ఆగ్ని దేవుడు చెప్పెను : వసిష్ఠా! పది గోవు లున్న వాడు ఒక గోవును, నూరుగోవులున్న వాడు పదిగోవులను, వెయ్యి గోవు లున్న వాడు నూర గోవులను దానము చేయగా వారికి లభించు ఫలము సమముగనే ఉండును. కుబేరుని రాజధాని యగు అలకాపురియందు ఉన్న సువర్ణనిర్మిత భవనమున గంధర్వులును, అప్పర సలును విహరించుచుందురు. సహస్రగోదానము చేసినవాడు ఆచటికి వెళ్లను. శతగోదానములు చేసినవాడు నరక సముద్రము నుండి విముక్తు డగును. వత్పదానము చేసినవాడు స్వర్గమున పూజింపబడును. గోదానము చేయుటచే దీరాయురారోగ్యసౌభాగ్యములు లభించును. స్వర్గము ప్రాప్తించును. ఈ క్రింది మంత్రము చదువుచు మహిషిదానము చేయుటచే సౌభాగ్యము లభించును “ఇంద్రాది లోకపాలుల మంగళమయజమహిషి యైన దేవి ఈ మహిషీ దానము చేసిన పుణ్యముచే నాకు సకలాభీష్టవస్తువులను ఇచ్చుగాక. ఏ మహిషి పుత్రుడు యమధర్మరాజునకు సహాయుడుగ నియుక్తుడై నాడో, ఏ మహిషి మహిషాసురుని తల్లియో ఆ దేవి నాకు వరములనొసంగుగాక! వృషభదానముచే మనుష్యుడు స్వర్గమును పొందును.
“సంయుక్తహలపంక్తి” యను దానము సమస్త ఫలప్రదము. కఱ్రతో తయారు చేసిన పది నాగళ్ళ పంక్తిని సువర్ణమయ మగు పట్టిక తో ఒకదానితో ఒకటి కట్టవలెను. ఒక్కొక్క హలముతో ఆవశ్యక సంఖ్యలో వృషభము లండ వలెను. వాటి దానము “సంయుక్తహలపంక్తి దానము”. ఈ దానము చేసినవాడు స్వర్గమున పూజించబడును. జ్యేష్ట పుష్కర తీర్థమునందు పది కపిలగోవుల దానము చేసినచో దాని ఫలము అక్షయము. వృషోత్సర్గముచేత గూడ అక్షయ ఫలము లభించును. ఆబోతకు చక్ర-త్రిశూలముద్రలు వేసి “దేవేశ్వరా! నీవు సాక్షాత్తు నాలుగు పాదములు గల ధర్మ దేవతవు. ఈ నాలుగు నీ ప్రియతమలు, పితృ-మమష్య-ఋషులను పోషించు ఓ వేదమూర్తి యైవ వృషభమా! నిన్ను విడచుటచే నాకు ఆమృతమయము లగు శాశ్వతలోకములు ప్రాప్తించుగాక. దేవ-భూత-పితృ ఋణముల నుండి విముక్తుడ నగుదును గాక. నీవు సాక్షాత్తు ధర్మము. నిన్ను ఆశ్రయించువారికి కలుగు గతి నాకు ప్రాప్తించు గాక” అని పఠించుచు విడువవలెను. మృతుని ఏకాదశ-షాణ్మాసిక - వార్షిక శ్రాద్ధములలో ఒక దానియందు వృషోత్సర్గము చేసినచో ఆతడు పేత లోకము నుండి విముక్తు డగును. పది హస్తముల దండములు మొదలు ముప్పది హస్తముణదండనలకు సమాన మైన భూమి “నివర్తనము: పది నివర్తనముల భూమి “గోచర్మము”. అంత భూమి దానము చేసినవాడు తన సమ స్తపాపములను నశింప చేసికొనును. గో-భూ-సువర్ణ యుక్త కృష్ణమృగచర్మ ను దానము చేసినవాడు ఎన్ని పాపములు చేసినవాడై నను, బ్రహ్మ సాయుజ్యమును పొందును. తిలములతోను, మధువుతోను నింపిన పాత్రను, మగధదేశీయమానానుసారము ఒక ప్రస్థము కృష్ణతిల లను దానము చేయవలెను దీనితో పాటు ఉత్తను మగు శయ్యను కూడ దానము చేయుటచే దాత భుక్తిముక్తులను పొందును.
