5 - లలితోపాఖ్యానము ప్రారంభము – అగస్త్య యాత్రా జనార్దనావిర్భావము

నాలుగు భుజములు, చంద్ర కళాభూషణము, ఉన్నత కుచములు, కుంకుమరాగ శోణిమ (ఎరుపుదనము) గలిగి పుండ్రేక్షువు (శ్రేష్టమైన చెరకుగడ) పాశము, అంకుశము, పుష్పబాణము - ఇవి నాలుగు హస్తములందుగల. ఓ జగత్తునకు ఏకైక మాతయైన లలితాంబా! నీకు నమస్కారము-1. అది శివుని వామాంగమున సుందరమైన వస్తువు. దానివల్లనే విద్వాంసుల మూడవది యావిష్కరించినది. ఆ మూడవదే పరమమైన తేజము-2. అగస్త్యుడను దేవర్షి కలడు. ఆతడు వేదవేదాంగపారగుడు, సర్వసిద్ధాన్తసారముల దెలిసినవాడు,  బ్రహ్మానందరసమే యాత్మగా గలవాడు-3.

చచారాద్భుత హేతూని తీర్ధాన్యాయతనాని చ

శైలారణ్యాపగాముఖ్యాన్సర్వాఃనపదానపి

తేషు తేష్వభిలాజంతూనజ్ఞానతిమిరావృతాన్

శిశ్నోదరపరాన్జప్త్వా చిన్తయామాస తాన్ ప్రతి

తస్య చింతయమానస్య చరతో వసుధామిమామ్

ప్రాప్తమాసీన్మహాపుణ్యం కాజీనగరముత్తమమ్

తత్ర పోరణ శైలేంద్రమేకామ్రనిలయం శివమ్

కామాక్షీం కలిదోషమ్నీమపూజయదధాత్మవాన్

ఆతడు మహాద్భుతములకు కారణములైన తీర్థములు, స్థానములు. (దేవస్థానములు), శైలములు, అరణ్యములు, నదులు మొదలగువానిని, సమస్త దేశములను సంచరించేను -4. అయా ప్రదేశములలోని ప్రాణులు అజ్ఞానాంధకారమున జుట్టబడినవారు. శిశ్నోదర (మైథున-భోజనములందు) పరాయణులు. ఇట్టివారీని చూచి యగస్త్యుడు. వారిని గూర్చి చింతపసాగెను-5. ఆ విధముగా చింతించుచు నీభూమిని సంచరించు నగస్త్యునకు కాంచీపురము ఘటించినది. ఆ కాంచీ నగరము మహాపుణ్యమైన యుత్తమ నగరము-6. అట శుద్దాత్ముడై యగస్త్యుడు వారణ శైలేంద్రమును (ఏనుగువంటి, పర్వత శ్రేష్ఠమును) ఏకామ్ర వృక్ష స్థలముననున్న శివుని (ఏకామేశ్వరుని) కలిదోషముల నశింపజేయు కామాక్షీదేవిని పూజించెను-7.

