నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

20 - సుమతిభూపకథావర్ణనమ్

 నారద మహర్షి పలికెను :- సర్వధర్మములను, సర్వశాస్త్రార్ధములను చక్కగా నేరిగిన మహానుభావా! ధ్వజారోపణము అన్ని కర్మలలో నుత్తమమని చెప్పియుంటివి. సుమతియను  మహారాజు ధ్వజారోహణమును చేసెనని చెప్పియుంటివి. ఆ సుమతి చరిత్రను నాకు విస్తరముగా తెలియజేయుము.

సనక మహర్షి పలికెను :-పురాతనమైన ఈ ఇతిహాసమును సావధానముగా వినుము. సర్వపాపప్రణాశనమగు నీ యితిహాసమును నాకు బ్రహ్మ  స్వయముగా తెలిపెను. పూర్వకాలమున కృతయుగమున సోమవంశమున సుమతి యను మహారాజు ఉండెను. ఈ మహారాజు సర్వసంపత్సమృద్ధి కలిగి సప్తద్వీపములకు ఏకైక నాయకుడగు చక్రవర్తి ధర్మాత్ముడు. సత్యసంపన్నుడు. పవిత్రవంశ్యుడు, అతిథి ప్రియుడు. సర్వలక్షణసంపన్నుడు. సర్వసంపద్విభూషితుడు. సర్వకాలములలో హరికథను సేవించువాడు. హరిపూజపరాయణుడు, హరిభక్తులను సేవించువాడు. ఆహంకొగరహితుడు. పూజ్యులను పూజించు శీలము కలవాడు. సమదర్శి, గుణవంతుడు, సర్వభూతహితుడు, శాన్లుడు, కృతజ్ఞుడు. కీర్తిమంతుడు. సుమతి మహారాజు భార్య మహానుభావురాలు, సర్వలక్షణవతి. పతివ్రత, పతిప్రాణ సత్యమతి యను పేరు గలది. ఆ దంపతులు నిత్యము హరి పూజా పరాయణులు. పూర్వజన్మ జ్ఞానము కల మహానుభావులు, సత్యమును తెలిసినవారు, సత్పరాయణులు. నిత్యము జలాన్నదాన నిరతులు. తటాకారామాదులను అసంఖ్యాకములుగా త్రవ్వించిరి. సత్యమతి కూడా నిత్యము పవిత్రురాలై విష్ణ్వాలయమున అతి సంతుష్టయై మనోజ్ఞముగా నాట్యము చేయుచు మృదు మధురముగా మాటలాడునది. ఆ మహారాజు కూడా ప్రతి ద్వాదశీతిథి యందు సుందరము విశాలము అగు ధ్వజమును ఆలయమున ప్రతిష్ఠించుచుండెను. ఇట్లు నిత్యము  హరిపూజారతుడైన సుమతి మహారాజును ధర్మపరాయణుడని సత్యమతి యను అతని ధర్మపత్నిని కూడా దేవతలు కూడా స్తుతించుచుండిరి.

ఆ దంపతులు ధర్మ కోవిదులుగా మూడు లోకములలో ప్రసిద్ధులగుట నెంగి, విభాండక మహర్షి చూడగోరి చాలామంది శిష్యులతో కలిసి అచటికి చేరెను. విభాండక మహర్షి వచ్చుచున్నారని వినిన సుమతి మహారాజు భార్యతో ఎస్తృతముగా పూజా సామగ్రితో ఎదురేగెను. అతిథి మర్యాదను చేసి శాంతముగా సింహాసనము పై కూర్చుండ పెట్టి శాంతునిగా నున్న విభాండక మహర్షిని క్రింది ఆసనమున కూర్చొనియున్న సుమతి మహారాజు చేతులు జోడించి ఇట్లు పలికెను.

మహారాజు పలికెను : ఓ పూజ్యుడా ! మీ రాకచే నేను కృతకృత్యుడనైతిని. సత్పురుషుల రాక సుఖావహమని సత్పురుషులు. కొనియాడుచుందురు. మహానుభావుల ప్రేమ యున్న ప్రదేశముననే అన్ని సంపదలు తేజస్సు, కీర్తి, ధనము పుత్రులు ఉందురని పండితులు చెప్పుదురు. మహాత్ముల పాదజలమును, పాదధూళిని శిరస్సున దాల్చినవాడు అన్ని పుణ్యతీర్ధములలో స్నానమాడిన పుణ్యాత్ము డగును. సంశయముతో పనిలేదు. నా ద్వారా పుత్రధనాది సంపదలనన్నిటిని మీకర్పించుచున్నాను. ఓ బ్రాహ్మణోత్తమా ! మీకేమి ప్రియమును చేయవలయునో నన్నాజ్ఞాపింపుము. ఇట్లు పలుకుచు వినయముతో వంగియున్న మహారాజును చూచి విభాండక మహర్షి ప్రీతితో చేతితో తాకుచు మిగుల సంతోషముచే ఇట్లు బదులు పలికెను.

