నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

70 - అధ్యాయము

సనత్కుమార మహార్షి పలికెను :- ఈ లోకములలో లభించ శక్యము కాని మహావిష్ణు మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను తెలుసుకొని మానవులు త్వరగా సమతమ అభీష్టములను పొందగలరు. ఈ మంత్రములనుచ్చరించుట వలననే పాపరాశులు నశించును. బ్రహ్మాదులు కూడా ఈ మంత్రములను తెలుసుకొని జగత్కార్యములందు సమర్ధులగుచున్నారు. నారాయణ పదము తారహత్నూరకము జేస్తమగును. ఈ మంత్రమునకు ఎనిమిదక్షరములుండును. ఈ మంత్రమునకు సాధ్యుడు నారాయణముని. గాయత్రీ ఛందస్సు, విష్ణువుదేవత, ఓం అనునది బీజము. యం శక్తి. అఖిల ప్రాప్తికి వినియోగము. క్రుద్గల్కునికి హృదయము, మహొల్కునికి శిరస్సు, వీరోలునికి శిఖ, ద్యుల్కునికి కవచము, మహాలునికి అస్త్రము. ఇట్లు పంచాంగ కల్పన చేయవలయును. తరువాత షడంగన్యాసము మంత్రమునందు గల షడ్వర్ణములచే ఆచరించవలయును. మిగిలిన రెండు వర్ణములను కుక్షి పృష్ఠములలో న్యాసము చేయవలయును. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలయును. చతుర్దీ విభక్త్యస్తమైన సుదర్శన పదము తరువాత నమః అను పదమును తారముగా చేర్చవలయును. తరువాత 'అస్త్రాయ ఫట్' అని చెప్పినచో ద్వాదశాక్టరమంత్రమగును. దశావృత్తిమయమగు విభూతి పంజరమను న్యాసమును చెప్పెదను. మూలమంత్రాక్షరములను స్వశరీరము నందుంచుకొనవలయును. ఆధారమున, హృదయమున ముఖమున, బాహువులందు, పొదములందు, నాసికయందు చేయు న్యాసము ప్రధమావృత్తి యనబడును. గలమున, నాభియందు, హృదయమునందు, కుచములందు, పార్శ్వములందు పృష్టములందు ద్వితీయావృత్తి. శిరస్సు, ఆస్యము, నేత్రము, శ్రవణములు,నాసికలయందు తృతీయావత్తి. బాహువులందు, పాదములందు, సంధులందు, ఆంగుళులయందు చతుర్ణావృత్తి న్యాసము చేయవలయును. ఫ్రణ ప్రాణ హృదయములందు పంచమావృత్తి చేయవలయును. శిరోనేత్రస్యహృతుకి ఊరు జంఘ పదద్వయములందు ఒక్కొక్క మంత్రాక్షరమును న్యాసము చేయవలయును. మంత్రము యొక్క నాలుగక్షరములను హృదయ భుజ ఊరు పాదములందుంచవలయును. చక్ర శంఖ గదా పద్మపదములందు ఆయాముద్రలచే న్యాసము చేయవలయును. ఈ న్యాసమును విభూతి పంజరమందురు. ఒక్కొక్క మూల వర్ణమును సచంద్రముగా తారసంపుటముగా న్యాసము చేయవలయును. లేదా నమోంతముగా చేయవలయునని మరికొందరు చెప్పిరి. తరువాత విష్ణుభావసిద్ది కొఱకు తత్త్వన్యాసమును చేయవలయును. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపమని పూర్వసూరులు చెప్పుచున్నారు. పృథివ్యాది పంచ భూతములు, అహంకారములు, మహత్తత్త్వము, ప్రకృతి అను ఈ ఎనిమిది ప్రకృతులు. పాదమునందు, లింగమునందు, హృదయమునందు, ముఖమునందు, శిరస్సునందు వక్షఃస్థలమున, హృతృలమున సర్వాంగములందు న్యాసము చేయవలయును. ఒకదానిచే వ్యాపకము నాచరించవలయును. మంత్రాక్షరహృత్పరమునకు మొదటిది, ఆత్మకు హృదయాంతిమముగా ఆయా నామముల నుచ్చరించి ఆయాస్థలములందు న్యాసమును చేయవలయును. ఇదియే తత్త్వన్యాసము. ఈ న్యాసము సర్వన్యాసములలో ఉత్తమన్యాసము. ద్వాదశాదిత్య సంయుతులగు ద్వాదశమూర్తి న్యాసమును చేయవలయును. ద్వాదశాక్షర మంత్రము యొక్క ద్వాదశాక్షరములు ద్వాదశాదిత్య సంయుతములు. అష్టాక్షర మంత్రము అష్టప్రకృతి స్వరూపముగా చెప్పబడినది. ఈ అష్టాక్షరములకు ఆత్మ చతుష్యయోగముతో ద్వాదశాక్షరమంత్రమగును. ద్వాదశమూర్తులము క్రమముగా లలాట, కుక్షి, హృదయ, కంఠ, దక్షిణ పొర్శ్వ, భుజ, గల, వామపార్శ్వ భుజ, గల పృష్ఠ కకుత్ స్థానములందుంచ వలయును. ధాతతో కేశవుని, అర్యముతో నారాయణుని, మిత్రునిచే మాధవుని, వరుణునిచే గోవిందుని, అంశువుచే వామనుని, పూషచే శ్రీధరుని, పర్జన్యునిచే హృషీ కేశుని, త్వష్టచే పద్మ నాభుని, విష్ణువుచే దామోదరుని, న్యాసముచేసి, ద్వాదశాక్షరమంత్రమును సమస్త శిరమున న్యాసము చేయవలయును. