అగ్ని మహా పురాణము

28 - అథాచార్యాభిషేక విధానమ్

నారదుడు పలికెను : శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్లు చేయవలెనో చెప్పెదను. 'దీని చేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగ విముక్తు డగును. రాజు రాజ్యమును, శ్రీ కుమారుని, పాపవినాశమును పొందును.

తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహసావర్తితములు లేదా శతావర్తితములు చేయవలెను. మండంమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠము పై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా ఆచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను.

యోగ పీఠాదులను సమర్పింపవలెను. “నీవు నరులను అనుగ్రహింపవలెను”అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురుర క్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు.

అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేక మను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.