మత్స్య మహా పురాణము
125 - సూర్యరథస్థ దేవతాభేద కథనము - చంద్రాది గ్రహమండల స్వరూప-తద్రథాది స్వరూప ప్రతిపాదనము - అందు వసంతాది ఋతువులందు సూర్యరథస్థ దేవతా గణభేద ప్రతిపాదనము
(*ప్రమ్లోచస్త్యప్సరాశ్చైవానుమ్లోచంతీతథైవచ))
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ సూర్యరథమును ఆయా మాసములందు యథాక్రమమున ఆయా దేవతలు అధిష్టించియుందురు. అందుచేతనే రవి ఆయా మాసములందును ఆయా ఋతువులందును ఆయా ఋషు లతో గంధర్వులతో అప్సరసలతో సర్వగ్రామణు. (శ్రేష్ట)లతో రాక్షసులతో కూడి తన రథమును నడుపుకొనుచుపోపు చుండునని వేదశాస్త్రములందు చెప్పబడుచున్నది.
సూర్యరథమున 1. వసంత ఋతువునందు-మధుమాధవమానములు; ధాత. ఆర్యమన్-ఆదిత్య దేవతా భేదములు; పుల స్త్యపులహులు - ఋషులు. వాసుకి కణాదులు నౌగులు -నారద తుంబురులు గంధర్వులు -కృతస్థలాపుంజికస్థలలు అప్సరసలు-రథగృత్స రథోజసులు గ్రామణులు. హేతిప్ర హేతులు రాక్షసులు. 2. గ్రీష్మరువునందు -శుచి. శుక్ర మాసములు; మిత్రుడు.వరుణుడు. ఆదిత్య దేవతా భేదములు -ఆతి వసిష్ఠులు ఋషులు తక్షక రంభకులు నాగులు హాహాహూహులు గంధర్వులు. మేనకా సహజన్యలు అప్సరసలు.రథంతర రథకృత్ లు గ్రామణులు. పౌరుష యోధనులు రాక్షసులు; 8. వర్ష రువు నందు నభస్.నభస్య-మాసములు-ఇంద్ర.వివస్వాన్లు ఆదిత్య దేవతాభేదములు. అంగిరుడు భృగువు ఋషులు. ఏలాపుత్ర శంఖపాలులు నాగులు_విశ్వావసూగ్ర సేనులు గంధర్వులు-ప్రహ్లిచానుచలు ఆప్సరసలు. హేతి-వ్యాఘులు రాక్షసులు; 4. శరదృతువునందు ఇషము ఊర్జము మాసములు.పర్జన్యుడు.పూషన్.ఆదిత్య దేవతాభేదములు. భారద్వాజుడు గౌతముడు ఋషులు-ఐరావతుడు.ధనంజయుడు.నాగులు. చిత్ర సేనుడు సురుచి-గంధర్వులు.విశ్వాచీ-ఘృతాచీ-అప్సరసలు. సేనజిత్.సుషే ణుడు.గ్రామణులు.పొరుడు.ఆవారుడు రాక్షసులు; 5. హేమంతమున సహస్సహన్య-మాసములు హంసుడు భగుడు. ఆదిత్య దేవతా భేదములు-కశ్యపుడు.క్రతువు-ఋషులు-మహాపద్ముడు కర్కోటకుడు నాగులు చిత్ర నేనుడు మూర్ఘాయువు-గంధర్వులు
పూర్వచి త్తి-ఊర్వశి-అప్సరసలు.తార్ క్యుడు. అరిష్టనేమి-గ్రామణులు. విద్యుత్-స్పర్ముడు.రాక్షసులు; 6. శిశిర ఋతువునందు తపన్.తపస్య మాసములు.త్వష-విష్ణువు ఆదిత్య దేవతా భేదములు-జమదగ్ని -కౌశికుడు-ఋషులు.కంబళుడు అశ్వతరుడు. నాగులు - ధృతరాష్ట్రుడు సూర్యవర్చస్-గంధర్వులు. తిలోత్తమ రంభ - అప్సర నలు-రుత జిత్ సత్యజిత్-గ్రామణులు-బ్రహ్మో పేతుడు.యక్ష పేతుడు రాక్షసులు.