స్వర్ణముతో తన ప్రతిమ చేయించి దానము చేయువాడు స్వర్గమును పొందును విశాల మగు ఇల్లు కట్టించి దానము చేయువాడు భోగ మోక్షములను పొందును. గృహమును, మఠమును, ధర్మశాలను, ఆవాసస్థానమును దానము చేసిన వాడు స్వర్గమున సుఖము లనుభవించును. గోశాల నిర్మించి దానము చేయువాడు పాపరహితుడై స్వర్గము పొందును. యమునికి సంబంధించిన మహిషమును దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గము పొందును. దేవతాసహితు లగు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పాశధారి యగు యమదూత మూర్తి స్థాపించి ఆ యమదూత శిరస్సు ఖండించి ఆ మూర్తితో కూడిన మండలమున బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేయుటచే దాత స్వర్గమునకు వెళ్లును గాని, ఆ ‘త్రిముఖ’ మను దానము పట్టిన బ్రాహ్మణుగకు పాపము సంక్రమించును, వెండి చక్ర మొకటి చేయించి, దానిని నీటిలో నుంచి దాని నిమిత్తము హోమములు చేసి, దానిని బ్రాహ్మణునకు దానము చేసినచో అది “కాలచక్ర దానము”. తన బరువుతో సమాన మై బరువు గల ఇనుము దానము చేయువాడు నరకమున పడడు. ఏబది పలమాల లోహదండమును వస్త్రము చుట్టి దానము చేయువానికి యమదండ భయ ముండదు. దీర్ఘాయువును కోరువాడు మృత్యుంజయుని ఉద్దేశించి ఫలములు, మూలములు, ద్రవ్యము అన్నింటిని ఒక్కసారిగాని, వేరువేరుగా గాని దానము చేయవలెను. కృష్ణతిలలతో పురుషుని చేసి వెండి దంతములు, బంగారు కళ్లు అమర్చవలెను. మాలను ధరించి దీరాకారముతో నున్న ఆ పురుషుని కుడి చేతిలో ఎత్తిన ఖడ్గ ముండవలెను. ఎఱ్ఱని వస్త్రములు, జపాపుష్పములు, శంఖమాల ధరించి యుండవలెను. రెండు పాదములందు పాదుకలు, పార్శ్వమున నల్లని కంబళి ఉండవలెను. ఎడమ చేతిలో మాంసపిండ ముండవలెను. ఈ విధముగ కాలపురుషుని నిర్మించి గంధాది ద్రవ్యములచే పూజించి, బ్రాహ్మణునకు దానమీయవలెను. ఇట్లు చేసిన దాత త్యాధి మృత్యురహితుడై రాజరాజేశ్వరు డగును. బ్రాహ్మణునకు రెండు ఎద్దులు దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును.
సువర్ణ దానమును చేయువానికి అభీష్టవస్తుసిద్ధి యగును. సువర్ణదానము సఫల మగు టకు వెండి దక్షిణ ఇవ్వ వలెను. అన్యదానముల సాద్గుణ్యము నిమిత్తము ను వర్ణదక్షిణ మంచిది. సువర్ణమే కాక రజతము, తామ్రము, తండు లములు ధాన్యములు కూడ రక్షణకు తగినవి. నిరః శ్రాద్ధ నిత్యదేవపూజాదు ఎందు దక్షిణ ఇవ్వవలసిన పని లేదు. పితృకార్యమునందు ర జతదక్షిణ ధర్మార్థ కామప్రదము. భూమి దానము చేసి బుద్ది కుంకుడు సువర్ణ - రజత - తామ్ర మణి - ముక్తాదుల దానము కూడ చేసిన ఫలము పొందును. భూదానము చేసిన శాంతచిత్తుడు పితృలోకములో నున్న పితృ దేవగలను, దేవలోకములో నున్న దేవతలను గూడ పూర్తిగా సంతృప్తిపరచును. సస్యములతో నిండి గరున్న చిన్న పల్లె, గ్రామము, ఖర్వటము, నూరు నివర్తనముల ప్రమాణము లేదా దానిలో సగము ప్రమాణమున నిర్మించిన గృహాదికము గోచర్మప్రమాణము గల (పది నివర్తనము) భూమి దానము చేసినవాడు అన్ని యు పొందును. తైలబిందువు నీటిపై గాని, భూమి పై గాని పడి వ్యాపించి నట్లు అన్ని దానముఫలము ఒక జన్మవరకును ఉండును. స్వర్గ - భూ - గౌరీకన్యా దానఫలము ఏడు జన్మల వతకును స్థిరముగా నుండును. కన్యాదానము చేసినవాడు ఇరువది యిక్క తరములను నరకము నుండి ఉద్దరించి, బ్రహ్మలోకమును పొందును. దక్షిణా సహితముగ గజ దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గమును చేరును. అశ్వదానము చేయుటచే దీర్ఘాయురారోగ్య సౌభాగ్య - స్వర్గములను పొందును. శ్రేష్ఠ బ్రాహ్మణులకు దాసీదానము చేయువాడు ఆప్సరస్రాలలోకమున సుఖము లనుభవించును. ఐదువండు పలములు లేదా రెండువందల ఏబది పంములు, నూటఇరువదియైదు పలములు, లేదా వాటిలో సగము పలములు బరువు గల తా మ్రపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తు లను పొందును.
