అగ్ని దేవుడు పలికెను. వశిష్ఠా ! ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు మంత్ర విద్యను చెప్పెదను వినుము. ఇరువది కంటె అక్షరములు ఆధికముగల మంత్రములు మాలామంత్రము. పది అక్షరములు మించియున్న ఏ మంత్రములు. పదికి తక్కువ అక్షరములున్నవి బీజమంత్రములు. ఇవి వార్ధక్యమున సిద్ధినిచ్చును. మాలామంత్రములు యౌవనమున సిద్ధి నిచ్చును. ఐదుకు మించిన అక్షరము గల మంత్రములు అన్ని ఫలముల నిచ్చును. మంత్రజాతులు స్త్రీ పురుష నపుంసక భేదములచే మూడు విధములు. స్వాహాయనువది అంత మందు గలవి స్త్రీ ముత్రములు. నమః అనునది చివరగలు నపుంసక మంత్రములు. మిగిలినవి పురుషమంత్రములు, అవివశీకరణము నందును ఉచ్చాటనము వందును ప్రశస్తమై వవి. క్షుద్ర క్రియయందును. రోగశాంతి యందును. స్త్రీమంత్రములు మంచివి. నపుంసక మంత్రములు ఇతర కార్యములందు మంచివి. ఆగ్నేయములు సౌమ్యములు యని మంత్రములు రెండు విధములు. ఆది యందు ఓంకారము చేర్చినవి ఆగ్నేయములు, ఓంకారము చివర యున్నవి సౌమ్య మంత్రములు. వీటిని అన్ని చంద్ర నాడి సమయ ముస జపించ వలయును. ఓం, క్ష, ర, హ, అనునవి అధికముగా గల మంత్రములు ఆగ్నేయములు. మిగిలి నవి సౌమ్యములు. ఈ రెండును వరుసగా క్రూర సౌమ్యకర్మల యందు ప్రశస్తములు. ఆగ్నేయ మంత్రములు, ప్రాయశ: చివర సమః చేర్చుటచే సౌమ్యము లగును. సౌమ్య మంత్రము కూడ చివర ఫట్ చేర్చినచో ఆగ్నేయ మగును. మంత్రము నిద్రించినను అపుడే లేచినను సిద్ధి ప్రదము కాదు. హిమ నాడి చలించునపుడు ఆగ్నేయ మంత్రమునకు, నిద్రా సమయము, దక్షిణ నాడి చలించునపుడు జాగరణ సమయము. సౌమ్య మంత్రము యొక్క నిద్ర జాగరణ సమయములు ఇందుకు విపరీతముగ నుండును. రెండు నాడులు చలించునపుడు రెండు మంత్రములకు జాగరణ సమయము. చుష్ట నక్షత దుష్ట రాశి, శత్రు రూపాది అక్షరములు గల మంత్రములను తప్పక విడిచి వేయవలయును. “రాజ్య లాభోప కారాయ” మొదలు “లిపిః” వరకు ఉన్న శ్లోకములో మొదటి నుండి “పుల్లె” యను వరకును, లిపి చెప్పబడినది. ఈ వర్ణమాలను నక్షత్రములతో కూడ, అశ్విన్యాది క్రమమున చేర్చవలయును. “అం, అః” యను రెండును. సర్వదా రేవతీ నక్షత్రముతో చేరి యుండును. వా, లా, గౌ, రం, ఖు, రం, శో, నం, భా, య సంఖ్యలలో విభక్తములగు అకారాద్య క్షర ములు క్రమముగ మేషాది రాళుల లో వున్నట్లు గ్రహించ వలయును. శ, ష, స, హ, అను అక్షరములను ఐదవ దగు కన్యా రాశి యందు చేర్చవలెను. క్ష కారమును మీన రాశి యందు చేర్చవలెను. చతుష్కోణము నందున్న ప్రథమ కోష్టము నందలి నాలుగు పంక్తులు సిద్ధములు. రెండవ కోష్టము నందున్న నాలుగు పంక్తులు సాధ్యములు. మూడవ కోష్టము వందున్న నాలు గుపంక్తులు సుసిద్ధములు. నాలుగవ కోష్టమునందలి పంక్తులు ఆరి. సాధుకుని నామాద్యక్షరము ఏచతుష్కము వందపడునో ఆది వానికి సిద్ధచతుష్కమ. రెండవది సాధ్యము ఇట్లే గ్రహించవలెను. సిద్ధమంత్రము అత్యంత గుణ యుక్తము. దాని జపమాత్రముకనే సిద్ధికలుగును. సాధ్యమంత్రము జప పూజాదులచే సిద్ధించును. సుసిద్ధమంత్రము ధ్యాన మాత్రముచే సిద్ధించును. అరిమంత్రము సాధకుని వశింపజేయును. అధికముగ దుష్టవర్ణములు గల మంత్రము అందరిచేతను నిందింపబడినది.