[ఈ చేప్పిన దేవాది గణములు సూర్యరథమును ఆయా మాసములం దధిష్టించియుండుటలోని తాత్వికార్థమును పురాణమే ఇట్లు చెప్పుచున్నది:] 1. ఈ ద్వాదశ సత్తములు (సత్-తమ- దేవ శ్రేష్టులు)ను ఆయా మానస్థానాభిమాని దేవతలు; మాసభేదమున భిన్న దశలనొందు తమ తేజో విశేషముచే ఉత్తమ తేజోమూర్తియగు రవిలోని సూర్య ప్రధాన తత్వమును ఆప్యాయన మొందింతురు; (ప్రీతునొసరించి అధిక శక్తి సంపన్నుని చేయుదురు. ఋషులు తాము గ్రథనము (కూర్పు) చేసిన వయస్సులతో రవిని స్తుతింతురు. (ఋషులు వాగాత్మక తత్వరూపులు); గంధర్వులు నృత్త గీతములతో రవి నుపాసింతురు. గ్రామణులనగా ఊరి పెద్దలు. వీరు విద్యా గ్రామణులు-త్రయీ విద్యలకును తదంగ విద్యలకును తద్ గ్రామ సమూహమునకును ముఖ్యముగా దేవతాస్తావక గానప్రధానమగు స్వర ముల-గ్రామమునకును అధి ష్ఠాతలు; కనుకనే వీరు ఈశ సంగ్రహము (రవి యందర్ని హితమగు పర మేశ తత్వమును ప్రసన్న మొనర్చు పనిని) నేర వేర్తురు; సర్వగణములు రవిని సర్పణమొనరింతురు.రవి రథమును ముందునకు ప్రసరించు ప్రవృత్తికి సహాయకులుగా నుందురు; రక్షోగణము కూడ ఇదేపనిని (రథరడా రూపమున) నిర్వర్తింతురు. వీరు కాక ప్రగణములలో చెప్పక యు శ్రుతి పురాణములందు ఉదయము మొదలు ఆ సమయ వరకు - రవి రథము వెంటనుందురని చెప్పిన వాలఖిల్య ఋషులు రవిని పరివారించి వెంటనుందురు. వీరు సౌరశక్తి సర్వస్వ రూపులు ఋషులు.
ఇంత యేల? ఈ చేప్పిన దేవతాది గణముల వీర్యమును వయస్సును యోగమును ఆచరికను ధర్మమును తత్వమును బలమును (ఇవి అన్నియు శ్రుతులయందును శాస్త్రములందును కలవు. ఇచట చెప్పబడ లేదు.) అనుసరించి సూర్యుని తేజమాయా దేశకాలములందు వృద్ధినొందుచు పరిణమించుచు నుండును. వాని ననుసరించి రవి తపించు చుండును. ఆ దేపుడు ఆశ క్తితో తన తేజస్సుతో భూతముల యశంభము పోగొట్టి దురితమును హరించి వానికి శుభమును కలిగించును. శుచరులును ఒకోనోక చో (తెలిసి తెలియకయా) చేసిన దురితమునుకూడ ఆరని నశింప జేయును. ఈ విషయమున సూర్యునకు సహకారులై ఈ దేవాది గణములపోరు తమతమ పరివారముతో కూడ సంచరించుచు భూత ముల పై దయతోపానికి వేడిమి వెలుగులనిచ్చుచు జయము కలిగించుచు సంతోష పెట్ట చు వానిని కాపాడుచుందురు.
ఈ సప్తకము (ఆదిత్య-ఋషి-సర్పగంధర్వాపరోగ్రామణి రక్షోగణములుఏడు) ఇంతవరకును గడచిన.ఇపుడు జరుగుచున్న ఇక ముందు రానున్న -మన్వంతరములందు పదునాల్గింటియందును ఇదే విధముగా స్థానాభిమానులుగా ఉండి హిమవరాది ఋతువులయందు యథాక్రమముగ ఉష్ణ హిమ వృష్ట్యాదికమును విశ్వమునందు అహర్నిశములును ప్రవర్తిల్ల జేయుచుందురు.
