మత్స్య మహా పురాణము

Table of Contents

153 - పార్వతి జనన - పార్వతీదేవీ వివాహాది వృతాంత కథనము॥

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు సింహాసనమునందు కూర్చుండియున్న తారకాసురుని కడకు వచ్చి ద్వారపాలుడు ఎదుట నిలి చేను; వాడు శుచియై చీనాంబరము (పట్టు వస్త్రము) ధరించియుండెను॥ వాడు మోకాళ్ళు నేలకు ఆనించి చేతితో నోరు మూసికొని అల్పాక్షరములు కలిగియుండియు స్పష్టార్థములతో అలంకృతమగు వచనమును రవి సమూహములంత ప్రకాశమానమగు శ రీరముకల తారకునుద్దేశించి ఇట్లు పలికెను: ప్రభూ “కాలనేమి దేవతలను బంధించికొనివచ్చి వాకిట నిలిచియున్నాడు॥ బందీలు ఎట నుండవలయునని మనవి చేయుచున్నాడు॥ అనగా ప్రతీహారుని వచనము విని దైత్యుడిట్లనెను॥ వారు తమ ఇచ్చ వచ్చినచోట ఉండవచ్చును॥ భువనత్రయమును నాఇల్లే॥ వారికి పాశ బంధములు మాత్రము త్వరగ వదలించుడు॥ ఇట్లు చేసిన తరువాత దేవతలు నొచ్చుచున్న మనస్సులతో జగద్గురుడును (గురుడు = తండి) పద్మసంభవుడును శరణ్యుడునునగు బ్రహ్మను దర్శింపబోయిరి॥ ద్వారపాలురచే నివేదించబడి ఆ ఇంద్రాదులు శిర స్సులు ధరణికి మోపి స్పష్టములగు వర్ణములును ఆర్థములును కల వచ నములతో కనులా సనునిట్లు స్తుతించిరి॥

(ఆది మధ్యాంతములందేల్ల వ్యాపించియుండు) ప్రణవత్రయ స్వరూపుడును ఇపుడిట్లు అనంత భేద భిన్న మై యున్న ఈ విశ్వమునకు మొదట అంకుర మై ప్రసవరూపుడై సంభవ సృష్టి రూపుడై అనంతరము సత్వ (స్థితి) రూపుడై కడపట సంహార రూపుడునగు కాలమూర్తీ: నీకు నమస్కారము॥ నీవు నీ శరీరమును స్వమహిమతోనే వ్యక్త మొనర్చి నీ పేరితో ప్రసిద్దమగు అండము (బ్రహ్మాండము) నుండియే (స్థూల ప్రపంచముగా) రూపొంది అచింత్యుడ వయితివి॥ ఈ అండమునుండియే నీవు ద్యావా పృథివులనెడు ఊర్ధ్వా ధర ఖండములుగా విభాగ మొనర్చితివి॥

నీయందే ఈ విశ్వము వ్యక్తినొంది నీనుండియే సంభవించినది; నీవు రచించినవికారము (జగత్పరిణామము) విషయమున మాకు తెలిసినది ఇదియే॥ జన్మము (వాస్తవమున) లేనివాడును శాశ్వతుడును అనంతుడును దేహధారుల అంతఃకరణవ ర్తియునగు నీవు వ్యక్తుడవగుటయే (జగత్తుగా పరిణమించుటయే) నీ జన్మము॥ ద్యులోకము నీ శిరస్సు॥ చంద్ర సూర్యులు నీకన్నులు॥ సరాది సరీసృపములు నీ కేశ ములు॥ దేసలు నీ చెవులు; నీ ఆవయవములందే మూల ప్రకృతియు ద్యులోకమును నున్నవి॥ భూమి నీపాదములు॥ నీ నాభిరంధ్రమునందు సముద్రములున్నవి; నీవు వేదములచే మాయయు కార్యమును కారణమును శాంతుడవును ఆద్యజ్యోతియును నీవేయని చెప్పబడి ప్రసిద్ధుడవయి యున్నావు॥ వేదార్థములయందు అనుభవముగల వృద్దులగు వారు నిన్ను హృత్పిండాంతర్భాగమున అమరియున్న ప్రాచీన తమ తత్వమునుగా చెప్పుచున్నారు; యోగనిష్ణాతులు నిన్ను ఆత్మనుగా చెప్పుదురు; సప్త సూక్ష్మ తత్వములుగా ప్రసిద్ద ములగు 1॥ మహత్॥ 2॥ అహంకారము 3॥ పంచతన్మాత్రలు (సూక్ష్మ భూతములు) నీవేయని సాంఖ్యు లందురు॥ ఏఏడింటికిని హేతు వగు ఎనిమిదవత త్వముగా పేర్కొనబడిన (అవ్య క్త) తత్వమునుకూడ స్వస్వరూపముతో నీవే అధానుడవై మరుగుపడిన అసాక్షాద్భూత॥రూపముతో ఉజ్జీవింపజేయు చున్నావు॥ దృశ్యమగు స్థూల ప్రపంచమును (స్థూల భూతములను కూడ) సూక్ష్మమూర్తిని నీవే సృష్టించితి ఏ; కారణ తత్వములు అని కొందరచే చెప్పబడినవియు ఆది సర్గమం (సృష్టియందు నీ నుండి యే ఉత్పన్నమయినవి; మరల నీనుండియే అవి స్వస్వవాసనను సంస్కారమును పొందును॥ ప్రపంచము నకు భావ వ్యక్తిని (రూప స్పష్టీకరణమును) దానికి వాసమును (స్థితిని దానికి సంహార మును అనంతత్వమును (సంసారము ఆనాదికావున) కలిగించువాడవు నీవే; గూఢమును అమేయమును త త్త్వమెరుగ రానిది-పరిమితి నిర్ణయించ నలవికానిది) సంఖ్యా వికల్పమునకు అందరానిదియగు కాలము కూడ నీ సంకల్ప మాత్రము చేత అంతమునందును॥ స్థూల భూతములు అనియు సూక్ష్మభూతములు అనియు పేర్కొనబడినవి ఏవి కలవో వోని అంతర్బాగమున వానికి ఆత్మ భూతుడవై యున్న వాడవును నీవే; పురాణ (శాశ్వత) రూపుడవగు నీవే వాటికంటెను స్థూల రూపుడవయియు ప్రపంచ రూపుడవయి పరిణమించి గోచరించుచున్నావు; భూతి భాజులు (సంభూతిని-జన్మమును పొందు పొణులు) పొందు ప్రభవము (ప్రభవము = ఉత్పత్తినందు భూత రూపుడపు (వారికంటే ముందు కూడ ఉన్న వాడవు నీవే; అమరిన రూపమును నీరసించి (తొలగించి కొని) ఈ ప్రపంచమునకు భావి తరువాత కూడ ఉండువాడు) కూడ నీవే; వ్యక్త ప్రపంచము స్థితి నొందుటకు అనుకూలమగు వ్యక్త వ్యాపారమును (ప్రవృత్తిని) నీవే కల్పించుచున్నావు॥ భక్తి భాక్కులగు వారికి నీవే రక్షకుడవనుట స్పష్టము; అనంతమూర్తీ!  మాకును నీవు రక్షకుడవుకమ్ము॥

 అని ఇట్లు దేవతలు అవికారియగు బ్రహ్మ నుస్తుతించి వినములయి ఇష్టార్థ ప్రాప్తిని ప్రార్థించుచున్న మనస్సు లతో నిలిచిరి॥ ఇట్లు స్తుతింపబడిన బ్రహ్మయును మిగుల అనుగ్రహవంతుడయ్యెను॥ వరదుడనగుదునని వామ హస్తముతో నిర్దేశించుచు ఇట్లు పలికెను:

 ఆకస్మికముగ భర్త గతించగా భూషణములు విడిచిన స్త్రీవలే నీశరీరమును మొగమును వాడి కేశముల కలంకర ణాదికము లేక ప్రకాశింపక యున్న దేమి? హుతాశనా నీవు పొగలేక యు అడవిని కాల్చి చాలకొలమట్లే యుండి బూడిదతో కప్పువడినవాడువలె ప్రకాశింపకున్నా వేమి? యమా వ్యాధిమయమయిన శ రీరముతో కూడి(నట్లు) అడుగడుగునను దండమును ఆసరా చేసికొని నడుచుచు ఉన్నా వేమి? నిరృతీ నీవు నిశాచరులకు ఆధిపతివై ఉండియు భయపడినట్లు తోచుచున్నావు; శత్రులను గాయపరచు నీవు రాక్ష సేంద్రా శత్రువు చేతిలో గాయపడినట్లున్నా వేః సర్పములు చాల కాలమునకు ముందే విడిచిన (వట్టి త్రాటిరూపములోనున్న) పాశమును చూచుకొనుచు వరుణా ఆగ్ని చుట్టివేసినవాడువలే తెగ ఎండిపోయియున్నా వేమి? వాయు దేవాః శత్రువులచేతిలో ఓడిపోయినట్లు చేతోరహితుడవయి యున్నా వేమి? పౌలస్త్యాః నీవు కుబేరత్వమును ధనాధి పతిత్వమును కోల్పోయినట్లు మాటాడకున్నా వేమి? ఈ రుద్రులు శూలధారులయ్యు బహు శూలములు (కడుపు నొప్పులు) కలవారమని చెప్పకయే చెప్పుచున్నారు॥ ఎవరు మీయంతటి వారి తేజమును కూడ హరించిరి? మధుసూదనా  నీకరము తీక్షమును నల్లకలువవలె ప్రకాశించునదియునగు చక్రముతో ప్రకాశించక ఏమియు చేతకాని దానివలెనయినదేమి? విశ్వతోముఖా జెప్పవాల్చక నీవు నీ ఉదరమునందే జనించి రక్షింతువని) అచ్చటనే దాగియున్న భువనములను (ఎట్లు రక్షింతునయని) చూచుచున్నా వేల? ఇట్లు వేద మూర్తియగు బ్రహ్మ పలుక గా వాక్కు నకు ప్రధానుడు (ప్రకృతి మూల కారణ) రూపుడు కావున దేవతలు వాయుదేవుని ప్రేరించిరి॥

 అంతట విష్ణువు మొదలగు దేవతల పేరణచే వాయు దేవుడు చతుర్ముఖుడగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను: చరాచర (ప్రపంచ విషయ) మును నీవెరుగుదువు కదా దేవా నీవు విధించిన క్రతువులు ఆశ్చర్యకర గుణములు కల వయి విస్తృతిని పొందేను, మరియు వాటిచే ద్విజనాధులును దేవగణములును పుష్టిని పొందినవారును తాము కోరిన ఫలము లను పొందినవారునునయిరీ, ఇదివరకును స్వరము దేవతలదిగానుండెన॥ కాని ఇపుడో॥నీవిచ్చిన వరయోగ సంబంధమున తారకుడు నిరంతరముగా దేవతల విమాన గణమును అపహరించుటతో స్వర్గలోక మిపుడు మరుదేశము(ఎడారి) తో సమా నమయి యున్నది॥ సర్వగుణాతిశయముతో కూడిన ఏమేరు పర్వతమును సకల వర్వత రాజముగా చేసియుంటివో అదియు నిరంతరముగా అధివాసమునకును విహారమునకును గగనమునందుపయోగించుటతో ఆ దానవుడు దాని శిఖరములను నేత్రములను భగ్న మొనర్చినాడు॥ దాని గుహలయందలి రత్నములన్ని యు దోచీ వేసి ఆ పర్వత భాగములన్నియు బహు దైత్యుల కాశ్రయముగా నొనర్చినాడు॥ దేవరాజా ఆ మేరువు వానికి భయపడి విషాదముతో నిండిన శరీరము కలిగి కూర్చుండుటకు చాలకాలము దైత్యులకు ఉపయోగించునదై తన విమల కాంతులతో దిజ్ముఖములను నింపుచు నున్నది॥ ఆడియుగమున నీవే నిర్మించినవియు మొక్కపోనివియు భేదింపనలవికానివియు అగు దేవతల వేలకొలది ఆయుధములు ఆదైత్యుని శరీరమును చేరగానే అల్పబుద్ధియగు వాని బుద్ధి పండితుల ఎదుట భేదిల్లిన విధమున భిన్న భిన్న ములయి పోయినవి॥ వాని సేనాముఖమునందలి ధూళితో సర్వావయవములును ధ్వంసము కాగా మేము వాని పొకిట ద్వారపాలురవలే నిలిచి మిగుల శ్రమమీదట ఆదేవ విరోధి సభలోనికి ప్రవేశము సంపాదించగలిగితిమి॥ గోప్పవారుగా అటనుండిన వేత్రహస్తులు మమ్ములను కూర్చుండ బెట్టగా నోరు మెదలక కూర్చుంటిమి॥ అటనున్న శత్రువులు మమ్మేగతాళి చేసిరి॥ దేవతలారా మీరు మహాపూజ్యులు॥ సర్వార్థములు సిద్ధి పొందినవారు; మీరు మీత భాషులు; ప్రశంసతో కూడినదియు అధికార్థములతో కూడినదియునగు మాట ఏదై నను ఇపుడెక్కువగా మాటాడుడు: ఇది దైత్య సింహుడగు తారకుని సభ; ఇంద్రుని సభవంటిది కాదిది॥” అని ఇట్లక్కడనున్న తారకుని సేవకులు మమ్ములను మిక్కిలిగా ఎగతాళి చేసి వెక్కిరించిరి॥ క్రతువులు మూర్తిమంతములయి అహర్నిశము వాని నుపాసించును; వదలినచో అపరాధమగునే మోయని అవి క్షణమయిన వానిని వదలవు; సిద్ద గంధర్వ కిన్నరులు తంత్రీవాద్యములతో మంద్రమధ్య తార త్రివిధలయలతో రాగయుక్తముగా వాని గృహములంధదు సన్నిహితులయియుండి గానము చేయుచుందురు॥ ఆయ్యయో వాడు వీరు మిత్రులు వీరు శత్రువులు అని కానీ వీరు గురుజనులు (బరువై నవారు) వీరు తేలిక వారు అని కాని లెక్క పెట్టడు; మరుగు చొచ్చినవారిని కూడ విడిచి వేయును; సత్యమునకు పరి శ్రయమీయనే ఈయడు॥ వాని అవి నయమును నిః శేషముగ॥ ఒక్కమాటలో ఇట్లు చెప్పవలసినదే; ఐనను కాకున్న ను వాని ఆవినయమంతయు ఎపరు నిః శేష ముగా చెప్పగలరు? సృష్టికర్తవగు నీవే ఈ విషయమున శరణము (రక్షకుడవు) కావలయును॥

 ఇట్లు దేవతలు (వాయు ముఖమున) తార కదైత్య చేష్టలు విన్న పించగా విని ఆ భగవానుడు చిరునగవు మొగమునందు తోచుచుండ వారితో నిట్లు పలికెను: దేవతలారా దేవతలందరు కూడియు తారకుని చంపజాలరు॥ ఎవనికి వాడు వధ్యుడో అట్టి పురుషుడు త్రిభువనములందు ఎచ్చటను పుట్టలేదు॥ నేను వానికి కోరిన వరములనిచ్చి త్రిలోకము లను దహించివేయగల తపస్సునుండి వానిని వారించితిని॥ ఏడు దినముల వయస్సుగల శిశువు వలన తనకు మృతి కావలెనని వాడు వరము కోరెను॥ అట్టి స ప దినవయస్కుడగు బాలుడు శంకరునీవలన ఎవడు కలుగునో॥ ఆతడే॥ రవి తేజస్కు డగు ఆత డే॥ తారక నిహంతయగును॥ భగవానుడును ప్రభువునగు శంకరుడు ఇంకను అపత్నీ కుడుగా ఉన్నాడు॥ ఇదియుగాక ఏదేవి కరము ఎల్లప్పుడును ఉతానమయి (నిట్టనిలువుగను విప్పుకొనియు) ఉండునో ఆమే కుమారుడే వానినీ చంపుననియు చెప్పియుంటినిగదా ఇదిగో ఈ దేవీకరము పరదమయి ఉతానమయియే యుండును కదా ఆదేవి ఇక ముందు హిమ శైల పుత్తియగును॥ శర్వాణియగు ఆమేయందేప్పుడు భగవానుడు కామప్రవృత్తుడే ఆ కుమారుని జని యింపజేయునో అప్పుడు అతనితో కూడి (యుద్ధముచేసి) తారకుడు తిరస్కృతుడు (నశించినవాడు) అగును॥ ఏ విధముగ ఇది జరుగునో ఆ యుపాయము నేను చేసియుంటిని॥ ఎక్కువ వ్యవధానము లేకుండగనే తరువాత కోలది కాలములోనే వాని విభవమంతయు వినాశమందును॥ మనస్సులందు భయ సందేహములు లేక కొలది కాలము వేచియుండుడు అని పద్మ సంభవుడు స్వయముగా చెప్పిన మాటవిని దేవతలు ఆయనను నమస్కరించి తమతమ అనుకూలతననుసరించి వెడలిపోయిరి॥

దేవతలు వెడలిన అనంతరము లోక పితామహుడును దేవేశుడును అగు బ్రహ్మ సృష్ట్యాదియందు మొట్ట మొదట ఏర్పడిన తన రూపమేయగు విభావరిని [(ప్రళయ కాల రాత్రిని)] స్మరించెను॥ [మాయా శబళ బ్రహ్మత త్వపు ఒక దశ యందలి రూపము ఈ విభావరీ రూపము అని దీనిని బట్టి స్పష్టమగుచున్నది॥ ఈ హేతువు చేతనే శ్రీదేవీ సప్త శతీపాఠ పూర్వాంగముగా రాత్రి సూక్త పఠనము సంప్రదాయమునందు ఏర్పడెను॥ అనువాదకుడు॥] పిమ్మట వెంటనే భగవతి దేవతారూప యగు రాత్రి బ్రహ్మదేవుని ఎదుట నిలిచెను॥ ఆ సమయమున ఆచ మరెవ్వరును లేరు॥ అట్టి వివిక్త స్థానమందు ఆ విభావరిని చూచి ఆమె నుద్దేశించి బ్రహ్మ ఇట్లు పలికేను: విభావరీ దేవతలకొక మహాకార్యము ఇపుడు తటస్థించియున్నది॥ దాని విషయమున నీవు చేయవలసిన పని నిశ్చిత స్వరూపమును తేలి పేద; వినుము॥ తారకుడను దే త్యేంద్రుడు దేవతలకు ధూమ కేతువు వలె పీడాకరుడై ఉండు టేకాక జయింపబడకయున్నాడు॥ వాని నాశము కొరకై భగవానుడగు ఈశ్వరుడు కుమారుని జనియింప జేయును॥ అతడు తారకుని అంతమొందించు వాడగును॥

