నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

61 - అధ్యాయము

సనత్కుమార మహర్షి పలికెను:- శోకము నశించుటకు శోకరహితమైన, శాంతిని కలిగించు శుభప్రదమైన శాస్త్రమును అభ్యసించినచో బుద్ది లభించును. బుద్ధి లభించినచో ఆనందము వృద్ధి చెందును. వేలకొలది ఆనంద స్థానములు వందలకొలది దుఃఖ స్థానములు ప్రతినిత్యము మూడునికి ఎదురగును. పండితునికి కావు. అనిష్టము కలుగుట వలన, ప్రియము దూరమగుట వలన అల్పబుద్దులగు మానవులు మానసిక దుఃఖమును పొందెదరు. నశించిన ద్రవ్యములలోని మంచిగుణములను - గూర్చి విచారించరాదు. నశించిన వాటిని ఆదరించనివాడు స్నేహబంధము నుండి విడివడును. ఒక విషయమున రాగము కలిగినచో దానిలో దోషమును దర్శించువాడగును. కావున అన్ని వస్తువులలో అనిష్టబుద్ధిని కలిగియుండవలయును. అపుడే విరక్తుడు కాగలడు. నశించిన దానిని విచారించినచో అర్థము ధర్మము కీర్తి కలుగవు. నశించినదీ లేదనుకొన్నచో బుద్దీ నుండి తొలగిపోవును. ప్రాణులు గుణములతో కలిసియుందురు. విడిపోవుదురు. ఇవన్నియూ లేనివే. కలిసియున్నపుడు శోకస్థానమొక్క ఓ యుండును. మరణించిన వానిని, నశించిన దానిని, గడిచిపోయిన దానిని విచారించువాడు దుఃఖ పరంపరలను పొందును. మహానర్ణమున బాధపడును. శారీరికము మానసికము అయిన దుఃఖము ప్రాప్తించినపుడు ప్రతిక్రియ చేయశక్యము కానిచో దాని గురించి చింతించరాదు. దుఃఖమును గురించి చింతించకపోవుటయే దుఃఖమునకు ఔషధము. చింతించినచో తొలగకపోగా వృద్ధి చెందుచుండును. మానసిక దుఃఖమును జ్ఞానముచే శారీరిక దుఃఖమును ఔషధములచే తొలగించు కొనవలయునని తెలుసుకొని ఇతర సామ్యమును పొందరాదు. జీవితము రూపము, యౌవనము, ద్రవ్యసంపాదన, ఆరోగ్యము, ప్రియులతో కలిసియుండుట అనిత్యములు. పండితుడు వాటిని పట్టించుకొనరాదు. అజ్ఞానము వలన కలిగిన దుఃఖమును గూర్చి విచారించరాదు దుఃఖము మొదలైనచో చింతించక ప్రతీకారము చేయరాదు. జీవితమున సుఖము కంటే దుఃఖమే ప్రియకరము. ప్రియమైన ఆత్మను జరామరణ దుఃఖముల నుండి ఉద్దరించవలయును. దృఢమైన ధనువు కలవాడు విడిచిన తీక్లబాణముల వలె శారీరిక మానసిక రోగములు శరీరమున ప్రవేశించును. బ్రతుక గోరువాడు వ్యాధిని పొందినపుడు చికిత్సలచే కూడా భయపడు చుండును. రోగనాశము కొఱకు శరీరము కృశించును. అయినను రోగములు నదీ ప్రవాహముల వలె జారిపోవుచుండును. కాని నశించవు. శుక్ల కృష్ణపక్షములలో రాత్రింబవళ్ళు మానవుల ఆయుష్యమును తీసుకొని వచ్చిపోవుచుండును. పుట్టిన మనిషిని జీర్ణింపచేయు నిమిషము నిలిచి యుండదు. సుఖదుఃఖములచే