ఈ రవి తన వ్రతముల (క్రియాశక్తి ప్రవృత్తి) వశమున (చంద్రకిరణములుగా) మారుచుండెడి తన కిరణములతో దేవతలను పితరులను మనుజులను తృప్తి నొందించుచుండును. ఆది ఎట్లనిన సోముడు శుక్లపక్షమున రవియందలి అమృత మును తనయందలి యమృతముగా సృష్టించుకొని తనయందు రక్షించుకొనును. ఆతనిని అతనియందలి యమృతమును సౌమ్యులు సోమారులై యజ్ఞములం దారాధ్యులు- కొమ్యులు (యజనముచే తృప్తులై యజమానులకు కామముల నొసగు వారు) ఆగు దేవతలును పితృ దేవతలును అనుక్రమమున త్రోవుదురు. అదియే చంద్రునియందు కళాక్షయరూపమున కస బడు చున్నది. ఈ దేవతలును పితరులును తా మట్లు తృప్తి నొంది వృద్యౌషధములతోవలె మనుజులను ఆయా ఆన్నము లతో పోషించి ఉ త్తేజింపజేయుచున్నారు. దీని రహస్య మేమన అమృతము త్రోవుట చే దేవతలకు కలుగు తృప్తి అర్ధ మాసము వరకు మాత్రమే యుండును. కాని స్వాహాకారములతో దేవతలను స్వధాకారములతో పితరులను యజించుటచే వారికి కలుగు తృప్తి మాసము పాటుండును. కానీ మనుజులు అన్న ముతోనే జీవింతురు. రవి ఆ మానవాహారమగు అన్న మును తన కిరణముల రూపమున తనయందు నిలుపుకొని యుండును. (అదియే చంద్రుని ద్వారమున సోమాది హవిరాది రూపమున దేవతలకును కవ్యాది రూపమున పితరులకును ఆంది తదనుగ్రహమువ అన్న రూపమున మనుజులకు చేరును. ఇట్లు రవి తన కిరణములయందు నిలుపుకొనిన దేవ పితృ మనుజాహార జన్యతృప్తియే రవి రథపు ఏక చక్రము. ఇట్టి ఏకచక రథముతో రవి వేగముగా ప్రవర్తిల్లుచుండును. అక్కడనే (అంతరిక్ష ద్యులోకములందే) ఆక్రమములు (క్రమము = పాదవిన్యాసము; పాద పిన్యాసము చేయనివి అక్రమములు) అయిన ఆశ్వములతో సాయంకాలమున ముందు నకు ప్రసరించును. ఆందుచే సూర్యుడు అస్తమించుట జరుగును.) సూర్యుడు ఇట్లు పచ్చని గుర్రములచే కొనిపోబడును. కిరణము లనెడు గుర్రములతో నీటిని వేయి విధములుగా తాగును. మరల పచ్చని గుర్రములతో రథము పై కొనిపో బడుచు మరల ఆ జలములను భూతములకు అంద జేయును.
ఈ దివస్పతియగు రవి అహోరాత్రములును ఏడు గుర్రములచే లాగబడు ఏకచకయుతమగు రథముతో సహా ద్వీప సప్త సముద్ర ఘటితమగు ఈ పృథివీ చక్రము నంతను భ్రమించుచుండును. ఆ అశ్వములు స పచ్చందోరూప ములు; కామరూపములు; కామగమములు భగవంతుని లేదా సూర్యుని - సంకల్పానుసారము పొవునవి) మనోవేగయుత ములు; సకృద్యు క్తములు (ఒకమారు పూన్చినంతనే మరల పూంచుచు విప్పుచుండవలసిన పని లేనివి) హరితవర్ణము కలవి; పింగవర్ణమును కలవి; ఎన్నటికిని ఏ మార్పును లేక యుండునవి; అవి ఈశ్వరములు సర్వసమర్థములు; బ్రహ్మ వాదులు (వేద విజ్ఞానవంతములు); అట్టి అశ్వములతో మోయబడు రథమున రవి దివసక్రమముస మండల రూపమున నిరంతరముగా సాగిపోవుచుండును.
ఈ ఛందోమయాశ్వములను కల్పాదియందు ఒక సారి రథమున పూన్చినంతనే భూత సంప్లవ (ప్రళయ) పర్యం తము ఆ రథమును అవి మోసికొనిపోవుచునే యుండును.
