మత్స్య మహా పురాణము
82 - ధాన్యాది పర్వత దానములు
నారదుడు ఈశ్వరుని ఇట్లడిగెను: పరలోకమున అక్షయ ఫలద మైనదియు దేవతలును దేవరులు ను ప్రశం సించునదియు మహా మహిమము కలదియు నగు ఉత్తమ దానమును తెలుప వేడుచున్నాను. అనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: పది విధములగు మేరు పర్వత) దానము అనునది కలదు. దానిని చేసిన నరుడు సుర పూజితములగు ఊ తమ లోకము లందు సుఖించును, ఇవి చేయుటచే కలుగునంత ఫలము పురాణములను వేదములను అధ్యయనము చేయుటచే కాని వాని యందు చెప్పబడిన ఆయా యాగాది పుణ్య కార్యములను చేయుటచే కాని లభింపదు. ఆవి వరుసగా ధాన్య లవణ సుడ సువర్ణ తిల కార్పొస దూది) ఘృత రత్న రజత. శర్కరా మేరు పర్వత) దానములు. క్రమముగా వీని విధానము తెలి పెదను. (ఉత్తర/దక్షిణ) అంచునములు-వీషువము (దివారాత్ర పరిమాణము సమమగు దినములు రెండు వ్యతీపాత యోగము అవమ-త్రిద్యుస్పృక్ దినములు-{ప్రతిమాసం శుక్లపక్ష తృతీయ-చంద్ర.సూర్య) గ్రహణములు- అమావాస్య వివాహములు ఉత్సవములు. యజ్గములు ద్వాదశి- పూర్ణిమ-పుణ్య (శుభ) నక్షత్రమున్న దినము. ఈ కాలములందును పుణ్య తీర్థ క్షేత్రములు.గోవులు నిలుచు ప్రదేశము. ఇంటి ముంగిలి.వనము-ఇట్టి దేశ ముల దును వీటిని రుథా విధానముగ సీయవలెను. తూర్పునకో ఉత్తరమునకో వాలుగా ఉండు ప్రదేశమున భక్తితో ఉత్తర మో తూర్పో మొగముండునట్లు చతు. రన మండపము (పందిరి) ఏర్పరచవలయును. దానియందు గోమయముతో అలికిన ప్రదేశమున, దర్భలను పరచు వలయును. ఆచోటి నడుమ శాఖా పర్వతములతో కూడిన ప్రధాన పర్వతమును మేరువును) నిర్మించవలెను.
పర్వత నిర్మాణము: 1. ధాన్య పర్వతము: దీని కై కావలసిన ధాన్య పరిమాణము-(తూము-32 మానికలు-64 కొలత సేరులు. అని గుంటూరు మండలమునందును రాయలసీమలోను వాడుక;తూము=కడవ(రాయలసీమలొ))వేయి తూములుగాని ఐదు వందల తూములు కాని మూడు వందల తూములు కాని ఉండవలెను. నట్ట నడుమ చూడు బంగారు శిఖరములు తూర్పున ముత్తెముల వజముల శిఖరము-దక్షిణమున గోమేదక పుష్యరాగ" శిఖరము పడమర , గరుడ -- పచ్చల: ఇంద్ర నీలముల శిఖరము ఉత్తరమున వైడూర్య పద్మరాగముల శిఖరము ఉండవలెను. మంచి గంధపు కర్రలతోను పగడముల తోను చేసిన