శంకరుని భార్యయగు దక్షపుత్త్రి సతియుండెను గదా ఆమేయొక కారణాంతరమున తన తండ్రి విషయమున కుపితురాలయ్యెను॥ (దేహత్యాగమును కూడ చే నెను॥) లోక భావని (సృష్టికిని స్థితికిని హేతుభూత) యగు ఆదేవి హిమ శైల పుత్తియగును॥ సతీదేవి విరహముచే హరుడు జగ యమును శూన్యమయినట్లు భావించి సిద్ద సేవితమగు హిమవత్పర్వత కందరమునందు తపమొనరించును॥ అతడట్లు కొంత కాలమామె జననమున కై ప్రతీక్షించుచు ఆట వసించును॥ (పార్వతియు ఆతనికై తపస్సు నాచరించును॥) ఆట్టు మిక్కిలిగా తపస్సాచరించిన వారికిరువురకును లోక శుభకరమగు కలయిక (వివాహ రూపమున) జరుగును॥ అనంతరము వారికిరువురకును స్పల్పమగు వాకలహము జరుగవలయును॥ ఏలయన-ఆట్లు జరిగినచో తారకుని నాశము విషయమున సంశయము ఉండదు॥ అందులకై నీవు సుర ఆస క్తి కారణముగా సంయోగము చెందుచుండు ఆ పార్వతీ పరమేశ్వరులకు సంతానము కలుగుటలో వీఘ్న ము కలిగించవలసియున్నది॥ అది ఎట్లందువే మో - చేప్పెదను వినుము॥

నీవు పార్వతీ మాతయగు మేనా గర్భమును ఆశ్రయించియుండి ఆ గర్భ(స్థ పిండ)మునకు నీవర్ణము కలుగు నట్లు చేయుము॥ అందువలన వివాహానంతరము శివుడు: శృంగార వినోద పూర్వకముగా మాటలాడుచు (ఆమె దేహచ్చాయ విషయమున) విభ్రాంతినొంది వినోదమున కై ఆమెను బెదరించును॥ (రాత్రిదేవీ దేహచ్చాయ నలుపు కావున ఆమె మేనా గర్భమునందు వసించి నాటినుండియు పార్వతీ దేహచ్చాయ సహజముగ తేలు పే చుయి నను నల్లగా కనబడునట్లు చేయును॥ వివాహానంతరము శివుడు పార్వతి యందపుడపుడు కనబడు నలుపుచాయనే గమనించి సల్లని దానా అని ఎగతాళి చేయుచు ఇట్టి నీవు నాకక్కరలేదని ఇట్లు బెదరించును॥) ఆంతట పార్వతి కుపితురాలయి (ఆ నల్లని దేహచ్చాయను వదలించుకొని తెల్లని చాయ సంపాదించి) గౌరి॥గౌరచ్ఛాయ కలదియగుటకై తపస్సాచరించ పోవును॥ ఆ మేయట్లు తపమవలంబించి శివుని వలన అమిత తేజోమండల మండితుడగు కుమారుని జనింపజేయును॥ అతడు నిస్సంశయముగ తారకాది) దైత్యుల చంపువాడగును॥ దేవీ నీవును లోకములకు దుర్జయులుగానున్న దైత్యులను చంపవలయును॥ కాని నీవు సతీదేవి (రూపయగు పార్వతీ దేహముతో సంబంధము కలిగి (ఆమె దేహమునందా వేశించి) యున్నంతవరకును నీవు దైత్యవధ చేయజాలవు॥ పార్వతి తన తపోబలమున నిన్ను తననుండి వేరుపరచును॥ తరువాత ఆమె గౌర దేహచ్చాయతో గౌరియే శివునికడకేగును॥ తరువాత శివుని యనుగ్రహమున కుమారుని కనును॥ ఈ నడుమ కాలములో నీవు మహిషుడు శుంభనిశుంభులు మొదలగు దానవులను చంపవలయును॥ దానిచే తారకుని బలమును తగ్గును॥ వారు శ్రీవలన మరణమును కోరుట కుమారునివలన మరణము కోరుట యను వరములును నెరవేరి మరణింతురు॥ పిమ్మట పార్వతీ పుత్రుడు న ప దిన వయస్క శిశువుగా తారకుని వధించును॥ అని బ్రహ్మదేవుడు విభావరికి చెప్పిన వచనపు - తాత్పర్యము॥) నీవు ఇట్లు చేయగా అమెయు తన స్వస్వరూపమును పొందగోరి పూనిన తపో నియమమును ముగించును॥ అంతట పార్వతియును తన స్వస్వరూపమును పొందును॥ నీదేహమును సహజ స్వరూపము నొందినదయి గౌరీ రూపమే తనయందు కలదిగా నగును॥ (నీరూపము-విభావరీ రూపము-ఆకృతియందు గౌరిగాను॥ దేహచ్ఛాయ మాత్రము నల్లనిదిగాను నగును॥)

 నీవు ఇట్లు ఉమ (పార్వతి) రూపాంశముతో కూడిన దానవయ్యేదవు॥ వరదురాలవగు విభావరీ లోకము నిన్ను (పార్వతితో) ఏకాత్మక తత్వము అనియు 'అనంత' ఈమె సాక్షాతార్వతియే కాని ఆమెకు అంశ భూతురాలు కాదు॥' అనియు భక్తితో పూజించును॥ ఆవిధముగా నీవు ఆనేక విధములుగా ఉండు ఆకారములతో సర్వమునందునుండి కోరికలను సిద్ధింపజేయుదువు॥ వేదతత్వ వేత్తలగు ఉపాసనాపరులగు విప్రులు 'ఓంకార వక్త్ర' - ఓంకారము ముఖముగా గలది - వేద స్వరూప' ఆనియు 'గాయత్రి' ఆనియు క్షత్రియులు 'ఊర్జితమగు-బలశక్తులతో కూడిన - ఆకారముగల ఆక్రాంతి” అనియు వైశ్యులు 'భూదేవత' అనియు శూద్రులు 'మాతా' ఓ అమ్మతల్లి' అనియు నిన్ను పూజించి సేవింతురు॥ నీవు మునులయందు కలవరపరచనలవిగాని క్షాంతి ‘ఓర్పు’ గా నియమవంతులయందు దయ'గా నయశాస్త్రము ననుసరించి వ రించు వారియందు మహోపాయ సందోహములతో కూడిన 'నీతి'గా 'స్వధర్మము'లకు 'పరిచ్చి తి’ ‘పరిమితి'గా ప్రాణుల హృదయములందు వసించు ‘ఈహ’ ‘వాంఛ’ ప్రయత్నము'గా ఉందువు॥ కీర్తిమంతులయందు 'కీర్తి' సర్వ దేహధారులయందును ‘మూర్తి' 'ఆకృతి'గా అనురాగయుత చిత్తము కల వారియందు 'రతి' 'పరస్పరానురాగము'గా హృద్య॥మనోహరమగు వానియందుగల సౌందర్యమును చూచి యానందించు వారి హృదయములందలి ప్రీతి' 'ఆనందానుభవము'గా సర్వ భూషణములందలి 'కాంతి'గా దుష్ట కర్మాచరణములందలి 'శాంతి'గా సర్వభూతముల హృదయములందలి 'క్రాంతి' ఓఒక దాని జూచి మరియొక టీయను కొనుట'గా తమ ఇచ్చవచ్చినట్లు నడుచుకొనువారియందు 'క్రాంతి' 'అలసట'గా సముద్రములందు “చెలియలికట్ట'గా విలాసవం)తులయందు 'లీల' 'ఒయ్యారము'గా నత్తాత్మక పదార్థములందలి ‘సంభూతి' 'పుట్టుక'గా లోక పాలకులయందు స్థితి''లోక వ్యవస్థ॥లోక జీవనము 'గా సకల భువన నాశ నియగు 'కాళరాత్రి'గా ప్రియ కంఠా శ్లేషము వలని యానందము నంద జేయు 'రాత్రి' ‘విభావరి'గా ఇట్లనేక విధముల దేవీరూపవై లోకమునందు నీవర్చింపబడేదవు॥ వర దురాలవగు దేవీ ఎవరు నియతులై నీ తత్వమునేరుగుదురో పూజింతురో వారికి అన్ని కోరికలును ఈ డేరును; ఇందేమియు సంశయములేదు॥

బ్రహ్మాజ్ఞప్తవిభావర్యాః హిమాచలగమనమ్॥

బ్రహ్మ ఇట్లు పలుక సరేయని నిజాదేవి విభావరి॥కాళరాత్రి రూపయగు మహామాయ కృతాంజలియై త్వరి తముగా దేవతాత్ముడగు హిమవంతుని మహాగృహమున కేగెను॥ అచట ఆమెకు మహా హర్మ్యమునందు కూర్చుండిన హిమవత్పత్ని మేనాదేవి కనబడెను॥ ఆమె రత్నభూషణములు దాల్చి కొంచెము తెల్లనైన ముఖపద్మ కాంతితో ఉం డెను॥ కొంచెము నలు పెక్కిన మొనలు కలిగి పైకెత్తినట్లున్న స్తన భారముచే ముందునకు వంచబడినట్లుండెను॥ మహౌషధి సమూహముతో కూర్చి కట్టబడిన మంత్రరాజము మహామంత్ర రక్షాబంధము) ఆమే దేహము సొశ్రయించి ఉండెను॥ శుద్ధమగు హంసాతకము (బంగారు?)తో చేయబడి కట్టబడిన జీవర జాప్రద మహాసర్పము కలిగి ఉండెను॥

విభావరి అచటకు వెళ్ళిన సమయము పగలు; అయినను ఆయుండిన గృహాంతర్బాగము మణిదీప గణముల జ్యోతిస్సులనుండి వెలువడు గొప్ప వెలుగుతో ప్రకాశితమై తెల్ల ఆవాలు చాల వేదజల్లబడి ఎందరో పరిచారికలు కలిగి శుచియగు చీన వస్త్రములు కప్పియుంచిన గొప్ప పడకల పరపులతో ప్రకాశించుచు ధూపముల వాసనలతో మనోహరమయి సర్వ ‘సర్జ’ రసాదిరస ద్రవ్యముల ॥ ఉపయోగముతో కూడియుండెను॥ క్రమముగ పగలు గడ చేను॥ అది దూర మయ్యెను॥ రాత్రి అయ్యెను॥ అపుడు ఆమేనాదేవీ మహాగృహము అత్యధికమగు సుఖ వి శేషము కలది యయ్యెను॥ పురుషులలో చాలమంది గాఢ నిద్రయందు మునిగిరి॥ పరిచారిక లు నిద్రతో తూగుచుండిరి॥ శివ ప్రీతికరమగు ఆ ప్రదేశమంతయు శుభకరమును క్రొత్తదిగ కనబడునదియునై ఉండెను॥ రాత్రి సంచారి పనులు ఆటునిటు సంచరించు చుండెను॥ రాక్షసులు సంచరించుచుండిరి॥ ముంగిళ్ళయందు క్షుద్ర భూతములు తిరుగుచుండెను॥ పరస్పర ప్రీతి పాత్రులగు ప్రియాప్రియులు గాఢ కంఠాలింగనమున మునిగిరి॥ ఇట్టి రాత్రికాలమున మేనా నేత్ర పద్మద్వయముకూడ విశ్రాంతి కై కొంచెము కలవరపడుచుండెను॥ అదే సమయమున రాత్రి దేవి మేనాదేవితో సంగమము (కూడిక) చెంది ఆమె ముఖమునుండి మేనో శ రీరమున ప్రవేశించేను॥

 మేనాయాం పార్వత్యుత్పత్తిః॥

నిరుపమానమగు జగన్మాతృ జననము జరుగబోవుచున్న దని ఎరిగి రాత్రి దేవి ఆ జగన్మాతృ మాతృ గర్భాంతర్భాగమును ప్రవేశించెను॥ తత్తణమే అచ్చట వ్యాపించి విభావరీదేవి గుహునకు అరణియగు (గుహుడనగా కుమార స్వామి; గుహుడను అగ్ని జనించుటకు అరణివంటిది పార్వతి॥ ప్రాచీన సంప్రదాయమున అగ్నిని ఉత్పత్తి చేయుటకై మథించు కొయ్యపనిముట్టునకు అరణియని పేరు॥ ఇది రెండు భాగములు-క్రింది భాగము॥ గుంతతో ఉండు నది పూర్వారణి; మథించు పైభాగము ఉత్తరారణి॥) పార్వతి దేహకాంతిని జయించి ఆమె శరీర చ్చాయ నలుపగు నట్లోనరించెను॥ అటు తరువాత బ్రాహ్మముహూర్తమునందు సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగు హిమవత్పత్ని మేనా దేవి జగత్తునందంతట నిర్వాణము (సుఖము॥ మోక్షము నకు హేతువగు గుహారణిని (గుహున కు జన్మస్థాన మగు పార్వతిని) కనెను॥

ఆ పార్వతి జనించుచుండ స్థిరచరములగు సర్వలోక నివాసి ప్రాణులు అన్ని యు సుఖవంతములయ్యెను॥ నరక వాసులకును ఆ సమయమున సర్వ శరీర వ్యాపియగు మహాసుఖము కలిగెను॥ క్రూరమగు అంతఃకరణ వృత్తి కల ప్రాణుల చేతస్సు కూడ శాంతమయ్యెను॥ జ్యోతిస్సుల కన్నిటికిని అపుడు మిక్కిలిగ తేజస్సధికమయ్యేను॥ ఓష ధులును మనము (అధిక వీర్యము) చే ఆశ్రయించబడినవి (మహాశ క్తిమంతములు) అయ్యెను॥ పూవులు సుగంధయుతము లును ఆకాశము విమలమును అయ్యెను॥ వాయువులు సుఖ స్పర్శములును దిశలతిమనోహరములును నయ్యెను॥ పృథివీ దేవియు ఉద్బూతమగు ఫలము పంట కలదియు వరి పైరు పంటల వరుసలతో అతి సుందరియు పంటల పరి పాకముతో నిండినదియు నయ్యెను॥ చాల కాలమునుండియు భావితాత్ములయి ఉత్తమ సంస్కారము నొందించబడిన అంతఃకరణ వృత్తి కలవారయి నిర్మలచిత్తులై ఆచరించినను ఫలవంతములు కాక యుండిన తపస్సులును ఆ సమ యమున సాకల్యము నొంది ఫలించేను॥ శాస్త్ర పండితులు చదివి మరచిన శాస్త్రములును ఆ సమయమున వారి చీ తము లందు సాక్షాత్కరించెను॥ ఉత్తమ తీర్థముల ప్రభావము ఎప్పటికంటే పుణ్యతమమయ్యెను॥ మహేంద్ర హరి బ్రహ్మ వాయువహ్ని ప్రముఖులగు దేవతలు వేలకొలది మంది ఆంతరిక్షమునందు విమానములయందుండి హిమవంతుని మీద పూలవాన కురియించిరి॥ గంధర్వ ముఖ్యులు పాడిరి; అప్సరోగణములు వర్తించేను॥ మానవులుగా మూ ర్తిమంతములయి మేరువు మొదలగు మహాపర్వతములన్నియును సాగరములును నదులును అన్నియును దివ్య హిమాచలు ఏ ఇంట చేరువ అయిన ఆ దివ్య మహోత్సవమున కై వచ్చెను॥ ఆ పర్వతోత్తముడగు హిమాచలుడు ఆ సమయమున సర్వభూతములలో మేలగువాడును సర్వ చరాచర భూతములకును ఆశ్రయణీయుడును సేవనీయుడును నయ్యెను॥ దేవతలును దేవనాగ గంధర్వ పర్వత జాతులవారును వారి వారి లీలా విలాసవతులగు స్త్రీలును ఆ ఉత్సవము ననుభవించి తమ తమ నివాసములకు సంతోషముతో వెడలిపోయిరి॥ లక్ష్మీవాణీ దేవతలును దేవతా శ్రేష్ఠులును (వారి స్త్రీలును) నేను ముందు నేను ముందనుచు ఆ హిమ శైలపుత్రిని క్రమముగా పెంచి పెద్ద చేయుచుండిరి॥ ఆ పర్వతపుత్రి పార్వతి అనే ధారణములగు రూప సౌభాగ్య ప్రబోధముల (వికాసముల) తోను రూపలక్ష్మితోను క్రమముగ లోకత్రయమును జయించేను॥

నారదస్యేంద్రోలోక గమనమ్॥

నారదస్య హిమాచలగమనమ్॥

ఇదే సమయమునందు ఇంద్రుడు దేవపూజ్యుడును దేవర్షియు నగు నారదుని తమ దేవకార్యమును సాధించు కొను త్వర తో స్మరించేను॥ భగవానుడా నారదుడును ఇంద్రుని కోరిక నెరిగి మోదయుక్తుడయి మహేంద్రభవనమునకు వచ్చెను॥ సహస్రనేత్రుడా వాసవుడు (ఇంద్రుడు) ఆతని చూచి తన మహాసనమునుండి లేచి యథార ములగు పాదము (మొదలగు ఉపచార పూజల)తో పూజించేను॥ ఇంద్రుడు యథావిధిగా ఒనరించిన ఆ పూజనందు కొని నారదుడు పాకా సురుని అణచినవాడగు ఇంద్రుని కుశలమడిగేను॥ ఆ కుశలప్రశ్నమునకు సమాధానముగా విభుడగు ఇంద్రుడు ఈ వచనము పలికెను॥ భువనత్రయము నకును కుశ లము కలిగించు అంకురము (దేవి) జనించినది॥ ఆ మొలక నుండి ఫలము సంభవించి సంపన్న మగుటలో నీవును అతంద్రీతుడవు (ప్రయత్న పరుడవు) కమ్ము; నీవును ఈ విషయ మంతయును ఎరుగుదువు; ఐనను నీపు అడుగుచున్నావు॥ అదియు గాక తన హృదయమందలి విషయము సుహృజనము నకు తెలుపుట చే పరమ సుఖము కలుగును॥ కావున నీవడిగినది చెప్పుచున్నాను॥ ఆది ఎట్టిది యనిన- శైలజాదేవి పినాకి (శివుని)తో వివాహ సంబంధముతో కూడిక నందవలయును॥ కావున మన పక్షము వారందరును॥ అందులకై ప్రయత్నము చేయవలయును॥

