యుధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని నేనయు కురు క్షేత్రమును చేరినవి. ఆర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయ డని తెలిసికొని, భగవంతు డైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. “నేనే పరబ్రహ్మను” అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.
ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా ఆర్జునుడు రథము పై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవులకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడిన కౌరవులు యుద్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దేవాసుర యుద్ధము వలె జరిగెను.
భీష్ముడు వది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. వదవ రోజున, ఆర్జునుడు వీరుడైన భీష్ముని పై బాణవర్షము కురిపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేమమువలే అస్త్రములను వర్షం చెను. పరస్పరము ప్రయోగించిన స్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేల పై కూలెను.
స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వస్తువులచేత పేరితు డై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై , విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తరాయణము నకై వేచి యుండెను.
దుర్యోధనుడు శోకార్తుడయ్యెను. అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున ధృష్టద్యుమ్నుడు నేనాపతి అయ్యెను.
వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణ డను మహాసముద్రమునందు విరాట ద్రుపదాదులు మునిగిపోయిరి.
హస్వశ్వరథపదాతులు గల దుర్యోధన నేన కూడ పాండవ సేనాపతి యైన ధృష్టద్యుమ్ను ని చేత (చంవ బడెను). ద్రోణుడు యుద్ధమునందు యముడు వలే కన్పట్టెను.
ఆశ్వత్థామ మరణించేను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని ఆతడు సర్వశత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్ను ని బాణములచే కొట్టబడి మరణించెను.
దుర్యోధనుడు “కార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగేను.
కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను.
శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ధ ఎవనము యుద్ధము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమ సేనుడు గదతో యుద్దము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదునెనిమిదవ దివసమున పడగొట్టెను.
మహాబలశాలియైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల నేను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను.
పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషికాస్త్రముచే ఆశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.
శ్రీ కృష్ణుడు అశ్వత్థామస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భస్థశిశువు పరీతిన్మహారాజు ఆయెను.
ఆ యుద్దమునుండి, కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయట పడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణుడు ఈ ఏడుగురు మాత్రమే. మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.
యుధిష్ఠిరుడు దుఃఖార్త లైన స్త్రీలను ఓదార్చి, భీమాదిన మేతుడై, మరణించిన వీరు లందరికిని పేత సంస్కా రములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారు డైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యేను. శత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను.
ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును ఆర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తును రాజ్యాధి షిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను.
అగ్ని మహాపురాణమునందు మహాభారతాఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 14 of the Agni Mahā Purana is as follows:
The chapter describes Bhagavān's descent as Buddha to delude the asura-s who had gained great power through rigorous Vedic practice. By teaching doctrines that led them away from the Veda-s and Vedic ritual, Bhagavān caused them to abandon their source of strength, allowing the gods to overcome them. This avatāra is presented as an act of compassion toward the world through a strategic delusion of the undeserving. The chapter then turns to the Kalki avatāra — Bhagavān's future descent at the end of the Kaliyuga, when he will appear on a white horse, sword in hand, to slay the wicked, restore dharma, and initiate the new Kṛtayuga. Kalki's birth lineage, weapons, and mission are described, closing the avatāra survey with a vision of cosmic renewal.