విభాండక మహర్షి పలికెను : ఓ రాజా ! నీవు చెప్పినదంతయూ నీ వంశమునకు తగియున్నది. వినయము కలవారందరు బహు శ్రేయస్సులను పొందగలరు. ధర్మార్థకామమోక్షములు వినయము వల్లనే లభించును. మహాత్ములకు దుర్లభమైనదేమి ? మంచి మార్గము నవలంబించిన నీ విషయమున ప్రీతుడనైతిని. శ్రీహరిని సంతోషింప చేయు పూజలు చాలా యున్నవి. వాటిలో నీవెప్పుడూ ధ్వజారోహణమునే ఎందుకు చేయుచున్నావు? నీ భార్య పరమ సాధ్వీమణి. ఎప్పుడూ స్వామి మందిరమున నృత్యమును చేయుచున్నది. ఎందుకిట్లు చేయుచున్నారో నాకు ఉన్నదున్నట్లు తెలుపుము.

మహారాజు పలికెను : పూజ్యుడా ! మీరడిగిన దానిని చెప్పెదను. మా చరిత్రము లోకముల కాశ్చర్యావహము. ఓ మహానుభావా ! నేను పూర్వము మాలిని యను పేరుగల శూద్రుడనై యుంటిని. ఎపుడూ చెడుదారిలో నడుచుచు అందరికీ కీడును చేయుచు, కొండెములను చెప్పుచు, ధర్మమును ద్వేషించుచు, దేవ ద్రవ్యముల నపహరించుచు, గో బ్రాహ్మణులను వధించుచు, చౌర్యము చేయుచు, అన్ని ప్రాణులను వధించుటయందాసక్తిని చూపుచు, ఎపుడూ కఠినముగా మాట్లాడుచు, పాపాత్ముడనై, వేశ్యాలోలుడనై, పెద్దలమాటలను లెక్కించక చాలాకాలముంటిని. బంధువులందరూ వెలివేయగా దుఃఖముతో అరణ్యమునకు చేరితిని. అరణ్యములో మగ మాంసమును భక్షించుచు బాటసారులను దోచుచు ఒంటరిగా బహు దుఃఖముతో చాలా కాలముంటిని. ఒకపుడు ఎండవేడికి తపించి ఆకలి దప్పులు పీడించగా తిరుగుచు నిర్జనారణ్యమున శిధిలమైయున్న ఒక విష్ణ్వాలయమును చూచితిని. ఆ దేవాలయ సమీపమున హంసాది పక్షి సంకులమగు తీరమున పుష్ప ఫలభరితోద్యానములు గల సరస్సును చూచితిని. ఆ సరస్సున నీరు త్రాగి తీరమున  విశ్రమించి అలసట తీర్చుకుంటిని. రాలిపడియున్న పండ్లను భక్షించి ఆకలిని తీర్చుకొంటిని. ఆ జీర్ణవిష్ణ్వాలయమున నివాసమేర్పరచుకొంటిని. జీర్ణమైన వాటిని, పగిలిన గోడలను మరల సంధానము చేసితిని. కట్టెలు ఆకులు తీగలచే చక్కగా గృహమును నిర్మించితిని. నా సౌకర్యము కొఱకు అచట భూమిని చక్కగా నలికితిని. అచట వ్యాధవృత్తిని స్వీకరించి చాలా మృగములను చంపుచు ఆ మాంసముతో కాలము గడుపుచు ఇరువది సంవత్సరములుంటిని. అపుడు వింధ్య దేశమున పుట్టిన ఈ సాధ్వి వచ్చినది. కోకిల అను పేరుగల ఈమే నిషాదవంశమున పుట్టియుండెను. బంధువర్గము విడువగా శిథిలదేహాయై దుఃఖించుచు ఆకలి దప్పివేడిమిచే ఆర్తురాలై తాను చేసిన పాపమును గూర్చి ఆలోచించుచు నిర్జనారణ్యమున తిరుగుచు దైవయోగమున అటకొచ్చినది. బయట గ్రీష్మతాపముచే, అంతరంగమున పాపముచే పీడించబడుచు వచ్చెను. ఇట్లు దుఃఖముచే బాధపడుచున్న ఈమెను చూచి నాలో దయకలిగెను. నీరును పండ్లను మాంసము నిచ్చితిని. నేనిచ్చిన వాటిని తిని ఆకలి దప్పులు అలసట తీరిన ఈమెను గత వృత్తాంతము నడిగితిని.

