అగ్ని దేవుడు పలికెను : తండ్రిదాయవిభాగము చేసినచో, జ్యేష్ఠపుత్రునకు అధిక భాగము ఇవ్వవచ్చును, లేదా ఆందరికి ని సమముగా ఇవ్వవచ్చును. సమముగా ఇచ్చిన పక్షమున థర్తద్వారా కాని, మామగారి ద్వారా కాని స్త్రీధనము అఖించని స్త్రీలకు కూడా సముభాగము లివ్వవలెను. తాను స్వయముగా ధనమును సంపాదింప సమర్థుడు పితృధనము కోరని కుమారునకు కూడ ఏమైనను కొంచెము ఇచ్చి వేరు చేయవలెను. తండ్రి చేసిన దాయవిభాగమునందు న్యూనాధిక ములున్నను అది తండ్రి చేసినదగుటచే ధర్మ సమ్మతమే. తల్లిదండ్రులానంతరము కుమారులు ధనమును ఋణమును కూడ సమముగా పంచుకొనవలెను. తల్లి చేసిన ఋణమేదైనా వున్న చో దానిని తీర్చి కుమార్తెలు మిగిలిన ధనమును సమముగా పంచుకొనవలెను. కుమార్తెలు లేనిచో కుమారులు పంచుకొనవలెను. పితృధనమునకుజయవిభాగః వష్టము కల్గింపక స్వయముగ సంపాదించినది కాని, మితు ద్వారా కాని వివాహము ద్వారా కాని వచ్చినది గాని యైన ధనము పై దాయాదులకు అధికారము లేదు. అన్నదమ్ములందరును కలిసి సంపాదించినధనమును, వారందరును సమముగా పంచుకొనవలెను. చాలమంది తండ్రులగల పౌత్రులు పితామహధనమును తమ తండ్రులను బట్టి పంచుకొనవలెను. పితామహుడు సంపాదించిన భూమి నిబంధము ద్రవ్యము వీటిపై తండ్రికిని పుత్రులకును అధికారము సమానము. విభాగము చేసికొనిన పిమ్మట సవర్ణస్త్రీయందు పుట్టిన కూమారునకు కూడ వాటా ఇవ్వవలెను. లేదా ఆయవ్యయము సరిచూచు కొనిన తరువాత దృశ్యధనమునుండీ ఆతనికి భాగ మీయవలెను. కుల క్రమాగతమైన ధనమును ఎవరైన అపహరించినపుడు దానిని మరల ఎవడు సంపాదించునో ఆ ఆతనికే చెందును. దాయాదులకు ఇవ్వవలసిన పనిలేదు. విద్యద్వార లభించిన ధనమును కూడ దాయాదులకు ఇవ్వపనిలేదు. తల్లితండ్రులు ఒక వస్తువును ఎవరికిత్తురో ఆడి అతి నికి మాత్రమే చెందును. తండ్రి తరువాత కుమారులు పంచుకొనునపుడు తల్లికూడ సమామును పొంది వలెను. వివాహాదులు జరగని సోదరులకు వివాహాదులు జరిగిన సోదరులు ఆసంస్కారములు చేయించవలెను. తోబుట్టువులకు కూడ తమధనములో నాల్గవవంతు ఇచ్చి వివాహము చేయవలెను. బ్రాహ్మణునకు బ్రాహ్మణాది శ్రీలయందు పుట్టిన పుత్రులకు వరుసగా నాలుగు మూడు రెండు ఒకటి భాగములు ఇవ్వవలెను, క్షత్రియులకు పుట్టిన కుమారులకు (తల్లివర్ణమును బట్టి) వరుసగా రెండు మూడు ఒకటి భాగములను, వైశ్యుని పుత్రులకు (వర్ణక్రమమునుబట్టి) వరపగా రెండు ఒకటి భాగములను ఇవ్వవలెను. ధనవిభాగము ఆయిన తరు వాత ఏదైన ద్రవ్యమును అన్నదమ్ములలో ఎవరై న అపహరించినట్లు కనబడినచో ఆద్రవ్యమును వారందరును మరల సమముగా పంచుకొనవలెనని నియమము. పుత్రులు లేని వానిచే పర భార్యయందు ని యోగముచే పుట్టింపబడిన కుమారుడు వారి ఇరువురి రిక్తమునకు (అస్థికి) ఆధికారి-ఇద్దరికిని-పిండదాత.