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకన్యాసమును చేయవలయును. కిరీట కేయుర హోరాంతమున ధ్రువము మకరమని, కుండాలాంతమున, చక్ర శంఖ గదాంతమున భోజు హస్తమున, పీతాంబరాంతమున శ్రీ వత్సాంకిత వక్ష స్థలము అని శ్రీభూమి సహిత స్వాత్మ జ్యోతిద్వయమును దీప్తకరాయ. తరువాత సహస్రాదిత్య తేజమునకు బాణ షడ్వర్ణములతో నమోంతము కిరీట మంత్రముగా చెప్పబడినది. ఇట్లు న్యాస వీధినాచరించి ప్రభువగు నారాయణుని ధ్యానము చేయవలయును. ఉదయించుచున్న కోటి సూర్యసముడు, శంఖ చక్రగదా పద్మములను ధరించినవాడు రెండు పార్శ్వములలో శ్రీభూములు కలవాడు, శ్రీవత్సవకుడు, కౌస్తుభమణి చే ప్రకాశించువాడు, ముత్యాలహారములు కంఠమున గలవాడు, హార కేయూరవలయాంగద భూషితుడు, పీతాంబరుడు, అగు నారాయణుని స్మరించవలయును. వీధిననుసరించి ఇంద్రియనిగ్రహము కలవాడై అక్షరలక్ష జపమును చేయవలయును. మొదటి లక్షచే ఆత్మ శుద్ధి, రెండవలక్షచే మంత్రశుద్ధి, మూడవలక్షచే స్వర్గము, సౌలుగవలక్టచే విష్ణుసామీప్యము, అయిదవలక్షచే పరిశుద్ద జ్ఞానము, ఆరవలక్షచే విష్ణువునందు స్థిరబుద్ధి, ఏడవలక్షచే విష్ణుసారూప్యము, ఎనిమిదవలక్షచే నిర్యాణమును పొందును. ఇట్లు ఎనిమిది లక్షలు జపించిన తరువాత దశాంశమును పద్మములచే తేనెను కలిపి సంస్కరించిన అగ్నిహోత్రమున హోమమును చేయవలయును. పీఠమున మండూకమునుండి పరతత్త్వమువరకు పూజించి, విమల, ఉత్కరిణి, జ్ఞాన, క్రియ, యోగా, ప్రహ్యే, సత్యా, ఈశానా, అనుగ్రహా అని తొమ్మిది శక్తులు. ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే, వాసుదేవాయ సర్వాత్మా అను మంత్రమును ఉచ్చరించవలయును. సంయోగ యోగ పద్మాంతమున పీఠమున హృదయాంతిమము షడ్వింశాక్షరము అగు పీఠమంత్రము. ఈ పీఠమంత్రముచే ఆసనము నర్పించవలయును. మూర్తిని సంకల్పించి మూలమంత్రముచే ఆవాహన చేసి పూజించవలయును. మొదట అంగములను పూజించి మంత్రి కేశరములందు ప్రాగాదిదిగ్గలములందు వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్దుని, కోణములందు శక్తులనర్చించవలయును. శాంతిని, శ్రీని, సరస్వతిని, రతిని, క్రమముగా పూజించవలయును. హేమ, పీత, తమాల, ఇంద్రనీల కాంతులు గలవారు. పీతాంబరులు, చతుర్భుజులు, శంఖచక్రగదాపద్మధరులు మొదటి నలుగురు. సీతకాంచన గోదుగ్ధ దూర్వావర్ణులు శక్తులు. దలాగ్రములందు చక్ర శంఖ గదా పద్మ కౌస్తుభములను ముసలమును, ఖడ్గమును, వనమాలను క్రమముగా పూజించవలయును. రక్తా జపీత కనక శ్యామ కృష్ణాసితార్జున వర్ణులను, కుంకుమ వర్ణము గల పక్షిణజును బహిరగ్రభాగమున చక్కగా పూజించవలయును. రెండు ప్రక్కల ముక్తామాణిక్య సంకాశములగు శంఖ పద్మ నిధులను క్రమముగా పూజించవలయును. పశ్చిమ భాగమున ధ్వజమును పూజించవలయును. ఆగ్నేయమున రక్తవర్ణుడగు వీ ఘ్నేశుని, నైబ్రుతి కోణమున శ్యాముడగు ఆర్యుని, వాయవ్యమున శ్యామ యగు దుర్గను, ఈశానకోణమున పీతవర్ణుడగు సేనానీని పూజించి, బాహ్యభాగమున ఆయుధములతో కూడియున్న లోకపాలకులను పూజించవలయును. ఇట్లు ఆవరణలచే కూడి యున్న అవ్యయుడగు విష్ణువును పూజించినపోడు ఇహమున సకల భోగములననుభవించి అంతమున విష్ణుపదమును పొందును.