తీగలు ము: తైపు చిప్పలతో అమర్చిన రాతినేలలు ఉండవలెను. బంగారుతో చేసిన బ్రహ్మ విష్ణు ' రుద్ర శివుల ప్రతిమలును - సురసిద్ద ప్రముఖ దేవతల ప్రతిమలును ఈ పర్వతపు పైభాగమున , అమర్చవలేను. నాలుగు శిఖర ములును నెత్తములును వెండితో చేయవలెను. సోనా దిక్కులందును చేరకుగడలతో మూయబడిన గుహలును నేతితో నీటితో అమర్చిన సెలఏరులును కొండ ఊటలును ఉండవలెను. తూర్పున తెల్లని వస్త్రములు దక్షిణమున పచ్చని వస్త్రములు పడమర కలగలుపు వన్నెల వస్త్రములు ఉత్తరమున ఎర్రని వస్త్ర ములు మేఘములుగా అమర్చవలేను. వెండితో చేసిన స్పిలకుల ప్రతిమలను ఎనిమిది దిక్కులందును నిలుపవలేను. కొండ పై అంతటను వివిధ ఫలపుష్ప మాల్యములు అమర్చవలెను. దీనికి పైభాగమున ఐదు వన్నేల వస్త్రములతో పొడని పూవులతో ఆభరణములతో అమర్చిన చాందినీని అమర్చవలెను. ( నిర్ణయించుకొనిన ధాన్య పరిమాణములో నాలుగింట మూడు వంతుల ధాన్యముతో మేరు పర్వతము అమర్చగా మిగిలిన నాలుగవవంతు ధాన్యముతో గంధమాల్య యుక్తముగా ఆయా కుల ( శాఖా) పర్వత ములను అమర్చవలెను. ఎట్లనగా -తూర్పున బంగారుతో చేసిన రుద్రుని ప్రతి మయు ప్రమథుల ప్రతిమలును అనేక ఫల పుష్ప గంధ విలేపనములును బంగారు మన్మథ - ప్రతిమయును. వీరికందరకును వస్త్రమాల్య గంధ విలేపనములును మందర పర్వతము పై అమర్చవలెను.
దక్షిణమున గోధుమల రాశితో గంధమాదన పర్వతమును దాని పై బంగారుతో నేరేడు చెట్టు - బంగారుతో కుబేర ప్రతిమ నేతితో మానస సరస్సు చక్కని వస్త్రములు వెండితో చేసిన చెట్ల అడవులు ఉండవలెను. పడమట తిలలతో చేసిన విప్రుల పర్వతము దానిపై అనేక సుగంధ పుష్పములు బంగారుతో అశ్వత వృక్షము బంగారు హంసలు వెండితో తెల్లని పూలవనము తెల్లని వస్త్రములతో దధి ( పెరుగు) సరస్సు అమర్చవలయును. ఉత్తరమున కంచుతో సుపార్శ్వ పర్వతమును దాని పై శిఖరములు బంగారుతో పూల మొక్కలు మర్రిచెట్టు బంగారు గోవు వెడి చెట్ల అడవి తేనెతో భద్రమను సరస్సు ఏర్పరచవలయును.
ఈ మండపమునకు తూర్పున హస్త ఘన పరి సూణము కల కుండమునందు వేద పురాణ వేత్తలును పవిత్ర చరిత్రులు సమర్థులునగు నలుగుర బ్రాహ్మణులచే తిలలతో యవలతో ఘృతముతో సమిధలతో కుశ లతో హోమము చేయించవలెను.
