నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

72 - హయగ్రీవోపాసనానిరూపణమ్

సనత్కుమార మహర్షి పలికెను : “ఓం విష్ణవే సురపతయే మహాబలాయస్వాహా” అనునది మంత్రము చంద్రుడు ముని విరాట్చందస్సు. దధివామనుడు దేవత తారము బీజము స్వాహా శక్తి సంఖ్యలు గల మంత్రాక్షరములచే షడంగన్యాసమును శిరస్సున, ఫాలభాగమున, నేత్రములందు, కర్ణములందు, నాసికలందు, ఓషతాలు కంఠములందు భుజప్పష్టహృదయ ఉదరములందు, నాభియందు, గుహ్యమునందు, ఉరస్థలమునందు, జానుద్వయమున, జంఘద్వయమున, పొదములయందు క్రమముగా చేయవలయును. మంత్రోత్పన్నస్థలములు పదునెనిమిది మాత్రమే. తరువాత దైవమును చింతించవలయును. ముత్యములవలే గౌరవర్ణుడు రత్నభూషణములు కలవోడు, చంద్రస్థుడు, తుమ్మెదలవంటి ముంగురులు కలవాడు, పవిత్రజలముతో నింపిన కుంభమును, దధ్యోదనపొత్రను ధరించినవానిని స్వామిని ధ్యానించవలయును. మూడు లక్షలు జపమును చేయవలయును. దశాంశమును ఘృతుతమగు పాయసాన్నముచే, దధ్యోదనముచే యథావిధిగా హోమమును చేయవలయును. తరువాత చంద్రాంతము పూర్వోక్తమగు కల్పిత పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి విధానోక్తముగా పూజించి, కేసరములందు షడంగములను, దిగ్గలములందు వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని, కోణపత్రములందు శాంతిని, శ్రీని, సరస్వతిని రతిని, అష్టదలములందు, ధ్వజమును, వైనతేయుని, కౌస్తుభమును, వనమాలిని, శంఖచక్రగదా శార్జములను పూజించవలయును. దలాగ్రముందు కేశవాదులను, దిక్పాలురను, తరువాత వారి అస్త్రములను పూజించి అష్టదిగ్గజములను పూజించవలయును. ఐరావతము, పుండరీకము, పోమనము, కుముదము, అంజనము,పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనునవి అష్టదిగ్గజములు. ఈ గజముల పత్నులు అభ్రము, కపిల పింగళ అనుపమ, మకర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి అనునవి. ఇట్లు ఆరాధించినచో మంత్రము ఇష్టములనిచ్చును. సిరిని కోరువాడు నేయి కలిసిన పొయసముచే ఒక వేయి హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో గొప్పధనమును పొందును. ధాన్యముచే హోమము గావించినచో ధాన్యము లభించును. శత పుష్పబీజములచే ఒకవేయి హోమమును చేసినచో దుర్గతినుండి విముక్తుడగును. త్రివిక్రమ రూపమును ధ్యానము చేసి, సావధాన మనస్కుడై మంత్రమును జపించవలయును. మంత్ర ప్రభావమువలన కారాగృహాబద్దుడు కూడా విముక్తుడగును. దేవేశుని గోడమీదకాని, ఫలకము మీదకాని చిత్రించి పూజించవలయును. ఇట్లు ప్రతిదినము సుగంధపుష్పములచే పూజించినచో మహాసంపదలను పొందును. ఎఱ్ఱని కలువలచే హోమమును గావించినచో సకలజగము వశమగును. నేయి కలిపిన అన్నముచే ప్రతిదినము ఇరువది. యెనిమిది మారులు హోమముగావించినచో అక్షయాన్నమును పొందును. షడ్రసోపేతములగు అపూపములచే ఎనిమిది వేలు హోమముగావించినచో దొరిద్ర్యము తొలగి మహాసంపద కలుగును. దధ్యన్నముచే పదివేలు హోమము చేసినవారున్న ప్రదేశమున అక్షయాన్నమును పొందును. బిల్వవృక్షసమీపమున నుండి పద్మాకరములచే హోమమును గావించినచో మహాసంపదను పొందును. పొయసముతో లక్షహోమమును గావించినచో బృహస్పతి సముడగును. లక్షజపముచేసి దశాంశమును పుత్రజీవ ఫలములతో బృహస్పతి సముడగును. లక్షజపముచేసి దశాంశమును పుత్రజీవఫలములతో హోమము గావించినచో ఉత్తమపుత్రులను పొందును. ససాధ్యతారము విలసత్కర్లీకము సువర్ణములచే శోభించు కేసరములు కలది మంత్రాక్షర షోడశపత్రములు గలది