అగ్ని మహా పురాణము

147 - అథ త్వరితాపూజాదిః.

పరమేశ్వరుడు పలికెను- ఓం గుహ్యకుబ్జికే.........నమః అను మూలోక మంత్రముచే గుహ్యకుబ్జకా జప పూజలు చేయవలెను. హీం సర్వజనక్షోభణి ......ఫట్ ఇడి (మూలోకము) నవాత్వరితా ముత్రము దానిని మాటి మాటికి జపించినచో విజయము నిచ్చును. హౌం సింహాయ నమః అను మంత్రముచే ఆసనపూజ చేసి దేవికి సిం హాసనము సమర్పించవలెను. హీం మే హృదయాయ నమః అని హృదయమును, వచ్చే శిర సే స్వాహా అని శిరస్సును స్పృశించ వలెను. త్వరీలామంత్ర శిరోన్యాసము పైవిధముగ చెప్పబడినది. హోం హ్రీం శిఖాయై వషట్ అని శిఖను మేం కవచాయ హుం అని భుజమున హ్రూం నేత్రతయాయనౌషట్ ఆని నేత్రద్వయమును, లలాటమధ్యభాగమును స్పృశించి హీం ఆస్తాయఫట్ అని చప్పట్లు కొట్టవలెను. హ్రీంకారి, ఖేచరి, చండ, ఛేదని, క్షోభణి, క్రియ, క్షేమకారి, హూంకారి, ఫట్ కారి-వీరు వ శక్తులు. ఇపుడు దూతికలను గూర్చి చెప్పెదను వీరందరిని పూర్వాది దిశ లందు పూజించవలెను. స్త్రీం వవే బ్రహ్మవేతాలి మధ్యే (ఆని మూలోక్తము దూతీమంత్రము). చరలత్వరిత గుహ్యాంగములను తత్త్వములను గూర్చి చెప్పే దను. హ్రాం హ్రూం హః హృదయాయనమః ఆని హృదయమునందు, హీం హ్రాం శిర సే స్వాహా' అని శిరస్సునందును ఫాం జ్వల జ్వల శిఖాయై వషట్ అని శియందును, ఇలే హ్రం హం కవచాయ హుం అని రెండు భుజములందును క్రోం మాం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ అని నేత్ర లలా: మధ్యములందును న్యాసము చేసి, క్ష అస్త్రాయ ఫట్ అని చప్పట్లు కొట్టవలెను. మధ్యభాగమున హ్రుం స్వాహా అని వ్రాసి, పూర్వావిదిక్కులందు ఖి సదాశివే వ ఈశ ఛ వునోన్మనీ, మ కే తార్య హీం మాధవః క్షా బ్రహ్మా హం ఆదిత్యః దారుణం ఫట్ అని వ్రాసి పూజ చేయవలెను. ఈ విధముగ ఎనిమిది దిక్కులందు పూజింపదగిన దేవతలను గూర్చి చెప్పబడినది.

ఆగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున త్వరితా పూజాదికమను నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.