అగ్ని మహా పురాణము

238 - అథ రామోక్తనీతిః

ఆగ్ని దేవుడు పలికెను : వశిష్ఠా! ఇంతవరకు, పుష్కరుడు బోధించిన రాజనీతిని చేప్పితిని. ఇపుడు లక్ష్మణు నకు రాముడు చెప్పిన విజయప్రదమగు రాజనీతిని వినుము. శ్రీ రాముడు చెప్పెను. లక్ష్మణా న్యాయమగా ధనమును ఆర్జించుట, సంపాదించిన దానిని వ్యాపారాదుల ద్వారా వృద్ధి పొందించుకొనుట, దానిని స్వజనుల నుండియు, పరుల నుండియు రక్షించుకోనుట, సత్పాత్రము బందు వినియోగించుట ఇవీ రాజు చేయవలసిన సొలుగు పనులు. నయమునకు మూలము విశ్యము. అది శాస్త్రనిశ్చయముచే కలుగును. వినయమనగా ఇంద్రియజయము. వీవయము కలవాడే శాస్త్రము లను పొందగల్గును. శాస్త్రజ్ఞానము, ఎనిమిది గుణములు గల బుద్ధి, ధృతి, దక్షత, ప్రగల్భత్వము, ధారణశక్తి, ఉత్సాహము, ప్రవచనశక్తి, దృఢత్వము, ప్రభుశక్తి, శుచిత్వము, మైత్రి, త్యాగము, సత్యము, కృతజ్ఞత, కులీనత్వము, శీలము, దమము . ఇవి సంపత్తికి హేతువులగు గుణములు. విషయములనెడు మహారణ్యములో నిర్భయముగ పరుగెత్తు చున్న ఇంద్రియగ జములను జ్ఞానాంకుశముతో వశమునందుంచుకొనవలెను. రాజు, కామ - క్రోధ - లోభ - మోహ -హర్ష - మద - మాత్సర్య మానములను అరిషడ్వర్గమును పూర్తిగా పరిత్యజించినచో సుఖవంతుడగును.

రాజు, వినయ గుణ సంపన్నుడై, అన్వీక్షకి, వేదత్రయము, వార్త (కృషి వాణిజ్య పశుపాలనాది కము) దండ నీతి అను నాలుగు విద్యలను గూర్చి విద్వాంసుల వద్దను, వాటి ప్రయోగ ముందు నేర్పు కల వారి వద్దను కూర్చుండి చింత నము చేయవలెను. ఆన్వీక్షకి వలన ఆత్మజ్ఞానము, వస్తుయథార్థ స్వరూపజ్ఞానము కలుగును. ధర్మాధర్మ జ్ఞానము వేదత్రయాధీ కము. అర్థ . అనర్థములు వార్త ప్రయోగాధీ ములు. న్యాయ . అన్యాయములు దండనీతి యొక్క సముచిత ప్రయోగ ముపై ఆధారపడియున్నవి. ఏ ప్రాణులకును కష్టము కలిగించకుండు మధురము మాటలాగు), సత్యము పలుకుట, బైటను అంతరంగమునందును పవిత్రముగ నుండుట, శౌచాదా పాము , దీనుల పైదయ, ఓర్పు - ఇవి అన్ని వర్ణము వారికిని, ఆశ మములవారికి వర్తించు సాధారణ ధర్మములు. రాజు ప్రజ ను అనుగ్రహించుచు, సదా దార తత్పరుడై ఉండవలెను. మధురమైన వాక్కు దీనుల పైదియ, దేశ కాలానుసారము సత్పాతదానము, దీనులను శరణాగతులను రక్షించుట, సత్పురుష సహవాసము . ఇది సత్పురుషుల ఆచారము. ఈ ఆచారము ప్రజాసంగహోపా యము. ఇదిలోక ప్రశంసాపాతముగాన శేషము. భవిష్యత్తులో గూడ ఆభ్యుదయ హేతువుగాన హితకరము. ఈ శరీరము రోగములతోను, మానసిక చింతలతోను నిండియున్నది. నేడో, రేపో, దీని వినాశము నిశ్చితము. ఇట్టి పరిస్థితులలో ఇట్టి శరీరము కొరకై ఏ రాజు అధర్మాచరణము చేయును:

రాజు తాను సుఖించుచు దీనులను పీడించ కూడదు. ఏలన పీడితులైన దీనజనులు దుఃఖము వలన కలిగిన క్రోధముచే క్రూరుడైన రాజును నశింపజేయుదురు. కల్యాణమును కోరురాజు పూజ్యుల విషయమున ఏ విడమున అంజలి మటించి ఆదరము చూపునో దుష్టుల విషయమున అంత కం టేకూడ ఆధికమగు ఆదరము చూపవలెను. మంచి స్నేహితుల విషయమునను, దుష్టులగు శత్రువుల విషయమునను గూడ ప్రియవచనములే పలుకవలెను. ప్రియవాది 'దేవత' ; కటువాది ‘పశువు’. రాజు భైటను లోపలను విశుద్దుడై , ఆ స్తికత్వముతో అంతఃకరణమును పవిత్రము చేసికొని సర్వదా దేవతలను పూజించ వలెను. గురువులను దేవతలను వలే పూజించవలెను. మిత్రులను తనతో సమానులని భావించుచు బాగుగ సత్కరించవలెను. తన ఐశ్వర్యమును రక్షించుకొనుటకును, వృద్ధిపొందించుకొనుటకును, రాజు ప్రతిదినము ప్రణామము చేయుచు పెద్దలను అనుకూలులనుగా చేసికొనవలెను. సాంగ వేదాధ్యయనము చేసిన వారు ప్రవర్తించు విధముగ ప్రవర్తించుచు విద్యావృద్దులగు సత్పురుషులను సుముఖులను చేసికొనవలెను. సుకృతకర్మలచేదేవతానుకూల్యము సంపాదించవలెను. సద్బా వముచే మిత్రులను, ఆదరముచే బంధువులను, ప్రేమచే స్త్రీలను, దానముచే భృత్యులను, అనుకూలులుగ చేసికొనవలెను. ఇతరులనుఅనుకూలతా ప్రదర్శనము ద్వారా సుముఖులను చేసికొనవలెను. ఇతరుల పనులు నిందింపకుండుట, తన వర్ణాశ్రమ ధర్మములను నిరంతరము పాలించుట, దీనులయెడదయ, లోకవ్యవహారములన్నింటి యందును, అందరితోడను, మధురముగా మాటలాడుట, ప్రాణములిచ్చియైనను తన ప్రియమిత్రులకు ఉపకారము చేయుటకై సిద్ధముగా ఉండుట ఇంటికి వచ్చిన మిత్రులను, ఇతర సజ్జనులను కౌగలించుకొనుట, ఆవసర మైనచో యథాశక్తిగ వారికి ధన మిచ్చుట, ఇతరుల కటు ప్రవర్తనను, కోరవచనములను సహించుట, తనకు అభివృద్ధి కలిగినపుడు వికారరహితుడుగ నుండుట, ఇతరులకు అభ్యుదయము కలిగినపుడు ఈర్య లేకుండుట, ఇతరులకు బాధ కలిగించు మాట పలుకకుండుట, మౌనముగా నుండుట, బంధువులతో సంబంధమం అవిచ్ఛిన్నముగ ఉంచుకొనుట, సజ్జనులతో ఋజు ప్రవర్తనము, వారి సంమతి ప్రకారము కార్యము చేయుట ఇవి మహాత్ముల ఆచారము.

అగ్ని మహాపురాణమునందు రామోక్తనీతివర్ణన మను రెండు వందల ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.