నారద మహా పురాణము - పూర్వార్థము
114 - ద్వాదశమాసస్థపంచమివ్రత నిరూపణమ్
సనాతన మహర్షి పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు నీకు పంచమి వ్రతములను. చెప్పెదను వినుము. ఈ వ్రతములను భక్తితో ఆచరించిన వారు అన్ని వాంఛితములను పొందగలరు. చైత్ర శుద్ధ పంచమిని మత్స్య జయన్తి అందురు. ఈ దినమున భక్తులు మహోత్సవముగా మత్స్యావతార పూజను చేయవలయును. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అందురు. ఈ దినమున శ్రీ అర్చన చేయవలయును. గంధాది ఉపచారములచే పాయసాదులనైవేద్యములచే లక్ష్మీదేవిని పూజించువానిని లక్ష్మీదేవి విడిచి పెట్టదు. అట్లే పృథ్వీ వ్రతమును, చాంద్ర వ్రతమును, హయగ్రీవ వ్రతమును ఆయా వ్రత విధానములచే ఆయా సిద్దులను కోరువారు ఆచరించవలయును. ఇక వైశాఖ శుద్ధ పంచమినాడు ఆదిశేషుని పూజించి అభీష్ట ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధ పంచమినాడు పితృదేవతలను పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టినచో సర్వకామ ఫలములను పొందగలుగును. ఆషాఢ శుద్ధ పంచమిన సర్వవ్యాపియగు వాయుదేవుని, గ్రామము నుండి వెలుపలకు వచ్చి భూమి మీద కూర్చుని వంశదండాగ్రమున పంచవర్ణములు గల ధ్వజము నేర్పరచి, మధ్య భాగమున పద్మమును కల్పించి, ఆ మూల దేశమున, అన్ని దిక్కులయందు, లోకపాలకులను పూజించి, వాయు పరీక్షణమును చేయవలయును. ప్రథమాది యామములలో యే యే వాయువు వచ్చునో ఆయా దిక్పతులకు పూజను గావించవలయును. ఇట్లు అచట నిరాహారముగా నాలుగు రూములుండి, సాయంకాలమున స్వగృహమునకు వచ్చి సావధానముతో స్వల్పముగా భుజించి, లోకపాలకులకు నమస్కరించి, పవిత్రమగు భూమిపై పరుండవలయును. ఆ రాత్రి నాలుగవ ఝామున వచ్చిన స్వప్నమే నిజమగునని శివుడు చెప్పెను. అశుభ స్వప్నము వచ్చినచో శివపూజను గావించుచు యెనిమిది ఝాములుకాని ఆదినము మొత్తముకాని గడుప వలయును. యెనిమిది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి శుభములను పొందవచ్చును. ఈ వ్రతము శుభాశుభములకు నిదర్శనముగా చెప్పబడినది. ఇహపరలోకములలో మానవులకు సౌభాగ్యజనకము. శ్రావణబహుళపంచమినాడు చేయువ్రతము అన్న సమృద్ధినిచ్చునది. చతుర్థిదినశేషమున అన్ని విధములగు అన్నములను వేజువేజుపాత్రలలో నుంచి వీటితో తడుపవలయును. తరువాత ఇతరత్రలలోనికి ఆయన్నములను తీసి జలములనుంచవలయును. ప్రాతఃకాలమున సూర్యోదయకాలమున పితృదేవతలను, ఋషులను దేవతలను చక్కగా పూజించి స్నానాదులను చేయించి నైవేద్యముగా ఆయన్నములనుంచవలయును. తరువాత సంతోషముతో ఆయన్నములను యాచకులకు పెట్టవలయును. ఇట్లు దినమంతయు గడిపి, ప్రదోషకాలమున శివాలయమునకు వెళ్ళి లింగరూపియగు ఈశ్వరుని గంధపుష్పాదులతో చక్కగా పూజించి, నూరుమార్లుకాని, వేయిమార్లుకాని పంచాక్షరీమంత్రమును జపించవలయును. ఆజపమును భవరూపియగు భవునకు నివేదించవలయును. సావధానమనస్కుడై వైదికమంత్రములచే పౌరాణిక మంత్రములచే స్తుతించి, ఎల్లకాలము అన్ని అన్నములు లభించుటకు ఈశ్వరుని ప్రార్థించవలయును. శారదాన్నములు, వాసంతికాన్నములు ఇంకా ఈ ప్రపంచముననున్న అన్ని యన్నములు నాకు ప్రతిజన్మలో సమృద్ధిగా లభించవలయును అని ఈశ్వరుని ప్రార్థించి తన గృహమున కొచ్చి బ్రాహ్మణాదులకు పక్వాన్నమును పెట్టి తను భుజించవలయును. ఇట్లు ఈ అన్నవ్రతమును విధిగా ఆచరించిన వారు సర్వాన్నసంపదలను ఇహలోకమున పొంది పరలోకమున ఉత్తమగతిని పొందుదురు. ఇక శ్రావణ శుక్ల పంచమినాడు ఆస్తికులైన నరులు ద్వారమునకు రెండు ప్రక్కలా గోమయముతో సర్పములను లిఖించి గంధాదులచే పూజించి శచీదేవిని పూజించ వలయును. స్వర్ణరూప్యములతో దధ్విక్షతకుశ అంబుగంధపుష్పధూపదీపనైవేద్యదాల నర్పించి, ప్రదక్షిణము గావించి, ఆద్రవ్యమును భక్తిభావముతో బ్రాహ్మణులకు నమస్కరించి సమర్పించవలయును. ఇట్లు బ్రాహ్మణాధీనము చేసిన స్వర్ణరూప్యాది ద్రవ్యము నాకు ప్రతి జన్మలోను ఆనన్తఫలప్రదమగు గావుత