పుష్కరుడు చెప్పెను : ఇటు పైపాపములకు ప్రాయశ్చిత్తములను చేప్పెదను. బ్రహ్మహత్య చేసినవాడు కుడి నిర్మించుకొని పండ్రెండు సంవత్సరములు వనములో నివసించవలెను. శిరస్సు గుర్తును తన దేహముపై ఏర్పరచుకుని ఆత్మ శుద్ధికై భిక్షాన్నము తినవలెను. లేదా ప్రజ్వలించుచున్న అగ్నిలో తలక్రిందులుగా తన శరీరమును పడవేయవలెను. లేదా అశ్వమేధయాగము గాని. స్వర్గలోకము నిచ్చు గోసవము కాని చేయవలెను. లేదా ఏదైన ఒక వేదమును జపించుచు నూరు యోజనము . నడచి వెళ్ల వలేను, లేదా వేదవేత్త యగు బ్రాహ్మణునికి తన సర్వస్వమును ఇచ్చివేయవలెను. మహా పాతకము చేసిన వారు ఈ వ్రతములచే తమ పాపములను తొలగించుకొందురు. ఉపపాతకములు చేసినవాడును, గోహత్య చేసిన వాడును ఒక మాసము యవలు త్రాగ వలేను. ముండనము చేయించుకొని, ఆ గోచర్మమును కప్పుకొని గోష్ణ మనందు నివసించ వలెను. ఉప్పు, పులుపు లేని ఆహారమును మితముగా దినమునందలి నాల్గవ భాగమున తినవలెను. నియంతేంద్రియు డై రెండు మాసములు గోమూత్రముతో స్నానము చేయవలెను. పగలు గోవుల వెంట వెళ్లుచు నిలబడి గోపరాగమును త్రాగవలెను. ప్రళము పూర్తి చేసికొని పది గోవులను, ఒక వృషభమును దానము చేయవలెను. అందుకు శ క్తి లేనిచో వేదవేత్తలకు సర్వస్వమును దానము చేయవలెను. గోవును నిరోధించగా ఆవి చనిపోయినచో ఒక పాదము ప్రాయశ్చిత్తమును. కట్టి వేయుటచే చనిపోయినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తమును నాగలికి కట్టి నపుడు చనిపోయినచో మూడు వంతులును, కొట్టగా చనిపోయినచో పూర్తిగను ప్రాయశ్చిత్తము చేయవలెను. అడవులందును, దుర్గ ములందును, విషయప్రదేశములందును, భయము బందును గోవుకు ఆపద కలిగినచో ఒక పాదము ప్రాయశ్చిత్తము విహితము. ఆలంకారార్థమై ఘంటాదులు కట్టుటచే మరణించినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తము. గోవును దమనము చేయునపుడు గాని, చేయించునపుడు గాని కట్టి శ్రీమదగ్ని మహాపురాణము నపుడు గాని, గుదికజ్ఞ, గొలుసు, పాశము కట్టుటచే గాని మరణించినచో మూడు వంతులు ప్రాయశ్చిత్తము ఆచరించవలెను. గోవుకు కొమ్మువిరిగినను, ఎముక విరిగినను, తోక తెగినను దానికి పూర్తి ఆరోగ్యము చేకూరువరకును, గంజి త్రాగవలెను. గోమతీవిద్యను జపించుచు, గోస్తుతి - గోమతులను స్మరించుచుండవలెను. దైవవశమున ఒక గోవును అనేకులు చంపినచో వారు ఒక్కొక్కరు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. గోవుకు సహాయముచేయబోగా అది మరణించినచో పాపము లేదు. ఉపపాతకములు చేసి శవా రందరును, అవకీర్ణి తప్ప ఇతరులను, శుద్దినిమిత్తమై, ఈ వ్రతమునే చేయవలెను. లేదా చాంద్రాయణము చేయవలెను.