శిష్యుడు అభిషేకాంత దీక్షయథావిధిగా గ్రహించి గురువు ద్వారా తంత్రోక్త విధానము తెలుసుకొని గురువు ఇచ్చిన ఆభీష్టమంత్రమును సాధించ వలెను. ధీరుడు, సమర్థుడు, పవిత్రుడు, భక్తి సంపన్నుడు, జప, ధ్యానాదితత్పరుడు సిద్ధుడు, తపశ్శాలి, కుశలుడు, తంత్రజ్ఞుడు, సత్యవాది, నిగ్రహానుగ్రహ సమర్థుడైన వాడే గురువు. శాంతుడు జితేంద్రియుడు సమర్థుడు, బ్రహ్మచారి హవిష్యమును తినువాడు, గురు సేవాతత్పరుడు మంత్ర సిద్ధికై ఉత్సాహముకలవాడు యైన వ్యక్తియే యోగ్యుడైన శిష్యుడు. అట్టి శిష్యునకును, తనపుత్రునకును. మంత్రోపదేశము చేయవలయును. శిష్యుడు వినయవంతుడై గురువునకు ధనమును ఇవ్వవలెను. గురువు ఆట్టి శిష్యునకు మంత్రోపదేశము చేసి తన్మంత్ర సిద్ధికై తాను సహస్ర జపము చేయవలయును. అకస్మాత్తుగా విన్నది వంచనచే కాని, బలముచేగాని పొందబడినది పుస్తకములలో వ్రాయబడి నది గాథలలో వున్నది యగు మంత్రము జపించకూడదు. ఆట్టు జపి.చినచో అనర్హము కలుగును. హోమ ఆర్చనా ఏ వివిధ క్రియలతో మంత్ర సాధన చేయువానికి స్వల్ప కాలమునందే మంత్ర సిద్ధికలుగును. ఒక్క మంత్రము నైనను, విధి పూర్వకముగ సిద్ది చేసికొనిన వానికి అసాధ్యమైనది యేదియు వుండదు. అనేక మంత్రముల సిద్ది సంపాదించిన వాని, మాహాత్మ్యము వర్ణనాతీతము. అతడు సాక్షాత్తు శివుడే. ఏకాక్షర మంత్రమును పదిలక్షలు జపించినచో సిద్దించును. మంత్రము నందలి వర్ణములు పెరిగిన కొలది జపసంఖ్య తగ్గును. ఈ విధముగ జపసంఖ్యను ఊహించుకొనవలయును. మాలా మంత్రము)ను బీజమంత్రము కంటే రెండు మూడు రెట్లు అధికము జపించవలెను. జపసంఖ్య చెప్పని మంత్రమును నూటయెనిమిది పర్యాయములు కాని, ఒక వెయ్యి యెనిమిది పర్యాయములుకాని జపించవలయును. జపములో దశాంశము హోమము తర్పణము చేయవలయును.