క్షేత్రధాన్యసువర్ణముల ప్రాప్తి కొఱకు మూర్వాదలశ్యామ, శాలిమంజరులను ధరించియున్న ధరణిని స్మరించవలయును. దేవదేవుని దక్షిణ భాగమున నున్న పూర్ణచంద్రనిభానన క్షీరసాగరతరంగఫీననిభవస్త్రధారిణి, వీణా పుస్తకధారిణియగు భారతీదేవిని ధ్యానించవలయును. బారతీదేవితో కూడియున్న పరాత్పరుని ధ్యానించినవాడు వేదవేదార్థ తత్త్వజుడు సర్వవిత్తముడగును. అతిభయంకరుడగు నారసింహుని ధ్యానము చేసి, మంత్రముచే శస్త్రమును మంత్రించి యుద్దమునకు వెళ్ళినచో శత్రువులను వధించి తిరిగి వచ్చును. సాధకుడు నారసింహబీజముచే మంత్రమును సంయోజన గావించి, ఆప్టోత్తరమును జపించి మంత్రించబడిన జలమును వామహస్తముచే మాటిమాటికి ప్రోక్షణ చేసినచో సర్పదష్టుడు కూడా బ్రతుకును. గారుడ మంత్రముతో సంయోజనము చేసి పంచాక్షరితో జపించవలయును. విషమును తొలగించుటకు గరుడవాహనుడగు విష్ణువును ధ్యానించవలయును. అశోకఫలమున గరుడుని లిఖించీ అశోక పుష్పములతో పూజించి మూడు పూటలా ఏడుమార్లు ఆ పుష్పములను హోమమును చేయవలయును. పక్షి ప్రత్యక్షమై ఇష్టమగు వరముల నిచ్చును. గాణపత్యముచే సంయోజనము చేసి క్షీరవ్రతమును స్వీకరించి లక్ష జపము చేసినచో మహాగణపతిదేవుని ప్రత్యక్షముగా చూడగలడు. వాణీ బీజయుక్తముగా ఆరు మాసములు యోజన చేసినచో మహాకవివరుడై సకల జగత్తును మోహింపచేయును. అర్ధాంగుల మితములగు, గుడూచీశకలములను దధిమధ్వాజ్యయుక్తముగా హోమముగావించినచో మృత్యువును జయించును. శనివారమున రాగి చెట్టును చేతితో తాకి అష్టశతమును జపముగావించినచో యుద్ధమున అపమృత్యువుని జయించును. ప్రతి నిత్యము ప్రాతఃకాలము ఇరువది అయిదుమార్లు జపించి జలపానము చేయవలయును. సర్వపాపవినిర్ముక్తుడై జ్ఞానవంతుడై రోగవర్షితుడగును. కుంభమును స్థాపించి శుద్ధజలమును విధిననుసరించి అన్ని రోగములు నశించును. సూర్య చంద్ర గ్రహణములలో ఉపవసించి ఎనిమిది వేలు బ్రాహ్మీఘృతమును జపించి పానము చేయవలయును. మేధను కవిత్వమును వాక్సిద్ధిని పొందగలడు. బిల్వపత్రములచే పదివేలు హోమము చేయవలయును. మహాధనపతి యగును. ఇది నారాయణమంత్రము సర్వమంత్రోత్తమము. సర్వ సిద్దులకు ఆలయమైన దీనిని నీకు చెప్పితిని. “నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది విష్ణుగాయత్రి. ఇది సర్వపాపములను నశింపచేయును. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనునది మహా మంత్రము. ఇది ద్వాదశాక్షరి. భుక్తి ముక్తి ప్రదాయకము. స్త్రీ శూద్రులకు ప్రణవరహితముగా బ్రాహ్మణులకు ప్రణవసహితముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు ప్రజాపతిముని. గాయత్రీ ఛందస్సు. దేవత వాసుదేవుడు శక్తి బీజము హృదయము ధ్రువము. చంద్రాక్షి వేదపంచాక్షరములతో అంగ కల్పనము చేయవలయును. శిరస్సున ఫాలభాగమున నేత్రములందు, ముఖమున, కంఠమున, హృదయమున, కుక్షియందు, నాభియందు, ధ్వజమునందు, జానుద్వయమున, పాద ద్వయమున, క్రమముగా మన్తవర్ణన్యాసము చేయవలయును. దీనిని సృష్టిన్యాసమందురు. హృదయము నుండి మస్తకము వరకు చేయు న్యాసము స్థితిన్యాసమందురు. పాదములనుండి మస్తకము వరకు సంహారన్యాసమందురు. సర్వతంత్రములందు గుప్తముగా చెప్పబడిన తత్త్వన్యాసమును తరువాత