ధర్మపత్నియందు పుట్టిన పుత్రుడు. ఔరసుడు. పుత్రికాపుత్రుడు ఔరస సమానుడు. తన భార్యయందు సగోత్రుడగువానిద్వారా కాని, సగోత్రునిద్వారాకాని, ఇతరులచేతగాని, పుట్టింపబడినవాడు క్షేత్రజుడు. గృహమునందు రహస్యముగా పుట్టినవాడు గూఢజుడు. అవివాహిత కన్యకు పుట్టినవాడు కానీనుడు. వాడు మాతా మహునికి పుత్రునిగా అంగీకరింపబడును. క్షతయోనిగాని, అక్షతయోనిగాని యైన, విధవకు పుట్టినవాడు పౌనర్భవుడు. తండ్రిచేతకాని, తల్లి చేత కాని, ఇవ్వబడినవాడు దత్తకుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు విక్రీతుడు. స్వయముగా పెంచుకొన బడినవాడు కృత్రిముడు. తననుతానే ఇతరులకు ఇచ్చినకుమారుడు దత్తాత్మ. గర్భవతిని వివాహమాడగా పుట్టినవాడు సహోడజుడు. తల్లిదండ్రులు పరిత్యజించగా గ్రహింపబడినవాడు ఆపవిద్ధుడు. ఈ పదకొండు విధముల కుమారులలో పూర్వ పూర్వ పుత్రులు లేనిచో పర పర పుత్రుడు పిండమును ఇవ్వవలెను. ఆస్తి తీసుకొనవలెను. ఇంతవరకు చెప్పిన విధానము సమానజాతీయుల విషయముననే.
శూద్రునకు దాసియందు పుట్టినవాడుకూడ తండ్రికి ఇష్టమైనచో ఆంశహరుడు అగును (ఆస్తిపంచుకొనువాడగును) తండ్రి మరణించిన పిమ్మట సోదరులు ఆతనికి ఆర్థభాగ ములు ఇవ్వవలెను. ఆతనికి సోదరులు లేనిదో, దౌహిత్రుడుకూడ లేనిచో దాసీపుత్రుడే అంతయు తీసుకొనవచ్చును. పైన చెప్పిన పదకొండు విధముల పుత్రులులేనివాని ధనముపై క్రమముగా భార్యకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, సోదరపుత్రులకు, గోత్రమువారికి, బంధువులకు, శిష్యనకు సహాధ్యాయికి అధికారముండును. ఈ నియమము అన్ని వర్ణములవారికిని చెల్లును. వానప్రస్థ, సన్యాసి, బ్రహ్మ దారుల రుక్తముపై క్రమముగ ఆచార్యునకు ఉత్తమ శిష్యునకు ధర్మభ్రతకు ఏక తీర్థికి అధికారముండును. సోదరుడు జన్మించినవ, సోదరుడు మరణించినను వారిద్దరు కలసివున్నపుడు ఆతనికి భాగమును ఇవ్వవలేను. ఆతని భాగ మను తీసుకొనవలెను. కలసివున్న మరియొక సోదరుడు మరియొక సోదరుని ధనమును గ్రహిం కూడదు. సవతిసోదరుడుకూడ కలిసిలేక పోయినను, మరణించినవాని ధనమును తీసుకొనవచ్చును
నపుంసకుడు పతితుడు ఆతని కుమారుడు, కుంటినాడు, ఉన్మత్తుడు, జడుడు, గ్రుడ్డివాడు చికిత్స చేయ శక్యము గాని రోగములతో బాధపడువాడు. వీరికి అంకము ఉండదు. వీరిని కేవలము పోషించవలెను. ఔరసులు, క్షేత్రజులు అయిన పుత్రులు ఈ దోషములు లేకున్నచో భాగమును తీసుకొనవచ్చును. వీరి కుమార్తెలనుకూడ వివాహమగునంతవరకు పోషించవలెను. వీరి