విశేష ద్రవ్యమును దేనిని చెప్పనప్పుడు హోమమునందు ఘృతమును ఉపయోగించవలయును. హోమా సమర్దుడు హోమమునకు బదులు జపసంఖ్యలో దశాంగ జపము చేయవలయును. అంగాది మంత్రములకు కూడ జపము చెప్పబడినది. సశక్తి కమగు మంత్రమును జపించుటచే (దేవతలు) మంత్ర దేవతలు అభీష్టఫలమును ఇత్తురు. సాదకుడు చేసిన ధ్యానహోమ అర్చనాదులచే తృప్తి చెందుదురు. ఉచ్చస్వరముతో జపము చేయుటకంటే ఉపాంశు జపము పది రెట్లు శ్రేష్ఠము. జిహ్వ మాత్రమే కథుపుచు చేసిన జపము నూరు రెట్లు శ్రేష్ఠము. మానసిక జపము వెయిరెట్లు శ్రేష్ఠము. మంత్ర జపమును పూర్వాభి ముఖుడై గాని, దక్షిణాభిముఖుడై గాని ప్రారంభించవలయును, మౌనము అవలంబించి విహితమైన ఆహారమును స్వీకరించుచు, ప్రణవాది మంత్రము న్నింటిని జపించవలయును. ఆసనముపై కూర్చుండి దేవతను ఆచార్యుని ఒక్కరుగా భావించుచు జపించవలయును. పర్ణశాల ఏకాంతమైన పవిత్ర ప్రదేశము, దేవాలయము సదీ తటాకాదుల తీరములు జపమునకు ఉత్తమ ప్రదేశములు. మంత్ర సిద్ధికోరువాడు గంజి, అపూపములు, పాలు, హవిష్యము ఆహారముగ తీసుకొనవలయును. సాధకుడు మంత్ర దేవతలకు సంబంధించిన తిథివారములందును కృష్ణపక్ష అష్టమి చతుర్ద శులయందును గ్రహణాది పర్వముల యందును మంత్రదేవతలను పూజించ వలయును. అశ్వివ్యాది నక్షత్రము లకు క్రమముగ అశ్వినీకుమారులు, యముడు, అగ్ని, ధాత, చంద్రుడు, రుద్రుడు, అదితి, బృహస్పతి, సర్పము, పితృదేవతలు, భగుడు, అర్యమ సూర్యుడు, త్వష్ట వాయువు ఇంద్రాగ్నులు, మిత్రుడు, ఇంద్రుడు జలము నిఋరుతి, విశ్వేదేవులు, :ష్ణువు వసుగణము, వరుణుడు, అజై కపాత్, అహిర్భుధ్యుడు, పూషయను వారు దేవతలు. ప్రతిపత్తు మొదలు చతుర్దశి వరకును తిథులకు, క్రమముగ , అగ్ని బ్రహ్మపార్వతి, గణేశుడు, సగము, స్కందుడు, సూర్యుడు, మహేశ్వరుడు, దుర్గ, యముడు, విశ్వేదేవతలు విష్ణువు, కామదేవుడు, ఈశ్వరుడు దేవతలు, పూర్ణమికి చంద్రుడును అమావాస్యకు పితృదేవతలును దేవతలు. శివుడు దుర్గ బృహస్పతి, విష్ణవు, బ్రహ్మ. లక్ష్మి కుబేరుడు వీర వరుసగ రవ్యాది వారములకు దేవతలు, ఇపుడు లిపిన్యాసమును చెప్పెదను.