అపుడు ఈమె తన వృత్తాన్తమునంతటిని నాకు నివేదించెను. “ఓ మహామునీ ! దానిని వినుము. నేను నిషాదకులమున పుట్టితిని. నా పేరు అవకోకిల. నా తండ్రి పేరు దారుకుడు. వింధ్యపర్వతప్రాంతమున నా నివాసము. ఎపుడు పరద్రవ్యములను అపహరించుచు, కొండెములు చెప్పుచు, నచ్చిన పురుషునితో విహరించుచు బ్రతుకును సాగించుచుంటినని నన్ను  బంధువులందరు వెలివేసిరి. ఇట్లు లోక నిందీతనైన నన్ను కొంతకాలము భర్త పోషించెను. దైవ వశమున నా భర్త నన్నిచటనే వదిలి తాను యమలోకమును చేరెను. నిర్జనమైన అరణ్యమున ఒంటరిగా దుఃఖముతో తిరుగుచు దైవ వశమున నీ సమీపమునకు చేరితిని. నీచే బ్రతికించబడితిని” ఇట్లు ఆమె తన చరితము నంతను నాకు నివేదించెను.

తరువాత మేమిద్దరమూ దాంపత్య భావముతో మాంసమును ఫలములను ఆహారముగా తీసుకోనుచు పది సంవత్సరములుంటిమి. ఒకపుడు బాగుగా మద్యము సేవించుటవలన మదించినవారమై ఆ రాత్రి దేవాలయమున మాంస భోజనముచే సంతోషించి వడలును వస్త్రములను మరిచి మోహముతో నృత్యమును చేసితిమి. ఇంతలో మా ఇద్దరికీ ఒకేసారి ప్రారబ్ధకర్మభోగము పరిసమాప్తమైనది. అపుడు భయంకరులైన యమదూతలు పాశహస్తులై నృత్యముచే ఆనందించుచున్న మమ్ములను ఘోరమైన యమయాతనలకు గొనిపోవవచ్చిరి. అంతలో దేవాలయమును పరిశుభ్రముగా ఉంచుటచే సంతోషించిన శ్రీ మహావిష్ణువు స్వభక్తులను కాపాడు శీలము కలవాడగుటచే తన దూతలను పం పెను. దేవదేవుని దూతలు శంఖచక్రగదొదులను ధరించి చతుర్భుజులై వేయి సూర్యుల వెలుగు కలవారై కిరీట కుండలాద్యా భరణములను ధరించినవారై హారములను వనమాలను ధరించి, తమ కాంతులచే దిక్కులను వెలిగింపజేయుచు, పాశహస్తులు దంష్ట్రులు భయంకరులై మా ఇద్దరిని తీసుకొని పోవయత్నించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి.

విష్ణుదూతలు పలికిరి : ఓ క్రూరులారా ! దురాచారులారా ! వివేకహీనులారా ! ఈ దంపతులు హరికి ప్రీతిపాత్రులు. కావున పాపరహితులు. వీరిని వీడువుడు. మూడు లోకములలో అన్ని సంపదలకు మూలకారణము వివేకము. పాపరహితుని పాపిగా తలచువాడు పురుషాధముడు. పౌపీని పాపరహితునిగా తలచువాడు అధమాధముడు.

 యమదూతలు పలికిరి : “మీరు నిజమునే పలికితిరి. కాని వీరు పరమ పాపులు. పాపులను యమధర్మరాజు దండించవలయును. కావున వీరిని మేము తీసుకొని పోగలము. వేదవిహితమే ధర్మము. తద్వాపరీతమధర్మము. ఇదియే ధర్మాధర్మ వివేకము. కావున వీరిని తీసుకొని పోవుచున్నాము.” గొప్ప తేజస్సు గల విష్ణుదూతలు ఈ మాటలను విని మిక్కిలి కోపించినవారై, అధర్మమును ధర్మముగా భావించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి.

