అగ్ని దేవుడు పలికెను : ఇపుడు భుక్తిముక్తిప్రద మగు “దీపదాన వ్రతమును” గూర్చి చెప్పెదను. దేవాలయము నందు గాని, బ్రాహ్మణగృహమునందు గాని ఒక సంవత్సరము దీపదానము చేయువాడు సకలకామములను పొందును. చాతుర్మాస్యమునందు దీపదానము చేయువాడు విష్ణులోకమునకును, కార్తి కమున దీపదానము చేయువాడు స్వర్గమునకు పోవును. దీపదానమును మించిన వత మేదియు పూర్వము లేకుండెను, ఇపుడు లేదు, ఉండబోదు. దీపదానముచే ఆ యుర్దాయము, నేత జ్యోతియు లభించును. ధనపుత్రాదిపాప్తి కలుగును. దీపదానము చేయువాడు సౌభాగ్యవంతుడై స్వర్గమున దేవతలచే పూజింపబడును. విదర్భరాజకుమారి యగు లలిత దీపదానపుణ్యము చేతనే చిరుధర్మమహారాజుకు భార్యయై ఆతని నూర్గురు రాణులలో ప్రముఖు లైనది. ఆ పతివ్రత ఓక పర్యాయము విష్ణ్వాలయమున సహస్రదీపముల దానము చేసెను. ఆమె సవతులు దీపదానమాహాత్మ్యమును గూర్చి ప్రశ్నించగా ఆమె ఇట్లు చెప్పెను. లలిత చెప్పెను : పూర్వము సౌవీరరాజువద్ద మైత్రేయు డను పురోహితు డుండెను. అతడు దేవికానదీతీరమున శ్రీమహావిష్ణువునకు ఆయము కట్టించేను. కార్తికమాసమున అతడు దీపదానము చేసెను. పిల్లికి భయపడి పారిపోవుచున్న ఒక ఆడుఎలుక అకస్మాత్తుగ, తవ ముఖాగముతో ఆ దీపపు వత్తిని పైకి త్రోసెను. అట్లు చేయుటచే ఆరిపోవుటకు సిద్దముగానున్న దీపము ప్రజ్వలించెను. మరణానంతరము ఆ ఆడుఎలుక యే రాజకుమారిగ జన్మించి రాజధర్ముని నూర్గురు, రాణులలో ప్రధానురా లైనది. ఈ విధముగ ఆనుకొనకుండగనే నేను విష్ణ్వాలయమునందలి దీపపు వత్తి ని ఎగసనత్రోయుటచే కలిగిన పుణ్యమునకు నలమును అనుభవించుచున్నాను. దీనివలననే నాకు పూర్వజన్మస్మృతికూడ లభించినది. అందుచే నేను సదా దీపదానము చేయుచున్నాను. ఏకాదశినాడు దీపదానము చేసినవాడు స్వర్గమున విమానారూఢుడై ఆనందించుచుండును.
దీపమును హరించినవాడు మూగ వాడు, బుద్ధివిహీనుడు ఆగును చీకటితో నిండిన దా ట శక్యముగాని నరకములో పడును. ఆక్కడ విలపించుచున్న వారిని చూచి యమకింకరుడు ఇట్లు అనును “ఇక్కడ ఏడిచి ఏమి ప్రయోజనము? మీరు ఏమరచి మీ ధర్మమును ఉపేక్షించినారు. కొన్ని వేల జన్మలలో ప్రాణి మనుష్యుడుగా పుట్టును. అపుడు కూడ మూడబుద్ధి యై భోగాలకొరకు పరుగెత్తును. పూర్వము మీరు అనుభవించిన విషయభోగాల ఫలితంగా ఇక్కడ ఏడ్వవలసి వచ్చినది. చేసిన పాపముల ఫలము ఆనుభవించవలసి ఉండునని మీరు ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? పరభార్యల కుచమర్ధనము మీకు సుఖకరముగ కనబడినది. అదే ఇపుడు మీ కుదుఃఖ హేతు వై నది. పరస్త్రీలను ఆవహరించి మీరు చేసిన కర్మలను గూర్చి నేను చెప్పి ఉన్నాను. ఇపుడు అయ్యో! అమ్మా! అనుచు ఎందుకు ఏడ్చెదరు? శ్రీమహావిష్ణువు నామము నాలుకకు ఏమి భారము? తైలము, వత్తి చాల స్వల్పమూల్యము కలవి. అగ్ని యైతే అంతటను లభించునదే. ఐనను మీరు దీపదానము చేయక విష్ణ్వాలయమునుండి దీపమును హరించితిరి. ఆదియే మీకిపుడు దుఃఖము నిచ్చుచున్నది. విలపించి ఏమి ప్రయోజనము? వచ్చిన యాతనను అనుభవింపుడు”.
అగ్ని దేవుడు చెప్పెను. లలిత సవతు లందరు ఆమె చెప్పిన ఉపాఖ్యానము విని దీపదానప్రభావముచే స్వర్గము పొందిరి. అందుచే దీపదానము అన్ని వ్రతములకంటెను విశేషఫలదాయకము.
అగ్ని మహాపురాణమునందు దీపదానవర్ణనమను రెండు నూర్లవ అధ్యాయము సమాప్తము.
అగ్ని మహా పురాణము 1 – 200 అధ్యాయములు సమాప్తము
* * * * *
Summary of chapter 200 of the Agni Purāṇa is as follows:
Agni declares dīpadāna—the gift of a lamp—to be the supreme vrata, surpassing in merit all past, present, and future vratas. Donating a lamp to a temple or to a brāhmaṇa's home every day for one year fulfils all desires; a lamp donated throughout the cāturmāsya period leads to Viṣṇu-loka; a Kārtika lamp donation leads to svarga. The chapter narrates the story of Lalitā, a princess of Vidarbha: in a past life an unknown mouse, fleeing a cat through a temple on Kārtika-pūrṇimā, accidentally raised the wick of a dying lamp in Viṣṇu's sanctuary; through that single unintended act the creature was reborn as Lalitā, the most beloved among the hundred queens of the righteous king Cārudharmarāja. Lalitā donates one thousand lamps to Viṣṇu's temple and explains to her co-wives how her great good fortune arose from that inadvertent lamp-act; they attain svarga merely by hearing her account. The chapter concludes with the warning that stealing a lamp from a temple causes blindness, muteness, and descent into deep naraka, as proclaimed by Yama's messengers to the sinners who arrive at his court.