ఆవకీర్ణిమాత్రము (వ్రతమధ్యమునందు శ్రీ సంగము చేసినవాడు) రాత్రియందు చతుష్పథమున, నిరృతి నుద్దేశించి నల్లని గాడిదను పాకయజ్ఞవిధానమున పూజించవలెను. పిమ్మట ఆ ధీమంతుడు “సమాసిక్చాత్తు మరుతః' ఇత్యాది ఋక్కుతో చంద్ర ఇంద్రగురువుల నుద్దేశించి మృతాహంతి ఇవ్వవలెను. లేదా గార్దభచర్మము కప్పికొని ఒక సంవత్సరము భూమి పై సంచరించవలెను. తెలియక భ్రూణహత్య చేసినవాడు బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక సురా పొనము చేసిన బ్రాహ్మణుడు ఆగ్ని వలే కాలుతూన్న సురగాని, గోమూత్రము గాని, జలము కాని త్రాగ వలెను. సువర్ణము నపహరించిన బ్రాహ్మణుడు రాజువద్దకు వెళ్ళి నేను ఈ అపరాధము చేసితిని, నాకు దండము నిమ్ము అని చెప్పవలెను. ఈ విధముగ తనంతట తాను వచ్చి చెప్పిన వానిని రాజు ముసలముతో ఒక్క దెబ్బ కొట్టవలెను. ఈ విధముగ చచ్చుటచే గాని, తపస్సు చేయుటచే గాని సువర్ణస్తేయము చేసిన బ్రాహ్మణుని పాపము తొలగును. గురుపత్నిగమనము చేసినవాడు స్వయముగ శిశ్నమును, వృషణములను ఖండించుకొని, వాటిని దోసిటిలో నుంచుకొని చనిపోవువరకును, నైరృతిదిక్కు వైపు వెళ్ళవలెను. లేదా నియతేంద్రియుడై చాంద్రాయణవ్రతము చేయవలెను. జాతిభ్రంశకర మగు పాప మేదైన తెలిసి చేసినవాడు “సాంతపనకృచ్చమును,” తెలియక చేసినవాడు “ప్రాజాపత్యకృచ్చమును” చేయవలెను. “సంకరీకరణ' “ఆపాత్రీకరణ” పాపములు చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. “మలినీకరణ' పాపము చేసినవాడు మూడు దినములు తప్తయావకమును త్రాగవలెను. క్షత్రియవధ చేసినవాడు బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు చేసి కొనవలెను. వైశ్యుని వధించినచో ఎనిమిదవవంతు, సదాచార వతు డైన శూద్రుని వధించినచో పదునారవ వంతు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. పిల్లి, ముంగిస, నెమలి, కప్ప, కుక్క, ఉడుము, గుడ్లగూబ, కాకి... వీటిని గాని, నాలుగు వర్ణములకు చెందిన ఏ స్త్రీ నైన గాని చంపినచో శూద్రహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. సర్పాదులను చంపి నపుడు నక్త వ్రతమును, ఎముకలు లేని జీవులను చంపినపుడు ప్రాణాయామము చేయవలెను.
ఇతరులగృహమునుండి ఆల్ప మైన సారము గల వస్తువుల చౌర్యము చేసినవాడు కృచ్ఛసంతపనము చేయుటచే శుద్ధు డగును. భక్ష్యభోజ్యములను, యాన-శయ్యా-ఆసనములను, పుష్ప-ఫల-మూలములను అపహరించినవానికి పంచ గవ్య ప్రాశనము ప్రాయశ్చిత్తము. తృణ.కాష-వృక్షములను, బెల్లమును, వస్త్రమును, చర్మమును, మాంసమును అపహరిం చినవాడు మూడు రోజులు భోజనము చేయరాదు. మణులు, ముత్యములు, ప్రవాళములు, రాగి, వెండి, ఇనుము, కందు, రాళ్లు ఆపహరించినవాడు పండ్రెండు రోజులు కొంచెము అన్నము మెతుకులు మాత్రము తినవలెను. నూలు, పట్టుఉన్ని బట్టలను, రెండు డెక్కలు గల పశువులను, ఒక డెక్క గల పశువులను, పక్షులను, గంధములను, ఓషధులను, త్రాడును అపహరించినవాడు మూడు దినములు పాలుమాత్రమే త్రాగవలెను. సమానోదరు లగు స్త్రీలతోను, మిత్ర-పుత్రాదిస్త్రీలతోను, బాలికలతోను, అంత్యజాతిస్త్రీలతోను, మేనత్తకుమార్తెతోను, సోదరితోను, తల్లి సోదరి కుమార్తెతోను, తల్లి సోదరుని కుమార్తె తోను, ఆప్తని స్త్రీతోను సంగమము చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. మనుష్యభిన్న పశ్వాదులందును, రజస్వల యందును, యోనిభిన్న ప్రదేశములందును, జలమునందును రేతః సేకము చేసినవాడు కృచ్ఛసంతపనము చేయవలెను. ఎద్దుల బండియందును, నీటియందు, పగటిభాగమునందు స్త్రీతో గాని పురుషునితో గాని మైథునము చేసిన ద్విజుడు సచేత స్నానము చేయవలెను. విప్రుడు తెలియక చండాలస్త్రీతో గాని, అంత్యజాతి స్త్రీలతో గాని సమాగమము చేయుట, భుజించుట, దానము పట్టుట అను పనులు చేసినచో పతితు డగును. తెలిసి చేసినచో వారితో సము డై పోవును. చేడిపోయిన స్త్రీని భర్త ఒక యింటిలో నిరోధించి ఉంచి, పరదార సంబంధము గల పురుషుడు ఏ వ్రతము చేయవలెనో ఆ వ్రతమును ఈమెచే చేయించవలెను. సమావజాతీయునిచే పిలవబడి ఆమె మరల చెడి పోయినచో కృచ్చమును, చాంద్రాయణమును చేయవలెను. దానితో ఆమె పవిత్రు రాలగును. ద్విజుడు ఒక రాత్రి శూద్రస్త్రీసమాగమము చేసిన పాపమును, నిత్యము భిక్షాన్నము తినుట ద్వారా మూడు సంవత్సరము”లో పోగొట్టుకొనును.
అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణ మను నూటఅరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 169 of the Agni Purāṇa is as follows:
The specific expiations for the mahāpātakas described in the previous chapter are detailed. The brahmahā must carry a skull-flag, live in a forest hut for twelve years, and announce his sin at every village gate while begging; alternatives include walking into fire, performing an aśvamedha, or walking one hundred yojanas while continuously chanting a Vedic hymn. Go-hatyā (cow-slaughter) requires one month of yava-pāna, residence in the cow-pen, and following the herd daily through smoke and rain. The chapter provides a graduated table of penances for causing a cow's death through different degrees of negligence or violence, with fractions of the full penance proportionate to culpability.