లోక హేతోర్ధయార్ధస్య ధీమతశ్చిత్తనో ముహుః

చిరకాలేన తపసా తోషితో ఽభూజనార్దనః

హయగ్రీవాం తనుం కృత్వా సాక్షాచ్చిన్మాత్రవిగ్రహమ్

శంఖచక్రాక్షవలయపుస్తకోజ్వలబాహంకామ్

పూరయిత్రీం జగత్కృత్నం ప్రభయా దేహజాతయా

ప్రాదుర్బభూవ పురతో మునేరమితతేజసా

తం దృష్ట్వానన్దభరితః ప్రణమ్య చ ముహుర్ముహుః

వినయానవతో భూత్వా సంతుషావ జగత్పతిమ్

అథోవాచ జగన్నాథస్తుష్టోస్మి తపసా తమ

వరం వరయ భద్రం తే భవితా భూసురోత్తమః

ఇతి పృష్ణో భగవతా ప్రోపోచ మునిసత్తమః

యది తుష్టోఽసి భగవన్నీమే పామరజస్తవః

కేనోపాయేన ముక్తాః స్యురేతన్మే వస్తు మర్హసి

ఇతి పృష్టో ద్విజేనాథ దేవదేవో జనార్దనః

ఏష ఏవ పురా ప్రశ్నః శివేన చరితో మమ

అయమేవ కృతః ప్రశ్నో బ్రహ్మణా తు తతః పరమ్

కృతో దుర్వాసని పశ్చాద్భవతా తు తతః పరమ్

లోక కారణుడును, దయార్ధుడును, మహాధీశాలియును, మాటిమాటికి ధ్యానించువాడును, అయిన యగస్త్యుని యొక్క తపస్సుచే జనార్దనుడైన విష్ణువు సంతసించెను-8. హయగ్రీవాకారము వహించి అమితమైన తేజముతో యగస్త్యుని యెదుట సాక్షాత్కరించెను. ఆ హయగ్రీవాకారము కన్నులయెదుట మూర్తీభవించిన కేవలం చిన్నయ రూపము, శంఖము, చక్రము, అక్షవలయము. . (జపమాల) . పుస్తకము-వీనిని ధరించుటచే నుజ్జ్వలమైన (ఉన్నతముగా ప్రకాశించిన) నాలుగు బాహువులు గలది. తన దేహమునుండి బుట్టిన కాంతితో జగమునంతయు నింపుచున్నది-10. ఆ హయగ్రీవుని జూచి యానంద భరితుడై మాటిమాటికి నమస్కరించి వినయ వినమ్రుడై యాజగత్పతిని స్తుతించెను -11, ఆ తరువాత జగన్నాథుడు - నీ తపమునకు సంతసించితిని. వరమును గోరుకొనుము. నీకు క్షేమము గలుగును. అనియనేసు-12 ఈ విధముగా నడుగబడి. యాముని సత్తముడు ఈ విధముగాననెను. ఓ భగవంతుడా! నీవు సంతసించినచో, ఈ పామర ప్రజలందరు ఏయుపాయమున ముక్తులగుదురో, దీనిని మాకు జెప్పుము - అని మునిచే నడుగబడిన దేవదేవుడైన జనార్దనుడు ఇట్లనెను -14. ఈ ప్రశ్నమునే పూర్వము శివుడడిగెను. ఆ తరువాత నీ ప్రశ్నమునే బ్రహ్మయడిగెను. తరువాత దుర్వాసుడడిగెను. ఆ తరువాత నీ వడిగితివి-16.

