పుష్కరుడు పలికెను : రాజు ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క అధిపతిని నియమించవలెను. పదేసి గామములకు ఒక అధ్యక్షుని, నూరేసి గ్రామములకు మరొక అధ్యక్షుని నియమించవలెను. వారందరి పైనను మొత్తము రాష్ట్రమునకు శాసకుడుగ ఒకనిని నియమించవలేను. వారందరికిని వారివారి పనులను బట్టి వేరువేరుగా భృతిని నిర్ణయించ వలెను. గూఢచారులద్వారా ప్రతిదినము వారి ప్రవృత్తులనుగూర్చి తెలుసుకొనుచుండవలెను. గ్రామములో ఏదైనదోషము (వ్యవహారము) ఉత్పన్నమైనచో గ్రామాధిపతి దానిని పరిష.. రించవలెను. తానుపరిష్కరింపజాలకున్నచో దశ గ్రామాధిపతి వద్దకు వెళ్ళి ఆవిషయములన్నియు ఆతనికి తెలుపవలెను. విషయమునంతను తెలిసికొనిన పిమ్మట దశ గ్రామాధిపతి ఆదోషమును పరిష్కరించుటకు ప్రయత్నించవలెను. రాజ్యము సురక్షితముగా ఉన్న యెడలనే రాజునకు దానినుండి ధనాడులు లభించును. ధనవంతుడే ధర్మమునార్జించగలుగును. అతడే కామసుఖములను అనుభవింపగ లగును. ధనములేనిచో గ్రీష్మమునందు నదుల నీరు ఎండిపోయినట్లు కార్యములన్నియు విఫలములై పోవును. ఈ ప్రపంచమునందు పతితునకును, దరిద్రునకును భేద మేమియు లేదు. పతితునిచేతినండి ఎవరును ఏవస్తువును తీసికొనరు. దరిద్రుడుకూడ ఏమి లేనివాడగుటచే ఇతరుల కేమియు ఇవ్వ జాలడు భార్యకూడ దరిద్రుని మాట వినదు. అందుచే రాష్ట్రమునుపీడించి, దానిని నిస్సారముచేయు రాజు చిరకాలము నరకములో సండను. గర్భవతియైన స్త్రీ తనసుఖముకొరకు చూచుకౌనక గర్భస్థశిశువుడే మానికై ప్రయత్నించునో, అట్లే రాజు కూడ ప్రజార క్షణమునే సర్వదాదృష్టిలోనుంచుకొనవలెను. ప్రజలను రక్షించ జాలనీరా జు యజ్ఞము, తపస్సు చేసి ఏమి ప్రయోజనము? ప్రజలను బాగుగా రక్షించు వాని గృహమేస్వర్గము. ప్రజలు కష్టపడుచున్న రాజు గృహమే నరకము. ప్రజల పుణ్యపాపములలో ఆరవవంతు రాజుకు చెందును. రక్షించుట చే ప్రజలపుణ్యమునందలి ఆగవభాగమును పొందినట్లే రక్షించకపోవుట చే వారి పాపములోని ఆరవవుతుగూడ పొందును. పర స్త్రీలంపటలగు దరాత్ములనుండి పతివ్రతలను రక్షించుట ధర్మము. రాజ బంధువులచేతను, చోరులచేతను, అధికారులచేతను పీల్చివేయబడుచున్న ప్రజలను రక్షించవలెను. ప్రజలను బాగుగా రక్షించినచో వారు రాజుకు ఉపయోగ పడుదురు. ప్రజలను రక్షించకున్నచో వారు పైన చెప్పిన రాజ బంధ్వాదులకు గ్రాసమైపోదురు. ఆదుచే రాజు దుష్టులను శిక్షించి కాస్తోక ప్రకారము ప్రజలనుండి పన్ను తీసికొనవలెను. రాజ్యమునందలి సగము ఆయమును కోశాగారములో రక్షించి సగము బ్రాహ్మణులకీయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు దానినంతను గ్రహించి నాల్గవవంతు క్షత్రియులకును, ఎనిమిదవ భాగము వైశ్యులకును, పదునార వభాగము . శూద్రులకును ఇవ్వవలెను. ధనమును ధర్మానుసారముగా సలాతలకు దానము చేయవలెను. ఆసక్యముపలుకువానిని దండించవలెను. వానీధనములో ఎనిమిదవవంతు దండముగా తీసికొనవలెను. స్వామి ఎవరో తెలియని ధనమును రోజు మూడుసంవత్సరముల పాటు తనవశములో నుంచుకొనవలెను. మూడు సంవత్సరములలోపుగా ధసస్వోమి వచ్చినచో ఆధవమును అతడు తీసిన వచ్చును. ఆసమయము దాటినచో ఆ ధనము రాజధన మైపోవును. మూడుసంవత్సరములలోపున వచ్చి ‘ఇది నాధనము’ అని చెప్పుచు, ధనస్వామి దాని స్వరూపము, సంఖ్య మొదలగు వాటిని రాజు ఎదుట సరిగా చెప్పగలిగినచో ఆ ధనము పొంద వచ్చును. చిన్న పిల్లవానికి చేరిన సొత్తును రాజు, ఆతనికి సమావర్తన సంస్కారము అగువరకును లేదా అతని బాల్యావస్థ తీరువరకును తన ఆధీనమునందుంచుకొనవలెను. సంరక్షులెవ్వరును లేని కాలమునందు పిల్లలు చిన్నవారైనపుడు స్త్రీల పోషణ బాధ్యత కూడ రాజు వహించవలెను.