 విష్ణుదూతలు పలికిరి : “ధర్మ పరీక్షకుల సభను అధర్మము స్పృశించుచున్నది. ఇది చాలా గొప్ప ఆపద. చక్కని వివేకము లేకపోవుటయే అన్ని ఆపదలకు మూలము. మీరు చక్కగా విచారించలేకపోవుట వలననే నరకలోకమున కొలువుదీరితిరి. మరల ఇపుడు కూడా పాపములను చేయుటకు పూనుకొందురేల ? తాము చేసిన కర్మలు క్షయమగువరకు మహాపాపులు ఘోరమైన నరకమున నుందురు. మీరు సూర్యచంద్రులుండు వరకు నరకముననే యుండవలయును. ఇది వరకు చేసిన పాపములకు నిష్కృతిని కనుగొనకనే మరల పొషముల నెందుకు చేయుచున్నారు ? వేదవి హీతమైనదే ధర్మమను మాట ముమ్మాటికీ నిజము. సంశయములేదు. కాని ఈ దంపతులు చేసిన ధర్మములను చేప్పెదము వినుడు. హరిని సేవించుటలో ఆసక్తులైన వీరు అన్ని పాపములనుండి విముక్తులయిరి. కావున శ్రీహరియే వీరిని కాచుచుండెను. కావున ఆలసించక విడువుడు. ఈమే హరి మందిరమున నృత్యము చేసెను. ఇతను ధ్వజారోపణము చేసెను. ఈ రెండు పుణ్యకార్యములను అత్త కొలమున విష్ణుమందిరమున చేసిరి. కావున వీరి పాపములు నశించినవి. అంతకాలమున . శ్రీహరి సొమమును ఒకసారి వినిననూ పలికిననూ పరమపదమును పొందుదురు. ఇక సేవించిన పోరి విషయమున నేమి చెప్పవలయును ? మహాపాతకములు ఉపపాతకములు కలవారైనను అత్త కొలమున శ్రీకృష్ణుని సేవించినవారు పరమ పదమును పొందెదరు.యతులను విష్ణుభక్తులను సేవించువారు పౌపులైనను పరమ పదమును పొందెదరు. ఒక ముహూర్త కాలము కాని సగము ముహూర్త కాలము కాని శ్రీహరి మందిరమున నివసించినచో పరమపదమును పొందుదురన్న, ముప్పది రెండు సంవత్సరములున్న వారి విషయమున నేమి చెప్పవలయును. ఈ దంపతులు దేవాలయమును ఊడ్చిరి, అలికిరి, శిథిలమైన వాటిని మరల సంధానము చేసిరి. నీరు చల్లిరి. దీపమును పెట్టిరి. ఇట్టి వీరు నరకయాతననెట్లనుభవింతురు ? “ విష్ణుదూతలు ఇట్లు పలికి మా పాశములను తెంపి విమానమున కూర్చుండబెట్టి విష్ణుపదమునకు చేర్చిరి. అచట శ్రీహరి సామీప్యమును పొంది చాలా దీవ్యవర్షములు సకల భోగముల ననుభవించి మరల భూలోకమునకు చేరితిమి. హరి సేవా ప్రసాదము వలన ఇచట కూడా సాటిలేని సంపదలను పొందితిమి. ఇచ్చ లేకనే చేసిన హరి సేవ వలననే దేవతలకు కూడా దుర్లభమగు . నిట్టి ఫలమును పొందితిమి. ఇచ్చతో భక్తి భావముతో విశ్వేశుడైన శ్రీహరిని సేవించి ఉత్తమ శ్రేయస్సును పొందగలమని నిరూపించబడియున్నది. మన వశములో లేక మత్తులో నుండి చేసిన కర్మలకే ఇంతటి గొప్ప ఫలము లభించినది కదా ! ఇక శ్రద్ధచే చేసినచో నేమి చెప్పవలయును. ఇట్లు సుమతి చెప్పిన వృత్తాస్త్రమును వినిన విభాండక మహర్షి ఆ దంపతులను ప్రశంసించి తన తపోవనమునకు వెళ్ళెను. కావున ఓదేవర్షీ ! దేవదేవుడగు చక్రి సేవ అందరికి కామధేనువు వంటిది. హరిని పూజించువారికి శ్రీహరియే సర్వకామార్థ ఫలప్రదమగు శ్రేయస్సును ప్రసాదించును. ఇట్లు అన్ని పాపములను తొలగించి అన్ని పుణ్యములను కలిగించు ఈ కథను చదివిన వారు, వినిన వారు కూడా పరమ పదమును పొందెదరు, అనెను.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సుమతిభూపకథావర్ణనమను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.