ఆకారాది వర్ణములను సాధకుడు వరసగ, కేశాంతము, ముఖము, నేత్రద్వయము, శ్రవణద్వయము, వాసాపుట ద్వయము, కపోలద్వయము, ఓష్ఠద్వయము, హృదయము, ఊర్ద్వదంతపంక్తి , అధోదంత పంక్తి, వీటిపై “ఓం, ఆంనమః” కేశాంతేషు” ఇత్యాది విధమున చెప్పుచు, న్యాసము చేయవలయును. శిరస్సుయందు, ముఖ వృత్త మునందు, దక్షిణ బాహుమూలము నందు, దక్షిణ కూర్పరము నందు, దక్షిణ మణిబంధము నందు దక్షిణ హస్తాంగుళి మూలము నందు, ఓం, ఆం, నమః, యని ప్రారంభించి, ఓం, వం, నమః అను వరకు చెప్పుచు న్యాసము చేయవలయును. ఐదు వర్ధము - ఐదేసి వర్గమును, బాహుచరణ సంధుల యందును, పార్శ్వము లందును పృష్ఠ, నాభి, హృదయము లందును క్రమముగ వు-చవలయును. యకారాది వర్ణమును త్వక్, అస్మక్ మాంస, మేధస్సు, ఆస్తి, మజ్జ, శుక్రములను ఏడు ధాతువు లందను న్యాసము చేయవలయును. ప్రారంభ మున ప్రణవమును, ఆంతమున నమఃను చేర్చి లిపిశ్వర, మాతృకేశ్వర న్యాసము చేయవలయును. శ్రీకంఠ - అనంత. సూక్ష్మ - త్రిమూర్తి - అమరేశ్వర - ఆర్దీశ - భావ భూతి - తీతిశ స్థాణుక - హర - డఁడీశ - భౌతిక - సద్యోజాత - అనుగ్ర హేశ్వర - అక్రూర - మహా సేనులు స్వరమూర్తి దేవతలు. క్రోధీశ - చండీశ - పంచాంతక - శివోత్తమ - రుద్ర - కూర్మ త్రినేత్ర - చతురానన, అజేశ - శర్మ - సోమేక - లాంగలి - దాయిక - అర్ధనారీశ్వర - ఉమాకాంత - అషాడిన్ - దండిన్ - అద్రిమీన - మేష - లోహిత - శిఖి - చగలాడ - ద్విరండ – మహాకాల - కపాలి - భుజంగేశ - పినాకి - ఖడ్గీశ - బక - శ్వేత, భృగు - నకులీ - శివ - సంవర్తకులు ప్యంజన మూర్తి దేవతలు. శ్రీ కంఠాది రుద్రులను, వారి శక్తులతో క్రమముగ న్యాసము చేయవలయును. అంగముల న్యాసము కూడ చేయవల యును. అన్ని మంత్రములను సాంగము లైననే సిద్ధి ప్రదములగును. ఉల్లేఖకు వ్యోమ బీజము కలిపి ఈ అంగి న్యాసము చేయవలయును. హృదయాది ఆగముత్రములను అంతము నందు చేర్చి పలుక వలయును. హృదయమునందు “నమః” శిరస్సు నందు “స్వాహా”, శిఖ యందు “వషట్”, కవచము నందు “హూం” నేత్రము నందు వౌషట్, హస్రము నందు “ఫట్” చెప్పవలయుమ. నేత్ర న్యాసము లేనిచో పఃదాఁగ న్యాస మగును. మంత్రము నిరంగ మైనదో స్వరూపము చేతనే ఆంగ న్యాసము చేసి, వాగీశ్వరీ దేవీ మంత్రమును ఒక లక్ష జపించి దళాంశము తిల హోమము చేయ వలయును. లిపి దేవియైన వాగీశ్వరి తన హస్తములలో అక్షమాల, కలశం, పుస్తకము, కమలం ధరించి యుఁడును. కపిత్వాదులను ఇచ్చును. అందుచే జప కర్మాది సిద్ది కొరకై వాగీశ్వరి న్యాసము చేయవలయును. ఇట్లు చేయుటచే కవి కాని వాడు కూడ కవి యగును. మాతృకా న్యాసముచే అన్ని మంత్రములును సిద్ధించును.
అగ్ని మహా పురాణమున మంత్ర పరిభాష యను రెండు వందల తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 293 of the Agni Purāṇa is as follows:
The classification and fundamental rules of mantras are laid down. Mantras of more than twenty akṣaras are māla-mantras; those under ten are bīja-mantras; those between are siddha in all yugas. Mantras are gendered: those ending in svāhā are feminine (strī), those ending in namaḥ are neuter (napuṃsaka), and the remainder are masculine (puṃ). Āgneya mantras begin with Oṃ, while saumya mantras end with Oṃ. The optimal japa timing is determined by which nāḍī (Iḍā or Piṅgalā) is active. The siddha/sādhya/susiddha/ari classification of a mantra relative to the sādhaka is determined by placing both the deity's name-initial and the sādhaka's name-initial in a 4×4 quadrant grid. The chapter also elaborates the rules of guru-śiṣya mantra transmission: the guru must be dhīra, dakṣa, śuci, and bhakta, while the qualified disciple must be vinayī and devoted.