మునిగియున్నవానికి యౌవనమే ప్రాణములను జీర్ణింపచేయును. సూర్యుడు మాటిమాటికి ఉదయించుచుండును. అస్తమించుచుండును. ఊహించలేని కొత్త కొత్త భావములను తీసుకొని, మానవుల ఇష్టానిష్టములను కూర్చుచు వేరు చేయుచు రాత్రులు వచ్చిపోవుచుండును. కామములలో యథేచ్చముగా ఎవడేది కోరునో దానిని పొందుచుండును. క్రియాఫలము పరాధీనము కానపుడు మాత్రమే పొందగలడు. నిగ్రహము, సామర్థ్యము, బుద్దీగల మానవులు కర్మ హీనులై నిష్పలులగుట చూచుచున్నాము. కొందరు ఇతరులు పురుషాధములు గుణహీనులు ఆశారహితులై కామితార్థములను పొందుచున్నారు. ప్రాణులలో కొందరు ఎప్పడూ హింసలో ప్రవర్తించుచు లోకములను వంచింపచేయచు సుఖములలోనే జీవించుచుందురు. ఏ పనులను చేయక ఉదాసీనముగా కూర్చుండువానిని సంపదలు వచ్చి చేరును. పనులు చేయుచున్నవానికి కూడా ఇష్టములు లభించుట లేదు. పురుషుడు సహజముగా అపరాధములనే చేయుచుండును. ఒకచోట పుట్టిన వీర్యము మరియొక చోట చేరును ఆ వీర్యమే యోనిలో చేరినపుడు గర్పరూపమును ధరించును. మామిడి పూవు వంటి నివృత్తిలభించును. సంతానమును కోరి ప్రయత్నించువారికి సంతానము కలుగదు. గర్భమంటే పామును చూచినట్లు భయపడు వారికి సంతానము కలుగును. సంతానము కొఱకు దేవతలను పూజించి, తపసులను చేసి, పుత్రుల కొఱకు ఎన్నో దుఃఖములను అనుభవించువారికి కులమును చెడగొట్టు పుత్రులు కలుగుదురు. ఇతరులు తండ్రి సంపాదించిన ధనధాన్యములను భోగభాగ్యములను తల్లితండ్రుల పుణ్యములతో అనుభవించుటకు పుట్టుదురు. ఒకరినొకరు కోరుకొని స్త్రీపురుషులు సంగమించినచో కనపడని ఉపద్రవము వలె గర్భము ప్రాప్తించును. ఇంద్రియములు స్నేహసంయుక్తములు కావున మానవునికి మరణము అప్రియమగును. మానవుడు సుఖమును దుఃఖమును రెంటిని వీడుచును. సుఖదుఃఖముల నతిక్రమించినవాడు బ్రహ్మ భూతుడై అత్యంత సుఖమును పొందును. దుఃఖమును కలిగించు అర్థములను వదిలి పెట్టవలయును. అర్దములను పోషించినచో సుఖము నీయజాలవు. అర్థప్రాప్తిని గూర్చి వినుట కూడా నిషిద్ధమే. అర్థ నాశమును గూర్చి చింతించరాదు. వేరు వేరు ధనావస్థను పొందిన విశిష్టమానవులు తృప్తి పొందలేక నశించెదరు. పండితులు సంతోషమును పొందెదరు. సంపాదించిన వాటి నాశమే చివరిమెట్టు. అన్ని అభివృద్దులకు పతనమే చివరి హద్దు. ప్రతి కలయిక విడిపోవుటతో ముగియును. జీవితము మరణముతో అంతమగును. ఆశకు అంతులేదు. తృప్తి చెందుటయే ఉత్తమసుఖము. కావున పండితులు సంతోషమే ఉత్తమధనమని చెప్పెదరు. సంతోషమును ఒక నిమిషము పొందిననూ కృతకృత్యుడగును. పొందజాలని వాడు నిమిషము కూడా నిలువజాలడు.