చేయవలయును. జీవము, ప్రాణము, చిత్తము, హృత్పద్మము, సూర్యమండలము, చంద్రాన్ని మండలములు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, చక్రము అనునవి ద్వాదశ తత్త్వములు. మూలాక్షర హృత్పరము క్రమముగా న్యాసమును గావించవలయును. ఇచట కూడా పూర్వోక్తధ్యాన మునే గావించవలయును. మంత్రమును పన్నెండు లక్షలు జపించవలయును. దశాంశమును నేతితో కలిపిన నువ్వులతో హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు దేవేశుని ఆవహించి వాసుదేవుని పూజించవలయును. మొదట అంగములను పూజించి తరువాత వాసుదేవాదికమును, శాంత్యాది శక్తులను దిక్కులందు, విదిక్కులందు పూజించవలయును. తృతీయావరణమునందు చెప్పబడిన ద్వాదశ మూర్తులను పూజించవలయును. ధరణీగృహమునందు ఆయుధయుక్తులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు పంచావరణలచే అవ్యయుడగు విష్ణువును పూజించి సకలాభీష్టములను పొంది అంతమున విష్ణుపదమును చేరును.

పురుషోత్తముడను పేరుగల విష్ణువును నాలుగు భేదములు గలవు. వారిలో మొదటి వాడు త్రైలోక్య మోహనుడు. రెండవవాడు శ్రీకరుడు. హృషీ కేశుడు కృష్ణుడు అను వారు మూడవ నాలుగవ భేదములు. ఈ మంత్రమున ఓంకారము కామము. తరువాత రమాపదమును. చతుర్థ్యస్త పురుషోత్తమ పదమును చెప్పవలయును. ఓం రమాపురుషోత్తమాయ అనునది మంత్రము. వర్మ అస్త్రములు అగ్ని ప్రియాంతము వహ్నీందు వర్ణములు గల మంత్రమిది. ఈ మంత్రమునకు బ్రహ్మ ముని. గాయత్రీ ఛందస్సు. పురుషోత్తముడు దేవత. స్మరబీజము, ఇందిర శక్తి, భూదందైకరసాక్షి అక్షిమంత్ర వర్ణములచే విభాగముతో అంగముల నేర్పరిచిన తరువాత విధిననుసరించి పురుషోత్తముని ధ్యానించవలయును. ఉదయించు సూర్యసన్నిభుడు, శంఖచక్రగదాపద్మములచే శోభించు హస్తములు కలవాడు, పీతాంబరుడు అగు పురుషోత్తముని స్మరించవలయును. మహా రత్నసమూహములచే చెక్కబడిన, శోభించు మండపమున, ముత్యముల సమూహము శమదమ విరాజిత వితానమున, నర్తించు దేవాంగనా బృందముల ధ్వనించు కింకిణులు గల నూపురములు గల, ప్రకాశించు మాణిక్య వేదిక యందు, ప్రకాశించు సూర్య తేజస్సు గల, బృందారక వ్రాత కిరీటాగ్ర రత్నాభిచర్చితమగు మండలమున నవలక్ష పర్యాయములు మంత్రమును జపించవలయును. దశాంశమును పూర్వోక్త వైష్ణవ పీఠమున వికసించిన కమలములచే హోమమును చేసి అర్చించవలయును. ఇట్లు దేవేశుని పూజించి గొప్పసంపదను పొందును. పుత్రులను పౌత్రులను, కీర్తిని, కాంతిని, భుక్తిని, ముక్తిని పొందును. తరువాత శ్రీకారాగ్ని ప్రియాంతిమమగు 'ఉత్తిష్ఠ' అని పదమునుచ్చరించవలయును. ఈ మంత్రము అష్టాక్షరములు కలది. ముని వ్యాసమహర్షి, పంక్తి ఛందస్సు. శ్రీకరనాముడు శ్రీహరి దేవత భీషయద్వితయము హృదయము. త్రాసయ త్రాసయ అనునది శిరము. ప్రమర్దయ ప్రమర్దు' అనునది శిఖ, ప్రధంసయ ప్రధ్వంసము అనునది కవచము. రక్ష రక్ష అనునది అస్త్రము. ఇవి అన్నియు హుం అనునది అంతమునందు కలవి. మస్తకమున, నేత్రములలో, కంఠమున, హృదయమున, నాభియందు, ఊరు జంఘపాదద్వయములందు క్రమముగా మన్త వర్ణ న్యాసమును చేయవలయును. తరువాత పురుషసూక్తమంత్రములచే న్యాసము నాచరించవలయును. బ్రాహ్మణోగ్య ముఖమాసీత్ అను మంత్రమును ముఖమున, బాహూరాజన్య అను మంత్రమును బాహుద్వయమున, ఊరూ తదస్య యద్వేశ్య అను మంత్రమును ఊరుద్వయమున, పద్బ్యాం శూద్రో ఆజాయత అను మంత్రమును పాదద్వయమున న్యాసమును చేయవలయును. చక్ర శంఖ గదా పద్మములను కరాగ్రములందు న్యాసమును చేయవలయును. ఇట్లు న్యాసవిధిని పూర్తి చేసి పూర్వోత్తమండపమున ధ్యానమును చేయవలయును. అరుణాబ్దానమున నున్న గరుడుని మీదున్న పూర్వోక్తరూపుడగు, లోకమోహనుడగు శ్రీకరుని ధ్యానము చేసి పూజించి ఎనిమిది లక్షలు జపమును చేయవలయును. దశాంశమును రక్త పద్మములచే బిల్వసమిధలచే, క్షీరిద్రుమ సమిధలచే హోమమును చేయవలయును. పొలన్నముచే నేతితో వేరు వేరుగా హోమమును గావించవలయును. రాగి, మేడి, జువ్వి, మట్టి వృక్షములు క్షీరిద్రుమములన బడును. వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అంగావరం దీక్సాలాయుధములచే కూడిన విభువును పూజించవలయును. ఇట్లు మస్త్రము సిద్ధించిన తరువాత పూర్వము వలే ప్రయోగముల నాచరించవలయును. “ఓమ్ నమో భగవతే వరాహరూపాయ భూర్భువస్వః” అనునది మంత్రము. నాకు భూపతిత్వమును ఇమ్ము, అని ప్రార్థించవలెను. ఈ మంత్రమునకు బార్గవ ఋషి. అనుష్టుపునస్సు, ఆదివరాహము దేవత. ఏకదంష్ట్రునకు హృదయము వ్యో మోలునను శిరము, తేజోధిపతికి శిఖ, విశ్వరూపునకు కవచము, మహాదంష్ట్రునకు అస్త్రము అని పంచాంగమును కల్పించవలయును. గిరి, షట్, సప్త బాణవసు అక్షరములుగా మన్త వర్యములకు విభాగము చేసి పంచాంగములను కల్పించవలయును. తరువాత అనేక సూర్యసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానము చేయవలయును. స్వర్ణవిభుని జానువులలో, సిత ప్రభుని నాభి అధోభాగమున, ఇష్ట భయగదోశంఖచక్రశక్తి ఖడ్గఖేటములను హస్తములలో ధరించియున్న, దంష్ట్రాగ్రములందు శోభించు ధరణి కలవాడు అయిన వరాహమును స్మరించవలయును. ఇట్లు ధ్యానము చేసి, దశాంశమును పద్మములను నేతితో కలిపి హోమమును చేయవలయును. వైష్ణవ పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ప్రభువును పూజించవలయును. అంగావరణ దిక్పాలహోతి యంత్రప్రసిద్ది కొఱకు జపము చేయగనే ధనధాన్యభూసంపదలను దానము చేయవలయును. సూర్యుడు సింహరాశిలో ఉన్నపుడు శుక్లపక్షమున అష్టమితిథియందు పంచగవ్యములందు శుద్ధమగు శిలనుంచి, ఆ శిలను స్పృశించి పది వేలు జపమును చేయవలయును. తరువాత మంత్రసిద్ధిని పొందినవాడు ఉత్తరాభిముఖుడై ఆశలను భూమియందు నిక్షిప్తము చేయవలయును. ఇట్లు చేసినచో భూత ప్రేతసర్పచోరాది బాధలు తొలగును. శుక్రవారమున ప్రాతః కాలమున సాధ్యమగు భూమినుండి మట్టిని తేవలయును. ఆ మట్టిని మూల మంత్రముచే మంత్రించి మూడుగా విభజించవలయును. ఒక భాగమును పొయ్యి మీద అలికి, మరొక భాగమును పాక పాత్రను పూసి, ఆవుపాలతో చక్కగా ఆలోడనము చేసి శుద్ధి పరిచిన తండులముల నుంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన పాకశాలలో మంత్రమును జపించుచు చరువును వండవలయును. ఆచరువును పొయి మీది నుండి దింపి అగ్నిలో యథావిధిగా హోమమును చేయవలయును. ధూపదీపాదులతో చక్కగా పూజించి నేయి కలిపిన చరువును సంస్కరించబడిన అగ్నిలో నూటా ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. ఇట్లు మంత్రమును పొందినవాడు ఏడుశుక్ర వారములలో హోమమును గావించవలయును. స్వక్షేత్రమున