ఇట్లు ఇంద్రుడు చెప్పగా విషయమంతయు ఎరిగి అట్లే యగుగాక యని పలికి నారదుడు ఇంద్రుని కడ వీడ్కోలు అందుకొని ఇంద్ర భవనమునుండి హిమాలయుని భవనమునకు పోయెను॥ అచ్చట బహు విధములగు వేత్రలతలను (మేము బేత్రములను) ధరించి తమ తమ విధులందు వ్యాకులు లై యున్న ద్వారపాలకుల నమస్కారము లందుకోని (వారు పోయి తెలుపగా) ముందుకు వచ్చిన హిమాలయుడు శీఘ్రమే లోనికి ప్రవేశింపజేయగా నారదుడు భువనముల కే అలంకారమగు ఆ పర్వతుని భవనమును ప్రవేశించెను॥ అచట ఆమల ప్రకాశుడగు ఆ మునివరుడు స్వయముగా హిమాలయు డే పరచి చూపిన సువర్ణ మహాసనమునందు కూర్చుండెను॥ ఆ పర్వతుడు ఆయనకు యథార్ట్ ముగా అర్ఘ్యపాద్యాదికములను నివేదించేను నారదముని ఆ అర్యాదికమును యథావిధానముగా గ్రహించెను॥ పిమ్మట హిమాలయుడు వికసిత ముఖ పద్మముతో మెల్లగా మృదువగు వాక్కుతో ఆ మునివరుని తపోవిషయమున కుశలమడిగేను॥

వెంటనే నారదమునియు పర్వతరాజును పర్వతరాజ్యపు కుశలమడిగేను॥ తరువాత అతనిని నారదుడు సాదరముగ ఇట్లు ప్రశంసించెను॥ (హిమవంతుడు స్థూలదృష్టికి వర్వత శ్రేష్టము; తత్త్వదృష్టితో అతడు దేవతాత్ముడై న శివోపాసకుడు॥ ఈ నారదుడు చేయు ప్రశంస అందులకు తగినట్లు భావన చేయవలసియుండును॥)

మహాగిరీ! నీ శరీరపు అన్ని సన్ని వేశములు (అమరికలును) అవతాంతములుగా నున్నవి॥ నీవు పర్వత మాత్రుడవు కాక దేవతావతార రూపుడవు అని తెలుపుచున్నవి॥) అచలమా! (స్థిర ప్రజ్ఞుడవగు ఉపాసకుడా!) నీ కందరముల (ఎత్తైన శిలల నడుమనుండు లో తగు విశాల ప్రదేశముల) విశాలత నీ మనస్సులోతులతో సమానము; స్థావర రూపుడవగు నీ గురుత్వము (బరువు) దేవతాత్ముడవగు నీ గుణగణముల గురుత్వము (గొప్పదనము) వలెనే లోకము లందలి అన్నిటి గొప్పదనమును మించియున్న ది॥ నీయందలి నీటి ప్రసన్నత (తేటదనము! నీ మనస్సునందలి ప్రసన్నత నిర్మలత్వమువలెనే గొప్పది; శైలేంద్రమా ! ఇంతకంటే గొప్పదనము ఎచ్చటను మాకు కనవచ్చుటలేదు॥ ఏలయన॥॥ నీకందరములు తమ ఆశ్రయ స్థానములుగా చేసికొని నానా తపస్సుల ననుష్ఠించువారును ఆగ్ని తో రవితో సమానముగా తేజోవంతులునగు పావనమునులు నిన్నెడతెగక పావనుని చేయుచున్నారు॥ తమ యానములగు విమా నములను అలక్ష్యము చేసి అంతరిక్ష సంచార మునందు 'విరక్తి చెంది దేవగంధర్వ కిన్నరులు తండ్రి ఇండ్లయందువలే నీ ప్రదేశములందు వసించుచు నీకు చేరువయై యున్నారు॥ శైలేంద్రా! అహో! నీవు ధన్యుడవు; ఏలయన॥లోకనాథుడగు హరుడు యోగ సమాధానము (చిత్తమును పరతత్వమున సమాహితము చేయుట) పరాయణము పరమలక్ష్యముగా నీకందరమును ఆశ్రయముగా చేసికొని ఇపుడున్నాడు॥ నీ హృదయాంతరాళమును పరమేశ్వరుని ఆవాసముగా చేసి కొన్న మహోపాసకుడవు నీవు॥)

ఇట్లు దేవర్షియగు నారదుడు సాదరమగు వాక్కుతో పలుకునంత లో హిమాచలుని రాణియగు మేనాదేవి మునిని దర్శించు కోరిక తో తన కూతురగు పార్వతి తన వెంట రాగా కొలదిమంది చెలులును పరిచారికలును తోడురాగా లజ్జా ప్రీతులతో ముడుచుకొనిన అవయవములతో ఆ గృహ ప్రదేశమును ప్రవేశించేను॥ నిగృహీతేంద్రియుడగు ముని వరుడు నారదుడు అక్కడ హిమ శైలుని దగ్గరనుండెను॥ తపోరాశియగు ముని అటకు వచ్చియుండుట చూచి శైలుని ప్రియపత్ని హస్త పద్మములతో కృతాంజలియై చేతితో నోరు కప్పుకోనీ ( పెద్దలతో మాటాడునపుడు ఇది ఆచారము) నమస్కారమనుచు నమస్కరించేను॥ మహాభాగుడును ఆమిత తేజోవంతుడునగు ఆదేవర్షి ఆమెను చూచి అమృత ప్రవాహరూపములగు ఆశీస్సులతో ఆ శైల పత్నియగు మేనను వర్ధిల్లజేసెను॥ అంతట దేవియగు హిమవద్దిరి పుత్రి విస్మితచిత్తురాలయి ఆశ్చర్యకర రూప తేజస్సులుగల మునిని మొగమెత్తి చూచెను॥ మునియు ప్రీతియు క్తమగు వాక్కుతో ‘బిడ్డా! ఇటు రమ్ము!' అనెను॥ పార్వతి తండ్రిని కంఠమున గ్రహించి అతని తొడ పై కూర్చుండెను॥ తల్లియగు మేన ఆదేవితో "పుతీ! భగవానుని అభివందనము చేయుము॥ దానిచే ధన్యుడును పూజ్యుడునునగు పతిని పొందేదవు అనెను॥ తల్లి ఇట్లు పలుక ఆమెవస్త్రపు అంచుతో మొగము కప్పుకొని కొంచెముగా మొగము వంచుకొనెనే కాని ఏమియుననలేదు॥ ఆంతట తల్లి మరల పుత్రితో ఇట్లు పలి కెను:

“బిడ్డా! దేవర్షిని నమస్కరించుము॥ నామాట వినినచో - నేను నీకై చాల కాలమునుండి ఒక రతనాల మంచి ఆటవస్తువును దాచి ఉంచితినిక దా! అది నీకిత్తును॥” తల్లి పలికిన ఈ మాట విని పార్వతి శీఘముగా మొగమెత్తి తన కేలు దామర మొగల జంటను తల పై నిలిపి మునిని నమస్కరించెను॥ తరువాత పార్వతీమాత తన కన్నులయందు శ్రీ స్వభావ సిద్దముగ తల్లులకు తమ బిడ్డల విషయముననుండు చింతను తోపజేయు కను చూపుతో చూచుచు పార్వతికి కలుగబోవు సౌభాగ్య లబ్దిని తెలుపు శరీర లక్షణములెట్లున్నవో ముని నడుగుమని తన సఖిని పేరించెను॥ హిమ వంతుడు తన హృదయమున తన రాణి హృదయాభిప్రాయమును ఎరిగియు తన మొగమున తన మనస్సులోని భావము బయట పడ నీయ లేదు॥ కానీ ఇది ఏదియో శుభమే జరుగనున్నదని మాత్రము తల చేను॥

హిమవంతుని రాణియగు మేన సఖి అడుగగా మహాభాగుడగు నారదుడు చిరునవ్వు తన మొగమున తోప ఈ వాక్యమును పలికేను:

“ఆమ్మాయీ! భద్రేః (యోగ్యురాలవగు మేనాదేవీ!) ఈమెకు పతి ఇంకను పుట్టియుండ లేదు॥ అదియునుగాక॥ ఈ కన్య (మంచి) లక్షణములు లేనిది; ఈమె చేతులు ఎల్లప్పుడును వెల్లకిల తిరిగియుండును॥ ఈమె పాదములు ఎల్లప్పుడును తమ నీడ ఉన్న చోట నిలువక చంచలములయి పోవుచుండును॥ ఈమె ఇట్టిది॥ ఇంకను వేరుగా ఎక్కువగా చెప్పవలసినదేమున్నది?” అనిన నారదుని మాటలు విని మహాగిరియగు హిమాచలుడు ధైర్యము నశించి తడబడుచు కన్నీటిచే డగ్గు త్తిక పడు కంఠము కలవాడగుచు నారదునితో ఈ విధముగా మారు పలికెను:

నారద హిమవతోః పార్వతీ విషయకః సంపాదః॥

 “నేను ఏల దుఃఖపడుచుంటినన సంసారము అతి దోషయుక్తము; దీని గమనము ఎరుగుట సుసాధ్యము కాదు; ఏలయన తప్పక జరిగియే తీరవలసి జరుగుచుండు నృష్టియందు సర్వాతిశాయియగు పరమాత్మరూపుడగు అనిర్వచనీయ శ క్తిగల సృష్టికర్తచే సంసారస్థులగు జీవులకు ఈ చెప్పబోవు విధమున మర్యాద (వ్యవస్థ) చేయబడినది; ఎట్లన ఎవడు॥ ఎవని వీర్యము వలన జనించునో ఆ తండ్రికిని ఈ పుత్రుడు పుణ్యలోక ముల సాధించువాడు కాడు; కనిన తండ్రియు ఈ జనించిన జీవునకు ఏమియు మేలు కీడులు చేయగలవాడు కాడు; వివిధ భూత జాతులును ఆయా ప్రాణులుగా స్వక ర్మానుసారముగనే జనించుచుండును; అండజములు అండజములనుండియే పుట్టును; ఈ జన్మమందండజముగానున్న జీవుడే మరియొక జన్మమున మానవుడు కావచ్చును; మానవుడుగా ఇపుడున్న జీవుడును మరియొక జన్మమున సరీసృప నియందైనను మానవ యోనియందైనను జనించవచ్చును॥ ఆందునను తాను చేసికొనిన కర్మ ఫలానుసారము ధర్మోత్కర్షముననుసరించి శేషప్రాణి జాతియందు జీవుడు పుట్టును॥ మనుష్యులు తప్ప మిగిలిన ప్రాణులు ఆయా కర్మానుష్టానమునకో పుణ్యలోక ప్రాప్తికో పుత్తులు కలుగవలయునను విషయమును ఎరుగవు; వాటికి పితృ పుత్ర సంబంధమును బట్టి తండ్రి కొరకై కుమారుడో కుమారుని కొరకై తండ్రియా చేయు కర్మములునులేపు; ఏలయనగా మానవులు పుట్టుకతోనే భౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతగల గృహస్థులుగా పుట్టుటలేదు॥ బ్రహ్మచారి వ్రతముతో ఆరంభమయి క్రమముగా ఆయా యాశ్రమములు సంప్రాప్తించును; ఇదియును ఏ సృష్టికర్త సంసారమును వర్ధిల్లజేయునో ఆకర్త చేయు ఆజ్ఞచేతనే జరుగును॥ అందరు మానవులును నిర్గృహులు (గృహమనగా గృహిణీ గృహముచ్యతే యను న్యాయానుసారము గృహమనబడు ఇల్లాలు; ఆమె లేనివారయి గృహస్థులు కాని వారు) ఆయినచో సంసారము ఉత్పన్నము కానేకాదు; ఆందుచేతనే సృష్టికర్త చేత శాస్త్రములందు పుతీ లాభముకం టే పుత్రలాభము మేలని ప్రశంసింపబడినది; ఇట్లు చెప్పుట మానవులను మమకార మోహమున నిలుపుటకును నరకమునుండి కాపాడుటకును అని ఎరుగవలయును॥ కాని స్త్రీ లేనిదే సృష్టి జరుగు అవకాశము లేదు॥ స్త్రీ జాతి ప్రకృతి సిద్దము గానే దీనత్వమునకు పాత్రము; దయనీయ మయినది); (స్త్రాలు సృష్టికర్త చేతనే ఇట్లు శాస్త్ర విచారణా సామర్థ్యము కాని కర్మానుష్ఠానయోగ్యత కాని లేసివా రైరి; ఐనను ఈ హేతువుచే వారిని ఆవజ్ఞా (అవమాన) దృష్టితో చూడరాదనియు వారిని ఆదరించుట బహు పుణ్యలోక ద్వారమును మహాఫలప్రదముననియుశీలరహిత కాని కన్య పదిమంది పుత్రులతో సమరాలనియు సృష్టికర్తయే శాస్త్రములందు అసందిగ్ధముగా -స్పష్టముగా- చెప్పియున్నాడు; కాని ఆలోచించగా ఈ వాక్యము నిష్ఫలమయినదియు పురుషులకు మనో వ్యథను ప్రకోపింపజేయునదియు నయియున్నది; ఏలయనగాకన్య (కూతురు) దయనీయురాలును (ఆమె విషయమున) శోకింపవలసినదియు తండ్రికి దుఃఖమును వృద్ధి చేయునదియునై యున్నది; పతి పుత్త ధనాదుల విషయమున ఏకొరతయులేక సర్వార్థ పూర్ణురాలై నను ఇంతే; మరి దుర్భగ (భర్తృ ప్రీతికి నోచుకొననిది)యు పతిపుత్త ధనాదులందు కొరత కలదియు ఐనచో ఇక చెప్పవలసినదేమి? ఆది కాక మీరు నాకూతు శ రీమునందు ఆనేక దోషములున్న వని పలికితిరి॥ ఆయ్యో! అది విని నాకు మతిపోవుచున్నది; శోకము కలుగుచున్నది! శ్రమయగుచున్నది; శ రీర మును చిత్తమును పట్టుతప్పుచున్నవి॥ నారదా! ఇప్పటి నా స్థితిలో తగని విషయమే యైనను పొందరానిదేదైనను ఈ విషయ మిట్టిదని తాము చెప్పవలయును॥

అనుగ్రహముతో మునీ! కన్య విషయమున నొకుగల దుఃఖమును ఛేదించుము॥ సంశయము కలిగించిన విషయములో ఇది ఇంతే; ఇంతకంటే మేలు కలుగు అదృష్టము లేదు; అని నిశ్చయము కలిగినను మనస్సు అవమానమునకు పాలుపడియున్న ను ఇంకను ఫలముకలుగు నేమోయను విషయమునగల ఆశ మనస్సును దొంగిలించి తన వశము చేసి కొనును గదా! ఏలయన స్త్రీల జన్మము ఉభయ వంశముల (పుట్టిన మెట్టిన ఇండ్ల) వారలకును మేలు కలిగించునది; స్త్రీకి మంచి మగడు దొరకుట ఈ ఇరు పక్షముల హరికిని ఇహ పరఫల సాధకము; గుణహీనుడేనను స్త్రీలకు మొదలు భర్త దొరకుటయే దుర్లభము॥పుణ్యములు లేనిదే పతియే ఎన్నడును దొరకడు అందుర నిన సత్పతి దొరకుట మరియు దుర్లభము గదా! ఏలయన తాను సాధనము చేయక యే ధర్మ ఫలమును పరిమితిలేని సుఖానుభవమును జీవితాంతమువరకు ధనమును స్త్రీకి భర్తయందే ఆధారపడి యున్నది; నిర్ధనుడు కురూపుడు దుర్భగుడు॥ (సౌందర్యాది లక్షణములు లేనందున స్త్రీల ప్రీతికి పాత్రుడు కాని వాడు) మూర్ఖుడు ఏసల్లక్షణములును లేనివాడు ఐనను స్త్రీకి సదా పతియే పరమ దైవతమని శాస్త్రము చెప్పుచున్నది॥ కాని మీరో-దేవరీ! ఈమెకు ఇంక ను పతి పుట్టనే లేదంటిరి; ఈ దౌర్భాగ్యము సాటిలేనిదియు లెక్క చేసి పరి మితి నిర్ణయించనలవి కానిదియు చాల బరువయినదియు (తల్లి దండ్రులకు) దుస్సహమును; చరాచర భూత సృష్టియందే ఇప్పటికిని ఆతడు (ఈమెకుపతి) పుట్టలేదంటి రే! దానితోనే నా మనము వ్యాకులమైనది; మనుష్య దేవ జాతులవారలకు శుభా శుభములను తెలుపు లక్షణములను హ స్తపాదములందు అమరినచిహ్నములను బట్టియేక దా! ఇది ఇట్లుండ ముని పుంగవా! ఈమె ఉత్తానహస్త (అర చేయి పైకి వచ్చునట్లు పెట్టుకొని యుండునది) యంటిరి; ఈ లక్షణము ఎల్లప్పుడును యాచించు కొనువారలకే కాని శుభోదయము (శుభసమృది) కల ధన్యులకును ఇతరులకు ఇచ్చు దాతలకును ఎన్నడును అట్లుండదు॥ ఈమె పాదములు తన నీడ యున్న చోటి నుండి కదలి పోవుచు చంచలములయి యుండునంటిరి॥ ఆ లక్ష ణమునందు కూడ ఆమెకు శ్రేయము లభించునాశనాకు కనబడుట లేదు॥ సౌభాగ్యము ధనము పుత్రులు ఆయువు పతి లభించునని తెలుపు వేరు వేరు ఫలముల ఆయా శరీర లక్షణములు ఎన్ని యో కలవుకదా! అవియు ఏవియు ఈ మేకు లేవని ముని పుంగవా! మీరంటిరి, నాకు తెలిసినంతవరకు మీరు సర్వజ్ఞులు; సత్యవచనులు; కావునను మీ మాటవిని మునీశా రూలా! నాకు మోహము (ఏమియుతోచక పోవుట) కలుగు చున్నది; హృదయము బ్రద్దలగు చున్నట్లున్న ది॥ ఆని ఇట్లు తన మహా దుఃఖమును తెలిపి హిమవంతుడు ఊరకుండెను॥

(*ఆస్తే బ్రహ్మ తదిచ్ఛాత స్సంభూతో భువనప్రభుః)

