పుష్కరుడు చెప్పెను : మరణించినవానికి సంస్కారము జరిగినను జరుగకపోయినను శ్రీహరినామస్మరణ చేసినచో వానికి స్వర్గమోక్షములు రెండును లభించును. మృతుని అస్థులను గంగలో పడవేయుటచే ఆతనికి అభ్యుదయము కలుగును. తన ఆస్తులు గంగలో ఎంత కాల ముండునో అంత కాలము మానవుడు స్వర్గములో నుండును. ఆత్మహత్యశ్రీ మదగ్ని మహాపురాణము చేసికొన్న వానికిని, పతితునకును పిండోదక క్రియ లేకున్నను వాని ఆస్తులను గంగలో పడవేసినచో వానికి మంచి కలుగును. వానికై ఇచ్చిన అన్న జలములు ఆకాశములో లీనమైపోవును. పతితు డగువానీ ప్రేతను ఉద్దేశించి మహానుగ్రహబుద్ధితో వారాయణబలి ఇవ్వవలెను. వానికి నారాయణానుగ్రహము లభించును. కమలలోచను డగు శ్రీహరి వినాళ రహితుడు. అందుచే ఆతని కరించినది వినాశ రహిత వై యుండును. జనార్దనుడు జీవుని పతితుడు కాకుండ కాపాడును; అందుచే అతడే ఉత్తమ పాత్ర, పతితు లై బోవ నున్న జీవులకు భోగమోక్షముల నిచ్చు ఏకైక ప్రభువు శ్రీమహావిష్ణువు. జగత్తులో నున్న వారందరుమ ఏదో ఒక రోజున మరణింపవలసినవారే అను విషయమును గుర్తించి, తనకు నిజముగ సహాయముగా నిలువబోవు ధర్మమును ఆచరించవలెను. పతివ్రత యైన పత్ని తప్ప మరి యే బంధువును గూడ మరణించిన దానికొరకై మరణించియు అతనితో కలసి వెళ్ళజాలరు. యమలోకమార్గము ప్రతి ఒక్కరికిని వేరువేరుగా నుండును. జీవుడు ఎచటికి వెళ్ళివను ఆతనితో కూడ కలిసి వెళ్ళు ఏకై కసహాయము ధర్మమే. రేపు చేయవలసిన పని ఈ రోజునే చేయవలెను. మధ్యాహ్న మునచేయవలసిన పని పూర్వాహ్లమునందే చేయవలెను. ఏలనన ఈతడు చేయవలసిన పని పూర్తి యైనదా లేదా అని మృత్యువు నిరీక్షించదు. మనుష్యుడు పొలములు, ఆపణములు, గృహములు మొదలగు వాటియందు ఆసక్తుడై మనస్సంతయు మరొక వైవున ఉండి యుండగా ఏమరియున్న గొర్రెను ఆడతోడేలు వచ్చి తన్నుకొనిపోయి నట్లు మృత్యువు తీసికొనిపోవును. కాలమునకు ఇష్టుడు గాని, ఆనిష్టుడు గాని లేడు. ఆయుర్దాయము, ప్రారబ్ధకర్మ పూర్తి యైన వెంటనే మృత్యువు హటాత్తుగా వచ్చి జీవుని ఎత్తి కొనిపోవును. కాలము రానివానిని వందలకొలది బాణములతో కొట్టినను మరణించడు. కాలము వచ్చినవానిని కుశాగ్రముతో ముట్టినను వాడు మరణించును. మృత్యుగ్రస్తుని ఔషధములు గాని, ముత్రాదులు గాని రక్షింపజాలవు. లేగ దూడ సరిగా తన తల్లి దగ్గరకే వెళ్ళి నట్లు పూర్వజన్మకృత మైన కర్మ కర్తను అనుసరించును. ఈ జగత్తుయొక్క ఆది అవ్యక్తము ఆంతము కూడ అవ్యక్త మే. కేవలము మధ్యయే వ్యక్తము. శరీరమునందు కౌమార - వనావ్యవస్థలు వచ్చిన విధముననే మరొక శరీరము కూడ వచ్చును. నూతన వస్త్రమును ధరించిన విధముగ జీవుడు వెనుకటి శరీరమును విడచి క్రొత్త శరీర ముమ పొందును. జీవుడు సర్వదా అవధ్యుడు. వాడు ఎన్నడను మరణించడు. అందుచే మృత్యువును గూర్చి శోకమును విడువవలెను.
ఆగ్ని మహాపురాణమునందు అసంస్కృతాదిశుద్ధి యను నూట ఏబది తొమ్మిదవ అధ్వాయము సమాప్తము.
Summary of chapter 159 of the Agni Purāṇa is as follows:
Āśauca pertaining to persons who have not undergone the proper saṃskāras (especially upanayana) is discussed. Agni states that a person who has not been duly initiated lives in a permanent state of subtle ritual incompleteness, and that deaths in such families generate āśauca of different character from that of fully saṃskṛta families. The conditions under which formal saṃskāras can still be retroactively performed—with modified procedure and reduced validity—are described. The chapter reinforces the Purāṇic position that saṃskāras are not mere social ceremonies but transformative spiritual events whose absence has real ritual consequences.