గల విరోధము నశించును. శత్రు చోరాదుల వలన కలుగు ఉపద్రవములు నశించును. ఇట్లే మంగళవారమున సూర్యోదయకాలమున సాధ్య క్షేత్రమునుండి మట్టిని స్వీకరించి పూర్వవిధిగా హవిస్సును సిద్ధము చేసి నూటాఎనిమిది మార్లు సంస్కృతాగ్నిలో హోమమును గావించవలయును. పాయసముతో కూడిన గవ్యములలో లకసంఖ్యగా హోమమును గావించవలయును. ఇట్లు గావించినచో తాను కోరిన భూమికి ఆధిపత్యము లభించును. బాహువులలో పరిఘను ధరించి, తెల్లని దంష్ట్రాగ్రమును భూమిని ధరించి, స్వర్ణసన్నిభుడగు వరాహస్వామిని పీత పార్థివ మండలమున సావధాన మనస్కుడై ధ్యానము చేసినచో, వరాహస్వామి అనుగ్రహముచే చక్కని భూమీని పొందగలడు. వారుణ మండలమున హిమసన్నిభుడగు ఆదివరాహుని ధ్యానమును చేయవలయును. ఇట్లు చేసినచో సాధకునికి మహోపద్రవములు శాంతించును. సకలవశ్యత కొఱకు వహ్నిమండలమున వహ్నిసన్నిభుడగు వరాహస్వామిని ధ్యానించవలయును. శత్రువులను పారద్రోలుటకు వాయుమండలమున కృష్ణవర్ణుడగు వరాహస్వామిని ధ్యానించవలయును. ద్యుమండలమున నున్న స్వచ్ఛుడు సర్వ సిద్దీ ప్రదుడగు వరాహ స్వామిని శత్రు గ్రహ క్షేడా, ఆమయ పీడాదీ శాంతికోజుకు, వ్యోమ బిందు భూషితమస్తకుని ధ్యానించవలయును.

వరాహస్వామి యొక్క ఏకాక్షర మంత్రము మరియొక కల్పవృక్షము. ఈ మంత్రమునకు కూడా అర్ఘ్యాది పూజలు పూర్వము వలెనే ఆచరించవలయును. ఓంకారము ఆదియందుకల ఈ మంత్రము అష్టాక్షరి. సర్వేశ్వర్యప్రదము. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు. వరాహస్వామి దేవత ధ్యాన పూజా ప్రయోగాదులను మొదటి వలెనే ఆచరించవలయును. ఈ మంత్రము ప్రణవాదికము. చతుర్థ్యనము తరువాత భగవతి అను పదము, దాని తరువాత రెండు మార్లు ధరణీ అని, హరియని రెండుమార్లు ఉచ్చరించవలయును. అనగా ఓమ్ నమో భగవతి ధరణి ధరణి హరే హరే యని చెప్పి తరువాత చతుర్ద్యన్తము వరాహాయ అని పలుకవలయును. ఈ మంత్రము ఇరువది ఒక్క అక్షరములు గలది. ఈ మంత్రమునకు వరాహస్వామి ముని, గాయత్రీ ఛంధస్సు. ధరణి దేవతా తారము బీజము వసుప్రియా శక్తి రామవేదాన్ని బాణాక్టుల వర్ణములతో అంగన్యాసమును గావించవలయును. శ్యామ వర్ణము గలది, చిత్ర విభూషణ శోభిత, పద్మాసనస్థ, తుంగస్తనీ, నీలాంబుజ ద్వయమును, శాలిమంజరిని, చిలుకను చేతితో ధరించునది, చిత్రవస్త్రధారిణీ యగు భూదేవిని స్మరించవలయును. ఇట్లు ధ్యానమును చేసి లక్షజపమును చేయవలయును. దశాంశమును నేతితో కలిపిన పాయసముతో హోమమును గావించవలయును. విష్ణు పీఠమున పూజించవలయును. మూల మంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో భూదేవిని పూజించవలయును. మొదట అంగములను ఆరాధించి, భూవహ్నిజలమారుతములను దిక్పాత్రములందు పూజించి, కోణ పత్రములందు ఆకులను నివృత్తి, ప్రతిష్ఠ మొదలగు విద్యాకలలను, ఇంద్రాదులను వజ్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రసిద్ధిని పొందిన తరువాత స్వేషమును సాధించుకొనవలయును. పశురతాంబరాదికములచే భూదేవినిట్లు సేవించువాడు. ధరణీ వల్లభుడగును. నూరు సంవత్సరములు సుఖముగా జీవించును. ఇక ఇపుడు జగన్నాధుని త్రైలోక్యమోహన మంత్రమును చెప్పెదను. కాముడు తార, రమాబీజము హృదంతమున పురుషోత్తముడు నుండవలయును.