శైలరాజ ముఖపద్మమునుండి వెలువడిన ఈ వచనమును విని దేవపూజితుడగు నారదుడు చిరునగవుతో ఇట్ల నేను; మహాహర హేతువగు విషయమున నీవు దుఃఖము ప్రకటించుచున్నావు॥ మహాగిరీ! వాక్యార్థ మును స్పష్టముగ ఎరు గక వ్యామోహమందుచున్నావు॥ రహస్యార్థమును వివరించు నామాటను విని నే చెప్పిన దాని విచారణమునందు మనస్సు సమాహిత మొనర్చుము॥ హిమాచల: ఈ మేకు పతి పుట్టలేదంటినే: దాని యర్థము ఏమన॥ అతడు మహాదేవుడు (శివుడు)ను భూతముల వ్య క్రస్థితిని ఉద్భవింపజేయు వాడునగుటచే భవుడనబడును; అంతే కాని అతడు పుట్టినవాడుకాడు; శరణ్యుడు॥ శాశ్వతుడు॥ఎల్లరను శాసించువాడు -శంకరుడు (శుభమును కలిగించువాడు పరమేశ్వరుడు (ఈశ్వరులకును ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మునులు మొదలగు వారి కెల్లరకు గర్భజన్మ జరా బాధలు కలవు; వారెల్లరు పర మేశుని చేతి ఆట వస్తువులు; ఈ బ్రహ్మాండము ఆభువన ప్రభుని ఇచ్ఛ సంకల్పము॥ ఇచ్ఛాశ కి) వలన జనించును; విష్ణువు ప్రతి యొక యుగమునందును నానాజన్మలనందు మహాతనువు (శరీరము) కలవాడై పుట్టును; ఇట్లు అంటినని యుగ యుగము నను విష్ణువు కూడ మాయకువశుడై పుట్టు నను కొనుచున్నావేమో! స్థావర ప్రాణులగు వృక్షములవరకుగూడ ఏ దేహము నందును ఆత్మకు వినాశములేదు; సంసారమున పుట్టుచుచచ్చు చునుండు దేహికి దేహమే నశించును కాని ఆత్మకు నాశము లేదు॥ కానీ ఇతరమగు దేహి జన్మమృత్యు దుఃఖములతో బాధనందుచు దేనియందును అవశుడై తన యధీనమందేమియు లేక) దేహమునుండి దేహమునకు మారుచుండును॥ కాని మహాదేవుడో॥ అచలుడు-స్థాణువు - ఎప్పుడును స్థిరుడు॥ అతడు ఇతరము (రు)లను జనింపజేయునే కాని తాను జనింపడు; జర (వార్ధక్యము) సందడు॥ జగన్నాధుడు నిరామయుడు ఏదోషమును లేని వాడు) అగు అతడు ఈ మేకు పతియగును॥ ఈదేవి లక్షణ వర్జిత అనిన నా మాటకు కూడ లెస్సగా విచారణము ని పైరుగుము॥ లక్షణము అనునది దైవకము (మన సంకల్పము లేక యే కలుగునది); ఆది శరీరావయవముల నాశయించియుండు గురుతు; (అవయవములందు గోచరించు ఆ లక్షణము వంశము - ఆయువు-ధనము సౌభాగ్యము॥ ఇట్టివాని పరిమాణమును (ఎంతయను విషయము తెలుపును; అనంతము॥ఆప్రమేయము (హద్దు కాని పరిమాణము కాని లేనిది) ఆగు ఈమె సౌభాగ్యమునకు లక్షణము అని చెప్పదగిన ఆంకము (గురుతు) ఏదియు ఈ శరీరమునందు నిరూపింపదగినది లేదు॥ ఇందువలన మహామతీ! శైలా! ఈమె శరీరమున లక్షణములు లేవంటిని॥

ఈమె ఎప్పుడును ఉత్తానకరయైయుండునంటిని; అదియేమి అనిన ఈ దేవీకరము ఎల్లప్పుడు వరము లిచ్చుటకై ఉత్తానమయి వెల్లకిలనయి అరచేయి బయటపడుచు నుండును॥ ఈయమ సురలకును అసురులకును వరములొసగునది యగును॥ ఈమే చరణములు తమ నీడయున్న చోట నిలువక చరించుచుండునంటినిగదో! శైలస తమా! ఈ మాటకు నా వచోవివరణము వినుము; పద్మ సమానములును నిర్మల నఖములతో ఉజ్వలములునునగు ఈమె చరణములు ఈమెను నమస్కరించు సురాసురుల విచిత్ర వర్ణములుకల కిరీట మణి కాంతులతో ప్రకాశించుచుండ ఆచరణముల ప్రతిబింబము లాకిరీట మణులందు ప్రతిబింబించుచుండును; ( నమస్కరించు వారు మారిన కొలదిని ఆ ప్రతిబింబముల స్థానములును మారుచుండును॥) మహీధరా! ఈ మే జగద్భర్త యగు వృషభధ్వజునకు భార్యయగును; భూత సృష్టికర్తయగు సర్వ లోక జననియే అగ్ని ప్రకాశయగు ఆశీవ (శివుని పత్ని) మిమ్ములను పవిత్రుల జేయుట కే సీ క్షేత్రమునం భార్యయందు సంభవించినది; కావున శైలేంద్రస తమా! ఈమె శీఘముగా పినాకి (శిపుని)తో కూడునట్లు నీవు యథావిధిగా చేయ వలయును॥ హిమ భూధరమా! ఇందు దేవతల సుమహాకార్యముకూడ కలదుసుమా! అనగా మేనాపతియగు ఆ శైలేంద్రుడు నారదుని వలన ఇట్లంతయు వినిన మీదట తాను మరల పుట్టినట్లే భావించెను॥ ధీమంతుడును వృషభ ధ్వజుడునునగు మహాదేవునకు (స్వచిత్తమున) నమస్కరించి హిమాచలుడు చక్కగ హరము చెంది నారదునితో ఇట్లనెను: విభూ! నీవు నన్ను దు స్తర ఘోర నరకములో పడకుండ లేవనెత్తితివి; నన్ను పాతాళమునుండి పైకెత్తి ఏడు ఊర్ద్వ లోకములకును అధిపతిగా జేసితివి; ఇంతవరకును మునివరా! హిమాచలుడని విఖ్యాతుడనయి యుంటిని; ఇపుడంతకంటే నూరు ఇంతల సమున్న తినందితిని॥ మునీ! ఇపుడు నా హృదయము ఆనందామృతము ననుభవించుచున్నది॥ కాని నేను వాక్కులకు అధీశుడగు బృహస్పతియే బ్రహ్మయో॥ అయియుండినను మీగుణముల విచారణమున యత్నించి మీ ఆయా కృత్యముల ప్రవిభాగమును విచారించుటలో కూడ నా హృదయమునకు శక్తి చాలదు; తమవంటి వారి దర్శనము వ్యర్థము కాదు; మహామునీ! ఇందు మావిషయమున మీకు గల చాపల్యము (చూడవలెననుకొనగానే వచ్చి చూచి అనుగ్రహించుట) నాకు స్పష్టముగ గోచరించుచున్న ది, నేను స్వయముగ పాపముల చేయువాడ నేయేనను తమవంటి వారిచే తమవంటి మునులకును దేవతలకును నివాసమునకు యోగ్యుడుగా చేయబడితిని॥ అయినను ఒక విషయమునందు నాకు మీరు ఆజ్ఞనీయవలయును॥

పర్వతరాజిట్లు హర్ష నిర్భరుడై పలుకగా నారదుడును ప్రభూ! సర్వమును నరిపోయినది; దేవకార్యమేదియో అదియే నీ సుమహత్తర కార్యమును; కనుక ఇక వేరుగా చెప్పవలసినదియు చేయవలసినదియు ఏమియు లేదు॥” అని పలికి శీఘ్రమే అటనుండి స్వర్గ మేగెను॥ అతడట దేవేంద్ర భవనమునకు పోయి అతనిని సందర్శించేను॥ ఆ ముని యచట మనోహర మహాసనమున కూర్చుండెను॥ ఇంద్రుడడుగు పార్వతీ విషయక వృత్తాంతమతనికి తెలిపి “నేను చేయతగినది చేసితిని॥ ఇక ఇపుడు మన్మథునికి పనిపడు సమయము వచ్చినది॥” అనెను॥ కార్యదర్శి (ఏపని ఎట్లు చేయవలెనో తెలిసి తెలుపు) నారదుడిట్లు పలుక పాకాసురుని చంపిన భగవానుడు దేవరాజు అస్త్రముగా చూతాంకురము (మామిడి పూ మొలకను) ధరించు మన్మథుని తలచెను॥ ధీమంతుడగు సహస్రాకుడు సంస్మరించినంతనే మత్స్యధ్వజుడగు రతి

క్రమముగ మన్మథుడు మెల్లగ దగ్గరకు రాగా రాగా అతనికి శంకరుడు కనబడెను॥ విప్పారినతామర పూ రేకులవంటి కనులు మూసికొని సూటియగు స్థానమున స్థిరముగ నాసాగ్రమునందు కన్నులు నిలిపి చూచుచు॥అతి మనోహరమయి సింహచర్మముతో పాటు వేలాడు ఉత్తరీయమునుదాల్చి చెవులయందలి సర్పముల నోళులనుండి విడువ బడు ఊర్పు వాయువులచే పచ్చనై చెక్కిళ్ళవరకు సొర పిందెలవంటి జడలు వ్రేలాడుచు॥వాసుకి సర్పమును మొలత్రాడుగా చుట్టుకొని నాభి మూలమున ముడిగా అమర్చుకొని యున్న ఆ శివుని మన్మథుడు చూచెను॥ క్రిందికి వంగిన చెట్లుగల సానువులయందు వ్యాపించిన తుమ్మెదల ఝుంకారమునందు ప్రవేశించి మన్మథుడు చెవి రంధ్రపు మార్గమున శివుని మనస్సును ప్రవేశించెను॥ మన్మథునితో వ్యా ప్తమయిన ఆ ధ్వనిచే శివుడు తన మనస్సు రంజితము కాగా పార్వతిని తలచెను॥ ఆమె అతని ప్రీతికి పాత్రురాలు; అతి నిర్మలయగు ఆ పార్వతియు అంత వరకు అంతరిత అయియుండియు శివుడు స్మరించగనే సమాధి భావనయందు కనవచ్చు ప్రత్యక్ష రూపము కలదై నిలిచెను॥ విఘ్నముచేత తన హృదయము దెబ్బ తినగా శివుడు పార్వతితో తన్మయ భావననందియు ఇంద్రియనిగ్రహము కలవాడు కావున ఇది మదనునిచే కలిగిన మనోవికార మనీ ఎరిగేను॥ కొంచెము కోపమందెను॥ ధైర్యము నవలంబించేను॥ తన మనమున మదనుని ఉనికిని తొలగించుకొనగోరి దూరటి యోగమాయను (శ కి త్రయాత్మికయగు శ్రీదేవిని) తనయందు స్యోపింపజేసికొనెను॥ అంతట మదనుడు ఆ యోగమాయావ్యాప్తిచే మండెను॥ (ఆ మంటతో బాధనందియు) వాడు కామరూపుడును సుకర ముగ జయింపరాని వాడును రోషాది మహాదోషములకు ఆశ్రయుడును కావున వాసనా (చిత్త సంస్కార) జనిత వ్యసన రూపుడై శివ హృదయమునుండి వెలికి వచ్చెను॥ బహిఃస్థలమాశ్రయించి నిలిచెను॥ వాని వెంట మనోహరుడగు వసంతుడునుండెను॥ వాని ప్రభావమున తీయ మామిడి చెట్టునందు మంద మారుత చలితమగు - మామిడి పూగుత్తి మదను నకు కనబడెను॥ సత్వరముగా మకరధ్వజుడు మోహనమును బాణమును ధనువున సంధించి హరుని వక్షమున ఆ చూత కుసుమ స్తబక భావితమగు ఆ శరమును వదలెను॥ సులభముగ నశించు లక్షణముగల ఆ మహాశరము శివుని శుద హృదయమున పడెను॥ అది పరుషమును దీర్ఘమును మిగుల మోహకళ కి కలదియు; కావున శివుడు ఆ దెబ్బ తిని నంతనే తాను సహజముగ పర్వతమువలె అచలమగు ధైర్యము కలవాడయినను ఇంద్రియనిగ్రహము కోల్పోయి మదన పరవశుడయ్యెను॥ బహిఃప్రపంచమునందలి విఘ్న జనక సామగ్ర రూపమగు ఆయా రాగ భావముల ప్రభావమే అధికమగుటచే శివుని చిత్తమున సంక్షోభము కలిగెను॥

ధూర్జటిపాలస్థనేత్రవహ్ని నా మదనభస్మీకరణమ్॥

ఆంతట రౌద్ర శరీరుడగు రుద్రుని కోపాగ్ని సంజనిత ఘోరహుంకార భయానకమగు ముఖమునందలి తృతీయ నేత్రము జగత్రళయ భయంకరమయి అగ్ని వ్యాప్తమయ్యెను॥ ఆ యగ్నిని ధూర్జటి తన సమీపస్థుడగు మదనునియందు వ్యాప్త మొనర్చెను॥ నాక వాసులు దేవతలు గగ్గోలు పెట్టుచున్న ను లెక్కింపక ఆ నేత్రాగ్ని కణరాశి కాముకులకు మదన పారవశ్యము కలిగించు కందర్పుని కడు శీఘ్రముగా భస్మీభూతుని జే నెను॥ కాని ఆ అగ్ని మదనదహనానంతరము జగముల దహింప విజృంభించెను॥ జ్వాలా సమూహములతో లోకములను తిని పొట్ట నింపుకోన ఆ తపడుచున్న ఆ అగ్ని నీ శివుడు లోకానుగ్రహార్థమై తీయమామిడి చెట్టు॥వసంత ఋతువు॥ చంద్రుడు॥మంచి పూవులు - తుమ్మెదలు కోకిలలు ॥ వీని యందు పంచేను॥ ఇది మన్మథుడు శివుని పై ప్రయోగించగా శివుని అంతః కరణమునందు ఆ దేవుని బహిరంగముల యందును వ్యాపించి విజృంభించి ఆగ్ని రూపమునంది శివ నేత్రాగ్ని సంపర్కమున తీవహుతాశ ను డైనందున మన్మథ సంబంధమున అనురాగ స్నేహముల బలమున ప్రజ్వలించును॥ అందున కే అది ఇట్లు ఈ పదార్థములయందు విభజింప బడియు వారింప శక్యము కాక విజృంభించి లోకమునందలి ప్రాణుల హృదయములకు సంక్షోభము కలిగించు చుండెను॥ కాముకులగు స్త్రీ పురుషుల హృదయములందలి స్నేహానురాగములనేడునూనేతో తడిసి ఇంక ను అది జ్వలించి సుఖాత్మక ముగా కనబడుచు లోకములను బోధించుచున్నది॥ ఈ కామాగ్ని భయంకరమయినది; చికిత్స చేయనలవి కానిది॥॥

ఇది ఇట్లుండ - మదనుని పత్ని రతి తన పతి హర హుంకార జనిత జ్వాలలచే భస్మీకృతుడగుట చూచి తన సోదరుడగు వసంతుని శోకూడ క్రూరముగా విలపించెను॥ వసంతుడు ఓదార్చిన మీదట ఆమె చంద్రమౌశియగు త్రిలోచనుని శరణు వేడెను॥ తుమ్మెదలు వేంటనంటుచున్న పూచిన మామిడి రెమ్మను దర్భపవిత్రముగా చేత ధరంచి ఆడు కోకిల తన చెలిక తైగా తన వంక ముంగురులనే జటాజూటముగా అమర్చికొని హృద్యమై తెల్లనిదగు తన పతి భస్మమునే భూతిగా ధరించి మోకాళ్లను నేలకు ఆనించి ఇట్టి శివ సేవా దీక్షా నియమములతో) రతి శివునితో ఇట్లు పలుకుచు ఆ దేవుని సుతించెను॥

రతీదేవికృత వస్తుతి

(ఓమ్)-లోకముల కెల్ల శాంతియగుగాక! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును శుభకరుడును సురార్చితుడును భక్త కృపాపరుడునునగు భగవానునకు నమస్కారము॥ సంసార రూపుడు సంసార జనకుడు మన్మథ నాశకుడు రహస్య మహా వ్రతముల నాచరించువాడు స్వమాయకు గూఢముగా ఆశ్రయ భూతుడు అగు దేవునకు నమస్సు॥ దుష్ట హింసకుడు సిద్ధుడు త్రిపురాంతకరుడు కాలరూపుడు కొల ! పేరకుడు జ్ఞాన వర ప్రదుడునగు మహా దేవునకు నమస్కా రము॥ కోలావయవములకు అతీతుడు స్వస్వరూపమనేడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశ కుడు శరణ్యుడు నిర్గుణుడునగు పర మేశునకు నమస్కారము॥ భయంకర గుణములు తన వెంటనుండు వాడు నా భువనముల కును ఆదికర్త నాసా జగన్నిర్మాత చిత్ర వివిధ) ఫలదాతయగు శివునకు వందనము॥ సర్వావసానమునందుకూడ నశిం చని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత సంసార సంబంధ నాశకుడు అగు మహా దేవునకు ప్రణామము॥ అనంత రూపుడు అసహ్యకోపుడు చంద్ర చిహ్నడు అమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు॥ వృషభేంద్ర వాహనుడు పురాంతకరుడు ప్రసిద్దుడు మహౌషధ రూపుడు భక్తాభిమత ప్రదుడు సర్వార్తి హరుడు నగు నీకు నమస్సు; చరాచర జగమండలి సకల ప్రాణుల॥సకల పదార్థముల నడువడిని ఎరుగు వారిలో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్పమాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు మహేశుడునగు నిన్ను శరణు పొందితిని॥ ప్రభో! కామునకు (నా పతికి) కీర్తి సమృద్ది నిమ్ము॥ కామ దేవుని మరల బ్రదికింపుము॥ ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భువనములందు మరెవ్వరు కలరు ? మదన ప్రియ యగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడును పరా పరార్థము ల నిర్మించి భక్తుల కోసగువాడును సర్వ భువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశ కుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు॥

రతీహిమవత్సంవాదః॥

(*భవిచేతిత కామోయం కాలాత్కాంతోచిరాదపి॥)

(*రమ్యేషు వనసానుషు)

(*దగోసౌజుషకేతుస్తుమమకాంతోతివల్లభః)

మన్మథుని పత్ని ఇట్లు స్తుతించగా శంకరుడు సుఖము కలిగించువాడు వృషాకపి (ధర్మరక్షకుడు) చంద్ర ఖండ ధారియగు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను అనుగ్రహపు చూపుచూచి ఇట్లు పలికెను॥ “పుత్త్రీః! నీవు కోరినట్లే ఈ మగ నుడు అనంగుడు (శరీరము లేనివాడు) అని లోక ప్రసిద్దినందును॥" ఆనగా కాముని ప్రియురాలు రతి శిరసు వంచి గిరీశుడగు శివుని నమస్కరించి హిమ వంతమునందలి రమ్యమగు ఉపవనమునకు పోయేను॥ అచట ఆమే శివుని ఆజ్ఞ ననుసరించి మరణ ప్రయత్నమునుండి వీర మించెనేకానీ ఆర్తురాలయి ఒక రమ్య స్థలమున దీనభావముతో విలపించెను॥

