బ్రహ్మాండ మహా పురాణము
11 - లలితోపాఖ్యానమున భండాసురప్రాదుర్భావమను ఏకాదశాధ్యాయము
అగస్త్య ఉవాచ :-
కథం భండాసురో జాతః కథం సా త్రిపురాంబికా ।
కథం బభంజ తం సంఖ్యే తత్సర్వం వద విస్తరాత్ ॥
హయగ్రీవ ఉవాచ :-
పురా దాక్షాయణీం త్యక్త్వా పితుర్యజ్ఞవినాశనమ్ (శినీమ్) ॥
ఆత్మానమాత్మనా పశ్యషజ్ఞానానందరసాత్మకః ।
ఉపాస్యమానో మునిభిరద్వంద్వగుణలక్షణః ॥
గంగాకూలే హిమవతః పర్యంతే ప్రవివేశ హ ।
సాపి శంకరమారాధ్య చిరకాలం మనస్వినీ ॥
యోగేన స్వాం తనుం త్యక్త్వా సువాసీఛీమభూభృతః ॥
స శైలో నారదాచుత్వా రుద్రాణీతి స్వకన్యకామ్ ।
తస్య శుశ్రూషణార్థాయ స్థాపయాయాస చాంతికే ॥
ఏతస్మిన్నంతరే దేవాస్తారకేణ హి పీడితాః ।
బ్రహ్మణోక్తాః సమాహూయ మదనం చేదమబ్రువన్ ॥
సర్గాదౌ భగవాన్ బ్రహ్మా సృజమానోఽఖిలాః ప్రజాః ।
న నిర్వతి రభూత్రస్య కదాచిదపి మానసే ॥
తపశ్చచార సుచిరం మనోవాక్కాయకర్మభిః ॥
తతః ప్రసన్నో భగవాన్ సలక్ష్మీకో జనార్ధనః ।
కరేణ చ్ఛందయామాస వరదః సర్వదేహినామ్ ॥
అగస్త్యుడనెను: భండాసురుడెట్లు జన్మించెను. త్రిపురాంబిక గూడ ఎట్లు జన్మించెను. ఆమె భండాసురునేవిధముగ జంపెను. విస్తరముగా జెప్పుము-1. హయగ్రీవుడనెను. పూర్వము తన తండ్రియజ్ఞమును వినశింపజేసిన దాక్షాయణిని వదిలి శివుడు ఆత్మలోనాత్మను జూచుచు, జ్ఞానానందరసస్వరూపుడై అద్వంద్వగుణలక్షణుడయ్యెను. అపుడు మునులాతనినుపాసించుచుండిరి-3. తరువాత హిమవత్పర్యంతమున గంగాతీరమునందు ప్రవేశించెను. ఆ దాక్షాయణియు చిరకాలము శంకరునారాధించి మనస్విని-4. యోగముతో తన శరీరమును జాలించి హిమవత్పర్వతరాజునకు కూతురుగానయ్యెను-5. ఆ హిమవంతుడును నారదునితో. నీకూతురు రుద్రుని భార్యయగునని విని రుద్రాణీయను తనకన్యకను రుద్రుని శుశ్రూషకై రుద్రుని కడనుంచెను-6. ఈ మధ్యన దేవతలు తారకాసురునిచే పీడింపబడిరని బ్రహ్మ వారికి జెప్పగా దేవతలు మన్మథుని బిలిచి యిట్లనిరీ-7. సృష్టికి మొదట, సమస్త ప్రజలను సృష్టించుచున్నను బ్రహ్మకు మనమున తృప్తి కలుగలేదు. మనోవాక్కాయకర్మలతో తపమాచరించెను-8. అంత, భగవంతుడైన జనార్దనుడు (విష్ణువు) సర్వప్రాణులకు వరము లిచ్చువాడు లక్ష్మీదేవితో ప్రసన్నుడయ్యెను. వరమును గోరుకొమ్మనెను-9.
