నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి- నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.
బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. ఆతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. ఆతని ప్రథమ భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోదృవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖము లును గల రావణుడు పుట్టెను. ఆతడు బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి కూర్పణఖ సోదరి. రావణునకు మేమనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటే అధిక బలవంతు డైన ఆతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల షేమమునకై నీవు లక్ష్మణునిచే ఆతనిని చంపించితివి.
ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లి పోయిరి. దేవతలచేత ప్రార్దింవ బడిన రాముని ఆజ్ఞచే శత్రుఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను వట్టణ, మొకటి ఉండెను. రాముని ఆజ్ఞాపింపబడిన భరతుడు తీన్తములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను. సిందుతీరమునందు నివసించు దుష్టగంధర్వుడైన శైలూషని కూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తకుని, పుష్కరిని పాలకులనుగా చేసి భరతుడు శత్రుఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవరూపుడైన రాముడు దుష్టులను యుద్ధమున సంహరించి శిష్టులను పాలించెను.
లోతావవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథా శ్రవణమును బట్టి తెలిసికొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేవెను. ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పరుడై పది వేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగ ములు చేసి, దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములును వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు. రాజ్యము పొందెను.
అగ్ని పలికెను. వాల్మీకి నారదుని నుండి విని రామాయణమును సవిస్తరముగ రచించెను. దీనిని విను వాడు న్వర్గమునకు వెళ్లును.
ఆగ్ని మహాపురాణమునందు రామాయణమున ఉత్తర కాండవర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 11 of the Agni Purāṇa is as follows:
The chapter opens with the divine plan by which Bhagavān Kṛṣṇa descended into the prison of Mathurā as the eighth son of Vasudeva and Devakī, at the midnight hour of the Aṣṭamī tithi. Kaṃsa, the demonic king, had imprisoned the couple after receiving a prophecy that Devakī's eighth child would slay him. Bhagavān's luminous four-armed form appeared first to his parents before assuming the form of an infant. Vasudeva miraculously carried the child across the flooded Yamunā to Gokula, where he was exchanged with the daughter of Yaśodā and Nanda. The chapter describes Kṛṣṇa's childhood in Vṛndāvana — the killing of Pūtanā, Tṛṇāvarta, Śakaṭāsura — and the miracles that revealed his divine nature to those with eyes to see.