ఈ దానవ్రత దినమున రాతియంతయు జాగరణము చేయవలెను. తీవ్రత లేని సరస మధురములగు తూర్య నాదములతో పర్వతముల నావాహనము చేయవలెను. (ఆవాహన మంత్రార్థము): సర్వ దేవ గణముల తేజస్సులకు నివాస స్థానమ (నిధి) వగు దేవపర్వతమా! మాగృహములందలి ఆశుభమును శీఘ్రముగా నశింపజేయుము. పరమ భక్తితో చేసిన నాపూజలనందుకొని అత్యుత్తమమగు శాంతిని క్షేమమును కలిగించుము. నీవే భగవానుడవగు ఈశుడవు బ్రహ్మయు విష్ణువును రవియును మూర్తిక లదీయు లేనిదియు అగు వ్యక్తి వ్యక్తి తత్త్వమును జగద్బీజమును; కావున సనాతన పర్వతమా! మమ్ములను రక్షించుము. నీవు లోకపాలురకును విశ్వమూర్తియగు విష్ణునకును రుద్రాదిత్య వసువులకును నివాస స్థానమవు; కావున అట్టి నీవు నాకు శాంతిని కలిగిం * ము. నీశిరము దేవ దేవనారీ జనముతో నిండి యుండును. కావున ఇట్టి నీవు నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్దరించుము. ఇట్లు మేరు పర్వతము నర్చించి పిమ్మట మందర పర్వతమునర్చించవలెను. (మంత్రార్థ ము:) నీవు చైత్రరథ (వన) ముతోను భద్రాశ్వ వర్షముతోను శోధించుచుందువు, కావున ఇట్టి నీవు శీఘమే నాకు తుష్టి కలిగించుము. (గంధమాదనార్చనము : గంధమాదనమా! నీవు జంబూ ద్వీపమున చూడామణివి; గంధర్వ వనపు శోభతో కూడినదానవు. ఇట్టి నీచే నాకు దృఢమగు కీర్తి కలుగుగాక ! (విపుల పర్వ తార్చనము) : విపుల పర్వతమా! కేతుమాల వర్షముతోను వైబ్రెజవనముతోను శిర స్సునందు బంగారు రావిచెట్టుతోను ప్రకాశించుదానవు. ఇట్టి నీదయచే నాకు దృఢమగు పుష్టి కలుగుగాక ! (సుపార్శ్వ పర్వతార్చనము) : సుపార్శ్వ పర్వతమా? ఉత్తర కురు వర్షముతోను సావిత్రమనేడు వనముతోను నిరంతరమును ప్రకాశింతువు. ఇట్టి నీదయచే నాకు అక్షయ శ్రీ కలుగుగాక !
ఇట్లు వాటిని అన్ని టిని ఆవాహనము చేసి అర్చించి నిర్మలమగు ప్రభాతము కాగానే మధ్యమ (మేరు) పర్వతమును గురు (వురోహితు)నకును మిగిలిన నాలుగింటిని నలుగుర ఋత్విక్కులకును ఈయవలెను. శ క్తిననుసరించి ఇరువది నాలుగు-పది-ఎనిమిది. ఏడు-ఐదు - ఐన పాడి కపిల గోవులను దానమీయవలయును. గురునకొకటి తప్పక. ఈయవలయును.
అన్ని పర్వతముల విషయమునను ఇదే విధానము.మంత్రము -ఉపస్కరములును. సర్వదేవతలకును హోమము కూడ పైవలెనే.
వ్రత దినమున ఉపవాసముండ వలయును. శ క్తిలేనిచో నక్త మున భుజించ వచ్చును.
అన్ని పర్వత దానములందును ప్రధానముగా చెప్పవలసిన మంత్రము. “అన్న మే బ్రహ్మమును ప్రాణములును భూతోత్పత్తి స్థితి హేతువులును లక్ష్మియు జనార్దనుడును కావున (అన్నమునకు మూలమగు) ధాన్యపర్వత రూపమున ఉన్న పర్వత రాజమా! మమ్ము కాపాడుము.
ఈ విధానముతో ధాన్య పర్వతమును { కాని ఇతర పర్వతములను కాని) దానమిచ్చినవారు సమగ్రమగు మన్వం తర శతము దేవలోకమున సుఖింతురు. సర్వత్ర వ్యాపించియున్న ఆప్సరో గంధర్వ గణములతో వ్యాప్తమైయున్న స్వర్గమును దివ్య విమానములో చేరుదురు. కర్మక్షయము కాగానే మరల కల్పాదియందు రాజరాజై జన్మిం తురు.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ధాన్య పర్వత దాన మాహాత్మ్య కథనమును ఎనుబది రెండవ అధ్యాయము.