భార్యలు పుత్రులు లేని వారైనచో సచ్చరిత్రలైన పక్షమున వారినికూడ పోషించవలెను. వ్యభిచారిణులు ప్రతికూలలు అయినచో వారిని ఇంటినుండి వెడలగొట్టవలెను. స్త్రీలకు తల్లిదండ్రుల థర్త సోదరులు ఇచ్చినది. ఆగ్ని సమీపమునందు, ఉపాయముగా లభించినది అధివేదన సమయమున లభించినది శ్రీధవమని చెప్పబడును. బందువులిచ్చినది శుల్కముగా లభించినది వివాహానంతరము పారితోషికవగా లభించినదికూడ శ్రీ ధనము. శ్రీ సంతానరహితురాలై మరణించినపుడు ఆ ధనము బంధువులకు చెందును. బ్రాహ్మము మొదలైన నాలుగు వివాహ పద్ధతులచే పెండ్లాడిన భార్య, సంతానము లేకుండ మరణించినచో ఆమెధనము భర్తకు చెందును. ఆమె సంతానవతి యైనచో అధనము పుత్రికలకు చెందును. మిగిలిన వివాహ పద్ధతులచే వివాహము చేసికొన్న స్త్రీధనము ఆమెతండ్రికి చెందును. కన్యనుఇచ్చి మరల ఆమెను హరించిన వానిని దండించవలెను. ఆతనినుండి వ్యయమైన ధనమునంతను ఉదయముతో వడ్డితో) తీసుకొనవలెను. ఆ కన్య మరణించినచో ఇద్దరి వ్యయమును పరిశీలించి భర్త ఇచ్చినదానిని ఆ కన్య తండ్రి నుండి తీసుకొనవలెను. భర్త దుర్భిక్ష సమయమునందును, ధర్మకార్యమునందును వ్యాధియందును దేశో పప్లవమునందును, భార్యనుండి తీసుకొనిన శ్రీ ధశమును తిరిగి ఆమెకు ఇవ్వవలసిన పనిలేదు. శ్రీ ధనములేని భార్యఉండగా, మరొక వివాహము చేసుకొనువాడు ఆ వివాహమునక, ఎంత వ్యయమగునో ఆంతధనమును మొదటి భార్యకు ఇవ్వవలెను. ఆమెకు శ్రీ ధనమున్నచో సగము ఇవ్వవలెను. విభాగ విషయమున సందేహము వచ్చినపుడు జ్ఞాతులు, బంధువులు, సాక్షులు, ఆభిలేఖితములు (వ్రాసిన పత్రములు) గృహములు, క్షేత్రములు కట్నము వీటినిబట్టి విభాగ నిర్ణయము చేయవలెను.
“అగ్ని మహాపురాణమునందు దాయ విభాగ మను రెండువందల యేబది ఆఱవ అధ్యాయము సమాప్తము.”
Summary of chapter 256 of the Agni Purāṇa is as follows:
The signs of pregnancy and the development of the embryo month by month are described according to Āyurvedic embryology. Agni traces fetal development from the union of śukra and śoṇita in the first month through the formation of all organs by the sixth month to the full gestation by the ninth month. The dietary and behavioral guidelines for the pregnant woman — the Garbhiṇī-paricaraṇa — are prescribed, including the monthly herbal formulations (māsānumāsika dravya) that ensure the child's health and auspiciousness.