14 - మదనకామేశ్వరప్రాదుర్భావో నామ చతుర్దశోఽధ్యాయః

హయగ్రీవ ఉవాచ :

ఏతస్మిన్నేవ కా లేతు బ్రహ్మాలోకపితామహః

 అజగామాథ దేవేశీం ద్రష్టుకామో మహర్షిభిః

అజగామ తతో విష్ణురారూఢో వినతాసుతమ్

 శివోపి వృషమారూఢః సమాయాతో ఖిలేశ్వరీమ్

దేవర్షయో నారదాద్యాః సమాజగ్ముర్మహేశ్వరమ్

 ఆయయుస్తాం మహాదేవీం సర్వే చాప్సరసాం గణాః

విశ్వావసుప్రభృతయో గంధర్వాప యక్షకా

 బ్రహ్మణాథ సమాదిష్ణోవిశ్వ కర్మా విశాం పతిః

 చకార నగరం దివ్యం యథామరపురం తథా

 తతో భగవతీ దుర్గా సర్వమంత్రాధిదేవతా

 విద్యాధిదేవతా శ్యామా సమాజగతురంబీకామ్

 బాహ్యాద్యా మాతరశ్చైవ స్వస్వభూతగణావృతాః

 సిద్దయో హ్యణీమాద్యాశ్చ యోగిన్యశ్చైవ కోటిశు

 భైరపోః క్షేత్రపాలాశ్చ మహాశాస్తా గణాగ్రణీః

 మహాగణేశ్వరః స్కందో బటుకో వీరభద్రకః

 ఆగత్య తే మహాదేవీం తుష్టుపుః ప్రణతాః సదా

తత్రాథ నగరీం రమ్యాం సాప్రాకారతోరణామ్

గజాశ్వరథశాలాడ్యాం రాజవీధివిరాజితామ్

 సామంతానామమాత్యానాం సైనికానాం ద్విజన్మనామ్

వేతాలదాసదాసీనాం గృహాణి రుచిరాణి చ

 మధ్యం రాజగృహం దివ్యం ద్వారగోపురభూషితమ్

 శాలాభిర్బహుభిర్యుక్తం సభాభిరుపశోభితమ్

 సింహాసనసభాం చైవ నవరత్నమయీం శుభమ్

 మధ్యే సింహాసనం దివ్యం చింతామణీవినిర్మితమ్

స్వయంప్రకాశమద్వంద్వముదయాదిత్యసన్నిభమ్

 విలోక్య చింతయామాస బ్రహ్మలోక పితామహః

యస్త్వేతత్సమధిష్టాయ వర్తతే బాలిశోపివా

 పురస్యాస్య ప్రభాషణ సర్వలోకాధికో భవేత్

న కేవలా స్త్రీ రాజ్యారా పురుషోపి తయా వినా

 మంగలాచార్యసంయుక్తం మహాపురుషలక్షణమ్

అనుకూలాంగనాయుక్తమభిషించేదితి శ్రుతిః

విభాతీయం వరారోహా మూర్తి శృంగారదేవతా

వరో స్యాస్లీషు లోకేషు న చాన్యః శంకరాదృతే

జటిలో ముండధారీ చ విరూపాక్షః కపాలభృత్

 కల్మాడీ భస్మదిగ్ధంగః శ్మశానాస్థివిభూషణః

అమంగళాస్పదం చైనం వరయేత్సా సుమంగలా

 ఇతి చింతయమానస్య బ్రహ్మణోగ్రే మహేశ్వరః

కోటికందర్పలావణ్యయుక్తా దివ్యశరీరవాన్

దివ్యాంబరధరః స్రగ్వీ దివ్యగంధానులేపనః

కిరీటహారకేయూరకుండలాద్యైరలంకృతః

 ప్రాదుర్బభూవ పురతో జగన్మోహనరూపధృక్

తం కుమారమథాలింగ్య బ్రహ్మా లోకపితామహః

 చక్రే కామేశ్వరం నామ్నా కమనీయవపుర్ధరమ్

 తస్యాస్తు పరమాశక్తీరనురూపో వరస్త్వయమ్

 ఇతి నిశ్చిత్య తేనైవ సహితాస్తామథాయయుః

ఆస్తువంస్తే పరాం శక్తిం బ్రహ్మవిష్ణుమహ్వేరా

 తాం దృష్ట్వా మృగశావాక్షీ కుమారో నీలలోహితః

సాపీ తం వీక్ష్య తన్వంగీ మూర్తిమంతమివ స్మరమ్

 మదనావిష్టసర్వాంగీ స్వాత్మరూపమమన్యత

 అన్యోన్యాలోకనాసక్తా ధృతిమంతా మనస్వినౌ

సర్వభావవిశేష ధృతిమంతా మనస్వినౌ

 పరైరజ్ఞాతచారిత్రా ముహూర్తాస్వస్థచేతనే

 అథోవాచ మహాదేవం బ్రహ్మా లోకైకనాయికామ్

