అగ్ని మహా పురాణము

111 - అథ ప్రయాగమాహాత్మ్యమ్

అగ్ని దేవుడు పలికెను. వసిష్ఠా ఇపుడు ప్రయాగ మాహాత్మ్యమును గూర్చి చేప్పెదను. ఇది భుక్తిముక్తిప్రదమైవది. అత్యుత్తమము. బ్రహ్మ విశ్వాది దేవతలును, గొప్ప మనీశ్వరులను ప్రయాగలో నివసిదతనిధులు, సముద్రము, సిద్దులు, గంధర్వులు, అప్సరసలు కూడ ఈ తీర్థమునందు నివసింతురు. ప్రయాగలో మూడు అగ్నికుండములున్నవి. గంగ సకలతీర్థములను వెంట గైకొని ఈ కుండముల మధ్యనుండి మహావేగముతో ప్రవహించుచున్నది, త్రిభువన విఖ్యాతము, సూర్యపుత్రియు అగు యమున కూడ అచట నున్నది. గంగాయమునల మధ్య భాగము పృథివీజఘన మనియు, ప్రయాగ జఘనమధ్యభాగమునందలి ఉపస్థ యనియు ఋషులు చెప్పుదురు.. ప్రతిష్ఠానసహిత మగు ప్రయాగ, కంబలము, అశ్వతరము, నాగము, భోగవతీతీర్థము– ఇది బ్రహ్మయజ్ఞవేది యని చెప్పబడుచున్నది. వేదములును, యజ్ఞములును. ప్రయాగలో మూర్తి ధరించి నివసించును. ఆ తీర్థమును స్తుతించుట చేతను, నామ సంకీర్తనము చేయుట చేతను, ఆచటి మట్టిని స్పృశించినంత మాత్రముచేతను మనుష్యుడు సకల పాపవిముక్తుడగును. ప్రయాగలో గంగాయమునాసంగమమునందు చేసిన దావ-శ్రాద్ద- జపాదులు ఆశయము లగును. వసిష్ఠా! వేదము చెప్పినను, లోకము చెప్పినను గూడ అంతమునందు ప్రయాగములో ప్రా ములు విడువవలే ననెడు ఆలోచనను విడువరాదు. ఆరువది కోట్ల పదివేల తీర్థములు ప్రయాగలో ఉండను. అందుచే -అది అన్నింటికంటెను శ్రేష్ట మైనది. వాసుకి స్థాన మైన భోగవతీతీర్థము, హంసప్రపతనము ఉత్తమతీర్ధములు. వీటియందు మూడు దినములు స్నానము చేయుటచే కోటి గోదానములు చేసిన ఫలము లభించును. “గంగ అనేక స్థానములందు లభించ వచ్చును. కాని మామమాసమునందు, గంగాద్వారమునందును, ప్రయాగయందును, గంగాసాగరసంగమమునందును గంగ లభించుట చాల కష్టము” అని పండితులందురు. ప్రయాగలో దానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళి తిరిగి రూలోకమునకు వచ్చిన పిదప రాజాధిరాజగును. అక్షయవటమూలసమీపమునను, నంగమాదులందును మరణించినవాడు విష్ణులోకమును పొందును. ప్రయాగలో అతి సుందర మగు ఊర్వశీపులినము, సంధ్యావలమ, కోటితీర్థము, దశాశ్వమేధఘట్టమ, గంగా యమునా సంగమము, రజోహీన మగు మానసతీర్థము, వాసరకతీరము-ఇవి చాల ఉత్తమ మైనవి.

ఆగ్ని మహాపురాణమునందు ప్రయాగ మాహాత్మ్యవర్ణన మను నూటపదకొండవ అధ్యాయము సమాప్తము.