతికి కుమారుడు రౌచ్యుడు. భూతి అను ప్రజాపతికి కుమారుడు భౌత్యుడు. వీరును కాబోవు మనువులలోనివారు.
తరువాత బ్రహ్మ కుమారుడగు మేరుసావర్ణి మనువు అగును. క్రతువు ఋతుధాముడు విష్వక్సేనుడు అనువారు మరి ముగ్గురు మనువులు.
ఇట్లు గడచిన వారు ఆరు మందియు గడ చుచున్న వైవస్వతమనువును రానున్న మనువులు ఏడు మందియు మనువులు చెప్పబడినారు. ఇట్లు మొ త్త్రము పదు నలుగురు మనువులు.
వీరు వేలకొలది దేవ యుగముల కాలము తపమాచరించి ఆ శ క్తిచే లోకసృష్టిని ప్రజాపాలనమును జరుపుదురు. రాజా ! ఇది యంతయు నీకు ఇట్లు తెలిపితిని.
ఈ మనువులు అందరును తమ తమ ఆంతర ములలో చరాచర ప్రాణులతో నిండిన జగత్తును సృష్టించి పాలింతురు. తుదకు కల్పాంతమునందు బ్రహ్మతో పాటు ముక్తిని పొందుదురు.
ఈ సృష్టియును కల్పమును ఒకటి మాత్రమే కాదు. సృష్టులును కల్పములును ఆనంతములు. ప్రతి సృష్టి యందును కల్పమునందును ఇట్లే బ్రహ్మలును మనువులును మరల మరల పుట్టుచు పోవుచుందురు. కనుక) వీరు వేలకొలది దేవ యుగములు ముగిసిన తరువాత మరల మరల నశించుచుందురు. ఆ క్రమములో బ్రహ్మ మనువులు మొదలగు వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇక ముందును ఇట్టే పొందనున్నారు.
(ఇచ్చట సావర్ణి అను మనువులు ఐదు మంది. వీరిలో మొదట చెప్పిన సావర్ణి ఎవరో స్పష్టముగా చెప్పబడ
పృథువు మొదలగువారు భూమిని గోవుగా చేసి పిడుకుట-10-అ.
లేదు. మరియును మిగిలిన మనువులు కాని వారివారి అంతరములలో ఉండెడి సప్తఋషులును దేవతలును మనుపుత్తులును కాని చెప్పబడ లేదు.)
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున మన్వంతరాను కీర్తనమను నవమాధ్యాయము.