అనునది మంత్రము. దీని చివర భాగమని పలుకవలయును. ఫట్ అనునది కవచము. ఈ మహామంత్రము హృదంతము.

రెండు వందల అక్షరములు కలది. ఈ మంత్రమునకు మహర్షి జైమినీ. అమితమను ఛందస్సు. జగన్మోహనమునకు జగన్నాథుడు దేవత. కామ బీజము రమాశక్తి అభిలాప్తికి వినియోగము. పురుషోత్తమ ! త్రిభువనోన్మాదక అనునది అగ్నికవచము. జగతోభణశబ్దము హృదయము. లక్ష్మీదయిత అనునది శిరము.మన్మధోత్తమ అనునది శిఖ. మన్మథోత్తమమంగజే కామదాయ హుం అని వర్మ న్యాసము చేయవలయును. పరమభృగుకర్ణాభ్యాం సర్వసౌభాగ్యకర అనునది కవచము. సురాసురమనుజ సుందరీ హృదయ విత్ ! రణ సర్వప్రహరణ ధర ! సర్వకాముక ! హన ! హన ” అనునది హృదయము. తరువాత బంధనములను చెప్పవలయును. ఆకర్షయ ! ఆకర్షయ ! మహాబల !” అనునది కవచము అస్త్రము. తరువాత నేత్రము త్రిభువనకవచ సర్వజనమనాంసి హర హర దారయ దారయ, వశమానయ" అనునది నేత్రమంత్రము. తారాదులు, ఫట్ నమోంతములు షడంగ మంత్రములుగా చెప్పబడినవి. "త్రైలోక్యమోహన! హృషికేశ ! ప్రతిరూపమన్మథ ! సర్వ స్త్రీణాం హృదకర్షణ” అను మంత్రముచే వ్యాపకమునాచరించి జగన్నాథుని స్మరించవలయును. క్షీరాబ్ధతీరమున సురవృక్షశోభితము, ఉద్యద్భాస్కర ప్రభాప్రకాశిత దిబ్ముఖము, పుష్పముల సుగంధములచే మదించిన తుమ్మెదలు చేయు ఝంకారములు కలది, దివ్యవాయువుచే పైకి లేచిన పద్మ పరాగముచే నిండిన ఆకాశ భాగముకలది, దేవతా స్త్రీ గానమాధుర్యముచే సుందరమగు వనమును ధ్యానించవలయును. ఆ వనములోపల మణుల కాంతులచే ప్రకాశించు తోరణమండపమునందు, శోభించు ముత్యాల మాలలచే ప్రకాశించు వితానము కలది, మణి వేద్యాది వియత్కిరీటాగ్రములచే పూజింపబడిన దివ్య సింహాసనమునందు విప్రులతో కలిసి కూర్చొనియున్న స్వామిని స్మరించవలయును. శంఖపాశబాణ ధనుర్ముసలనందక గదాంకుశములను చేతులలో ధరించియున్న, వక్షస్థలమున లక్ష్మి శోభించున్న, అంకమున నున్న పద్మరాగ శోభితమగు లక్ష్మీదేవియొక్క అనురాగదృక్కులచే చూడబడుచున్న స్వామిని ధ్యానము చేసి నాలుగు లక్షలు మంత్రజపమును చేయవలయును. దానిలో దశాంశమును అర్థచంద్రాకారమున నున్న కుండమున పద్మములతో కాని జాతి పుష్పములతో కాని హోమమును చేయవలయును. శ్రీహరిస్వరూపమగు యాగ భూమిని యాగోపకరణములను జగన్నాథుని పూజింపదలచినవారు. గాయత్రీమంత్రముచే ప్రోక్షించవలయును.