 ఇమే దేవాశ్చ ఋషయే గంధర్వాపురసాం గణాః

 త్వామీశాం ద్రష్టుమిచ్ఛంతి సప్రియాం పరమాహవే

 కో వా నురూప్తస్తే దేవి ప్రియో ధన్యతమః పుమాన్

లోకసంరక్షణార్థాయ భజస్వ పురుషం పరమ్

రాజ్ఞీ భవ పురస్యాస్య స్థితా భవ వరాసనే

అభిషిక్తాం మహాభాగైర్దేవర్షిభిరకల్మషైః

 సామ్రాజ్యచిహ్నసంయుక్తాం సర్వాభరణసంయుతామ్

 సప్రియామాసనగతాం ద్రష్టుమిచ్ఛామహే వయమ్

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే

మదనకామేశప్రాదుర్భావో నామ చతుర్దశోధ్యాయః

హయగ్రీవుడనెను. ఈ కాలములోనే లోకపితామహుడైన బ్రహ్మ మహర్షులతోగూడ నాదేవేశిని జూచుటకేతెంచెను-1. గరుడు నారోహించిన వాడై విష్ణువు సైతమేతెంచెను. వృషారూఢుడై యఖిలేశ్వరిని చూచుటకు శివుడు గూడ నేతెంచెను-2. నారదాది దేవర్పులు మహేశ్వరికడకు వచ్చిరి. అపురోగణములందరును ఆమెకడకు వచ్చిరి-3. విశ్వావసువు మొదలగు గంధర్వులు యక్షులును వచ్చిరి. బ్రహ్మచే ఆదేశింపబడి, వీశాంపతి (రాజైన) విశ్వకర్మ-4. దేవపురమువంటి దివ్యమైన నగరమును నిర్మించెను. తరువాత భగవతియై సర్వమంత్రములకధీ దేవతయైన దుర్గ-5. విద్యాధిదేవతయైన శ్యామయు అంబికకడకు వచ్చిరి. బ్రాహ్మీమొదలగు మాతృదేవతలును సర్వభూతగణములతో బాటు వచ్చిరి. (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి ఇంద్రాణి, చాముండ-వీరేడుగురు మాతృదేవతలు)-6. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము వశిత్వము-అనెడు ఎనిమిది సీదులు వచ్చినవి. అట్లే కోట్ల కొలది యోగినులు వచ్చిరి. భైరవులు, క్షేత్రపాలులు, గణాగ్రణియైన మహాశాస్త్ర-7, మహాగణేశ్వరుడు, స్కందుడు, బటుకుడు, వీరభద్రుడు-వీరందరూ వచ్చి నిత్యము దేవికి ప్రణుతులై స్తుతించిరి-8. అట్టి విశ్వకర్మ నిర్మించిన నగరి, రమ్యమైనది. బురుజులతోగూడి కోటగోడలతో తోరణములతో నొప్పినది. గజ-అశ్వరథముల శాలలతోనొప్పినది. రాజవీధులతో విరాజిల్లినది-9, అచట సామంతరాజులయు, అమాత్యులయు, సైనికులయు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వేతాలులయు దాస-డీసీజనములయు సుందరములైన యిండ్లుగలవు-10. మధ్యన ద్వారములతోను, గోపురములతోను భూషితమై దివ్యమైన రాజ గృహముగలదు. అనేకశాలలు బహంసభా భవనములును గలది-11. నవరత్నమయమైన సింహాసన సభ యున్నది. దానిమధ్యన చింతామణి వినిర్మితమై దివ్యమైన సింహాసనము గలదు-12. అదీ స్వయం ప్రకాశము దానివంటిది మరొకటి లేదు. ఉదయించిన సూర్యునివలె ప్రకాశించునది. దీనిని జూచి లోక పితామహుడైన బ్రహ్మాయిట్లు చింతింపసాగెను-13. దీనిని అజ్ఞానియైన బాలుడెక్కియుండినచో ఈ నగర ప్రభావమున వాడు సర్వలోకములకును అధికుడగును-14. కేవలమొక పెండ్లియాడని స్త్రీకాని, స్త్రీ లేని పురుషుడుగాని