ఆగ్ని పలికెను
కృష్ణుని మాహాత్మ్యమునకు లక్షణ మైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని భూ భారమును హరించెను.
విష్ణువు నాభికమలమునుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రి చంద్రుడు, ఆతనికి బుధుడు, ఆతనికి ఐలుడు, ఆతనికి పురూరవుడు, అతనికి ఆయువు, ఆతనికి నహుషుడు, ఆతనికి యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. ఆతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. ఆతని వంశమునందు శంతనున జన్మించెను ఆతనికి గంగాపుత్రు డైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద - విచిత్రులు పుట్టిరి.
శంతనువు స్వర్గస్తు డైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరుల రాజ్యము పాలించెను. చిన్నవా డైన చిత్రాంగదుని, చిత్రాంగదు డనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరా కుమార్తె లైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్తు డయ్యెను.
సత్యవతి అనుమతిచే వ్యాసునివలన ఆంబికయందు రాజైన ధృతరాష్ట్రడును అంబాలిక యందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్య న కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును, వాయుదేవునివలన భీముడును, దేవేశిద్రునివలన ఆర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాదీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి ఆతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా, జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.
దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్దియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చేను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.
పిమ్మట ఆ పాండవులు ఏక చక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు ఒక రాక్షసుని చంపిరి.
వారు ద్రౌపదీస్వయంవరనిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.
దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్ధ రాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్నిదేవునినుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, ఆశయ్యమైన బాణములు గల అమ్ములపొదులను పొందెను. ద్రోణునివలన బ్రహ్మాద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.
పాండుకుమారు డైన అర్జునుడు తన శరవరముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహా యముతో, ఖాండవవనమునందు అగ్నిని సంతృప్తుని చేనెను.
పాండవులు నలుదిక్కులను జయించిరి. యుధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహించలేకపోయెను.
సోదరుడైన దుఃఖాననుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వులు, ఆతని రాజ్యమును హరించెను.
ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, దౌమ్యునితోడను ఆరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞ చేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకు డనెడు బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను ఆయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు అని గుర్తించిరి.
కృష్ణుని సోదరి యైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యుడను కుమారుడు కలిగెను. విరాటుడు ఆతనికి తన కుమార్తె యైన ఉతర నిచ్చెను.
ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్ధము చేసికొనెను. కృష్ణుడు అమర పూర్ణుడును, పదకొండు అక్షౌహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి “యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము . లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్దము చేయుము” అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.
సుయోధను డిట్లనెను - “సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్దమునకై సిద్ద ముగా ఉన్నాను”. అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, “ఆ సుయోధనునితో యుద్ధము చేయుము” అని చెప్పెను.
అగ్ని మహాపురాణములో భారతాఖ్యాన మను పదమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 13 of the Agni Mahā Purana is as follows:
The narrative moves to Kṛṣṇa's role in the adult world — his marriage to Rukmiṇī and other queens, the founding of Dvārakā, his role as adviser and charioteer of Arjuna. The chapter provides a compressed summary of the Mahābhārata war: the Pāṇḍavas' exile, the failed peace mission, and the eighteen-day battle at Kurukṣetra. Kṛṣṇa's divine discourse to Arjuna — the Bhagavadgītā — is acknowledged as the supreme teaching of jñāna, karma, and bhakti. The chapter describes key events of the war including the deaths of Bhīṣma, Droṇa, Karṇa, and Duryodhana. Kṛṣṇa's withdrawal from the world and the destruction of the Yādava clan conclude this section, with the Purāṇa affirming that Bhagavān merely enacted a cosmic play before returning to his supreme abode.