పతివ్రతలైన స్త్రీలు వైధవ్యము పొందివను, రోగగ్రస్తులైన వారిని కూడ ఈ విధముగనే రక్షించవలేను. ఆట్టి స్త్రీలు జీవించి ఉండగా వారి బంధువులెవ్వరైవ హాళ, ధనమును అపహరించినచో రాజు పారిని చోరులను దండించినట్లు దండించవలెను. చోరులు ప్రజల ధనమును అపహరించినపుడు రాజు పోయినంత ధనమును ప్రజలకిచ్చి, దానిని రక్షాధికారుల నుండి రాబట్టవలెను. ధనము అపహంపబడకపోయినను అపహంపబడినట్లు చెప్పిన దానిని దండించి రాజ్యము నుండి బైటకు పంపిచేయవలెను. ధనమును ఇంటిలోని హరే దొంగిలిచినపుడు రాజు తన ధనమును ఈయవ:సిన పనిలేదు. రాజ్యమునందలి ఆపణము నుండి వారి ఆదాయములో వవవంతు పన్నుగా రాజు గ్రహించవలెను. పరదేశము మంచి వస్తువులు దిగుమతి చేసుకోను నపుడు ఎంత ఖర్చు, నష్టము అగునో దానిని కాలిబుక్కుల ద్వారా పరిశేటించి, వస్తువు మీద పన్ను ఎంత ఇచ్చుచున్నారో చూచి ప్రతి వ్యాపారస్థుని మీదను ఆతనికి నష్టము కలగ కుండునట్లు పన్ను వేయవలెను. రాజు ఆదాయములోని ఇరువదవవంతు మాత్రమే తీసికొనవలెను. ఎవరైన అధికారి అంతకంటే ఎక్కువ వసూలు చేసినచో ఆతని దండించవలెను. స్త్రీల నుండియు, సన్యాసుల నుండియు నావ దాటించుటకు కేవు తీసుకొన గూడదు. నావికుని పొరబాటుచేత ఏ వస్తువై న నష్టమైనచో ఆ నష్టము నావికుని నుండి వసూలు చేయవలెను. శూకధాన్యములో (వరి, గోధుమ మొ.) ఆరవవంతు, శింబిధాన్యములో (శనగ మొ.) ఎనిమిదవ వంతు పన్నుగా తీసికొనవలెను. అడవిలో పండు ఫలమూలాదులపై గూడ దేశ కాలానుసారముగా పన్ను గ్రహించవలెను. పశువులలో ఐదవ భాగము, బంగారములో ఆరవ భాగము తీసికొనవలెను. గంధము, ఓషధులు, రసము, పుష్పములు, ఫలములు, మూలములు, పత్రములు, శాకములు, తృణము, వెదురు, చర్మ, వెదురుబుట్టలు, శిలాపాత్రలు, మధువు, మాంసము, నెయ్యి వీటిపై కూడ ఆదాయములో ఆరవవతు మాత్రమే వసూలు చేయవలెను.
బ్రాహ్మణుల నుండి ప్రియవస్తువేదియు, లేదా పన్ను తీసికొనగూడదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులు ఏ రాజు రాజ్యములో ఆకలితో బాధపడుచుందురో ఆ రాజ్యము రోగములు, కరువు, దోపిడీదొంగలు వీటిచే పీడింపబడును. ఆందు వలన బ్రాహ్మణుల విద్యా సదాచారాదులను తెలిసికొని వారికి అనుకూలమగు జీవికను ఏర్పాటు చేయవలెను. తండ్రి తన కుమారుని పాలించినట్లు రాజు సదాచారవంతులును, విద్వాంసులును అగు బ్రాహ్మణులను పాలించవలెను. రాజుచే రక్షింపబడి బ్రాహ్మణుడాచరించు స్వధర్మానుష్టానముచే రాజు యొక్క ఆయుర్దాయము పెరుగును. రాష్ట్రము, కోశము కూడ వృద్ధి పొందును. శిల్పకారులు వేతనము తీసికొనకుండ, భోజనము మాత్రము చేసి మాసము నందు ఒక రోజు రాజు పనులు చేయవలెను. రాజ్యములో నివసించుచు శరీర పరిశ్రమచే జీవించు ఇతరులు కూడ ఈ విధముగనే మాసమునందొక రోజు రాజకార్యములు చేయవలెను.
ఆగ్నిమహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 223 of the Agni Purāṇa is as follows:
This chapter presents an overview of the major vratas observed throughout the Hindu lunar calendar. Each vrata's presiding deity, the tithi on which it falls, the prescribed fast, pūjā procedure, and phalasruti are summarized. The Ekādaśī vrata honoring Viṣṇu, the Śivarātri honoring Śiva, the Navaratri honoring Devī, and the Gaṇeśa Caturthī are among those described. Agni declares that sincere observance of vratas purifies accumulated karma and leads the soul toward mokṣa.