అనునది గాయత్రి. ఈ గాయత్రీ సర్వోత్తమము సర్వశుద్దీకరము. పూర్వోత్తమగు వైష్ణవ పీఠమున ఆసనమును కల్పించవలయును. “పక్షిరాజాయఠ ద్వంద్వం” అనునదీ పీఠ మంత్రము. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తిలో ఆవాహన గావించవలయును. వ్యాపకన్యాసమంత్రముచే భక్తితో చక్కగా పూజించి శ్రీవత్సహృదయుని శ్రీవత్సమును స్తనములందు న్యాసమును చేయవలయును. “కౌస్తుభాయనమః” అని వక్షస్థలమున కౌస్తుభమును పూజించవలయును. వనమాలాయై నమః” అని కంఠమున వనమాలను పూజించవలయును. తరువాత కర్ణికయందు యథావిధిగా అంగదేవతలను పూజించవలయును. తరువాత దలములందు చామరావృతలు, బంధూక కుసుమా భాసలు, ముక్తాహారములచే శోభించు కుచములు గల వారు, వికసించిన పద్మములవంటి నేత్రములు కలవారు. మద విభ్రమమంధరలు, అగు లక్ష్మి సరస్వతి, ధృతి, ప్రీతి, కాంతి, శాంతి, తుష్టి, పుష్టి మొదలగువారిని పూజించవలయును. భృగు భద్రాంశ సంద్రాఢ్యము దేవీబీజము. ప్రస్వత్రయ యుతము, క్లబసర్వరహితము, స్వరసంయుతము దేవీ బీజక్రమమున వీరికి ఆదియును వినియోగమును చేయవలయును. దశాగ్రములందు శంఖమును, శార్జమును, చక్రమును, ఖడ్గమును, గదను, అంకుశమును, ముసలమును, పాశమును, స్వస్యముద్రచే మంత్రములచే పూజించవలయును. ‘మహా జలచరాయ” అనునది కవచము. వహ్ని వల్లభ అస్త్రము. పాంచజన్యాయ నమః అనుదానిచే శంఖమును పూజించవలయును. శార్ణాయ నమః - అనునది శార్ణపూజలో మంత్రము. “సుదర్శన! మహాచక్రరాజ ! హాయ్ హాయ సర్వ దుష్ట భయాన్తం కురు, కురు, భిన్ది భిన్ది, విదారయ విదారయ, పరమంత్రాన్ గ్రస ! గ్రస ! భక్షయ ! భక్షయ ! భూతాని త్రాసయ ! త్రాసయ ! ఫట్" అనునది మంత్రము. ఇది చక్రార్చనామస్త్రము. “మహాఖడ్గ తీక్షచ్చలి ముక్త! హుం ఫట్ స్వాహా ఖడ్గాయ నమః" అనునది ఖడ్గార్చనామంత్రము. “మహాకౌమోదరి! మహాబలే ! సర్వాసురాంతకే ప్రసీద ప్రసీద” అనునది కౌమోదకీ అర్చనా మంత్రము. మహాంకుశ కుట్ట కుట్ట హుంఫట్ అంకుశాయ నమః" అనునది అంకుశార్చన మంత్రము.” మహాపాశ ! ఆహ్లాదయ ! ఆహ్లాదయ ! అకరయ ! ఆకరయ ! హుంఫట్ స్వాహా ! పొశాయ నమః” అనునది పొతార్చన మంత్రము. ఈ మంత్రములన్నియు తారాదీకములే. తరువాత ఇంద్రాదులను పూజించవలయును. వజ్రాదులను కూడా పూజించి సర్వ సిద్ధీశ్వరుడగును. ఒక నేల హయారిజ పుష్పములచే పూజించి, కలువలతో వెయ్యి ఎనిమిది మార్లు హోమమును గావించవలయును. ఒక మాసములో రాజులందరు వశులగుదురు. ఎవరి నామమును కలిపి పదివేలు జపము చేతురో వారు ఈ మంత్రప్రభావము వలన వెంటనే దాసులగుదురు. ఇంకను ఏమి చెప్పవలయును ? ఈ మంత్రముచే సాధకుడు సకల కొమములను సాధించుకొనగలడు. విష్ణువంతటి వాడగును. సంశయముతో పనిలేదు.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున డెబ్బదియ - అధ్యాయము ముగిసినది.