బ్రహ్మోవాచ :-
యదీ తుష్టో సి భగవన్ననాయాసేన వై జగత్ ।
చరాచరయుతం చైతత్సృజామి త్వత్చసాదతః ॥
ఏవముక్తో వీధాత్రా తు మహాలక్ష్మీముదైక్షత ।
తదా ప్రాదురభూస్వం హి జగన్మోహనరూపధృక ।
తవాయుధార్థం దత్తం చ పుష్పబాణేక్షుకార్ముకమ్ ।
విజయత్వమజేయత్వం ప్రాదాత్రముదితో హరిః ॥
అసౌ సృజతి భూతాని కారణేన స్వకర్మణా ।
సాక్షిభూతః స్వజనతో భవాన్ భజతు నిర్వతిమ్ ॥
ఏష దత్తవరో బ్రహ్మా త్వయి విన్యస్య తద్భరమ్ ।
మనసో నిరృతిం ప్రాప్య వర్తతేద్యాపి మన్మథ ॥
అమోఘం బలవీర్యం తేన తే మోఘః పరాక్రమః ॥
సుకుమారాణ్యమోఘాని కుసుమాస్త్రాణి తే సదా ।
బ్రహ్మదత్తవరోలియం హి తారకో నామ దానవః ॥
బొధతే సకలాంల్లోకొనస్మానపి విశేషతః ।
శివపుత్రాదృతేఽన్యత్ర న భయం తస్య విద్యతే ॥
త్వాం వినాస్మిన్మహాకార్యే న కశ్చిత్పవదేదపి ।
స్వకరాచ్చ భవేత్కార్యం భవతో సాన్యతః క్వచిత్ ॥
ఆత్మైక్యధ్యాననిరతః శివో గౌర్యా సమన్వితః ।
హిమాచలతలే రమ్యే వర్తతేమునిభిర్వతః ॥
తం నియోజయ గౌర్యాం తు జనీష్యతి చ తత్సుతః ।
ఈషత్కార్యమిదం కృత్వా త్రాయస్వాస్మాన్మహాబల ॥
బ్రహ్మయనెను : ఓ భగవన్ హరీ! నీవీ నా సృష్టితో సంతుష్టిజెందీతి వేని, నీయనుగ్రహమున నిరాయాసముగనే చరాచరమైన జగమునంతయు సృజించెదను-అని బ్రహ్మయనగా విష్ణువు లక్ష్మీదేవిని జూచెను. అపుడు (మన్మథుడు) జగన్మోహన రూపముతో జనించెను-11. సంతుష్టుడైన హరి యాతనికాయుధముగా పుష్పబాణములను చెరకువిల్లును విజయత్వమును అజేయత్వమును ప్రసాదించెను12. స్వకర్మకారణముగా ఈ మన్మధుడు ప్రాణులను సృజించును. సాక్షిపై యో బ్రహ్మా నీవు స్వజనముతో సుఖముండుము. -13. ఈ విధముగా వరమీయబడిన బ్రహ్మ నీయందు (మన్మధునీయందు) ఆ సృష్టిభారముంచీ మానసికముగా బ్రహ్మ యిప్పటికీని సుఖసంతోషములతో నుంటున్నాడు-14. కావున ఓ మన్మథా! నీ బలవీర్యము వ్యర్థముగానిది. నీ పరాక్రమము గూడ వ్యర్థముగానిదీ-15. సుకుమారములైన నీ పుష్పబాణములు గూడ నెల్లప్పుడును, వ్యర్థముగానివే! ఇక బ్రహ్మదత్తవరుడైన యీ తారకుడను రాక్షసుడు -16. సకలలోకములను విశ్లేషించి మమ్ములను సైతము బోధించుచున్నాడు.. శివపుత్రునివల్ల, దప్పమరెవ్వరి నుండియు నాతనికి భయము లేదు-17. నీవు దప్ప నీ పనిలో మరొకడు మాటాడలేడు. నీకు నీస్వహస్తముననే యాకార్యము నెరవేరును. మతెచ్చుట నుండియుగాదు-18. ప్రస్తుతము రమ్యమైన హిమాచలముపైన మునులా వరించి యుండగా శివుడు ఆత్మైక్యధ్యాననిరతుడైయున్నాడు. గౌరితో గూడనున్నాడు-19. కావుననీబాణ ప్రభావమున శివుని గౌరీయందు నియోగింపుము.. దాని వలన వారికి పుత్రుడు గలుగును. ఈ చీన్నీకార్యమును జేసి ఓ మహాబలా! మన్మథా! మమ్ముల (దేవతల)గాపాడుము-20.