తరువాత హిమవంతుడు నారదుని ప్రేరణచే తన తనయయగు పార్వతిని ఆభరణములలో అలంకరింప జేసి శుభ సమయోచిత శుభ సంస్కారములతో సంస్కరింపజేసి స్వర్గ మందలి (కల్పవృక్షపు పూవులను శిరస్సున అలంకరివ జేసి శుభమగు పట్టు వస్త్రము ధరింపజేసి ఇద్దరు సఖులామె వెంట వచ్చుచుండ శుభయోగము సమకూ రేనని నిండిన మనస్సుతో బయలుదేరి పోవుచుండెను॥ అతడట్లు కాననములను పసములను ఉప వనములను గడచి పోవుచుండ తోవలో నతనికి ఊహింపనలవి కాని మహాతేజస్సుకలది లోక మందెచ్చటను సాటిలేని రూపము కలది రమ్యరూపము కలది దేవతల మనస్సులనుకూడ హరించునది అగు శ్రీ ఏడ్చుచు కనబడెను॥ హిమవంతుడా మేను ప్రీతితో పరామర్శించి ఆమే సమీపమున కేగి ఆమెను ఇట్లడిగెను॥ “కల్యాణీ! నీవు ఎవరవు? ఎవరిదానవు? నీవెందుల కై ఏడ్చుచున్నావు? గొప్ప నిబ్బ రము కల దానవును లో కేక సుందరియు అగు నీవు ఏడ్చుట కేదో గొప్ప కారణమే యుండునను కొందును॥” ఆనగా విని అంత వరకు వసంతునితో కూడి ఏడ్చుచుండిన ఆమె ఇంకను ఏడ్చుచు నిట్టూర్చుచు విను వారికి శోకమును జాలియు కలుగు నట్లు ఈ మాట పలి కెను: నన్ను మన్మథుని భార్యయగు రతిగా ఎరుగుము॥ ఈ గిరియందు భగవానుడు గిరీశుడు (శివుడు) తపమందున్నాడు॥ తనకు కలిగిన తపో విఘ్న మునకు కోపించి అతడు తన ఆగ్ని నేత్రము తెరచి అగ్ని శిఖాజ్వాలను వదలి కాముని భస్మావ శేషితునిగా జేసెను॥ నేను భయవిహ్వలనయి ఆ దేవుని శరణు జొచ్చి స్తుతించితిని॥ ఆ సంస్తుతి మెచ్చి శివుడిట్లు పలి కెను;

“కాముని ప్రియురాలా! నేను తుష్టి చేందితిని॥ నీ ఈ కోరిక నెర వేరును॥ నీవు నన్ను ద్దేశించి చేసినస్తుతి భక్తితో అధ్యయనము చేసి నన్ను శరణు జొచ్చిన నరుడు తాను కోరిన కోరికల నీ డేర్చుకొనును; ఇటువంటి దుర్మరణమును పొందడు॥"

నేను ఆశా బలముతో ఆ శివుని వాక్యపు ఫలమును ఎదురు చూచుచు ఓ మహా తేజశ్శాలీ: కొంత కాలము ప్రతీక్షం తును॥ అని రతి పలి కెను॥ ఈ మాటవిని హిమాచలుడు సంభ్రమమును భయమును చెంది తన కూతురగు పార్వతిని చేత గ్రహించి తన పుర మునకు తిరిగిపోదల చెను॥ భవితవ్యము అవశ్యభావి కావున భూతభవత్ (వర్తమాన) భావి సంఘటనము॥ లకు హేతు భూతురాలగు శ క్త్యాత్మిక పార్వతి బిడియ పడుచు తన తండ్రితో ఇట్లనెను: తండ్రీ! దుర్భగమగు (ప్రియ ప్రీతి పాత్రముకాని) ఈ శరీరముతో ప్రయోజనమేమి? ఆట్టి అనిర్వచనీయ సుఖము లభించుట కనుకూలముగా ఆట్టి పతి ఎట్లు లభించును? తపస్సుచే అభీష్టము లభించును॥ ఏలయన తపమాచరించు వానికి సాధ్యము కాని దేదియులేదు॥ లోకము (నందలి జనము) సాధనములు ఉండియు దుర్భగమగు చున్నది॥ దేవతానుగ్రహమును సాధించలేక పోవుచున్న ది॥) తపస్సువలన సాధ్యముకాని దేదియు లేదను నిశ్చయముతో భ్రష్ట సం దేహు డై జిగీషతో (కార్యసాధన సంకల్పముతో) ఉద్యమమునకు పూనవలయును॥ తపస్సు చేయక దురదృష్టవంతమగు జీవితము గడపుటకంటె మరణమే మేలు॥ కావున తపస్సాచరింతును॥ ఏలయన నేను దుర్లభమగు దానినిగూడ పొంది తీరుదును॥ ఏ మాత్రమునందు సందేహము లేదు॥ నియమములతో నా తనువు నెండింపజేసికొందును॥ అని పార్వతి పలుక గా శైలరాజు పు శ్రీ స్నేహముతో వివశుడై డగ్గుత్తి కచే స్నేహ పూర్ణముగా వినబడు వర్ణములుండునట్లు ఇట్లు పలికెను॥ ఉమా (అమ్మాయీ! వద్దు; పుత్రీ! నీవు అతి చపలు రాలవు; (మనస్సులోనికి వచ్చిన ఆలోచనములను వెంటనే ఆచరించవలెనని త్వరపడెదవు॥ నీవు సౌమ్యదర్శనవు సుకుమార రూపవు; క్లేశ ప్రధాన క్రియాసాధ్యమగు తపః శ్రమను నీ తనువు సహించ జాలదు; నీ విషయములో ఏవేవి జరుగవలసి యున్నవో అవి తప్పక జరిగి తీరును: మనకు ఇష్టమున్న ను లేకున్న ను భవితవ్య విషయములు సంభవించియే తీరును; కావున బాలా! (అమాయికురాలా!) తపస్సువలన నీకు వేరుగకలుగు ప్రయోజనము ఏమియు లేదు॥ నేనిపు డింటికీ పోవుదును॥ అక్కడనే యాలోచించును॥ ఆని ఇట్లు తండ్రి ఎంత చెప్పినను శైలజ ఇంటికి రానిష్టపడ లేదు; రాలేదు॥ అనంతరము హిమవంతుడు ఈ పుత్తి పట్టుదలకు చింతావిష్ణుడయ్యును తుదకు ఆమెను ప్రశంసించెను॥ అనంతరము అంతరిక్షమునుండి భువన శుభకరమగు ఈమాట వినబడేమ॥ అతి చపలవగు పుత్రీ! వద్దు (ఉమా) అంటీవి కావున ఈమే నామము భువనములందు 'ఉమా' అని ప్రసిద్ధమగును॥ ఇంతేకాదు; మూర్తీభవించిన సిద్ది రూప యగు ఈమె తన చింతనమును సిద్ధింపజేసికొనును॥ అను ఈ ఆంతరిక్ష వచనమును విని రెల్లు పూవువలె తెల్లని ఆ హిమవంతుడు ఆమెను తపమాచరింప ననుమతించి త్వరితముగా స్వగృహమున కేగెను॥

హిమవద్గిరౌ పార్వతీతపశ్చరణమ్॥     

పుత్త్రీః: లోక ములందు ఆయా విషయములలో లభించు సుఖము రెండు విధములని పెద్దల భావన; ఒకటి దైహిక సుఖములవలన కలుగు తృప్తి; రెండవది కేవలము చిత్తమున కలుగు ఈ తృప్తి; నీవు పతిగా కోరు శివుడు ప్రకృతి (స్వభావము) చేతనే దిగంబరుడు; భీముడు {భయజ్కరుడు;) శ్మశానశాయి; కపాలము ధరించిన భిక్షుకుడు; దిస మొలవాడు; వికృతమగు (బేసి) కన్నులవాడు; స్థిర క్రియుడు (శాశ్వతములగు పనులు చేయువాడు; మొండిపట్టుతో పనులు చేయు వాడు); ప్రమత్తుల॥ఉన్మత్తుల ఆకారము కలవాడు; రోతగొలుపు సామగులను సేకరించుకొని యుండువాడు; భూతములకు ప్రభువు; అతని వలన నీకు తీరు కోరిక ఏమి? నీవు నీ ఈ శరీర సుఖమునే కోరుచుంటివనిన భయంకరుడు రోత గొలుపువాడు రక్తము కారుచు వసపూత కలిగిన కపాలములు ఆభరణములుగా ధరించిన వాడు బుసలుకొట్టు సర్పరాజములు భూషణములుగా దాల్చిన భయంకరుడు శ్మశానవాసి రౌద్రులగు ప్రమధులు తన అనుచరులుగా గలవాడు ఆగు ఈ మహాదేవుని వలన నీకు కలుగు సుఖ మేమున్నది?

దేవతల కిరీట సమూహముల ఒరపిడి తిను పాదపద్మములు కలవాడు శత్రునాశకుడు లోక నిర్మాత శ్రీకాంతుడు అనంతమూర్తిధరుడు అగు హరియున్నాడు; యజ్ఞ భోక్తలగు దేవతలకధిపతి పాకాసుర సంహారి అగు ఇంద్రుడున్నాడు: దేవతలకు నిధివంటివాడు సర్వకాలప్రదుడునగు అగ్ని ఉన్నాడు; లోకరక్షకుడు శరీర ధారులకు ప్రాణభూతుడు నగు వాయువున్నాడు, సర్వధనాధిపతియు ప్రభువు విశ్రవసుని పుత్రుడు రాజరాజునగు కుబేరుడున్నాడు; వీరియందుండి ఎవరినైన నీవు పతిగా పొందగోరరాదా? లేక ఒక వేళ మరియొక శరీరమున సుఖముల పొందగోరి తప మాచరించుచున్నావా? ఇంతేయగు నేని అట్లయినను నీవు తపమాచరింపనక్కర లేదు; ఏలయన ఇచ్చటనే ఈ దేహముతోనే నీ తండ్రి ఇంటనే నీకు స్వర్గ సంపత్ సుఖము లభించుచునే యున్నది; ఇచట నీకన్ని శుభ సుఖములును కలవు; దేవతల వలన కూడ లభించనిదెల్ల నీకు నీ తండ్రినుండియే లభించును; కావున నీవందుల కై తపమాచరించుచు శ్రమ పడుట కూడ వ్యర్థము; ఆది కాక కల్యాణీ! ఎంత స్వల్ప ఫల మేయైనను మనసు కావలెనని మీగుల కోరినది దుర్లభమయి దూరము పోవుట లోక సహజము; నీవిట్లు తపస్సాచరించుచు శ్రమపడుట విధియోగము; బ్రహ్మ నీకిట్లు విధించినాడు కాబోలును; అని మునులు పార్వతితో పలికిరి॥

(*విధీంద్రాధ్యా మహర్షయః॥)

మునివర్యులు ఇట్లు పలికినది విని శైలజ కుపితురాలయి క్రోధర క నేత్రముతో కంపించు పెదవులతో ఇట్లు పలికెను॥ “ఆలోచనలతో నడుచువానికి నీతిఏమున్నది? వ్యసనపరునకు ఆదుపు ఏమున్నది? మంచిని చెడుగుగా చెడుగును మంచిగా ఆలోచించు వానిని మంచి త్రోవలో పెట్టువా రెవ్వరున్నారు? మీరు ఈ విధముగా నన్ను ప్రజ్ఞాహీను రాలనుగా తగని స్థానమున తగని విధముగా ప్రీతి కలిగియున్న దాననుగా తలచుచున్నా రుగదా! నా విషయమున మీరు సరిగా విచారణ చేయుటలేదు॥ నేను ఇట్లు మాటాడుట అహంకారము చే అని మీరనుకొనవచ్చును; ఏమనిన మీరందరును ప్రజాపతులతో సమానులు; సర్వజ్ఞులు కూడ; ఐనను మీరు ఆ (మహా) దేవుని నరిగా ఎరిగినట్లు లేదు; అతడు శాశ్వతుడు జగత్ర్పభువు అజుడు పుట్టుక లేనివాడు); ఈశానుడు (సర్వమునకు నియంత) అవ్యక్తుడు (స్పష్ట రూపము లేనివాడు) అమేయ (ఎరుగరాని) మహిమ సమృద్ధిక లవాడు; ఆది అట్లుండనిండు; ఆతడు ప్రతిష్ఠించిన ధర్మపు ఉనికిని సరిగా ఎరుగుటకూడ ఆశ్చర్యకరమగు విషయమే; హరి బ్రహ్మాది సురేశ్వరులును అతనినెరుగజాలరు; ఆ మహానుభావుని విభు త్వము వలన స్వయముగనే జనించినదై లోక ములయందు విజృంభించి ప్రకటమైయున్న మహామహిమను కూడ మీ రెరుగ మోక దా! గగనము వాయువు భూమి వరుణుడు (జలములు) అతని మూ ర్తియేక దా! చంద్రసూర్యు లాతని కన్నులు కదా! సురాసురులును భక్తితో అతని లింగ చిహ్నమును ఆర్చించుచున్నా రే! బ్రహ్మేంద్రాది దేవతలును మహర్షులును అతనిని సార్థకమగు ఈశ్వర నామముతో పిలుతురుగదా! ఆ శివమూర్తుల ప్రభావమును పుట్టుక ను కూడ మీరు ఎరుగ నట్లున్నది; ఈ అదితి ఎవరిమాత? జనార్ధను డేవరినుండి జనించెను? నారాయణాది దేవతలు అదితికశ్యపులకు జనించిరి॥ మరీచి పుత్రుడు కశ్యపుడు; దక్షుని పుత్రి ఆదితి; ఈ మరీచి దక్షులిరువురును బ్రహ్మ పుత్తలు; దివ్యసిద్ధి విభూషిత మగు హిరణ్మయాండమునుండిక దా బ్రహ్మ జనించేను? ప్రకృత్యంశ ములన్నియు ఆ ఈశ్వరుని ధ్యానము (సంకల్పము) వలననే కదా ప్రక్షోభము (ప్రథమ స్పందము) నంది సృష్టి ప్రాదుర్భవించేను! మూల ప్రకృతినుండి మూడవదియగు (1॥ ప్రకృతి॥2॥మహత్॥3॥ అహంకారము) ఆహంకార తత్వమునందుండి నిష్పన్న మయిన పద్మమునుండి 'లోక జన వ్యాపారము ( ఆ ఈశ్వరునినుండియే) కలిగెను గదా! ఇట్లు ప్రాదుర్భవించిన మూల ప్రకృతి ఆయా జీవుల కామ-కర్మ కృతములయిన షడ్వర్గములను (జాయతే-ఆ స్త్రీ-విపరిణము నే-వర్ష తే॥ఆపక్షీయతే నశ్యతి అను షడ్భావ - వికారములతో కూడిన ప్రాణి సృష్టిని సృష్టించేను కదా! అజాతకుడు (పుట్టుక లేనివాడు) అనబడు బ్రహ్మకూడ ఆవ్యక తత్వమునకును జన్మకారణమగు పరబ్రహ్మ రూపుడగు ఈశ్వరునినుండియే కదా జనించెను? తన ధ్యాన (సంకల్ప బలమున ఈశ్వరుడే మూల ప్రకృతియందు క్షోభము (స్పందము) కలిగించి ఇదియంతయు సృష్టించి బ్రహ్మయు సర్వార్థసిద్దినంది॥ సృష్టికి ఈశ్వరుడై (సమర్థుడై) లోక కర్తయగునట్లు చేసెను!

స్వమహిమ సంపన్ను డగు ఆ ఈశ్వరుని విష్ణ్వాది దేవతలును ఎరుగ యత్నించుచుందురుగదా! ఈశ్వర సంకల్పముననే విష్ణువు అసాధారణములగు అట్టి దేహముల (అవతారముల)ను ధరించి ఉత్తమ మధ్యమాధమభేదములుగల, లోక వ్యాపారముల నిర్వర్తించుచున్నా డుగదా! జన్మ మరణాత్మకమగు నంసారపు స్వరూపము ఇటువంటిది; ఇది॥ యంతయు॥ నానారూపములును నానా విధోద్భవములునుగల ఈ జగమంతయు॥ప్రాణుల కర్మఫల రూపమయినది; ఇది॥ ఇట్లుండ నారాయణుడును ఆ ఈశ్వరుని పేరణతోనే తన ఛాయయగు వైష్ణవ మాయాశ్రయముతో నానావిధ జన్మములను దాల్చును॥ వివశాత్ములయి విష్ణ్వాదులందరునుపొందు పేరణ కూడ ఉ న్మాదాది దోషదూషితులయిన వారి మతిప్రవృత్తి వంటిదే కాని వేరుకాదు॥ లోక మునందు జరుగు ప్రాణుల ఆయా వ్యవహారములనుచూచి ఈశ్వరుడు, తనలో తాను నవ్వుకొను చుండును॥ మానవులాచరించు ధర్మాధర్మములకు పుణ్యపాప ఫలములు లభించుటకు, ఈశ్వరాధీనుడై విష్ణువే హేతుభూతుడని శాస్త్రములు నిర్దేశించుచున్న వి॥ ఈ జీవునకు సామాన్య సిద్దానముగా ఆదిత్వము చెప్పబడెనే కాని ఈతడు ఏదేహమందును దీర్ఘకాలముండడు; అంతేకాదు; ఈ జీవుని అంతరంగము॥ (అంతఃకరణము) మీరుకాని మరెవ్వరు కాని చూచియుండ లేదు॥ ఒక చోట పుట్టుట మరి యొక చోట చచ్చుట అనునది దేహధారియగు జీవుని ధర్మము; అతడు ఒక చో గర్బ మందుండగనే మరి యొక చో వార్ధకమున ఇంకొక చోట వ్యాధి చేత వేరొక చోట నూరేండ్లు జీవించి ఇంకొక దేహమున బాల్యమున మరణించును॥ స్వల్ప కాలము జీవించు వాని కంటె నూరేండ్లు జీవించువాడు అనంత కాల జీవిగా కనబడును; (ఆట్లే సృష్టి కాలమంతయు) మరణించక జీవించియే యుండు వాడు ఆమరుడనబడు చున్నాడు; అల్ప కాల జీవులగు మానవులకు వారి దేవతల) మరణములు కనబడవు! ఆంతే; ఇట్లే విష్ణువు మొదల వారి చావుపుట్టుకలు సాధారణులు చూడలేకున్నా రు; (కావునవారిని వీరు అమరులని తలచుచున్నారు); (ఈశ్వరునికిగల ఇటువంటి జన్మ మరణాదులు బొత్తుగా లేని) ఈశ్వరత్వమును ఈ సంసారమును మరి ఎవ్వరు పొంద గలరు॥ అక్కడ ఈ ప్రపంచమున) జీవన మరణాదులు ఉండుటచే నానాశ్చర్య స్వరూపులు ఈ దేవతలందరును; కావున వీరందరును మలిన రూపులు; వీరి ఈశ్వరత్వము అల్పమయినది! పూజ్యులారా నేను శర్వుడు సర్వ ప్రాణి సంహారీ; శర్వుడనగా సర్వప్రాణులును నశించినను తాను మాత్రము నశించకుండు వాడనీ ఇచ్చట ఆర్థము॥) పినాక ధనుర్ధారియగు శివుని తప్పమ రెవ్వని నేని పతిగా కోరను! ఐశ్వర్యాది షడ్గుణములును ఇతరులగు దేవతలయందు తార తమ్యముతో (ఒకరి యం దేక్కువ - మరియొకరియందు తక్కువ ఉన్న వి; కాని ఈశ్వరుని యందు ఇది పరమమయి అత్యుత్కృష్టమయి) యున్నది; జ్ఞానబలైశ్వర్యాది లక్షణములు దేవునియందు మహత్తులలో మహత్ వరిమాణముననున్న వి; ఆతని కంటే మరి గోప్పది కాని ఇతరము కానిలేదు; సర్వమును ఆతని నుండి యే ప్రవర్తిల్లుచున్న ది॥ అతని ఈశ్వరత్వ మునకు ఆదియు అంతమును లేవు; అట్టి ఈశ్వరునే నేనాశ్రయించుచున్నాను॥ ఇదియే నా నిశ్చయముసు॥ నా ప్రయత్న మును; ఇది లోక విరుద్ధమయినదే కావచ్చును; నన్ను ఆయాకార్య ములందాజ్ఞాపించు యోగ్యతగల ఋషులారా! మీరిది విని సంతోషముతో) ఉన్న ను సరియే; (కోపించి) వెడలిపోయినను సరియే; (నానిశ్చయము మారునది కాదు॥) అని పార్వతి సపరులతోపలి కెను॥

సప్తర్షిణాం శఙ్కరతపోవనగమనమ్॥

ఇట్లు పలికిన దేవీవచనములు విని తమ కన్నుల ఆనందాశ్రువులుకమ్మ వారు ఆతపస్వినిని అభినందించిరి; పరమ ప్రీతులయి వారు మధురవచనములతో ఆమెతో ఇట్లనిరి; అహో! దేవీ! అత్యద్భుతస్వ భావురాలగు నీవు నిర్మలజ్ఞాన రూపురాలవువలె కనబడుచున్నావు; నీవు సర్వ భావముతో భవుని (శివుని) ఆశ్రయించిన దానవయి మా భావమును ప్రసన్న మొనర్చుచున్నావు; కాని మేము ఆమహాదేవుని అద్భుతమగు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును) నీవువలె పిరుగము; నీ నిశ్చయమునందలి దృఢత్వమును పరీక్షించి ఎరుగదలచి ఇచటకు వచ్చినాము॥ సుందర రూపా! అచిరకాలముననే నీ సంకల్పము నేర వేరును; సూర్యతేజము సూర్యుని కాని రత్న కాంతి రత్నములను కాని విడిచి ఎక్కడ కై న పోవునా? వర్ణరాశి రూపమగు శబ్దము చే ప్య క్రముకాక అర్థము వేరొక చోటికి పోదుగదా! ఆష్లే నీవును పర మేశుని విడిచియుండవు; కావున మేమును అనేకాభ్యు పాయములతో (నై నను) ఆ ఈశ్వరుని అభ్యర్థించుటకు నీవక్షమున) పోవుచున్నా ము; మా హృదయములందును (చాల కాలముగా) ఈ విషయమే మిక్కిలిగా ఉండినది॥ ఈ కార్య సాధనమునకు కావలసిన నీతి ఉపాయ) రూపురాలవును నీవే; కావుననే అందులకు కావలసిన బుద్ధి (ఆలోచనలు - నిశ్చయము) కూడ నీవేయయి యున్నావు; (నీకు శివునియందుగల దృఢనురాగ విషయక నిశ్చయమే ఈ కార్యము సిద్ధించుటకు కావలసిన ఆ లోచ నమును ఉపాయమును మాకు స్పురింపజేయును॥) ఈ హేతువున నీశంకరుడును నిస్సంశయముగ ఈ కార్యమును నెర వేరునట్లు చేయును॥

అని ఇట్లు పలికి సప్తమునులును గీరి పుత్రిచే పూజలందుకొని శివుని దర్శింపగోరి (అతడును) హిమవ త్పర్వత సానువునకు బయలుదేరిరి॥ ఆ సానువు చాల గొప్పది॥ శివుని వలెనే ఆ సానువును సమానముగ గంగా జలముతో తడుపబడిన శరీరము కలది; పచ్చని జడలను జూలును దాల్చి శివునివలెనే ఆ సానువు పచ్చని గైరిక ధాతువులతో అలంకృతము; శివుని చేతియందలి మందార కుసుమ మాలలను తుమ్మెదలనునరించుచుండెను॥ సానువు నందలి వృక్షశాఖలయందు పూచిన పుష్ప శ్రేణులను తుమ్మెదలు వెంటాడుచుండెను॥ ఇట్టి హిమవత్సానువునందలి శంకరాశ్రమమును ఆ ఋషులు దర్శించిరి॥ అచటి మృగ సమూహములు ప్రశాంతములై యుండెను॥ వన ప్రదేశము కోమలమును నిశ్చలమునై యుండెను॥ నిశ్శబ్దములును కలత లేనివియునగు జల ప్రపాతములు దానీయన్ని దిశలందుండెను॥ ఆ ఆశ్రమద్వారమున పూజ్యులగు ఆ సప్త మునులకును తనచేత పేప బెత్తము ధరించిన వీర కుడు కనబడెను॥ తాము వచ్చి నపని గొప్పదియగుటచే వారు వినయవంతులయి మాటలాడుటలో మేటి నేర్పరులు కావున మధుర భాషణయుతము లగు వాక్కులతో ఆతనితో నిట్లనిరి: లోక శరణ్యుడును ప్రమథగణ నాయకుడునునగు త్రిలోచనుని ఈశ్వరుని దర్శింప మేమిటకు వచ్చితిమి॥ దేవకార్య పేరణ మారాకకు హేతువని తెలియుము॥ కాలాతిక్రమము జరగకుండుటలో నీవే మాకు శరణ్యుడవు కావలయును॥ ఏలయన సాధారణముగా ద్వారపాలుర అనుకూలత చేతనే ప్రభువులు దర్శనమిత్తురు॥

మునులు పలికిన తమాట విని వీర కుడాదరమున వారితో ఇట్లనెను: “విప్రులారా! ఈశుడు మందాకినీ జలమున స్నానమాడి సాయం సంధ్యను ఉపాసించి క్షణకాలములో ఇటకు వచ్చును॥ అచ్చట మీరు పరమేశుని దర్శింతురుగాని॥”

ఈమాట విని మునులు వర్షాకాలమున దప్పిగొన్న చాతకములు గుభీర మేఘము వచ్చు సమయము కొరకు వలె శివుడు వచ్చు సమయమున కై ప్రతీక్షించుచు నిలిచిరి॥ తరువాత క్షణకాలములో శివుని యోగ సమా ధానానుష్టానము ముగి సేను॥ మృగచర్మమున నియమపూర్వక ముగ అమర్చుకొనిన వీరాసనమును శివుడు వదలెను॥ ఆంతట వీరకుడు వినయవంతుడై ప్రీతిభావముతో నిండిన మనస్సుతో మోకాళ్ళు వంచి నేలకు ఆనించి ఇట్లు శివునితో మనవి చేసెను; విభూ! దీపించు తేజస్సుకల స ప్రమునులు మిమ్ము దర్శింప ఇటకు వచ్చినారు॥ దర్శ నమునకు అనుజ్ఞ ఈయవలెనని ఎరుగ ప్రార్థించుచున్నాను॥ అనిన మహాత్ముడగు వీర కుని వచనము విని శివుడు కను బొమ విరుపు సెగతోనే వెంటనే వారికి ప్రవేశ మనుమతించేను॥ వీరకుడును అచటికి దూరమున నిలిచియున్న సప మహర్షులను శివుని దర్శనమునకై రావలసినదిగా తన శిరఃకంపముతోనే పిలిచెను॥ ఆ పిలుపునందుకొను త్వరలో ఊడిన జుట్టును సగమే ముడివేసికొని తమ కృష్ణాజినములును వస్త్రములును వేలాడుచుండ విభూతులతో శుద్దమగు పర మేశుని వేదికను ప్రవేశించిరి॥ చేదోయి దొన్నెలతో స్వర్ణ పుష్పముల రాసుల నీళుని పై వేద జల్లుచు వారు దేవ తలకును వంద్యుడు అగు పినాకపాణి పాదపద్మములకు వందనమాచరించిరి॥ అంతట శూలపాణి యు (పేమార్ధ దృష్టులు తమపయి ప్రసరింపజేయ ఆ సప్తర్షులు ఆదర పూర్వకముగ గిరీశుని చూచుచు ఆదేవుని లెస్సగా నిట్లని స్తుతించిరి॥

ఈశ్వరావివాహోద్యమనామ సప్తర్షీణాం హిమాచలగమనం॥

ఇపుడు మీదర్శనముచే మేమే ధన్యులమగుచున్నాము॥ ఈవిధముగా సురేశ్వరుడును లోకప్రసిద్ధి వడయు చున్నాడు॥ మీయనుగ్రహమను నిర్మల జలముతో తడియగోరి ఒకానొక శ్రీయును తపమాచరించుచున్న ది; తపః ఫలమందుకోననున్నది॥ ఈ హిమాచలుడును లోకమున ధన్యతముడు; ఏలయన నీ ఆశ్రయము నర్థించి ఆతని పుత్రియే తపమాచరించుచున్నది॥ మహాబల సమృద్ధి కలవాడై సమ ససురులను నిర్మూలించిన తారకాసురుడు గూడ ధన్యుడే; ఏలయన వాడు నీ యంశ భూతమగు తత్వమును (కుమారస్వామిని) దర్శించి తన పాపములనుండి ము కినందబోవుచున్నాడు॥ - ఆ తారకుని వలన కలిగిన భయ సంభ్రమములకు వశులై ఆ సంభమాగ్ని చే ఉద్దీపితులయి మహాభితాప ప్రశాంతి హేతువగు మీ పాదపద్మములను తమ హృదయముల దాల్చి మిమ్మరాధించు బ్రహ్మయు విష్ణువును ధన్యులు; వాస్తవమున నీవొక్కడవే ఐయుండియు వివిధాకృతులతో వివిధ క్రియలు నిర్వర్తించుచున్నా వు; ఇట్టి నిన్ను సరిగ ఎరుగలేక జనులు వాక్కులను శ్రమ పెట్టుకొని వివిధములుగ నిన్ను గూర్చి పలుకుచుందురు॥ ఒక వేళ ఆద్యుడవగు నీవు ఈ విధముగా జరుగు లోకోప ద్రవమును ఎరిగియైయున్నావు; అనినచో లోకమప్పుడు నీవు నిర్దయుడవని నిన్ను నిందించవలసివచ్చును॥ ఈ సంసారాత్మక (లోకమందలి ప్రాణుల దుఃఖమును నీవేరుగకున్నావా? (ఎరుగుదువు;) నీవు చేయు ఈ సృష్టిస్థితి క్రియలు అన్ని విధములుగా (ఈ తార కాదులచే) దెబ్బ తినుచున్నవి: ఇట్టి ఈ జగదుపద్రవమును నీవు చూచుచు ఊరకున్న చో దయామయుడవని నిన్నె వరును ప్రశంసించారు॥ స్వయాగమాయా మహిమలకు గూఢముగా (ఎవరికిని ఎరుగరాక) ఆశ్రయమయియున్న నీ 'నిర్మలైశ్వర్య గౌరవము నెవ్వరును కొని యాడరు॥ ఇట్టి నిన్ను దర్శింపగలుగుచున్నందున మేము ప్రాణులన్నిటికంటే ధన్యతరులము; మొదట మేము మాకు మీదర్శనము కాదేమో యనుకొంటిమి; ఇపుడు తమ దర్శనము చే మామనోరథము సఫలమయినది॥ జగృృష్టిస్థితి సంహార కర్తవును జగములకు ఆదిభూతుడవును అగు నీవు ఎవరు కోరినను కోరకున్న ను మేము కోరినంత కంటే అధిక ములగు కార్యమునే చేయుదువు; ఐనను మేమీంద్రుని సందేశమును గొని నీకడకు వచ్చితిమి; అని ఇట్లు మునులు తమ హక్కులను పర మేశుని శ్రవణ భూమి సమీపమున ఆర్పణ చేసి వంగి నమస్కరించిరి॥ అది కర్షకులు మంచి పంట పండుట కై మేలగు పంటభూమియందు విత్తనముల నాటినట్లుండెను

తగిన విధముగ ఆరంభించి కొనసాగించిన స ప్రమహర్షుల రమ్య స్తుతి వచనములు విని పరమేశుడు చక్కని చిరునగవుతో మనోహరవచనములు బృహస్పతివలె ఇట్లు పలికెను॥ మీరు వచ్చిన పని నేను చేయు లోక విధానము నందలి ఉత్తమ సత్కార్యమునకు అంగ మనియు అందులకై ఈ సర్వ సం కేత ములనేరుకపరచు దేవి హిమ శైల పుత్రిగా జనించినదనియు నేనెరుగుదును॥ దేవతలందరును చాల తహతహపాటుతో ఉన్నారనుటయు నిజమే; మీరు దేవకార్యార్థమే పూని వచ్చితిరి॥ ఆ దేవతల మనస్సులును త్వరపడుచున్నవి॥ కాని నిర్వహింపదలచిన కార్యము నెరవేరుటకై విచక్షణులగువారు లోక వ్యవహారానుసారముగానే పని చేయవలయును॥ ఏలయన ఉత్తములగు వారు ధర్మ వ్యవస్థ ననుసరించి ధర్మమునందు ప్రవర్తింతురు॥ ఇతరులు దానిని ప్రమాణముగా గ్రహించి నడుచుకొందురు॥ అనిన పర మేశుని మాటలు వినుచునే త్వరితముగా సప్తమునులును హిమవంతుని భవనమునకు ఏగిరి, అచట ఆ పర్వత రాజుచే సాదర పూజలనందుకొని ప్రీతులయి మునివరులు అల్ప వర్ణము (వచనము)లతో త్వర తో ఇట్లు శైలేంద్రునితో పలికిరి॥

హిమాలయా! సాక్షాత్ పినాక ధారి నీ కొమరితను పత్నిగా కోరుచున్నాడు; కావున ఆహుతిని అగ్ని యందర్పించి నట్లు ఆమె నతని యందర్పించి నిన్ను నీవు పవిత్రునిగా జేసికొనుము; ఇందు చాలకాలముగా ఏర్పడిన దేవకార్యమును ఇమిడియున్నది; కావున జగదుద్ధరణార్థమయి నీవు ఈ పూనిక నెర నేర్చవలయును॥ అనిన మునులమాట విని పర్వతరాజు హరావిష్ణుదే వారితో ఏదో చెప్పనారంభించెను॥ కాని మాటాడజాలక పోయెను॥ కేవలము శివుని ప్రార్థించి ఊరకుండెను॥ అంతట మేనాదేవి పుతీ ప్రీతిపారవశ్యముతో మునుల నమస్కరించి భగవానుడగు ఈశ్వరుని పాదము లను ఆశ్రయించిన ఆర్థవంతమగు వాక్యమిట్లు పలికేను! కూతురు 'పుట్టి ఉభయవంశ ములవారిని తరింపజేయును గావున ఆమే జన్మము మహాఫలప్రద మే; ఐనను ఆమె తల్లిదండ్రులను విడిచిపోవునను భయముచే కూతురు పుట్టవలెనని కోరరు: క్రమ పరిణామముగా ఇపుడదియే తటస్థించినది; కులజన్మ వయోరూ పైశ్వర్య సమృద్ధి కల వరుడు లభించినచో అతడు కోరకున్న ను కన్న తల్లిదండులాతని కామె నీయవలయును॥ ఆ శివుని యందే ఆసక్తురాలయిన మా పు తొ తన్నా యన కీయనిచో ఆ ఘోర తపమెట్లు విడుచును? కనుక ఆమె మాటననుసరించి ఈ విషయములో ఏమి చేయదగునో ఆ పని చేయుడు; అని పలికిన హిమవత్పతియగు మేనా వచనములు విని మునులు ఆమె మనస్సు పరీక్షింపగోరి ఉదారార్థ వంతమగు మాట ఇట్లు వచించిరి॥ దేవతలు ఆ మహాదేవుని పాదాబ్జ ద్వంద్వమును ఆరాధించి మిగుల సుఖమందు చున్నా రనిన ఆ శంకరుని ఐశ్వర్యమెట్టిదో ఎరుగుము; ఆ శివునకు ఉపయోగించి ప్రీతి కలిగించు రూపమును పొందగోరి నీ పుత్రి ఘోర తపమాచరించుచున్నది; ఆమె రూపముతో శివప్రాప్తి యను మహానందము లభించును॥ ఏ శంకరుడు ఆమె ఇంతవర కాచరించుచుండిన వ్రతములను ముగింప జేయునో అతనియందే ఆమె ఆవధానము నిలిపి యున్నది; అట్టి ఆమె ఇపుడతని ఇల్లాలగును॥ ఆని ఇట్లు పలికి ఆ సప్త మునులును హిమవంతుని కూడి-రవి వహ్ని తేజముల మించిన తేజము కలదియు తప స్తేజోమయ రూపయునగు పార్వతి తపమాచరించుచోట కేగిరి॥

(*తస్యాశ్చక్రుస్సురస్త్రియః॥)

మునులు ఆ పార్వతితో ప్రీతి పూర్వకముగా ఇట్లనిరి: సర్వజనాదరణీయమును రమ్యమును మనోహరమును ప్రీతికరము నునగు నీరూపమును తపోగ్ని తో దహించుకొనకుము॥ పుత్రీ! రేపటి ఉదయమే శంకరుడు నీపాణిని గ్రహించును॥ మేమందరమును వచ్చి ఈ విషయమును ॥ మీతండ్రిని అర్థించితిమి॥ నీవు నీతండ్రితో స్వగృహ మేగుము; మేమును మా ఇండ్ల కేగుదుము; ఇట్లు పలికిన న పరుల మాట విని పార్వతి తపమునకు ఫలము కలుగుననుట సత్యమయ్యేనని సంతసముతో దివ్య పదార్థ శోభితము అగు పితృ భవసమునకు త్వరితముగా ఏగెను॥ అచట ఆ హైమ వతికి వరునేప్పుడు చూతునాయను తహతహతో ఆ రాత్రి పది వేల యేండ్లుగా తోచెను॥ తరువాత బ్రహ్మ ముహూర్త మున ఆమె ప్రియసఖులు యడాగా సంప్రదాయముగ క్రమముతో సకల మంగళాలం కార సముదాయములతో ఆమెనలంక రించిరి॥ బహు మంగళ భరితమగు మందిరమున ఆ మేకు ఆయా యవయవములందు అనేకాభరణములలంకరించబడెను॥ ఆరు ఋతువులును మూర్తీభవించి సర్వకామముల పూరించుచు హిమవంతుని సేవించెను॥ వాయువులు కసవూడ్చెను; మేఘములు నీరు చల్లేను॥ లక్ష్మీ దేవి ఆతని హర్మ్యములందు నానా పదార్థ సాధనములు అమర్చేను; సర్వ పదార్థము లందును సర్వ భావములదును కొంతియు సమృద్ధియు వ్యాపించేను॥ చింతామణి మొదలగు రత్నములును పర్వ తములును కల్పవృక్షాది మహా వృక్షములును వచ్చి హిమవంతుని కొలిచెను॥ ఓషధులు దివ్యౌషధములతో రసములతో ధాతువులతో కూడి మూర్తీభవించి హిమ శైలమునకు కింకరులయ్యెను॥ అతని కింకరులును ఆ శైలుని ఆజ్ఞానువర్తులై వ్యగ్ర తతో పనులు చేయుచుండిరి॥ నదులును సముద్రములును సకల పదోర సముదోయమును హిమవంతుని మహత్వమును మంత వృద్ధి పరచెను॥