శరీరము మొదలగునవన్నియు అనిత్యములైనపుడు దేనిని నిత్యమని భావించును. ప్రాణులలో పుట్టుకను విచారించి. బుద్ధితో తమస్సును దాటవలయును. దారిలో నడిచి వెళ్ళినవారు విచారించరు. పరమగతిని చూడగలరు. కోరికలను తృప్తి లేదని తెలిసి ఒకటిగా నున్న ఆత్మను పరిశీలించవలయును. వ్యాఘ్రము పశువును తీసుకొని పోవునట్లు మృత్యువు ప్రాణములను తీసుకొనిపోవును. అయినను ఈ దుఃఖము నుండి విడివడు ఉపాయమును చూడవలయును. శబ్దస్పర్శరసరూపగంధముల విషయమున ఆలోచించరాదు. ఆరంభించరాదు. కూడియుండరాదు. న్యామోహమును కలిగియుండరాదు. ధనవంతుడైనను, నిర్జనుడైనను అనుభవమున కంటే వేరేమియూ ఉండదు. ప్రాణులకు వాకృంప్రయోగము వలన దుఃఖముండదు. అన్నిప్రాణులను ఎడబాటు వొక్కుచే కాని విద్యచే 'కొని కలుగదు. మంచివాటియందు చెడువాటియందు ప్రీతిని విడిచి, వ్యాకులతను బోనాడి సంచరించువాడే సుఖవంతుడు పండితుడు. ఆధ్యాత్మమార్గమును అవలంబించి, ఆసక్తి లేనివాడై అనుభూతిలేనివాడై ఆత్మ సహాయముచే సంచరించువాడు సుఖమునుపొందగలడు. అపుడు సుఖము దుఃఖమగును. దుఃఖమే సుఖమగును. నియమబద్ధుని ప్రజ్ఞకొని పౌరుషముకొని కాపాడజాలదు. సహజము కావున ప్రయత్నమును చేయవలయును. ప్రయత్నశీలి నశించజాలడు. అనిష్టమగు ఉపద్రవము వలె గర్భము యోనిని పొందును. పూర్వశరీరములు చాలా ఉన్ననూ శరీరిమాత్రము ఒకడే నిత్యుడు. ప్రాణులకు ప్రాణసంరోధమేర్పడినపుడు మాంస శ్లేష్మాదులతో కూడియున్నది, ఇతర దేహముచే దగ్గమైనది, బలయుతమైన బలహీనమైన ఇతరదేహము నశించును. వినాశము తరువాత నావ లోని శరీరము నశించిననూ సంజ్ఞ వలె అచలమగును. సంగమముచే గర్భమున ఉంచిన అచేతనమగు రేతోబిందువు ఏ ప్రయత్నముచే గర్భముగా జీవించుచున్నదనుకుందువు. అదే గర్భమున భక్షించిన ఆహారము, త్రాగిన పానీయములు జీర్ణములగుచున్నవి. కాని ఆ గర్పమున నున్న రేతస్సు అన్నము వలె ఎందుకు జీర్ణమగుట లేదు. ఉదరమున మూత్ర పురీషములుండుట సహజము.మూత్ర పురీషములను ధరించుటలోను, విడుచుటలోను నీ వశములేదు. ఉదరమున కొన్ని గర్బములు ఏర్పడుచున్నవి.. మరికొందరు పుట్టుచున్నారు. వచ్చుటతోనే పోవుట పుట్టును. కావున బ్రతికున్నపుడే ఈ యోని సంబంధమును విడిచినవాడు సుఖమును పొందగలడు. ఎట్టి గౌరవమును పొందజాలకున్నను సుఖదుఃఖాది జంటలలో మునిగియుండును. ద్వంద్వములతో కలిసి పుట్టిన గర్భమునకు ఇది ఏడవదశ కలిగితీరును. తరువాత మరొక అయిదు దశలను పొందుదురు. అనగా పంచత్వమును పొందుదురు. శతవత్సరాయుష్యమును పొందజాలరు. మానవులకు ఉత్థాన దశలో యోగములు కలుగవు. ఈ విషయమున సంశయములేదు. వ్యాఘములతో కుద్రమృగములు వధించబడునట్లు మానవులు, వ్యాధులచే వధించబడుదురు. వ్యాధులచే భక్షింపబడుచు, విపుల ధనసంపదను వ్యయము చేసి ప్రయత్నముచే చికిత్స చేయు వైద్యులు కూడా బాధలను తొలగించలేరు. గొప్పఔషధములు కలవారు, నేర్పరులగు