మత్స్య మహా పురాణము

Table of Contents

202 - ధర్మ నామకఋషి వంశ వివరణము.

మత్స్య జనార్ధనుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ వైవస్వతమన్వంతరము వచ్చిన మీదట ధర్ముడ నునతనికి దక్ష పుత్రికలయందు 1. సకల దేవతవంశమును ఉత్పన్నమయ్యేను. వారిలో అరుంధతియందు. సకల పర్వతాది మహాదుర్గ ప్రదేశముల దేవతాత్మతత్వములును జనించెను. సోమపాయులు (సోమ పానము చేయు యోగ్యతకల) వసుపులు ఎనిమిది మంది. 2. వసువను నా మెయందు జనించిరి. వారు ధ్రువుడు ధరుడు సోముడు ఆపుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు; ధరునకు ద్రవిణుడు ధ్రువునకు కాలుడు సుతులు కాలావయవశ రీరములన్నియు మూర్తిమంతములై కాలు నడు జనించేను. సోమునకు వర్చుడు. ఆపునకు శ్రీమాన్ అనలునకు (శివుని నుండి గంగ నుండి శర స్తంబము నుండి కృత్తికల నుండి) అనేక జన్మముల తరువాత పుట్టిన కుమార స్వామి అనిలున కు పురోజవుడు ప్రత్యూషునకు దేవలుడు ప్రభాసునకు దేవతల వడ్లంగియగు విశ్వకర్మ జనించిరి.  3. యమీ అను నా మెయందు నాగవీథి మొదలగునవి జనించెను. వీరు గ్రహనక్షత్రాదీ జ్యోతిర్గణముల శ్రేణులు. 4. లంబ అనుకామె యందు ఘోషులు అనువారు కలిగిరి. 5. భానువన నామెయందు భానువులు కలిగిరి. 6. మరుత్వతి యందు మరుత్వంతులను వారు కలిగిరి. 7. సంకల్పయందు సంకల్పులు. 8. ముహూర్తయందు ముహూర్తములు. 9. సొధ్యయందు మనుడు మనువు ద్రోణుడు నరుడు జాతుడు వీర్యవంతుడు చిత్తహార్యుడు ఆయనుడు హంసుడు నారాయణుడు విభువు ప్రభువు అను పండేండు మంది సాధ్యులు కలిగిరి. 10. విశ్వ అను ధర్ము నీ పత్నియందు క్రతువు దక్షుడు వసుడు సత్యుడు కాలుడు కాముడు అతిథి కుర జుడు మనుజుడు విశ్వుడు రోచమానుడు అను పదిమంది విశ్వేదేవులు కలిగిరి. రాజముఖ్యా! నీకిట్లు ధర్ముని వంశమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరించి చెప్పుట అనేక శతవర్షముల కాలమున తప్ప శక్యము కాదు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణము నందు ధర్మవంశాను కీర్తనమను రెండు వందల రెండవ ఆధ్యాయము.