భవద్భిః సర్వభూతానాం గురుభూతైర్మహాత్మభిః

మమోపదేశో లోకేషు ప్రథితోఽస్తు వరో మమ

అహమాదిర్షి భూతానామాటికర్తా స్వయం ప్రభుః

సృష్టిస్థితిలయానాం తు సర్వేషామపి కారకః

త్రిమూర్తి స్త్రీగుణాతీతో గుణహీనో గుణాశ్రయః

ఇచ్ఛావిహారో భూతాత్మా ప్రధానపురుషాత్మకః

ఏవం భూతస్య మే బ్రహ్మంస్త్రిజగద్రూపధారిణః

ద్విధాకృతమభూద్రూపం ప్రధానపురుషాత్మకమ్

మమ ప్రధానం యద్రూపం సర్వలోకగుణాత్మకమ్

అపరం యద్గుణాతీతం పరాత్పరతరం మహత్

ఏవమేవ తయోర్హాత్వా ముచ్యతే తే ఉజే కిము

తపోభిశ్చిరకాలోతైః యమైశ్చనీయమైరపి

త్యాగైర్దుష్కర్మనాశాంతే ముక్తిరాశ్వేవ లభ్యతే

యద్రూపం యద్గుణయుతం తద్గుణెక్యేన లభ్యతే

అన్యత్సర్వజగద్రూపం కర్మభోగపరాక్రమమ్

కర్మభిర్లిప్యతే తచ్చ తత్యాగేనాపి లభ్యతే

దుస్తరస్తు తయోస్త్యాగః సకలైరపి తాపస

అనపాయం చ సుగమం సదసత్కర్మగోచరమ్

ఆత్మస్థీన గుణేనైవ సతా చాప్యసతాపీ వా

ఆత్మైక్యైనైవ యజ్జ్ఞానం సర్వసిద్ధిప్రదాయకమ్

వర్ణత్రయవిహీనానాం పాపిష్టానాం నృణామపి

యద్రూపధ్యానమాత్రేణ దుష్కృతం సుకృతాయతే

యేఽర్చయంతి పరాం శక్తిం విధినాఽవిధినా పి వా

న తే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయః

శీవో వా యాం సమారాధ్య ధ్యానయోగంలేన చ

ఈశ్వరః సర్వసిద్ధనామర్ధనారీశ్వరోఽభవత్

అన్యేఽబ్జ ప్రముఖా దేవాః సిద్దాస్తద్ద్యానవైభవాత్

తస్మాదశేషలోకానాం త్రిపురారాధనం వినాః

న స్తో భోగాపవర్గా తు యాగపద్యేన కుత్రచిత్

తన్మనాన్తర్గతప్రాణస్తద్యాజీ తద్గతేహకః

తాదాత్మ్యేనైవ కర్మాణి కుర్వన్ముక్తిమ వాప్స్యసి

ఏతద్రహస్యమామ్నాతం సర్వేషాం హితకామ్యయా

సస్తుషేనైన తపసా భవతో మునిసత్తమ

దేవాశ్చ మునయః సిద్దా మానుషాశ్చ తథాఽపదే

త్వన్ముఖాంభోజతోఽ వా ష్య సిద్ధిం యాంతు పరాత్పరామ్

సర్వప్రాణులకు గురుభూతులై మహాత్ములైన మీచేత నాయుపదేశము లోకములందు ప్రసిద్ధిగాంచుగాత. ఇది నా వరము-17. నేను భూతములకాదని, భూతములకాదికర్తను, నేను స్వయముగా ప్రభువును సృష్టిస్థితి లయలకును అన్నింటికీని కారకుడను-18. త్రిమూర్తి (స్వరూపుడను)నీ, సత్త్వరజస్తమో గుణముల కతీతుడను. నిర్గుణుడను, గుణములకాశ్రయమైన వానినీ-19 స్వేచ్ఛగా విహరించువానిని, భూతములకాత్మను, ప్రధాన- పురుషాత్మకుడను ఓబ్రహ్మస్వరూపుడవైన అగస్త్యమునికి ఇటువంటి శ్రీజగద్రూపధారినైన నా యొక్క రూపము ప్రధానము- పురుషుడు అని రెండు విధములయ్యెను. నా ప్రధాన మను రూపము సర్వలోక గుణాత్మకము-21 తక్కిన గుణాతీతమైన రూపము పరమునకంటెను పరతరమైనది. మహత్తైనది. ఈ విధముగా రెంటి యొక్క స్వరూపములను దెలిసి ఈ రెంటిని వదిలిపెట్టును-22. చిరకాల తపస్సుల చేత, యమ నీయముల చేతను, త్యాగముల చేతను, దుష్కర్మలు నశించిన తరువాత ముక్తి తొందరగనే లభించును-23. ఏ రూపము ఏగుణముతో గూడియున్నదో అదీ గుణీయొక్క యొక్యముతో లభించును. తక్కినది సమస్త జగద్రూపము కర్మభోగము యొక్క పరాక్రమము (ఫలితము)-24 అదీ కర్మలనంటియుండును. అది కర్మల పదిలీనను (సదసత్కర్మల - వదిలినను) ఈ వరకు జేసిన సద సత్కర్మల ఫలితము లభించుచునే యుండును. ఓ తాపస! ఎవ్వరికైనను ఆ రెంటిని (సదసత్కర్మ ఫలములను) వదలుట దుస్తరము-25. సదసత్కర్మ గోచరమైన ఫలము వీడనిదీ, సులభముగా బొందునది-26. సద సద్గుణములాత్మస్థములై వీడవు, తత్పలితములనవశ్యమనుభవింపచేయును. ఆత్మైక్యముగా గలిగిన సర్వసిద్ధులనొసంగును-27. బ్రహ్మక్షత్రియులకన్న తక్కువై పాపిష్టులైన నరులకు గూడ ఏరూపమును ధ్యానించినంత మాత్రమున దుష్కృతము గూడ సుకృతముగా మారునో అది పరాశక్తి రూపము-28. విధి విధానముతోగానీ, వీధి విధానములవదలిగానీ పరాశక్తి నర్చించిన వారు సంసారులు సంసారులుగారు, నిశ్చయముగా వారు ముక్తులే. సంశయము లేదు -29, శివుడు గూడ నామెను ధ్యానయోగ బలముతో సమారాధించి సర్వసిద్దులకీశ్వరుడై యర్ధనారీశ్వరుడయ్యెను-30. ఆ పరాశక్తి ధ్యానవైభవమున బ్రహ్మ మొదలగు దేవతలు సీదులైరి. కావున సమస్తలోకులకు త్రిపురాశక్త్యారాధనము లేక యెక్కడనైనను ఒక్కమారుగా భోగా పవర్గములు భోగమోక్షములు లేవు. కావున పరాశక్తి మనస్కుడవై, పరాశక్తి గత ప్రాణుడవై, పరాశక్తిని యజించు (పూజించు) వాడవై, కోరికలన్నింటిని నామె. యందే. నిలిపినవాడవై-32 పరాశక్త్యాత్మలో సమస్త కర్మలజేయుచు ముక్తిని బొందగలవు. మునిశ్రేష్ఠ నీ తపమునకు సంతసించి అందరి హితమును గోరి యిరహస్యము జెప్పబడినది. దేవతలు మునులు, సిద్ధులు, మానుషులు, ఇతరులును నీముఖ కమలము నుండి యీ పరాశక్తి. రహస్యమును బొంది పరాత్పరమైన . సిద్ధిని బొందుదురుగాక-34