వైద్యులు కూడా వ్యాఘములతో బాధపడు మృగములవలె వ్యాధులచే బాధపడుచుందురు. ఆ వైద్యులు కూడా కషాయములను రసములను త్రాగుచుందురు. ఏనుగులచే ఏనుగులు భగ్నమగునట్లు వారు కూడా వార్ధక్యముచే కృశింతురు. గార్డులను మృగములను పక్షులను, పశువులను దరిద్రులను ఎవరు చికిత్స చేయుచున్నారు. వారు ఎక్కువగా రోగార్తులగుట లేదే? క్రూరులు, బలశాలులు, తేజశ్నాలులు ఆగు రాజులను కూడా కసాయి వారు పశువులను ఆక్రమించునట్లు రోగములు ఆక్రమించి బాధ పెట్టుచున్నవి. ఇట్లు లోకము శోకమోహములలో మునిగి గొప్ప ప్రవాహముచే బలముచే వేగముగా హరించబడుచుండును. ధనముచే రాజ్యముచే, ఉగ్రతపస్సుచే శరీరులలో నిర్ముక్తులైన వారు కూడా స్వభావములను దాట జాలరు. లోకమున ఉన్నత స్థానమునధిరోహించ వలయునని ప్రతివాడు కోరును. శక్తి కొలది ప్రయత్నించును. కాని అట్లుండజాలడు. ఉత్థాన ఫలము మరణము జరాతొలగి, అందరికి అన్ని కోరికలు తీరి అప్రియమును పొందకుండుటయే ఐశ్వర్య మదమత్తులు, అభిమానమదమత్తులు, శరులు క్రూరులు, బలశాలులు అయిన వారిని అప్రమత్తులు కూడా సేవించుచున్నారు. ఆలోచనా శూన్యులగు. వారికి కూడా శోకములు తొలగిపోవుచున్నవి. తనను తానుగా కాని ఇతరులకు కాని చెందుచున్నవి. ఎవరిని ఏది అతిక్రమించదు. కర్మ సంధులలో గొప్ప ఫలవైషమ్యము కనపడుచున్నది. కొందరు పల్లకిని మోయుచున్నారు. కొందరు పల్లకిలో కూర్చొనుచున్నారు. అందరూ సంపదలను కోరువారే. కానీ కొందరు మాత్రము రథమునకు ముందు నడుచుచున్నారు. మానవులు చాలామంది ఐశ్వర్య హీనులుగా కనపడుచున్నారు. స్త్రీలు కూడా అప్లెయున్నారు. మానవులు ఒక్కొక్కరూ సుఖదుఃఖాదిద్వంద్వములలో ఆనందించువారుగా ప్రవర్తించుచున్నారు. ఈ విషయమును చాలా జాగ్రత్తగా పరిశీలించుము. ఈ విషయమున , మోహగ్రస్తుడవు కాజాలవు. ధర్మాధర్మములను సత్యాసత్యములను విడిచి అన్నిటిని విడిచి స్వరూపముతో నున్నచో సుఖమును ఆనందమును పొందగలవు. నీకు ఈ పరమరహస్యమును చెప్పితిని. దీనిని తెలుసుకొని దేవతలు భూలోకమును విడిచి స్వర్గమును పొందిరి.

 సనందన మహర్షి పలికెను :- మహాముని యగు సనత్కుమారమహర్షి శుకయోగికి ఇట్లు బోధించి, శుకయోగిచే ఆదరముతో పూజించబడి వెళ్ళిపోయెను. యోగి శ్రేషుడగు శుకమహర్షి కూడా స్థితిని తెలుసుకొని బ్రహ్మపదమును అన్వేషింపదలచి తండ్రి వద్దకు వెళ్ళేను. తండ్రిని కలిసి నమస్కరించి ప్రదక్షిణము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళెను. వ్యాసమహర్షి పుత్ర విరహముచే పరితపించుచు ఒక్కక్షణము నిలువుము పుత్రా అని ఆక్రోశించెను. శుకయోగి మాత్రము నిరపేక్షుడు ని స్నేహడు అయి ఆన్ని బంధములను విడిచి మోక్షమునే ధ్యానించుచు పరమపదమునకు వెళ్ళెను.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున అరువది యొకట - అధ్యాయము సమాప్తము.