వృషభసహితశకట దానము చేసినవాడు విమానముపై స్వర్గమునకు వెళ్లను. వస్త్రదానముచే ఆయురారోగ్యములు, అక్షయస్వర్గప్రాప్తి కలుగును. ధాన్యము, గోధుమలు, ఆగ్రహాయణీ తండులములు, జొన్నలు మొదలగునవి దానము చేయువాడు స్వర్గము పొందును. ఆసనము, ధాతునిర్మితపాత్రమ, లవణము, సుగంధి చందనము ధూపదీపములు, తాంబూలము, ఇనుము, వెండి, రత్నములు, వివిధ, దివ్యపదార్థములు దానము చేయువాడు భుక్తిముక్తులను పొందును. తీలలనుతిపాత్రము దానము చేసినవాడు స్వర్గసుఖము పొందును. అన్నదానమును మించిన దాన మేదియు లేదు, ఉండ బోదు. గజ-అశ్వ-రథ-దాసదాసీ-గృహాదుల దానము అన్న దానము యొక్క పదహారవ కలకు కూడ సరితూగవు. మహాపాపములు చేసిన వాడు కూడ ఆన్న దానము చేసినచో ఆ పాపము లన్నింటినుండియు విముక్తుడై అక్షయ్యలోకములను పొందును. జలమున, పానపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. శీతకాలమునందు మార్గమధ్యాదులందు ఆగ్నిని, కట్టెలను ఇచ్చువాడు తేజోయుక్తుడై స్వర్గమునందు దేవతా - గంధర్వాపరాదులచే సేవింపబడును. మృతతై ల లవణదానము చేసినవానికి అన్నియు లభించును. ఛత్ర - పాదుకా - కాషాదులను దానము చేసినవాడు స్వర్గములో సుఖముగ నివసించును. ప్రతిపదాది పుణ్యతిథులందును, విష్కంభాది యోగములందును, చైత్రాది మాసములందును, సంవత్సరారంభమునందును, అశ్విన్యాది నక్షత్రములందును, విష్ణు - శివ - బ్రహ్మలోక పాలాదుల నర్చించి చేసిన దానము మహాఫలప్రదము. వృక్ష - ఉద్యాన - భోజన - వాహవాదులను, పాదములకు మర్ధించుటకై తైలాదికమును ఇచ్చిన మానవుడు భుక్తిముక్తులను పొందును.