ఇట్లు వివాహార్థము పార్వతి కలంకరణము జరుగుచుండ అట గంధమాదన పర్వతమున దేవతలందరును శంకరునలంకరింపదలచి నిర్మల మూర్తులై సకలములగు అలంకరణ సం భారముల ధరించి నిలిచిరి॥ వారిలో బ్రహ్మ విప్పారిన కన్నులతో శరుని జటాజూటమున ! పే మోదర భావమున చంద్ర ఖండమును అమర్చేను॥ చాముండ (మాతృ దేవత) శివశీరమున విపులమగు కపాలమాలను క టెను॥ డై త్యేంద్రకుల హంత యై రక్తముతో మాకు తృప్తి కలిగించు పుత్తుని కనుము శంకరా! యని ఆమే శంకరుని దీవించెను॥ యముడు ప్రకాశించు శిరోరత్న ములు కలదై అగ్ని వలే స్ఫుటముగ ప్రకాశించు సర్వాభరణమును చేత ధరించి శంకరుని ముందు నిలిచెను॥ (వానితో శివునలంకరించెను॥) ఇంద్రుడును చెమర్చు చున్న విశాల ముఖపద్ము డై వసపూత కల కొనలుగల గజచర్మమును ఉత్సాహముతో శివునిచే ధరింపజేసెను॥ వాయువు శివునికై వాహనముగా విశాలమయి పొడి కొమ్ములు కలిగి హిమగిరివలే తెల్లని కాంతి కలదై న మనోహర వృషభమును అలంకరించెను॥ సూర్య చంద్రాగ్నులు శంభుని నేత్రాంతరాళమున నిలిచి జగత్కర్మ సాక్షియగు ఆ దేవుని శరీరమున తమ కాంతినే విస్తరింపజేసిరి॥ యముడు కపాలమునందు వెండివలే మెరయు చితా భస్మమును తీసికొని తన చేతితో ఆ దేవుని కంఠమున మనుజాస్థిమయ మాలను కటి తనచేత గద ధరించి శివుని ఎదుటి భాగమున దూరముగా నిలువబడెను॥ కుబేరుడు స్వయముగా తెచ్చిన నానాకార మహారత్న భూషణమును వదలి ఈశుడు భయంకర సర్పేందములు కడియముగానున్న తన చేతితో వాసుకినీ తక్షకుని తన చెవికి ఆభరణములుగా తానే ధరించెను॥ స్థాణు (శివ) దేవుడు వరుణుడు తెచ్చినదై పూవులతో కూర్చిన మాలను కూడ ధరించుకొనెను॥ అంతట ప్రమథ గణాధీశులు వీర కునితో (ఆ పేరుగల ద్వారపాలునితో) ఆయా పనులయందు వ్యగ్రమగు ఆకృతిగల వీర జా! నీవు శూలికి మారాక నివేదింపుము॥ అని వినయమున పలికిరి॥ సప్త సముద్రములును ఆయా ఆభరణములు సమకూర్చబడిన ఈశుని లెస్సగా అలంకరించి అద్దపు విలాసమును సమకూర్ప వేచియుండెను॥

స్వవివాహార్థ మీశ్వర స్య బ్రహ్మవిష్ణ్వాది దైవతై స్సహ హిమాచలగమనమ్॥

ఈశుడు సముద్రజలములందు తన రూపు (అద్దమునందువలె) చూచికొనిన తరువాత హరి తన మోకాళ్ళు: భూమిని తాకునట్లు వంచి అతనితో: “దేవా! జగదానందదాయియగు రూపముతో ప్రకాశించుచున్నావు,” అనెను॥ ఇదే సమయమని మాతృకలును వైధవ్య లక్షణములతో ఉన్న మన్మథ పత్ని యగు రతిని ఆయా ప్రకారముల॥ ఇంగిత సంజ్ఞ లతో పేరించిరి॥ తరువాత రతి తమ్మువేడుకొనగా వారు నవ్వు మొగ ములతో శివునుద్దేశించి “దేవా! మదనుడు లేక రతి తమ ఎదుట కాంతిహీనయైయున్న ది" అనిరి॥ అప్పటికే పార్వతీ ముఖ దర్శనోత్సుక మానసుడై యున్న శివుడు॥ ప్రయాణోన్ముఖుడై ఆమెను కొంచెము వేచియుండుమని తెలుపుడని ఎడమ చేతి వేళ్ళ సైగ తోనే మాతృక లకు తెలి పెను॥

శివుడు వివాహమునకై తరలి పోవుట

అనంతరము శివుడు హిమగిరి కందరమువలె తెల్లనగు మహాపృషభముమ మెత్తని కొరడా దెబ్బలతో తోలుచు॥ సాగిపోవు చుండెను॥ అదియును సమ్మర్గముగా గుమియైయున్న ప్రమధుల పై కన్నులు ప్రసరింప జేయుచు వజ్రము కొండ లనువలే వారిని భయ పెట్టుచు వణకించుచు సాగుచుండెను॥ అంతట హరియు త్వర తో అడుగులు వేయుచు ముందుగ పోవుచు శ్రమయేనపుడు చెట్ల నీడలందు విశ్రమించుచు త్రోవలోని ధరాధూళితో తనయాభరణములు వింతరంగులు కలవి యగుచుండ పోవుచు “ముందునకు నడచుచుండుడు; నిలువబడి ఈశుని తోవకు ఇబ్బంది కలిగించవలదు॥” అని జనులను॥ హెచ్చరించుచుండెను॥ ప్రభువు మొదటనే తనకిచ్చిన యాజ్ఞను మన్నించుచు వీరకుడును కనుబొమలు ముడి వేసి దేవత లారా! ఆకాశములో ఏమివింత చూచుచున్నారు ? పర్వతములారా! మాకు దూరముగా పోండు; మహా సముద్రములారా! మహాసుర సంచారమున బురదగా నేన మీ జలమును శీలవలేగట్టి పరచుకొనుడు; గణాధిపతులారా! చంచలగతితో పోవలదు॥ దేవతలతోకలిసి స్టెరగతీతో నడువుడు॥ ఓ భృంగీ! నీవు నీ యొడ లివంక చూచుకొనుచు అడ్డదిడ్డముగా పోవుచున్నావే కాని శివుడు తన విశాలముఖమండలాగ్రమును (చూపును) ప్రసరింపచేసిన త్రోవవేంట ఆయనను వహించికొని పోవుట లేదు॥ యమా; నీవు నీ దంతముల నడుమ సందులు బయల్పడ నోరుతెర చుకొని ఏ సంభ్రమమును లేక ఊరక దండాయుధమును॥ మోసికొని పోవుచున్నావు॥ (ఎచ్చరికగా లేవు; ఏలయన-త్రోవయంతయు రథముల గుర్రములును మాతృకలును తమ॥ తమ అనుచరులు తమవెంటరాగా కాలినడక తో నడుచుచున్న దేవతలును తమకువలసిన దానికి రెండింతల తోవనాక మించి శివునకు తోవవిడుచుటలేదు॥ దేవతలారా! గాలికి చామరములు కదలియాడుచుండు ధ్వజములుచలించుచుండ ఠీవితో తమ తమ వాహనములారోహించినడువుడు; మీరు మూడు విధములగులయలతో మీరు మీరు సాధన చేసిన చేసిన రోగములను పాడరేల॥?

కిన్నరులు తమ విభూషణముల రాపిడివలన కలుగు ధ్వనిని మరుగు పరచునంతగా గొంతెత్తి పాడలేకున్నారే: స్వజాతీజు (లగుప్రమథు)లారా! మీరును షడ్గ మధ్యమ స్వరములతో బిగ్గరగా బహుతరముగా పాడ రేల? (కళావేత్తలగు) గౌడకులారా ! మిగుల వంగి వంగిపోవు శరీరములతో మీరందరును మీ కళలకు సంబంధించిన వ్యవస్థను విడిచి ఎవరికివారే విడిపోయి భయపడుచు త్వరలో అడుగులు వేయుచు ఆట్లు పోవుచున్న రేల? షాడవాది కళాభిజ్ఞులుకూడ అట్లు వేరువేరుగా విడి పడిపోయెద రేల ? లలిత పదప్రయోగములతో సంపన్న ములయిన మీమీ గీతక ములతో ప్రభువునకు ఎదుట ఆతీ స్పష్టార్థమగు అక్షత (ఏకొరతయు లేని) సంగీతమును స్ఫుటముగా పాడ రేల ? ఈ నాగజాతులవారును ఒక గుమిగానుండక ఎవరియంతట వారయి విడివడి రమ్యమగు నాసక నృత్త మును బహుగమక స్వభావవంతముగా అభి నయించుచు పరమ శివుని యశమును వ్యాపింప జేయుచు ప్రకీర్ణక విధానమున అభినయించుచున్నా రేల ? ఈ వివిధ జాతు లకు చెందిన దేవ యువతులును ఒక అమరిక లో నుండక ఆయా దిక్కులందేచ్చట వెచ్చటనోచేరి పరస్పర మిశ్రితలయి ప్రతిక్షణమందును ఏవేవో మాటలో పొటలో పలుకుచు ధ్వని చేయుదు రేల? చక్కని ధ్వనులుగల మృదంగ వాద్యధ్వనులు వినవచ్చుటలేదు॥ సంగీత శాస్త్రీయ మూర్చనా ప్రధానములగు మూర్చిత గీతికలు వినబడవు; ఇది యేమి? శ్రవణ ప్రీతికర మగు క్రమగతిగల సంగీత భేదములతో వివిధ సాధనములతో కూడినవియు తుంబురునిచే చెప్పబడినవియునగు వీణా మృదంగాది వాద్య విశేషములు చక్కగా మ్రోయింపబడ వేల? ఇట్లు పలుకు వీరకుని వచనములవధరించి సురాసురులు నియమబద్దులయి మిగుల హర్షముతో చరాచర జగమంతయు తామే నిండి ముందునకు సాగిపోవు చుండిరి॥

ఇట్లు దిశలు ఉరుముచున్నట్లు ధ్వనించుచుండ మహార్ణవములు మోగుచుండ మేఘములురుముచుండ గిరికందర ములు పగులు చుండ జగమంతయు తుములమగుచుండ త్వరిత గమనమున తన నగరికి తరలి వచ్చుచున్న శివునిచే హిమ వంతుడు కలతనందేను॥

ఆ హిమాలయ మహాగిరినగరమునందొక చోట మీగుల ప్రకాశించు వేలకొలది బంగారు తోరణములుండెను॥ ఒక దానికి మరియొకటి చేరువలో మరకత మణి వేదిక లుండెను॥ ఒక చోట వైడూర్యపు భూమిక లుండెను॥ ఒక చోట జల జలపారు అందమగు సెలయేళ్లుండెను॥ ఆ నగర మందంతటను వేలకొలది పతాక లు కదలియాడుచు ఆలంకారమయి యుండెను॥ ఇండ్లముంగిళ్లయందు కల్ప వృక్షముల పూలు చల్లబడి యుండెను॥ తెల్లని ఎరనీ నల్లని గేరిక ధాతువులు॥ వ్యాపించి యుండెను॥ త్రోవపొడవున భవన గోపురములు కనబడుచు శోభించుచుండెను॥ సుగంధ ధూపపు పొగలతో నిరుపమానములగు మేఘములానగరపు ఆకాశమున క్రమ్మీయుండెను॥ అంతట నా మనోహర వాయువులు వీచుచుండెను॥

పురప్రవేశ సమయే ఈశ్వరాదిక మాలోక్య పౌర నారీణా మన్యోన్యసం ల్లావః - ఈశ్వరుని పురప్రవేశము- నగరనారీ సంల్లాపము॥

ఇట్లు సురాసురుల స్తుతులందుకొనుచు పరమేశ్వరుడు ఒక క్షణ కాలములో ఇట్టి హిమవన్మహా నగరము చేరెను॥

ఈశ్వరుడిట్లు తరలివచ్చి పురప్రవేశము సేయుచుండ హిమవన్న గరము సంభ్రమమున కలత నొందు ముత్తైదువలతో తడబడు యాన సాధనములతో గందరగోళపడుచు త్రోవల పరుగెత్తు జనులు కల విళలరాజ మార్గము లతో రచ్చ పట్టులతో నిండి ఆకులమయ్యెను॥ హర్మ్యముల గవాక్షముల కడకు వచ్చిన ఆమరల నేత్ర పంక్తులు నల్లకలువల మాలలై కనుపట్టుచుండెను॥ వారిలో ఒకతే తన ఆభరణ కాంతికిరణములందే మరుగుపడియు మిగుల ప్రకటయే కనబడెను॥ ఒక తే తన ఆభరణాలంకరణము ముగియక యే తన చెలి పై ప్రీతినికూడ విడిచి ఆమెను వదలి తానొక్కతేయే హరుని చూడవచ్చెను॥ ఒకతె ఇంకోక తెతో “తెలివి తక్కువదానా! వేగిరపాటుతో మాలనపై వ్రేలాడ నిచ్చుకొనుచు రాకుము॥” అనెను॥ ఒకతే తాను శివుని చూడవలెనను త్వరతో పడుచుపోవుచునే శివ వీరహముతో తడబడు శరీరము కల ఇంకొక తెతో "ఈ పినాకి మన్మథునే దహించినవాడు॥ అతనికి స్త్రీలతో పొందు అక్కరలేదు॥ తానొక్కడే విహరింపగోరువాడితడు॥” అనెను॥ ఒకతెకు శివుడు కనబడనందున ఇంకొక చేతో యు క్షిగా “చపలురాలా! శివుని విషయములో మన్మథునితో సంబంధముకల మాటలేవియు పలుక కుము॥” అనెను॥ (ఆ మాటవినీ శివుడిటు మొగము త్రిప్పినపుడాతని చూడవచ్చునని ఆమె ఆశ- ఇంద్రాది దేవనాయకులును తామే పలుకు నామములతో స్తుతించి నమస్కరించుచు సేవాఫలమాశించి పూజించునదీతనినే అని ఒక తే పలికెను॥ ' ఈ చర్మ వస్త్రధారియే శివుడు॥' అని ఒక తే వలి కెను॥ “ఏవని ముందు ఇంద్రుడు వజ్రధారియై చెమర్చుచు పరుగెత్తుచు త్రోవ విశాలము చేయుచున్నాడో అతడే సుమా శివుడు!' అని మరియొకతే అనేను॥ పొడవు జడలు దాల్చి మృగ చర్మము ఒడలి పై కప్పుకొనియున్న ఎవనికడకు పోయి బ్రహ్మ ప్రేమపూర్వకముగా చెవి మొదట ఉంచిన తన నోటిని తన చేతితో మూసికొని మెల్లగా ఎదియో చెప్పు చున్నాడో అత డే శివుడు॥ అని ఒకతే పలికెను॥ ఇట్లు దేవశ్రీలు శివుని చూచి తమలో తాము అనురాగ పారవశ్యమున పలుకుచు చిత్తము కలవరపడుచుండ ఇట్టి పర మేశుని ఆశ్రయింపగోరు గిరిపుత్రి జన్మము సఫలమనుచుండిరి॥

ఆంతట విశ్వకర్మ నివేదించగా మహేంద్రాది దేవత లెల్లరును మహానీలమణిమయ స్తంభములు ప్రజ్వలించు బంగారు గచ్చు నేలలు ము తైపుజాలరుల అలంకరణములు మహౌషధీ లతాదీప ప్రకాశము వేలకొలది॥ క్రీడోద్యానములు బంగారు చుట్టుకట్టులు గల దిగుడు బావులు కల అద్భుతమగు హిమవన్న గరమును చూచి తమ నయనములు సఫలము లయ్యెనని మనస్సులందు భావించి హర్షించిరి॥ వాకిట నిలిచి హరి అందరను నిలిపి నిలిపి లోనికి విడుచుచున్నను సమ్మర్దములో భుజకీర్తులు మొదలగు ఆభరణములు చెదరుచుండ దేవతలు లోపల ప్రవేశించిరి॥

పార్వతీపరమేశ్వరయోర్వివాహమహోత్సవః॥

పార్వతీపరమేశ్వరయోరక్షక్రీడావర్ణనమ్॥

మునులు ఇట్లు పలికినది విని తన మనస్సంతయు హర్షముతో నిండ పార్వతి ఇట్లనెను: పెద్దలు ఇట్లు చెప్పుదురు; జలమే లేని దేశమున కూప నిర్మాణము చేసిన వివేకి ఆ కూపమందలి జలమున ఎన్ని బిందువు లుండునో అన్ని సంవత్సరములు స్వర్గమున వసించును; వది బావులును ఒక హ్రదమును (పుణ్యమునిచ్చుటలో) సమానము; పది ప్రదములు ఒక పుత్రుడును సమానము; పదిమంది పుత్తులు ఒక వృక్షముతో సమానము; లోకస్థితి కరమగు మర్యాద (వ్యవస్థ పెద్దలచే ఇర్పరచబడినది॥ ఇట్లు ఆమె పలికిన పలుకులు విని బృహస్పతి మొదలగు ఆవిప్రులు భవానిని సాదరముగ నమస్కరించి స్వగృహముల కేరిరి॥ వారు వెళ్ళిన తరువాత ॥ శంకరదేవుడును శుభ రూపయగు పర్వతపుత్రిని చేట్ట పట్టుకొని గోపురములతో కూడినదియు చిత్తమునకు హాయిని కలిగించునదియునగు ప్రాసాదమును ప్రవేశింపజేసెను॥ మరియు ఆ ప్రాసాదము ము తేముల దండలు వ్రేలాడు చున్నట్టిది; నిరుపమానమైనది; రత్న వేదికలు కలది; పుటము వేసి శుద్ది చేసిన బంగారు కట్టడములు కలది; క్రీడాగృహములు కలిగి మనోరమమయినది; అంతట వెదజల్లబడియున్న పూల వాసనతో మత్తెక్కిన తుమ్మెదల గుంపు చేయు ఝుంకారపు రొదలతో నిండినది; కిన్నరులు ఉచ్పైఃస్వరమున పాడు సంగీత ధ్వనులు కలది; గదుల నడుమ చక్కని గోడలు కలది; సువాసనలు కల పొగల గుములతో మనస్సు నాకర్షించునది; ఇదివరకు ఎవరుసు ఎక్కడను చూచియుండనిది; ఆట నెమిళ్ళతోను (సుందరు లగు) స్త్రీలతోను వీణాది వాద్యముల మోయించువారితోను కూడినది; గుంపులే ధ్వనులు చేయుచున్న టి హంసలు కలది; స్పటిక మణి నిర్మితములగు స్తంభములును వేదికలును కలది; ఏ మాలిన్యమును లేనిది; అతి పీతియుక్తులై యున్న కింనరులతో నిండినది; దానియందలి పద్మరాగ మణుల గోడలను చూచి దానిమ్మ గింజలను భ్రాంతితో చిలుక లు॥ వాటిని తమ ముక్కులతో పొడుచుచుండును॥ ముత్తెములా ప్రాసాదపు గోడలందు ప్రతిబింబించి { రెట్టింపై కనబడుచుండును॥