ఏవమభ్యర్థితో దేవైః స్తూయమానో ముహుర్మహుః ।
జగామాత్మవినాశాయ యతో హిమవతస్తటమ్ ॥
కిమప్యారాధయంతం తు ధ్యానసమ్మీలితేక్షణమ్ ।
దదర్మేశానమాసీనం కుసుమేషురుదోయుధః ॥
ఏతస్మిన్నంతరే తత్ర హిమవత్తనయా శివమ్ ।
ఆరిరాధయిషుశ్చాగాడి భాణా రూపమద్భుతమ్ ॥
సమేత్య శంభుం గిరిజాం గంధపుష్పోపహారకైః ।
శశూషణపరాం తత్ర దదర్శాతీబలః స్మరః ॥
అదృశ్యః సర్వభూతానాం నాతిదూరేఽస్య సంస్థితః ।
సుమనోమారడైరగ్రేస్స విద్యాధ మహేశ్వరమ్ ॥
విస్మృత్య స పా కార్యాణి బాణవిదోంఽతికే స్థితామ్ ।
గౌరీం విలోకయామాస మన్మథావిష్టచేతనః ॥
ధృతిమాలంబ్య తు పునః కిమేతదితీ చింతయన్ ।
దధర్మాగ్రే తు సన్నద్ధం మన్మథం కుసుమాయుధమ్ ॥
తం దృష్ట్వా కుపీతః శూలీ త్రైలోక్యదహనక్షమః ।
తార్తీయం చక్షురున్మీల్య దదాహ మకరధ్వజమ్ ॥
శివేనైవమవజ్ఞాతా దుఃఖితా శైలకన్యకా ।
అనుజ్ఞయా తతః పిత్రోస్తపః కర్తుమగద్వనమ్ ॥
అథ తద్భస్మ సంవీక్ష్య చిత్రకర్మా గణేశ్వరః ।
తద్భస్మనా తు పురుషం చిత్రాకారం చకార సః ॥
తం విచిత్రతనుం రుద్రో దదర్శాల్లే తు పూరుషమ్ ।
తత్క్షణాజ్ఞాతజీవోఽభూన్మూర్తిమానివ మన్మథః ॥
మహాబలోఽతితేజస్వీ మధ్యాహ్నానసమప్రభః ॥
తం చిత్రకర్మా భాహుభ్యాం సమాలింగ్య ముదాన్వితః ।
స్తుపా బాల మహాదేవం స తు సర్వార్థసిద్దిదః ॥
ఇత్యుక్త్వా శతరుద్రీయముపాదిశదమేయధీః ।
ననామ శతశో రుద్రం శతరుద్రీయమాజపన్ ॥
తతః ప్రసన్నో భగవాన్ మహాదేవో వృషధ్వజః ।
వరేణ చ్ఛందయామాస వరం ఇవ్ర స బాలకః ॥
ప్రతిద్వంద్వబలార్ధం తు మద్బలేనోపయోక్ష్యతి ।
తదస్త్రశస్త్రముఖ్యాని వృధా కుర్వంతు నో మమ ॥
తథేతి తత్పతిశ్రుత వీచార్య కిమపి ప్రభుః ।
షష్టివర్షసహస్రాణి రాజ్యమస్మై దదౌ పునః ॥
ఏతద్దృష్ట్వా తు చరితం ధాతా భండితి భండితి ।
యదువాచ తతో నామ్నా థండో లోకేషు కథ్యతే ॥
ఇతి దత్త్వా వరం తస్మై సర్వైర్మునిగజైరృతః ।
దత్త్వాఽస్త్రాణి చ శస్రాణి తలైవాంతరధాచ్చ సః ॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే భండాసురప్రాదుర్భావో నామైకాదశోఽధ్యాయః ॥
ఈ విధముగా దేవతలభ్యర్థింపగా వారిచేత పొగడబడుచు మన్మథుడు తన వినాశనమునకు హిమాలయతటమునకు బోయెను-21. ఏమియో ఆరాధించుచున్నవాడు ధ్యానమువలన మూసిన కన్నులు గలవాడు, కూర్చున్న వాడునైన యీశ్వరుని జూచి తన యాయుధమైన. పూవిల్లునెక్కుపెట్టెను-22. ఇంతలో హిమవంతుని కూతురు, అద్భుత రూపధారిటీయై పుష్పోపహారములతో బూజింపదలచి శివునికడకు వచ్చెను. శివుని సేవించుటలో మునిగిన యాపార్వతిని అతి బలుడైన మన్మధుడు జూచెను-24. సర్వప్రాణులకుగనబడకుండ శివునకు సమీపముననే యుండి మన్మథుడు తన శ్రేష్ఠములై (వాడియైన) పుష్పబాణములను మహేశ్వరుని గ్రుచ్చుకొనునట్లు ప్రయోగించెను-25. పుష్పబాణములు గ్రుచ్చిన శివుడు తన కార్యములను విస్మరించి మన్మథావిష్టమతయై గౌరిని జూడసాగెను. ఇదియేమీ వైపరీత్యమని యాలోచించి మరల ధైర్యమును వహించి (ఇంద్రియ చాపల్యమునరికట్టి) యెదుట కుసుమాయుధుడై సన్నద్ధుడైన మన్మథుని జూచెను-27. అతనిని చూచి శూలియైన శివుడు కోపించి ముల్లోకముల దహింపసమర్థమైన మూడవ కన్ను దెఱచి మకరధ్వజుడైన మన్మథుని దహించివైచెను-28. ఈ విధముగా శ్రీవునిచే తిరస్కరింపబడి దుఃఖించిన శైలరాజ పుత్రి తనతల్లిదండ్రులయనుమతినిటోంది తపముచేయుటకై వనము జేరెను-29. ఆ తరువాత ఆ మదన భస్మను జూచి చిత్రకర్ముడైన గణేశ్వరుడు ఆభస్మతో చిత్రాకారము గల పురుషుని సిద్దము - జేసెను ఆ విచిత్ర శరీరముగల పురుషుని రుద్రుడు తనయెదుటచూచెను. ఆ క్షణముననే యాతడు ఆకారముదాల్చిన మన్మథుని వలె ప్రాణము గలిగినవాడు (జాతజీవుడు) అయ్యెసు, ఆతడు మహాబలుడును, అతి తేజస్వీయును, సూర్యసమకాంతిగలవాడును నయ్యెను-31. చిత్రకర్మమైన గణేశుడు బాహువులతోనా పురుషుని కౌగిలించుకొని సంతసించెను. ఆ పురుష బాలకునకు-“మహాదేవుని స్తుతించుము. అతడు సర్వార్థ సిద్ధులనొసగువాడు”-32. అని చెప్పెను. ఇంత అంత అని చెప్పనలవి కాని బుద్దీగల గణేశుడు శతరుద్రీయమును ‘ఉపదేశించెను’. ఆబాలుడును శతరుద్రీయమును పూర్ణముగా జపించుచు నూర్లమారులు రుద్రునకు నమస్కరించేను-33. దానితో ప్రసన్నుడైన భగవంతుడగు మహాదేవుడు, వృషధ్వజుడునైన శివుడు బాలుని వరము గోరుకొమ్మనెను. ఆతడు శత్రుబల ప్రయోజనము నా బలముననుపయోగింపక నెరవేరకుండుగాక శత్రువు యొక్క సగము బలము నాలోజేరి, శత్రువునకుపయోగింపకుండుగాక కావున శత్రువు యొక్క ఆయస్త్ర శస్త్రములు మొదలగునవి వ్యర్థమగుగాక-కాని నా యస్త్రశస్త్రములు మొదలగునవి యట్లు వ్యర్థముగాకుండుగాక-35. అని వరమును గోరేను, అట్లేయని ప్రతిజ్ఞ చేసి, ఏదో ఆలోచించి ప్రభువైన శివుడు ఈతనికి అరువదివేలయేండ్ల వరకు మరల రాజ్యమునను గ్రహించెను-36. ఈ చరితమును జూచి బ్రహ్మ “భండ్ భండ్” అనియనెను. ఆ నామముతోనే యా పురుషుడు లోకములందు “భండుడు” అని చెప్పబడును-37. అని, వరములనిచ్చి ఆస్త్రములను శస్త్రములను ఇచ్చి మునిగణములతో సవరింపబడినవాడై యంతార్థనమందేను-38.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున ఉత్తరభాగమున లలితోపాఖ్యానమున భండాసురప్రాదుర్భావమను పదునొకండవయధ్యాయము -11.
Summary of chapter 123 of the Brahmānda Mahā Purana is as follows:
Expanding upon the divine city, this chapter systematically describes the various concentric walls of gold, precious gems, and mystical metals surrounding Śrīnagara. Each enclosure is guarded by radiant Sakti deities and embodies specific spiritual powers, virtues, and cosmic principles. The devoted seeker meditates upon these sacred layers, recognizing them as progressive steps of inner spiritual purification leading directly to the lotus feet of the supreme mother.