అగ్నిదేవుడు పలికెను! ఇపుడు భుక్తిముక్తిప్రద మగు తీర్ధమాహాత్మ్యమును గూర్చి చెప్పెగను. హస్తములను పాదములను మనస్సును సంయమములో నుంచుకొన్నవాడును, విద్యా తపఃకీర్తులు కలవాడును మాత్రమే తీర్ధములనుండి పూర్తి ఫలమును పొందగలుగును. ప్రతిగ్రహమును విడచి, నియమితాహారమును భుజించుచు, ఇంద్రియవన స్వాధీనమునం దుంచుకొన్న వాడై పాపరహితు డగు తీర్థయాత్రికుడు సకలయజ్ఞఫలమును పొందగలడు. ఎవడు మూడు రాత్రులు ఉపవాసము చేయలేదో, తీర్థయాత్ర చేయలేదో వాడు దరిద్రు డగును. యజ్ఞములవలన కలుగు ఫలితము తీర్థయాత్రలవలన గలుగును, పుష్కరము శేషమైన తీర్థము మూడు సంధ్యలందును ఆచట సకలదేవతలతో కలసి బ్రహ్మ ఉండును, కోరికలు కల వారు, మునులు, దేవతలును అచట స్నానము చేసి సిద్ధి పొందినారు. పుష్కరమునందు దేవతలను, పితృదేవతలను పూజిం చిన వాడు అశ్వమేధయజ్ఞఫలమును పొంది బ్రహ్మలోకమునకు పోవును. కార్తీకపూర్ణిమనాడు ఆచట అన్న దానము చేసిన పాడు గుద్దచిత్తుడై బ్రహ్మలోకము చేరును. పుష్కరమునకు వెళ్లుటకు అచట తపస్సుచేయుటకు, అచట దానము చేయుటకు, అవకాశము లభించుటయే బాల కష్టము. అచట నివసించు సౌభాగ్యము లభించుట అతిదుష్కరము. పుష్కరమునందు నివసించువాడును, అచట జప శ్రాద్దములు చేసినవాడును, తన వంశమునందు నూరుతరములవారిచి ఉద్దరించును. జంబూ మార్గము, తండులికాశ్రమము అను తీర్థములు కూడ అచటనే ఉన్నవి. కణ్వాశ్రమము, కోటితీర్థము, వర్మద, ఆర్బుదము కూడ ఉత్తమతీర్థములు. చర్మణ్వతి, సింధువు. సోమనాధము. ప్రభాసము, సరస్వతీసము డ్రసంగ మము, సాగరము కూడాశ్రేష్టమైన తీర్థములు. పిండారక క్షేత్రము, ద్వారక, గోమతి ఇవన్నియు సర్వసిద్ధిప్రదము లగు తీర్థములు.
భూమితీర్ధము, బ్రాహ్మతుంగ తీర్ధము, పలచనదములు (సత్తజ్ మొదలైన ఐదునదులు) కూడ ఉత్తమములు. భీమ తీర-గిరీంద్ర తీర్ధములు, పోకవినాశనీ యగు దేవికాసటి, పవిత్ర మైన వినశన తీర్తము, నాగోద్భేదము, ఆపదనము, జమార కోటి-ఇవన్నియు సకలఫలప్రదములు. నేను కురు క్షేత్రమునకు వెళ్ళేదను: కురుక్షేత్రములో నివాసము చేసెదను అని సర్వం చేప్పుడు పరిశుద్దుడే స్వర్గలోకమును పొందుము. అచట విష్ణ్వాది దేవతలు నివసించు చుందురు. అచట నివాసము చేయుటచే మానవుడు విష్ణలోకమును పొందును. కురుక్షేత్రమునందు సమీపముననే సరస్వతీనది ప్రవహించుచుండును. దానిలో స్నానము చేయువాడు బ్రహ్మలోకము పొందును. కురుక్షేత్రమునందలి ధూలికూడ ఉత్తమ పదము నిచ్చును. ధర్మతీర-సువరతీర్థములు, పరమోత్తమ మైన గంగాద్వారము (హరిద్వారము) పవిత్రమైన కనఖలము భద్ర-కర్లప్రదము, గంగాసరస్వతీ సంగమము, బ్రహ్మావర్తమ ఇవీ పాపవినాశకము లైన తీర్థములు, భృగుతుంగ కుట్టామగగోద్భేదములు గూడ పాపవినాశకములు. పారాణసి నర్వోత్తమ పైన తీర్థము. దీనికే శేష మగు ఆముక్త క్షేత్ర మ కూడ పేదు. కపాల మోచనతీర్థము కూడ ఉత్తమమైనది. ప్రయోగ తీర్థములలో రాజు- గోమతి-గంగా సుగమము కూడ పొవనతీర్థము. గంగ, ఎక్కడ మన్నను స్వర్గలోకము నిశ్చను. రాజగృహము వవిత్రతీర్థము, శాలగ్రామఉత్తమ పావవిపాక వడేక . వాసన–కాలికాసంగమతీర్తనలు కూడ ఉత్తమమైనవి. రౌహిత్యతీర్షము, కరతోయానది, శోకద్రమ, ఋషరతీర్ధము కూడమైనవి, శ్రీపర్వత కోలాచల సహగిరి మలయగిరి గోదావరీ.తుంగభద్రలు, వరదాయిని యగు కావేరినది, కాపి, పయోష్టి, రేత (నర్మద) దండకారణ్యము కూడ ఉత్తమతీర్థములు. కాలంజర-ముంజవట శూర్పార మందాకినీచిత్రకూట శృంగ వేరపురములు కూడ శ్రేక్షకులు. అవంతి కూడ ఉత్తమతీర్ధము, అయోధ్య సకలపాపములను నశింపచేయును నైమిషా రజ్యము పరమపవిత్రతీర్థము. ఇది భుక్తిముక్తిప్రదము.
ఆగ్నిమహాపురాణమునందు తీర్థయాత్రామాహాత్మ్య మను నూటతొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 109 of the Agni Purāṇa is as follows:
Pacificatory fire rites for warding off omens, celestial disturbances, and personal misfortune are described. Agni lists the categories of inauspicious signs—unusual sounds, dreams, animal behaviours, and planetary configurations—that call for a śānti-homa. The appropriate samidhs, ghṛta-āhutis, and Ṛgvedic śānti-sūktas are prescribed for each class of disturbance. The rite concludes with brāhmaṇa-bhojana, dāna, and the chanting of Mahāmṛtyuñjaya to dispel remaining dread.