పుష్కరుడు పలికెను : శుభా శుభ స్వప్నములు, ఆశుభస్వప్న ఫలని వారణోపాయములు చేప్పేదను. నాభికప్పఇతర శరీరాంగములందు తృణములు వృక్షములు మంచుట, నెత్తి మీద పెట్టుకొన్న కాంస్య పాత్రలు బద్దలగుతల గొరిగించుకొనుట, వస్త్ర విహీనుడగుట, నినవస్త్రము , ధుంచుక, తైలము, బురద పూసి కౌనుక, పైనుచిప్సు, వివాహమగు, గీతములు వినుట, వీణా వాద్యములు విమచు మనోవినోదము చేయుట, ఉయ్యాల ఊగుట, పద్మములను లోహములను సంపాదించుట, సర్పములను చంపుట, ఎఱ్ఱటి పూవులతోనిండిన వృక్షములను చండాలులను చూచుట సూకరము, కుక్క, గాడిద, ఒంటెవాటిపై ఎక్కుట, పక్షిమాంసము భుజించుకు తైలము త్రాగుట, కిచడి తినుట , మాతృగర్భము ప్రవేశించట, చితి పై ఎక్కుట, ఇంద్రధ్వజము విరిగిపడుట, సూర్యచండులు పడిపోవు! దివ్య - అంతరిక్ష - భూలోకములందు ఉత్పాతములు కనబడుట . దేవతా - బ్రాహ్మణ - రాజ - గురుపులకు కోపము కలుగు, నాట్యమాడుక, నవ్వుట, గీతములు పాడుట, వివాహము చేయుట, వీణతప్ప మిగిలిన వాద్యములను తాము వాయించుట, నదిలో మునిగి క్రిందికి పోవుట, గోమయము, బురద, సిరా కలసిన నీళ్ళలో స్నానము చేయుట, కుమారీకన్యలను ఆలింగనము చేసికొనుట, పురుషులు పరస్పరము మైథునము చేసికొనుట, తన ఆవయపముల హానీ, మనము, విరేచనపు ఆగుట, దక్షిణదిక్కు వైపు వెళ్ళట, రోగ మ పీడితుడగుట, ఫలముల హాని, ధాతువును బద్దలు కొట్టుట, ఇండ్లను పడద్రోయుట , ఇండ్లలోతుడుచుట పిశాచ - రాక్షస - వానర - చాండారాదులతో క్రీడించుట, శత్రువుచే అవమానితుడగుట, శత్రువులనుండి కష్టములు వచ్చుట, కాషాయవస్త్రములు ధరించుట, కాషాయవస్త్రములతో ఆడుకోనుట, తైలము త్రాగుట, దానిలో స్నానము చేయుట, ఎఱ్ఱని పూలమాల ధరించుట, ఎఱ్ఱని చందనము ధరించుట, ఇవన్నియు చెడు స్వప్న ములు. వీటిని ఇతరులకు చెప్పకుండుట మంచిది. ఇట్టి స్వప్నములు వచ్చినపుడు మరల నిద్రించవలెను. స్వప్న దోషశాంతికై బ్రాహ్మణులను పూజించవలేను. తిలహోమము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివులను, సూర్యగణములను పూజించి స్తోత్ర - పురుషసూక్తాదుల పారాయణము చేయవలెను. రాత్రిమొదటి తొమునందు చూచిన స్వప్నములవలము ఒక సంవత్సరములో కలుగును. రెండవజామునచూచినవాటి ఫలము ఆరు మాసములందును మూడవజామునందు చూచిన వాటిఫలము మూడుమాసములందురు, నాల్గవ జామునందుచూచిన స్వప్న ములవలము పడనై దుదినములందును కలుగును. అరుణోదయసమయమున చూచిన దానివలము పదిరోజులలోనే కలుగును.
ఒకే రాత్రి శుభాశుభ స్వప్నములు రెండును వచ్చినచో తరువాత వచ్చినదాని ఫలమునే చెప్పవలెను. అందుచే శుభ స్వప్నము చూచిన తరువాత నిద్రించుట మంచిదికాదు. పర్వతము, భవనము, ఏనుగు, గుఱ్ఱము, ఎద్దు ఎక్కినట్లు స్వప్నము వచ్చినచో మంచిది. పరశురామా! భూమిమీదగాని, ఆకాశమునందుగాని తెల్లటిపూవులతో నిండిన వృక్షములు కనబడినను, తన నాభినుండి వృక్షముగాని, తృణముగాని మొలిచినను. తన భుజములుగాని, శిరస్సుగాని ఆధికముగా ఉన్నట్లు కవబడినను, కేశములు తెల్లబడినను మంచి ఫలములు లభించును. శ్వేతపుష్పమాలయు, శ్వేతవస్త్రములును ధరించుట, చంద్ర - సూర్య - నక్షత్రములను వట్టుకొనుట, వాటిని తుడుచుట, ఇంద్రధ్వజమును ఆలింగనము చేసికొనుట, ధ్వజమున పైకెత్తు, ఈమి పై పడతున్న జలధారన తనమీడ ఆపుట, శత్రువినాశనమును చూచుట, వాద వివాదములందును, యుద్ధము నందునుతాను జయించుట, పాయసము భుజించుట, రక్త ముచూచుట, రక్త ములో స్నానమాడుట, సుర, మద్యము, లేదా పాలు త్రాగుట, అస్త్ర ప్రహారము తిని నేల పై దొర్లుట, ఆకాశము స్వచ్ఛమగుట, గోవు, గేదె, ఆడ సింహము, ఆడ ఏనుగు, ఆడగుఱ్ఱము వీటి పొదుగునుండి పాలు త్రాగుట, ఇవన్నియు మంచిస్వప్నములు, దేవతా . గురు . బ్రాహ్మణుల ప్రసాదము, గోశృంగము నుండి గాని, చంద్రుని నుండిగాని స్రవించు ఉదకముతో అభి షేకము చేసికొనుట . ఈ స్వప్నములు రాజ్యము నిచ్చును. పరశురామా! తాను రాజ్యాభిని కుడగుట, తన శిరస్సు ఖండితమగుట, తాను చచ్చుట, అగ్నిలో పడుట, గృహాదులకు అగ్ని దగ్ధ మగునపుడు ఆ అగ్నిలో పడుడి, రాజచిహ్నములు లభించుట, స్వయముగా వీణవాయించుట, ఈ స్వప్నములు గూడ మంచివి; రాజ్యమునిచ్చునవి. స్వప్నము చివర రాజును, ఏనుగును, అశ్వమును, సువర్ణమును, వృషభమును, గోవును చూచినవారి కుటుంబము వృద్ధిచెందును. ఎద్దు, గజము, ప్రాసాదోపరిభాగము, పర్వత శిఖరము, వృక్షము వీటి పైకెక్కుట, ఏడ్చుట, శరీరమునకు నెయ్యి, మలము అంటుకొనుట, ఆగ మ్యాస్త్రీగ మసము . ఇవి కూడ కథ స్వప్నములు.
ఆగ్నిమహాపురాణమునందు శుభాశుభస్వప్న - దుఃస్వప్న నివారణమను రెండువందల ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 229 of the Agni Purāṇa is as follows:
The Rājasūya yāga, the consecration of a universal monarch (cakravartin), is described. Agni explains that Rājasūya establishes the king as the earthly representative of Indra and involves the symbolic conquest of the four quarters before the actual rite. The abhiṣeka with water from sacred rivers, the digvijaya pūjā, and the Ratnin offerings to twelve royal functionaries are detailed. The chapter cites the Rājasūya performed by Yudhiṣṭhira as the model for all future performances.