గోదాన - విద్యాదాన - భూదానములు మూడును సమానఫలములు. వేద విద్యాదానము చేసిన వాడు పాపరహితుడై బ్రహ్మలోకమునందు నివసించును. యోగ్యుడైన శిష్యునకు బ్రహ్మ జాన మిచ్చినవాడు సప్తద్వీపసమన్విత యగు భూమిని దానము చేసినట్లే. సకల ప్రాణులకును ఆయదానము చేసినవాడు సర్వమును, పొందగల్గును. పురాణమును గాని, మహాభారతమును గాని రామాయణమును గాని వ్రాసి ఆ పుస్తకము దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. వేదాది ములను నృత్యగీతములను నేర్పినవాడు స్వర్గము పొందును, ఉపాధ్యాయునకు వృత్తిని, విద్యార్థులకు భోజనమును ఏర్పరిచి నవాడు ధర్మ కామాది పురుషార్థముల రహస్యము తెలిసినవాడు; అతడు చేయని దాన మేమున్నది ? విద్యాదానము చేసినవాడు సహస్ర వాజపేయములను విధిపూర్వకముగ దానము చేయు ఒచే ఎట్టి ఫలము లభించునో అంతఫలమును పూర్తిగ పొందున. సందేహ మేమాత్రము లేదు. శివ - విష్ణు - సూర్యదేవాలయములలో గ్రంథ ప్రవచనము చేయువానికి సకలదానఫలములు లభించును. త్రిలోకములలో నున్న బ్రాహ్మణాది వర్ణములును, బ్రహ్మచర్యాది ఆశ్రమములును, బ్రహ్మాదిదేవగణములును విద్యాదానమునందు ప్రతిష్టితము లై యున్నవి. విద్యయే కామధేనువు; విద్యయే నేత్రము; గాంధర్వాద్యుపవేదములు దానము చేసినవాడు గంధర్వులతో కలిసి ఆనందించును. వేదాంగముల దానముచే స్వర్గమును పొందును. ధర్మశాస్త్రదాన ముచే ధర్మసంనిధి చేరి ఆనందించును. సిద్దాంతచరుల దానము చేసినవాడు నిస్సంశయముగ మోక్షమును పొందును. పుస్తకదానముచే పద్యాదాన ఫలము లభించును. ఆందుచే శాస్త్రపురాణముల దానము చేసినవాడు సర్వమును పొందును. శిష్యులకు శిక్షాదానము చేసినవాడు పౌండరీకయాగము చేసిన ఫలము పొందును.
జీవికా దానఫలము అనంతము. పితరులకు అక్షయలోకాచాప్తి కోరువాడు, ఈ లోకమునందు సర్వ శ్రేష్టము లైన వస్తువులను, తనకు ప్రియ మగు సకలపదార్థములను పితరుల నుద్దేశించి దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివదేవీగణే శాదుల పూజ చేసి ఆ పూజాద్రవ్యముల నన్నింటిని బ్రాహ్మణునకు దానము చేయువాడు. సర్వమును పొందగలడు. దేవా లయములను కట్టించువారును, దేవప్రతిమలు నిర్మించువారును సమ స్తమైన అభిలషిత వస్తువులను పొందగలరు. దేవాలయ ములలో తుడిచి కడుగు వాడు పాపరహితు డగును. దేవ ప్రతిమకు ఎదురుగ వివిరమండలముల నిర్మాణము చేయువాడు మండలాధిపతి యగును. దేవతలకు గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ప్రదక్షిణ - ఘంటా - ధ్వజ - వస్త్రా దులను సమర్పించుట చేతను, దేవతాదర్శనము చేతను, దేవతాసమక్షమున నాట్యగానములు చేయుటచేతను మనుష్యుడు భుక్తిని ముక్తిని కూడ పొండును. భగవంతునకు కస్తూరి, సింహలదేశీయచందనము, అగురు, కర్పూరము, ముస్తాది సుగంధద్రవ్యములు, విజయగుగ్గులు సమర్పించవలెను. సంక్రాంత్యాదిదినములందు ఒక ప్రస్థము నేతితో స్నానము చేయించువాడు అన్నియు పొందును. నూరుపలములతో స్నానము, ఇరువదియైదుపలములతో అభ్యంగము, వేయిపలములతోమహా స్నానము చేయించవలెను. భగవంతునకు జలస్నానము చేయించుటచే పది అపరాధములు, దుగ్ధ - దధులతో స్నానము చేయించుటచే సహస్రాపరాధములు, మృతస్నానము చేయించినచో వెయ్యి అపరాధములు వినష్టములగును. దేవతలను ఉద్దేశించి దాసదాసులను, అలంకారములను, భూమిని, గజాశ్వములను, సౌభాగ్యద్రవ్యములను సమర్పించువాడు దీరాయుర్యుక్తుడై స్వర్గలోకమును పొందును.
అగ్ని మహాపురాణమునందు నానాప్రకారదానమహిమవర్ణన మను రెండువందలపదకొండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 211 of the Agni Purāṇa is as follows:
Agni teaches the construction and worship of yantras as physical embodiments of mantra-śakti. The chapter describes the Śrī Yantra, Sudarśana Yantra, and Durgā Yantra, along with their respective nyāsa and āvaraṇa pūjā sequences. The materials prescribed for drawing yantras — red ochre on copper, turmeric on birch-bark — are given. Agni declares that a properly consecrated yantra continuously emits the śakti of the mantra even when the sādhaka is not actively engaged in japa.