దివస్పతి(ద్యులోకాధిపతి)యగు రవి తన కిరణముల శక్తికి మారు రూపములగు వాలఖిల్య ఋషులు పరివార మయి తనవెంట నుండగా మహరు లందరు తాము కూర్చిన వచస్సులతో సుతించుచుండగా గంధర్వాపురోగణములు గీత నృత్యములతో సేవించుచుండగా పక్షములు కలవియు పక్షవలె ఆకాశమున పోవునవియు నగు ఆశ్వములు తన రథమును మోయుచు త్రిప్పుచుండగా రాత్రింబవళ్లు అంతరిక్ష ద్యులోక ములందు సంచరించుచుండును.
చంద్రమణ్డలపరిమాణాదికథనమ్- చంద్రమండల-తద్రథాది-ప్రతిపాదనము
చంద్రుడును నక్షత్రమయమగు వ్యోమవీధియందే సూర్యుని వలెనే సంచరించును. ఇతని ప్రస(క్షయ)వృద్దు లును కిరణముల విషయమును సూర్యుని విషయమునందే చెప్పబడినవి. ఆవి అట్లే గ్రహింపవలెను. ఇచట వేరుగా చెప్ప పని లేదు. చంద్రరథమునకు చక్కని తారలతో ఏర్పడిన మూడు చక్రములును కాడికి రెండు వైపులను తెల్లని మేలగు గుర్రములును ఉండును. ఇతని రథమును అశ్వములును సార థియును జలగర్భమునుండి ఉత్పన్నమయినవి. అజ.శత మఖవృషవాజినరాశ్మ-సప్తధాతు - హంస వామ - మృగ-నామములు గల మనోజవములగు ఆ పది అశ్వములును శంఖము వంటి తెల్లని ఒకే వన్నే కలవి. తెల్లని రథమున ఒకసారి పూన్చిన ఆ ఆశ్వములు ప్రళయ పర్యంతము చంద్ర భగవానుని మోయుచుండును.
చంద్రుని పరివారముగా అతని వెంట దేవనలుసు పితృ దేవతలు నుందురు. శుక్ల పక్షారంభమునుండి సూర్యుడు చంద్రునకు ఆవలగా నుండి సుషుమ్నా మార్గమున తన యొక్కొక్క కరణముతో నింపుచు పోపును. పితరు లును దేవతలును కృష్ణపక్షమున చంద్రుని యందలి అమృతము త్రోవుట చే క్షీణించిన యంశము ఇట్లు పూరింపబడును. అందు చేతనే శుక్లపక్షమున చంద్రకలలు వృద్ధి చెందును; కృష్ణమున క్షీణించును. ఇట్లు సూర్యునిచే కలిగిన ఆప్యాయనము చంద్రకలావృద్ధికి హేతువై ఆతడు పూర్ణిమనాడు సంపూర్ణ మండలు డై కనబడును. కృష్ణపక్ష ద్వితీయ మొదలు కృష్ణ చతుర్దశి వరకు దేవతలును పితరులును జలసారమయుడును అమృతమయుడు నగు చంద్రుని చాంద్ర మధువును ఆమృత మును- త్రావుదురు.
(*ఏవం సూర్యనిమిత్తైషా క్షయవృద్ధి ర్నిశాకరే)
ఇట్లు వర్దమాన- శుక్లపక్షమున నూర్యతేజస్సుచే చంద్రునియం దమృతము నింపబడును. దేవతలును పితరు లును తమకు భక్ష్యమై వచ్చిన సోము ని పూర్ణిమనాడు పరివారించి యుందురు. ఇది ఒక రాత్రి మాత్రమే. శుక్లపక్షాది తిథి మండి భాస్కరాభిముఖుడై యున్నందున నింపబడిన చంద్రుని పర భాగము కలాక్రమమున ఆనాటినుండి దేవతలచే పితరులచే ఋషులచే (ఉపాసకులచే) ప్రొవబడి క్షయించును. చంద్రామృతపానము చేయు దేవతల సంఖ్య ముప్పది మూడు వేలును ముప్పది మూడు వందలును ముప్పది మూడు =36333 ఆగును. ఇట్లర్ఘ మాసముపాటు చంద్రామృతపానము చేసి దేవతలు వెడలిపోవుదురు. కావ్యులు బరిషదులు అగ్ని ష్వాత్తులు అను) పితరులు నిలిచియుండి అమావాస్యనాటి అప రాహపు కడపటి భాగమున రెండు కలల కాలమున చంద్రుని పంచదశ భాగమున మిగిలి జారిపడిన - కలా శేష మును గ్రహించి దానియం దింకను మిగిలియున్న అమృతమును తావి వెడలిపోవుదురు. పితృ దేవతల కందరకును కావ్యులు అని సాధారణముగా వ్యవహారము. కాని వారి విషయ భేదానుసారము నామభేదములు ఉండును. ఈ శ్లోకములందలి విషయ విశ దీకరణము ముందు 140 అ. లో చూచునది.