రాజ్యార్థులుగారు, మంగలాచారములతో గూడి మహాపురుష లక్షణములు గలిగి, అనుకూల స్త్రీతో నున్న వానినే రాజ్యమున నభిషేకింపవలెనని శ్రుతి చెప్పును-15. ఈ మహాదేవి ఉత్తమ స్త్రీగను, ఆకారము దాల్చిన శృంగారదేవతగను బ్రాకాశించుచున్నది. శంకరుడుదప్ప ఈమెకు దగిన వరుడు ముల్లోకములలోను లభింపడు-16. కాని శంకరుడు జడలుగలిగి, కపాలమాలను ధరించి, బేసికన్నులుగల వాడై (ముక్కంటియై), చిత్రవర్ణములుగలిగి, బూడిదబూసికొన్న సమస్త శరీరము గలవాడై, కాటియెముకల నలంకరించుకొన్న వాడైయుండును-17. ఈ విధముగా అమంగలములకు నెలవైన వానిని సుమంగళియైన యా మహాదేవి వరించునా? అనీ చింతించుచుండగనే యా బ్రహ్మయొక్కయెదుట మహేశ్వరుడు-18. కోటి మన్మథుల సౌందర్యము దివ్యశరీరము దీవ్యవస్త్రములను దివ్యమాలలను ధరించి, ధివ్యగంధములబూసికొని-19. కిరీటము, హారములు, భుజభూషణములు, కర్ణకుండలములు, మొదలగువానిచే నలంకరింపబడినవాడై జగన్మోహనరూపమును ధరించి (బ్రహ్మదేవునియెదుట) ఆవిర్భవించెను-20. ఆ కుమార స్వరూపియైన శంకరుని లోక పితామహుడైన బ్రహ్మ కౌగిలించుకొని యా సుందరశరీరధారీకి కామేశ్వరుడనీ నామధేయము జేసెను-21. ఆ పరాశక్తి కీతడనురూపుడైన వరుడని నిశ్చయించి యాతనితో గూడ దేవికడకు దేవతలందరుపోయిరి-22.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరాశక్తిని స్తుతించిరి. ఆ లేడిపిల్లకన్నుల వంటి కన్నులు గల మహాదేవిని జూచి కుమార శంకరుడు తన సమస్త క్రియలను మరచి మన్మథావిష్టుడయ్యెసు-23. సన్నని సుందరదేహముగల యా మహాదేవియు ఆకారముదాల్చిన మన్మథునివలెనున్న కుమారశంకరునీ జూచి మదనావిష్ణ సర్వాంగియై యాతని స్వాత్మరూపునిగా దలచెను. పరస్పరము బాగుగా చూచుకొనగోరి వారిరువును కామపీడితులైరి-24. సర్వభావ విశేషములనుదెలిసి, ధృతిమంతులై, మనస్వులై మనమును తమ వశమునందుందుచుకొన్నవారై) ఇతరులకు దెలియరాని చరిత్ర కలవారై (పరమాత్మ స్వరూపులై మనోవాగతీతులై) కూడా ముహూర్తకాలము కామవశులై యస్వస్థచేతనులైరి-25. ఈ తరువాత బ్రహ్మ లోకైకనాయికయైన మహాదేవితోనిట్లనెను. ఈ దేవతలు, ఋషులు, గంధర్వాపురోగణములును ఈశివైన నిన్ను పరమయుద్ధమున సప్రియను (ప్రియునీతో గూడినదానినిగా) జూడగోరుచున్నారు-26. ఓదేవి! నీకు ప్రియతముడైన యా ధన్యపురుషుడెవడు? లోకసంరక్షణములకు పరమపురుషుని బొందుము-27. ఈ పురమునకు రాణివగుము. ఈ శ్రేష్ట (సింహా)ఆసనమున గూర్చుండియుండుము. అపాపులై, మహాభాగ్యవంతులైన దేవరులచే నభిషేకింపబడి, సామ్రాజ్యచిహ్నముతోగూడి, సర్వాభరణభూషితవై, నీ ప్రియునితో గూడ సింహాసనమున గూర్చున్న దానినిగా నిన్ను మేము చూడగోరుచున్నాము-29.

ఇదిశ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున మదనకామేశప్రాదుర్భావమను పదునాల్గవయధ్యాయము.