అగ్ని పలికెను- హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, ఆతనికి పురూరవుడు, అతనికి ఆయువు, ఆతనికి. నహుషుడు, ఆతనికి యయాతి పుట్టిరి. అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషపర్వుని కుమార్తె యేన శర్మిష్ట ద్రుహ్యు-ఆను పూరులు అనేడు కుమారులను కనిరి. యదువు కులమునందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.
భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశిపుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు పేరిత యైన యోగమాయ ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవకి నప్త మ. గర్భముగా ఆయెను. ఆతడు రోహిణి యందు సంక్రమింపచేయబడి రొహిణేయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి. శ్రావణ కృష్ణపష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.
రెండు ఖాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్బుజుని దేవకి వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద వక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో వరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.
దేవకి వారించినను “నీ అష్టమగర్భము నాకు మృత్యు హేతువు” అని పలుకుచు అట్లు చేసెను. ఆకాశవాణిని విని ఆతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చిన శిశువులనందరిని పూర్వము చంపివే నేను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక ఆకాశము పైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.
బాలిక పలికెను. కంసా; నన్ను విసరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు నర్వస్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.
ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే “ఆర్యా! దుర్గా, వేదగర్భా, అంబికా, భద్రకాళి, భద్రా, జేమ్యా జేమకర్, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమన రించుచున్నాను.” అని స్తుతించబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమస్త కామములను పొందును.
ఆ బాలుని చంపుటకై, కంసుడు, పతన మొదలగు వారిని పం పెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదావతియైన నందునికి రక్షణార్థమె ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి నంచరించిరి. జగత్తునకు పాలకులైన వారు గోపాలులైరి.
విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు ఆర్జునవృక్షముల మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.
బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివేసెను. కాలియుని జయించి ఆతనిని యమునాప్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన ఆతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి అలవనమును క్షేమకరమైన దానినిగా చేసెను.
వృషభ రూపముననున్న అరిషాసురుని వంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శకోత్సవమును మాన్ని పర్వతపూజ చేయిందెను.
పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.
కంసుడు వంపిన అక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్ళేను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు ఆతనితో క్రీడించిన, అనుర కలైన గోపికలు ఆతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. ఆంగరాగమునిచ్చిన కుట్టకు గూను పోవునట్లు చేసేను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, ఆననముల పై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరమల్లునితో మల్ల యుద్ధము చేనెను. బలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.
శ్రీకృష్ణుడు మథురావతి యైన కంసుని చంపి ఆతని తండ్రిని రాజుగా చేసెను. కంసుని భార్యలైన అస్తి - ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధుడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్ధము చేసిరి.
రామకృష్ణులు మథురను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్దమున జరాసంధుని జయించి, పౌండ్రక వాసు దేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.
జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహ మాడెను. ఈ విధముగ ఆతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.
నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూఢుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణితమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని వచ్చి సత్యభామా గృహమున ఉంచెను.
సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన ఆతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను, పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందునిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను, భక్తులను, విప్రులను పూజించెను.
బలభద్రునకు రేవతియందు నిశతుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. ఆరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరించి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను (మ్రింగెను). ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెను. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి ఆదరముతో పెంచెను. ఆతనితో ఇట్లనెను. “నేను నీ రతిని. నీవు నాపతి వైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండు నట్లు చేసెను. నన్ను శంబరుడు హరించేను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.
ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణీ కృష్ణులు సంతసించిరి.
ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదార బుద్ధియు ఆగు అనిరుద్దుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. ఆతని కుమార్తె ఉష. ఆతని నగరము శోణితపురము. ఆతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడాయెను. ‘ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్దము పొందగలవు’ అని సంతసించిన శివుడు పలికెను.
గౌరీ శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్త ను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశిదివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్త కాగలడు. గౌరి మాటలు విని సంత సించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. ఆతడు తనతో నంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటము పై ఆతని మూర్తి వి చిత్రించి దాని సాహాయ్యముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడై న అనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ దాణాసురుని మంత్రియైన కుంభాండుని పుత్రిక. అనిరుద్ధుడు ఉషతో కూడ రమించెను.
రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు ఆతనికి తెలిపిరి. అనిరుద్ధునకు బాణునితో సూదారుణమైన యుద్ధము జరిగెను.
కృష్ణుడు నారదునినుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతుడై వచ్చి శత్రువులను, మాహేశ్వరజ్వరమును కూడ జయించెను.
పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్ధము జరిగెను. తార్క్ష్యుడు మొదలగు వారు నంది - వినాయక - స్కందాదులను జయించిరి.
విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహు సహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణున కభయ మిమ్మని విష్ణువును కోరెను.
విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను. (కృష్ణుడు పలికెను). “నీవు ఈ, వాణునకు అభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును”.
విష్ణువు శివాదులచే పూజింపబడి, ఉషానిరుద్దాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదపులతో కలిసి సుఖముగా ఉండెను.
Summary of chapter 12 of the Agni Purāṇa is as follows:
This chapter narrates Kṛṣṇa's boyhood exploits in Vṛndāvana and Mathurā. His subjugation of the serpent Kāliya in the Yamunā, the lifting of Mount Govardhana to shelter the cowherds from Indra's wrath, and the Rāsalīlā with the gopī-s are summarised as cosmic plays that reveal Bhagavān's sovereignty over all elements, his grace toward his devotees, and the supreme nature of bhakti. Kṛṣṇa and Balarāma are then summoned to Mathurā by Kaṃsa under the pretext of a wrestling match. In Mathurā, Kṛṣṇa breaks Kaṃsa's great bow at the weapons ceremony, kills the elephants and wrestlers set against him, and finally seizes Kaṃsa by the hair and slays him. The imprisoned parents Vasudeva and Devakī are freed.