ఇట్లు పితరులు పదునై దవ కలను అమావాస్య నాడు తావుటతో అది అంతయు నిశ్శేషముగ క్షయించుటకు లోపలనే ఆ చంద్ర మండలములో రవి కిరణవశ మున మరి యొక కల పూరింపబడును. ఇట్లు శుక్లపక్షారంభమునుండి చంద్రక లావృద్ధియు కృష్ణపక్షారంభమునుండి చంద్రకలాక్షయమును ఆరంభమగును. వృద్ధి పదునారు కలల వరకు జరు గును. ఇట్లు చంద్రుని యందు కలుగు కలావృద్ది క్షయములు సూర్యవశముననే జరుగును.
కుజ బుధ గురు శుక్ర శనులకు తారాగ్రహములని జ్యోతిక శాస్త్ర వ్యవహారము. వీరి రథముల విషయమును రాహు కేతు రథ విషయమును ఇక తెలి పెదను. బుధ రథము. తెల్లనిది. దానికి శ్వేత పిశంగ సారంగ నీలశ్యామలోహిత హరిత చిత్రవర్ణములు గలిగి వాయువేగము గల ఎనిమిది యశ్వములు పూన్చియుండును. కుజుని రథమును సధ్వజములు సలక్షణములగు అష్టాంగములు కలిగినవై అగ్ని నుండి పుట్టిన ఎనిమిటి ఎర్రని గుర్రములు లాగుచుండ అతడు దాని పై ఋజువక్రాతిపకగతిత్రయముతో సంచరించుచుండును. బృహస్పతి రథము బంగారుతో చేసినది. దానికి అగ్ని సంభవములగు గౌరాక్వము లెనిమిది పూన్చియుండును. అతడు ప్రతి రాశియందును సంవత్సరముండుచు తన గతి క్రమమున సంచరించును. కు కుని రథమును ధ్వజమును అగ్ని సంభవ ములగు ఎనిమిది గుర్రములును కలిగి మహావేగవంత మయి యుండును. శనియు శబల మిశ్రిత ) వర్గము పొయు వేగము కలిగిన గుర్రములు పూన్చిన ఇనుపరథ మెక్కి నెమ్మదిగా పోవును. రాహురథము తమోమయము; దానికి వాయు వేగములగు నల్లని గుర్రము లేనిమిది యుండును. కేతుర థాశ్వములు సలక్షణాష్టాంగ యుతములై పలాల ధూమవర్ణములై దారుణములై నవి. వాయువేగ ములు. ఇవి ఆయా గ్రహముల రథముల - అశ్వముల - విషయము.
ఈ సూర్యచంద్రాది గ్రహములును జ్యోతిర్గణములును అన్ని యువాతమయములగు పగ్గములతో ఆయా ఆమ రికలతో ధ్రువునితో బిగింపబడి కంటికీ కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు మరీచులు-కిరణములును . కిరణయుతములగు జ్యోతిస్సులును) అవియు ధ్రువునితో నిబద్ధములై తా దతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కషకాశము నిచ్చుచున్నవి. (ధ్రువుడు తన చుట్టు తాను తిరుగుచు జ్యోతిర్గణములను కూడ తన చుట్టు త్రిప్పుచున్నాడు;) ఇవన్ని యు వాయుమయ చక్రముచే పేరితములయి కొర విని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచుండును. ఇట్లు జ్యోతిర్గణములు అంతరిక్షమున తిరుగుటకు హేతువు అగు వాయువునకు ఈ హేతువుతోనే ప్రవహము (ప్ర= మిక్కిలిగా; వహ=వహించునది;) అని నామము ఏర్పడింది.