శేషయుగ్మార్లాంతపత్రము ద్వాదశాక్షరవేష్టితము, బయట మాతృకావర్ణములచే కూడియున్న యంత్రము సర్వసంపతదము. రక్తవర్ణుడగు త్రివిక్రముని ధ్యానించి రక్తవర్ణపుష్పములచే పదివేలు హోమమును గావించిన అంతటా జయమును పొందును. చంద్రాసనగతుని ధ్యానించి పది వేలు పద్మములచే హోమమును గావించినచో సర్వలక్షణసంయుతము అకంటకమగు రాజ్యమును పొందును. నేయికలిపిన లవంగములచే కొని ఉత్తరేణి దలములచేగాని ఎవని పేరు చెప్పి హోమమును గావించిన వాడు వశమగును. ఉత్తరేణిదళములచే అష్టోత్తర శతమును ఏడు రోజులు హోమము గావించి, అంతయే జపముచేసినచో మహారోగమునుండి విముక్తిని పొందును. ఉమీరత్పదమును ప్రణవోహయ శబ్దమునుండి సర్వవాగీశ్వర ఈశ్వర సర్వవేదమయ అచిన్త్య సర్యం బోధయ బోధయ అను మంత్రము తారాదిమము. ఈ మంత్రమునకు ఋషి బ్రహ్మ. అనుష్టుప్ఛన్లస్సు. హయగ్రీవస్వామిదేవత. హయగ్రీవస్వామి వాగైశ్వర్యప్రదుడు తారములగు మంత్రపాదములతో పంచాంగములను కల్పించవలయును. తుషారాద్రిసమచ్ఛాయుడు, తులసీదామభూషితుడు, తుంగసారస్వతుడగు తురంగవదనునికి నమస్కారము. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును పదివేలు జపించవలయును. తేనె కలిపిన పాయసముచే దశాంశమును హోమమును గావించి, విమలాదియుతమగు వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూజించవలయును. కర్ణికయందు తొలుగు దిక్కులలో పూర్వాదిగా క్రమముగా పూజించవలయును. సనందన మహర్షిని, సనకమహర్షిని, శ్రీని, పృథివిని, బయటదిక్కులలో వేదములను షట్కోణములందు పూజించవలయును. నిరుక్తమును, జ్యోతిషమును వ్యాకరణమును, కల్పమును, శిక్షను, ఛందస్సును ఈ వేదాంగములను పూజించవలయును. తరువాత అష్టదలమూలమున అష్టమాతృకలను పూజించవలయును. దలమధ్యమున వక్రతుండాదికములను పూజించవలయును. దలాగ్రముందు అష్టభైరవులను పూజించవలయును. అసితాంగుడగు గురువును భీషణుడు రక్తనేత్రుడు, కటుకుడు, కాలదమనుడు, దంతురుడు, వికటుడు మొదలగువారిని, బయట షోడశదలమున శ్రీహరి దశావతారములను శంఖ చక్రగదా పద్మనందక శార్జములను, బహిర్భాగమున భూగృహమున ఇంద్రుడు మొదలగు పదిమంది దీక్పాలకులను, ఆ బయట వజ్రాదులను పూజించి, ద్వారములందు క్రమముగా మహాగణపతిని, దుర్గను, క్షేత్రేశుని, వటుకుని, సమస్త ప్రకటాది యోగినులను, ఆ బయట సప్తనదులను, ఆ బయట నవగ్రహములను, ఆ బయట అష్టపర్వతములను, ఆ బయట నక్షత్రములను, ఇట్లు పదునైదు ఆవృత్తులు హయగ్రీవుని పూజించి వాగీశ్వరునితో సముడగును. ధనములో ధనపతి యగును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. పరిశుద్ధజలమును వెయ్యి ఎనిమిది మార్లు మంత్రించి, బీజముచే, ఒక మాసము పొనము చేసినచో పుట్టు మూగియైనను వాక్కును పొందును. చంద్రసూర్యగ్రహణసమయమున బంగారు పాత్రలో పాలనుంచి, కంఠమాత్రోదకమున నిలిచి గ్రహణ స్పర్శనుండి మోక్షము వరకు మంత్రమును ఆదరముతో జపించవలయును. తరువాత పాత్రలోని పొలను త్రాగవలయును. అట్లు త్రాగినచో శాస్త్ర పాండిత్యము లభించును. జ్యోతిష్మతీలతాబీజమును ఒక్కొక్కదినమున ఒక్కొక్కటిగా పెంచుచు అష్టోత్తరశతమగు వరకు అభిమంత్రితమును భుజించవలయును. అట్లు చేసినవాడు సరస్వత్యవతారమగును. ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈ మంత్రప్రభావముచే సర్వవేదాగమవ్యాఖ్యాత యగును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమార విభాగమున తృతీయ పాదమున హయగ్రీవోపాసనా నిరూపణమను డెబ్బది రెండ - అధ్యాయము సమాప్తము.