ఇతి తస్య వచః శ్రుత్వా హయగ్రీవస్య శార్ఞిణః

ప్రణీపత్య పునర్వాక్యమువాచ మధుసూదనమ్

భగవన్ దృశం రూపం భవతా యత్పురోదితమ్

కింహారం కింప్రభావమేతన్మే వస్తుమర్హసి

హయగ్రీవ ఉవాచ :-

ఏ హోంఽశతో దేవర్షే హయగ్రీవో మమాపరః

శ్రోతుమిచ్ఛసి యద్యత్వం తత్సర్వం వస్తుమర్హతి

ఇత్యాదిశ్య జగన్నాథ్ హయగ్రీవం తపోధనమ్

పురతః కుంభజాతస్య మునేరంతరధాద్దరిః

తతస్తు విస్మయావిష్ణో హృష్టరోమా తపోధనః

హయగ్రీవేజ మునినా స్వాశ్రమం ప్రత్యపద్యత

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే ఉత్తర భాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే అగస్త్యయాత్రా-జనార్ధనావిర్భావో నామ పఞ్చమోధ్యాయః

విష్ణు రూపుడైన హయగ్రీవుడు చెప్పిన పై వాక్యములను వినీ నమస్కరించి యగస్త్యముని ఆ మధుసూదనునితో నిట్లనెను-35. ఓ భగవన్! నీవు పూర్వము జెప్పినది యెట్టి రూపము? ఎట్టి విహారములు గలది? ఎట్టి ప్రభావము గలది? - ఇది యంతయు మాకుజెప్పుము-36. హయగ్రీవుడనేను: - ఓ దేవర్షివైన అగస్త్యమునీ! ఈ హయగ్రీవరూపము సాయంశరూపమైన నా వేరొక రూపము. కావున నీవు వినదలచినదంతయు జెప్పగలది. అని జగన్నాథుడైన మహా విష్ణువు తపోధనుడైన హయగ్రీవుని నాదేశించి యగస్త్యముని యెదుటనే యంతర్ధానమొందెను-38. తరువాత ఆశ్చర్యము జెంది యగస్త్యుడు పులకిత గాత్రుడయ్యెను. హయగ్రీవ మునీతో స్వాశ్రమమును జేరెను-39.

ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాద రూపమైన లలితోపాఖ్యానము అగస్తయాత్రా జనార్ధనావిర్భావమును అను పంచమాధ్యాయము -5