ఇట్లు ధ్రువుని కేంద్రముగా చేసికొనియున్న తారామయమగు అమరికకు ‘శింశుమార చక్రము’ (శిశుమారమను జలచరపు రూపమున నున్నది) అనీ సంప్రదాయగత నామము. ఈ శింశుమారపు అమరికను ప్రవిభాగ పూర్వకముగ ఎరిగి తత్వమెరిగి దీనిని దర్శించినచో ఏనాటి పాపమానా డే విముక్తమగును. ఏతద్దర్శనముచే ఈ శింశుమార శరీ రమున చిన్న చిన్న జ్యోతిస్సులు తారకలు ఎన్ని కలవో అన్ని యు. అంతకంటే ఎక్కువగను కూడ.సంవత్సరముల పాటు జీవించును.
ఈ శింశుమారపు అమరిక ఇది: పైదౌడ -ఉత్తానపాదుడు యజ్ఞుడు క్రింది దౌడ - మూర్గము(శిరస్సు) ధర్ముడు - హృదయము నారాయణుడు.ముందరి పాదములు సాధ్యులు-ఆశ్వినులు వెనుక సర్దులు (తొడలు అని అర్థము. కాని ఇచ్చట సక్తి అనగా పాపములనియే గ్రహించవలెను.) వరుణుడు అర్యమన్ అను ఇద్దరు దేవతలు శిశ్నము సంవత్సరము . ఆపానము మిత్రుడు-పుచ్చము అగ్ని మహేంద్ర మారీచ కాశ్యప ధ్రువులు అను పదునాలుగు దేవతాత్మక తారాగణముతో ఈ శింశుమారము ఏర్పడినది. (యజురారణ్యక మునుడు ‘ధర్మోపూర్ణానం-బ్రహ్మోత్తరాహనుః యజో2ధరా.విష్ణు రృదయం-సంవత్సరఃప్రజననం- ఆశ్వినౌ పూర్వపాదౌ-ఆతీర్మధ్యం.మి తావరుణావపరపాదౌ.అగ్ని కిపుచ్చస్య ప్రథమం కొండం-తత ఇంద్ర స్తతః ప్రజాపతి రభయం చతుర్థం సవా ఏష దివ్యః శాక్వర శ్శిళుకుమారః’ అని యున్న ది.) ఇట్టి ఈ తారామయ స్తంబము (దుబ్బువంటి ఆమరిక) ఆస్తమించక ఉదయించక సర్వదా ప్రకాశించుచుండును. నక్షత్రములు చంద్రుడు సూర్యుడు గ్రహములు తారాగణములు ఈ శిశుమార చక్రమున కతిముఖములయి చక్రాకృతితో ద్యులోకమున అంతరిక్షాన్నత స్థానమునందు ఉన్నవి. ఇవి తమకు ధ్రువుడు అధిష్టాతగా సురశ్రేష్ఠుడగు ఆ ధ్రువుని మేథిగా చేసికొని అతనిని ప్రదక్షిణించుచుండును. ఈ ధ్రువుడు ఆగ్నీధ్రకాశ్యప వంశీయులలో పరము (శేష్ఠుడు; ఈ జ్యోతీ రూపుడు తానొక్కడే ప్రధానభూతుడై) మేరుపర్వత శిరోమధ్యమునకు తిన్నగా అంతరిక్షాగ్రమున) ఈ జ్యోతి శ్చక్రమును తన యధీసమున పట్టుకొని లాగికొనుచు ఆధోముఖుడై మేరువును చూచుచు ప్రదక్షిణ ప్రతియానము (ఆత్మ ప్రదక్షిణము చేయుచు ఉండును. (మారీచుడు = మరీచికి కుమారుడు)
(ఇది ధ్రువుడు కేంద్రముగాను సూర్యుడు దక్కాలాత్మక ప్రజాపతి కధీసుడుగాను సుండుననేడు సుప్ర దాయము ననుసరించి జ్యోతీరాశి వ్యవస్థ విషయక భావనతో ప్రతిపాదింపబడినది. – అనువాదకుడు)
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వ్యపనయందు సూర్యాది గ్రహ రథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనమను నూట ఇరువదియైదవ అధ్యాయము.