ఇట్టి ప్రాసాదమునందు పరమేశ్వరుడు పార్వతితో పాచిక లాడుట మొదలు పెట్టెను॥ స్వచ్చమగు ఇంద్ర నీల ఫలకము నందాడుచు దానియందు ప్రతిబింబించిన తమ శరీరములే తోడుగా వినోదరస పారవశ్యముతో పార్వతీ పరమేశులుండిరి॥ ఇట్లా దేవీ శంకరులాడుచుండ ఆ భవనాంతరాళమునుండి , మహాధ్వని యుత్పన్నమై వినబడెను॥

అది విని శుభ శరీరయగు దేవి కుతూహలముతో విస్మయముతో ఇది ఏమియని శంకరునడిగేను॥ శివుడును శుచియగు చిరునగవు కలదానా! నీవిదివరకు కని విని యుండవు; నా పీతికి పాత్రులగు గణాధిపతులీ · లమున సదా క్రీడించుచుందురు! ఆదియే ఇది; అనెను॥ తపముచే బ్రహ్మచర్యముచే నియమములచే క్షేత్ర సేవనములచే పూర్వ జన్మములందు నన్ను మెప్పించినవారే వీరు; శుభాననా! ఆ మనుజులట్లు నా హృదయమును తమ వశ మొనర్చుకొని నన్ను చేరి తమ కామముల (కోరికల) నీడేర్చుకొనిన మహోత్సాహులు; మహారూపులు॥ సద్గుణాన్వితులైన వీరిని చూచి నా కే యాశ్చర్యము కలుగుచుండును॥ దేవాదులతో కూడ ఈ జగమంతయు సృష్టింపసంహరింపగల వారు॥ వీరు; బ్రహ్మ విష్టింద్ర గంధర్వ కిన్నర మహోరగాదులేవ్వరు నాకడ లేకున్నను వీరు నన్నె ప్పుడును విడువరు; వీరు మనోహర సర్వావయవులయి॥ నామనస్సు లోగొనువారు; అట్టి వీరు ఇపుడి శైలమున క్రీడించుచున్నారు; అనిన శిపుని వచనములు విని వెంటనే దేవి ఆశ్చర్యవశురాలై ఆట విడిచి గవాక్ష రంధ్రములనుండి ఆది చూచుచు వికసితముఖి యయ్యెను॥ వారెందరందరును చిక్కినవారు పొడగరులు పొట్టివారు లావగువారు పెద్ద కడుపుల వారు పులుల॥ ఏనుగుల మొగములవారు॥ మేకల గొర్రెల రూపములవారు అనేక ప్రాణి రూపములవారు మం డెడి మొగములవారు నల్లనివారు పింగళ వర్ణులు సౌమ్యులు భయంకరులు స్మిత ము ఖులు నల్లని॥పింగ వర్ణపు జడలు జూలు కలవారు॥ నానా వక్షముఖులు సోనా మృగ ముఖులు పట్టువస్త్రములు॥మృగ చర్మములు దాల్చినవారు-దిస మొలవారు॥విరూపులు॥ ఆవు చెవులవారు ఏనుగు చెవులవారు బహుముఖ నేత్రోదరముల వారు బహుపాదులు బహుభుజులు దివ్య నానాస్త్రములు చేబూనినవారు అనేక కుసుమములు కొప్పులందు దాల్చినవారు నానా సర్పభూషణులు తోడేళ్ళ మాములవారు నానాయుధధారులు నానా కవచ నానా భూషణ ధారులు విచిత్ర వాహనారూఢులు దివ్యరూపులు గగన సంచారులు వీణాది వాద్యముల మోయించువారు నానా భూమికలు (వేషములు) దాల్చి నృత్యములొనరించువారు నయియుండిరి॥

తన పెంపుడు కొడుకయిన వీరకునకు దేవి చేసిన బాలోచిత హితోపదేశము॥

(ఇది గేయాత్మకమగు గద్యము): పార్వతి వీర కుని తన కడకు పిలుచుకొనుచు “రారమ్ము నాయనా! వీర కాః దేవదేవుడు నాకు నిన్ను పుత్రునిగానిచ్చినాడు; కావున నీవు నాకు కుమారుడవయితివి! అనుచు అతనిని తన తొడ పై కూర్చుండ బెట్టుకొని చెక్కిళ్ళు నిమురుచు అతని ముద్దు మాటల కానందించుచు తల మూస్కొని అవయవముల (ధూళి) తుడిచి దివ్య భూషణములతో కోమల పల్లవములతో గజ్జెలు మొలత్రాడు అందేలు రత్నాల భుజకీర్తులు హారములు, పుష్పమాలలు మొదలగు వానితో స్వయముగా నలంకరించెను॥ శుభ్ర విభూతులతో మంత్రించిన ఆవాలతో ॥ శరీర రక్ష చేసెను॥ పిమ్మట ఆమే వీరకునితో ఇట్లు బాలురకు చేయదగిన హితోపదేశము చేసెను; నాయనా! జాహ్నవీ జలమున ప్రవేశింపకుము॥ కల్లోలితమగు నీటితో వ్యా ప్రమయిన చోట్ల నది యొడ్డునకు కూడ పోవకుము॥ బహుదుష్ట వ్యాఘ్రము లతో నిండిన అడవులు కలవు॥ వానియందు ప్రవేశింపకుము॥ అనెను॥

అసంఖ్యాకులగు గణేశులయందును తనకతి ప్రీతిపాత్రుడగు ఈ వీరకుని విషయమున దుర్గామూర్తియగు పార్వతి పుత్ర భావముతో నంతుష్టాంతరంగయై వాత్సల్యముతో నుండును॥ అందుచేతనే ఆమె అతనితో పైవిధముగా చెప్పెను॥ ఈ విధమగు వాత్సల్యము తమతమ పుత్తుల విషయమున లోకమునందలి మాతా పితరులెల్లరు కోరు కొనునదే; కాని వారి వాత్సల్యములో మాయావరణముండును; పార్వతి చూపు వాత్సల్యము మాయ నతిక్రమించినది; మాయాతీతమయినది; ఆ వీరకుడును చిలిపి చేష్టలకు పోక సర్వగణ ప్రమథలతో కూడి బాల్యమునకు తగిన ఆటల వలని ఆనందరసమనుభవించు ఆస క్తితో ఇట్లు పలికెను: ఇదుగో! ఇచ్చట మా అమ్మ నాకు తాను స్వయముగా చేసిన భూషణాలంకార సంస్కారము; ఇదిగో వస్త్రము; ఇవిగో దీనియందు సన్న ని చుక కాలు; సింధువార పుష్పములతో కూర్చినది మాలతులు నడుమ నడుమ కూర్చినదియగు మాల ఇదిగో! మా అమ్మ నాతలలో ఉంచినది; వాద్యములు మోయించెడి ఈ గణనాధులకీ ఆటవస్తువునిత్తును; అనుచు ఆడుచున్న ఆ వీర కునివై పు పార్వతీదేవి తన చెలితోకూడి గవాక్ష మునుండి దక్షిణమునుండి పడమటకు ఆటనుండి ఉత్తరమునకు ఆటనుండి తూర్పునకు వచ్చుచు పోవుచు చూచుచు అతని ఆటల ముచ్చట కనుచుండెను॥ జగన్మాతకును ఇట్టి చిత్త భ్రమ మాశ్చర్యకరముగదా! ఆమెయే ఇటైనచో అల్ప బుద్దులు జడులు మాంసర క్త మలమూత్ర సముదాయ నిర్మిత శరీరులునగు సాధారణ జనులు పుత్తుల పై మోహ మందుటలో నాశ్చర్యమేమి ?

ఇది ఇట్లుండ ఇంతలో శివుని దర్శింపగోరి దేవతలు తమతమ వాహనముల పై వచ్చి వాటిని దిగి కక్యాంత రములు ప్రవేశించుచుండిరి॥ అంతలో ప్రమథగణనాధులు వచ్చి వారి వాహనములు (అల్లరిగా) ఎక్కుచు దిగుచు ఇట్లనుచుండిరి : అరే? ఈ యముడు తక్కిన లోకపాలురతో కలిసి ముద్దరము మాత్రము చేతిలో ఊగించుచు ఖడ్గము పాశము అసి (ఒక విధమగు ఖడ్గము) దండము మొదలగు ఆయుధములందు మమకార మేలేక యున్నా డే! ఈతడు ఎవరిపోడు ? వీనినీ ఇటు చూచి ఎవరైన పట్టుకొని కొట్టినచో ఏమీగతి! వీనికి ఇది ఏమీ! ఇంత అలక్ష్యము! ఈతని భయం కర ముఖమును ఆకారమును చూచి ఎవరు భయపడుదురు? ఈ పర్వతమున ఇట్టి యాకారముతో పని మాత్ర మేమున్నది? ఈతని ఆకారము చూచి ఇతడు ఆస్త్ర నిపుణుడని ఈతని నెవ్వరు కొట్టకుందురు? అనుచునే వేళాకోళము లాడుచున్న ప్రమథులను చూచి దేవతలు యమునితో “ఆఁ! వీరి చిలిపి చేష్టలును కొంటే మాటలును ఇంతియేలేమ్ము! లోకపాలానుచరులారా! మీరును వీరికి భయపడకుడు॥” అని ధైర్యము చెప్పుచుండిరి॥ వారిలో చేరి ఈ వీరకుడును ఆడుచుండెను॥

దేవికి ఆతని మీది మమకారము అమితము; ఆందుచే అతడు వనములందాడుకొనబోవునపుడు రక్ష సేయగోరి వన పర్వత నిర్ఘరములందును అగ్ని దేవతా మార్గములందును ప్రకృతియందు సంచరించు భూతములను పొదరిండ్ల యందు సంచరించు జల ప్రపాతములందు మునిగియుండు॥పుష్పజాల వ్యాప్త స్థానములందు సంచరించు॥ ఉన్నత నానా పర్వత నికుంజములందు ధ్వనించు వాయువులను ఉద్దేశించి ఆమె “ఓ వాయువులారా! మీరు విజృంభణము తగ్గించి వీరకుని ఇచ్చకు తగినట్లు వీచుడు॥" అని పలికెను॥ మేరు పర్వతపు ఎత్తైన శిఖరములనుండి దీగుచు (జారుడుబండ ఆట) ఆడి బంగారు రేఖలతో బంగారు ధూళితో ఒడలు నిండిపోవగా దేవతలు సంచరించు వన రమ్య దేశములందు ప్రమథ గణములు తన వెంటనుండి కొలువగా సుందర మందార వుష్పములు చిగురాకులు పద్మములు గల మందర పర్వత కందరములందు సిద్ద స్త్రీలు తన రూపామృతము తావుచుండ పార్వతి అతని వినోదములకు వేడుక పడుచు నిమిషము కూడ జెప్ప వాల్ఫక విప్పారిన కన్నులతో పుత్ర వాత్సల్యముతో వీరకుని చూచుచుండెను॥ అతడును అట్టి ఉత్సవ ములననుభవించగల్గుట తన పుణ్యోదయమనుకొనుచు తాను పూర్వ జన్మాంతరమందును ఆమెకు పుత్రుడై యుండెనని గుర్తించి ఎంతకును తృప్తినందక ఆడుకొనుచుండెను॥ ఆ శుభరూపుడు బ్రహ్మదేవుని తేజముతో సృషింపబడినవాడు కాని సామాన్యుడు కాడు; ప్రతిక్షణమునను దివ్యులు పాడు గీతముల వినుచు వారి నృత్యముల నొస క్తితో చూచుచు గణేశుల వందనములందుకొనుచు రత్న జాలపూర్ణ మై పెద్ద సాలలాల వృక్ష పూర్ణమయి సింహనాదాకులమగు గండ శైలములందు విచ్చిన నానా తమాల వృక్షములు కల తావులందు క్రీడించు హంసలు గల తావులందు చెట్ల మొదళ్ళ యందు బురద అంతగా లేని తామర కొలకుల జలములందు శుభము నిష్కలంకమునగు తల్లి ఒడియందు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణకాలము గణేశులకును ఆధిపతియగు ఆ వీరకుడు బాలక్రీడలతో విహార వినోదమనుభవించుచు ఆడుకొనుచుండెను॥ ఆతడు దేవతల కానందము కలిగించుచు తిరుగుచుండెను॥ విద్యాధరులాతనిపై గీతములను పొదరిండ్ల యందు కూర్చుండి పాడుచుండెడివారు॥ ఆతడు మహాదేవుడును పినాక ధారియునగు శివుని కంటే తక్కువ వాడు॥ ఐనను ఈతడును ఆతని వలేనే లీలా విలాసములతో కూడి క్రీడించుచుండెను॥

సాయజ్కాలవర్ణనమ్॥

భువన విస్తారమును ప్రకాశింపజేసి ఆస్త పర్వతమునకు వెనుక దూరమున నున్న దేశాంతరమునకు రవి వెడలిపోయెను॥ మేరుపర్వతము తాను అవనీధరమే భూమికి గల సుఖదుఃఖముల బరువును మోయునదే కదా! రవియును (తనకును లోకమునకు వలెనే) మిత్రుడు (స్నేహముతో మండు వాడు॥రవి॥అని రెండర్థములు॥ ఇది కాక-ఉద యించు సూర్యునికి మిత్రుడు ఆనియు ఆ స్తమించు రవికి వరుణుడు అనియు శాస్త్ర వ్యవహారము॥) కదా! ఆతని దృఢ మిత్రత్వమును ఆలోచించియే కాని ప్రతినిత్యమును ఆ రవి తను ఆరాధించుచున్నాడు కదా ! రవి సదా మేరువును ప్రదక్షిణించు చుండును అని ఆలోచించి విశాలమగు మూలము (మూలధనము) లోక మందంతటను కల మేరువు పడ మటి సముద్రములో ఆ స్తపర్వతమునకు వెనుకగా పడిపోవుచున్న (చిక్కులలో పడిపోవుచున్న) రవికి ఏమియు ఉప కారము చేయలేదు-(ఇది దుష్టుని స్వభావము కావున) వివేకి ఎప్పుడును ఉత్తమునినే ఆశ్రయించవలయును॥ పాపము! ఆ మేరు పర్వతము రవిని “ఓయీ! నీవు మనస్సులో చింతపడకుము; నీ పునర్వృద్దికయి యత్నింతు"నని మాట మాత్రమైన ఆనలేదే! ఐనను చింతపడక భానుడు దినాంతమను ఆవసానదశ తన వెంటరాగా బాధనందక తాను సర్వ ప్రాణులకును స్వజనుడు అను మాటను నిలువబెట్టుకొనెను॥ రవికి రాబోవు భావి దుర్దశా దుఃఖమును ఆత్మల తమ మనస్సుల) యందే అణచుకొని మునులు బద్దాంజలి పుటులై రవి కభిముఖులయి మరల శీఘ్రముగ రమ్మని ప్రార్థింప సాగిరి॥

క్రమముగ ఈ లోకమునందంతట విభావరికి (లోగడ బ్రహ్మ ఏ దేవిని ప్రళయాధిష్ఠాత్రిని యోగమాయను॥ ప్రార్థించెనో ఆ దేవియే ఈ విభావరి-రాత్రి) సంబంధించిన చీకటులు చేలరేగెను॥ ఆది నజ్జనుల మనస్సును కూడ కలుషితము చేయు దుర్జనుల హృదయములందలి మాలిన్యమువలె నుండెను॥

శివుని శయనమందిరము నందలి గోడలు మహానాగముల పడగలందు జ్వలించు రత్న దీపములతో మిగుల ప్రకాశించుచుండెను॥ అందలి పానుపు నానా రత్న కాంతులతో ఇంద్ర ధనువువలే మెరయుచుండెను॥ దాని పై చంద్రుల సముదాయము వంటి తెల్లదుప్పటి పరచియుండెను॥ దానిపయి రతనాల చీరుగ జైలు వేలాడుచుండెను॥ ము తెముల గుత్తులును వ్రేలాడుచుండెను॥ మనోహరమయి చంచలమయి కదలియాడు మేలు కట్టు ఆకాశమునే క్రమ్మివేయు చున్న దో యనునట్లుండెను॥ ఇట్టి మందిరమున ఇట్టి పాన్పు పై శంకరుడు మంద నంచారుడయి మెల్లగా గిరి సుతతో కూడి కూర్చుండెను॥ క్రమముగా ఆతని కంఠము పార్వతీ బాహులతాలింగనములో మునిగేను॥ అతని శిరమందలి చంద్రుని తెల్లని వెన్నెలలతో నిండి ఆ పరిసర ములన్నియు పవిత్రములును నిర్మలములునయ్యెను॥ పార్వతియును స్వాభావికముగనే నల్లనికడ గన్నులు కలది; ఆమే మేనిఛాయ నల్ల కలువ పూ రేకుల చాయను పోలినది; ఈ కాంతి విభావరీ (రాత్రి) కాంతితో సంపర్కమునంది అతి తమోమయమై కడు నల్ల నయి తోచెను॥ తనతో క్రీడించు తమ కమున ఆ కళలనెరిగి తన కడనున్న యాదేవితో మహాదేవుడు చిన్న గ నవ్వుచు ఇట్లు పలి కెను;

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున పార్వతీ పరమేశ్వర వివాహాది కథా నిరూపణమను నూట ఏబది మూడవ అధ్యాయము॥