అని భావించి భక్తిచే ద్రవ్యదానము చేయువానికి ధనాధ్యక్షుడు ప్రసన్నుడై స్వర్ణాది ద్రవ్య సమృద్ధిని కలిగించును. ఈ వ్రతమును మానవుడాచరించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి కుటుంబ బంధుమిత్రులతో కలిసి తానూ భుజించవలయును. భాద్రపదకృష్ణ పంచమినాడు నాగులకు పాలతో తర్పణము గావించవలయును. ఇట్లు చేసిన ఆ వంశములో ఏడు తరముల వరకు సర్పభయముండదు. భాద్రపద శుద్ధ పంచమినాడు ఋషివర్యులను పూజించవలయును. ప్రాతః కాలమున నద్యాదులందు స్నానము గావించి, నిత్యకృత్యములను జాడ్యము లేక నాచరించి, గృహమునకు వచ్చి, శ్రద్దగా మట్టితో వేదికనేర్పరచి, గోమయముతో అలికి, పుష్పములతో అలంకరించి, దానిపై దర్భలను పరిచి సప్త ఋషులను గంధపుష్ప ధూపదీపములచే చక్కగా పూజించవలయును. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర గౌతమ, జమదగ్ని, వసిష్టులు సప్తఋషులుగా ప్రసిద్ధులు, వీరికి విధిగా కల్పించిన అర్ఘ్యమును ప్రదానము చేసి, పండించని శ్యామాకాదులచే నైవేద్యమును సిద్ధముచేసి నివేదించి, వారిని విసర్జన గావించి, దానినే తాను భుజించవలయును. ఇట్లు ఈ విధిచే ఏడు సంవత్సరముల కాలము ప్రతి సంవత్సరము నాచరించి వ్రతాంతమున సప్త ఆచార్యులను వరించ వలయును. స్వశక్తి కొలది బంగారముతో ఏడు ప్రతిమలను చేసి, ఆ ప్రతిమలను జటిలులుగా అక్షసూత్రధారులుగా కమండలధారులుగా నిర్మించి, కలశములందు వీరిని స్థాపించి (తామ్రములుకాని మృణ్మయములు కాని కలశములు) భక్తితో యధావిధిగా వేరువేరుగా పంచామృతములచే స్నానము చేయించి, షోడశోపచారములచే భక్తిభావముచే పూజించి అర్ఘ్యమునిచ్చి తిలక్ర్హియవాదులచే “సహస్తోమా' అను ఋక్కుచేకాని నామమంత్రములచే కొని హోమము గావించి, పూర్ణాహుతిని ఆచరించి, తరువాత వస్త్రాలంకార యుతములగు ఏడు గోవులను దానము చేయవలయును. వస్త్రాలంకార భూషణములతో ఆచార్యుని పూజించవలయును. గురువుగారి అనుజ్ఞతో ప్రతిమలను బ్రాహ్మణులకు దానము గావించవలయును. ఆ బ్రాహ్మణులకు భోజనము పెట్టి నమస్కరించి విసర్జించవలయును. అపుడు బ్రాహ్మణ శేషమును ఇష్టబంధు జనముతో కలిసి భుజించి ఆనందించ వలయును. ఈ వ్రతమును సాంగోపాంగముగా నాచరించి ఇహలోకమున వాంఛిత భోగములనను భవించి దేహాంతమున సప్తర్షుల ప్రభావము వలన విమాన వరమును అధిష్ఠించును. ఆశ్వయుజ శుక్ల పంచమినాడు ఉపాంగలలితా వ్రతము చెప్పబడినది. స్వర్ణముతో లలితామూర్తి నేర్పరచి షోడశోపచారములతో పూజించి ఫలసంయుక్తమగు పక్వాన్నమును సఘృతముగా దక్షిణా సహితముగా బ్రాహ్మణోత్తమునకు దానము గావించవలయును. సవాహనశక్తియుతముగా వరదురాలు నా చేత పూజించబడినది. నన్ను అనుగ్రహించి నీ మందిరమునకు వెళ్ళుము. అని ప్రార్థించవలయును. కార్తీక శుక్ల పంచమినాడు సాటిలేని జయావ్రతమును పాపనాశము కొఱకు ఆచరించవలయును. జయాదేవిని శ్రద్దగా సావధానముగా యధావిధిగా షోడశోపచారములచే పూజించి, పవిత్రుడై, అలంకరించుకొని ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి దక్షిణనిచ్చి విడిచి, తాను మౌనముగా భుజించవలయును. జయాదినమున భక్తి కలవాడై స్నానము చేసిన వాని పాపములు సీంహము ఆక్రమించిన మృగములవలె పారిపోవును. అశ్వ మేధ యాగావ భృధస్పానమున కలుగు ఫలము జయాదినమున స్నానము చేసిన కలుగును. పుత్రులు కలిగెదరు. గోత్రాలు గర్భమును పొందును. రోగి రోగము నుండి విముక్తుడగును. బంధనము కలవాడు బంధనము నుండి విముక్తుడగును. మార్గశిర శుక్ల పంచమినాడు యథావిధిగా సాగులను పూజించి నాగులనుండి అభయమును పొంది బంధుమిత్రాదులతో ఆనందించును. పుష్య శుద్ధ పంచమినాడు మధుసూదనుని పూజించి వాంఛితములను పొందును. ఇట్లు ప్రతిమాసమున శుక్ల కృష్ణ పంచములయందు పితృదేవతలను నాగులను పూజించుట ప్రశస్తము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున ద్వాదశ మాసస్థ పంచమి వ్రతమును నూట పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
