నారద మహా పురాణము - పూర్వార్థము
73 - రామాద్యుపాసనావర్ణనమ్
సనత్కుమార ఉవాచ :-
సనత్కుమార మహర్షి పలికెను: ఇపుడిక సిద్ధిదాయకములగు శ్రీరామ మంత్రములను చెప్పెదను. ఈ మంత్రముల నారాధించుటవలన మానవులు సంసారసాగరమును తరించెదరు. ఉత్తమమంత్రములన్నింటిలో విష్ణుమంత్రములు శ్రేష్ఠములు. గాణపత్య, సౌర శాక్తమంత్రములలో ఉత్తమము వైష్ణవ మంత్రము. వైష్ణవమంత్రముల కంటే రామమంత్రములు కోటి కోటి గుణాధికములు. విష్ణుశయ్యా స్థితుడగు వహ్ని ఇందు భూషితమస్తకుడు. రామాయ అనునది హృదయాంతముగా గల ఈ మంత్రము మహాపాపరాశులను నశింపచేయును. రామ మంత్రము లన్నింటిలో అతి శ్రేష్టమైనది ఈ రామషడక్షరి తెలిసి తెలియకచేసిన బ్రహ్మహత్యాసహస్రములు, స్వర్ణ సేయ సురాపాన గురుతల్పాదికములగు మహాపాపములు వేలకోట్ల ఉపపాతకములు అన్నియూ ఈ మంత్రోచ్చారణ వలన వెంటనే నశించిపోవును. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ, గాయత్రీ ఛందస్సు, శ్రీరాముడు దేవత. బీజము ఆద్యము హృదయము శక్తి అఖిలాప్తికి వినియోగము షడ్దర్షభాజమగు బీజముచే షడంగన్యాసమును చేయవలయును. బ్రహ్మ రంధ్రమున, భ్రూమధ్యమున, హృదయనాభి గుహ్యపొదములందు క్రమముగా మంత్రివరన్యాసమును చేసి కేశవాదులను న్యాసము చేయవలయును. పీఠిన్యాసాదికము నాచరించి హృదయమున శ్రీరామచంద్రుని ధ్యానించవలయును. కాలాంభోధరము వలే సుందరుడు, వీరాసనసమాస్థితుడు, దక్షిణహస్తమున జ్ఞానముద్రను ధరించి వామహస్తమును జానువు పైనుంచిన వాడు, పద్మహస్త విద్యుత్సన్నిభయగు సీత పోమపార్శ్వమున నుండి రాముని ముఖమును చూచుచు బహవిధభూషణ భూషితయగు సీతతో నున్న రాముని ధ్యానించి అక్షర లక్షలు జపించి దశాంశమును అగ్నిలో కమలములతో హోమము చేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలయును. విమలాది సమన్వితమగు వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు ఆవాహనము చేసి పూజించ వలయును. వామ భాగమున ఆసీనురాలగు సీతను ఆమె మంత్రముచే పూజించవలయును. రమాసీతాయై తరువాత ద్వీతాంతము సీతామంత్రము. అగ్ని వలన శార్ణమును పూజించి, పార్శ్వద్వయమున శరములను పూజించవలయును. కేశరములందు షడంగములను, పత్రములందు హనుమంతుని, సుగ్రీవుని, భరతుని, విభీషణుని, లక్ష్మణాంగదశతృఘ్నులను జాంబవంతుని క్రమముగా, మాటలాడుచున్న ముందు పుస్తకమును ధరించి యున్న హనుమంతుని, రెండు పార్శ్వములలో చామరములను ధరించియున్న భరత శత్రుఘ్సులను వెనుక భాగమున ఛత్రమును ధరించియున్న లక్ష్మణుని అర్చించవలయును. తరువాత అష్టపత్రమున సృష్టిని జపించుచున్న విజయుని, సురాష్ట్రుని, రాష్ట్ర పాలుని, అరోపుని, ధర్మపాలకుని, సుమంతుని, చక్కగా పూజించి, ఆయుధో పేతులగు లోకేశులను పూజించవలయును. ఇట్లు రామునారాధించినవాడు జీవన్ముక్తుడగును. చందనము కలిపిన జాతీపుష్పములచే సావధానముగా హోమమును చేయవవలయును. అట్లు చేసిన రాజులు వశులగుదురు. ధనధాన్యాది సిద్ధికి కమలముచే హోమమును చేయవలయును. నేతితో కలిసిన నీలకమలములచే . హోమమును గావించిన సకలజగత్తు వశమగును. నేయికలిపిన శతపర్వములచే హోమమును గావించిన రోగములు తొలగి దీర్ఘాయుష్మంతుడగును. ఎఱ్ఱకలువలచే హోమమును గావించినచో వాంఛితధనమును పొందును. మోదుగు పూలచే హోమమును చేసినచో మేధావియగును. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును ఒక సంవత్సరము పానము చేసినచో కవివర్యుడగును. ఈ మంత్రముచే మంత్రించబడిన అన్నమును తినినచో మహారోగములు నశించును. ఆయారోగములకు నిర్దేశించబడిన ఔషధముచే హోమముగావించినచో ఆ రోగము తొలగిపోవును. నదీతీరమున కాని కోషమున కొని పయోవ్రతుడై లక జపించవలయును. నేయి కలిపిన పాయసముచే హోమమును చేసినచో విద్యానిధియగును. అధికారమునుండి తొలగినవాడు శాఖాహారుడై ఇతర తీర్థమున లక్ష జపించి బిల్వపుష్పములచే దశాంశము హోమమును గావించినచో వెంటనే తన అధికారము తిరిగి లభించును. ఉపవాసము చేసి గంగాతీరమున నిలిచి లక్ష జపము చేసి దశాంశమును కమలములచే కొని బిల్వపుష్పములచే కొని హోమము గావించినచో రాజ్యసంపదను పొందును. మార్గశీర్షమాసమున కందమూలఫలాశనుడై జలమున నిలిచి లక్ష జపము చేసి దశాంశమును పాయసముచే హోమమును గావించినచో శ్రీరామచంద్రుని వంటి పుత్రుడు కాని పౌత్రుడు కొని కలుగును. ఇంకను ఈ మంత్రవిషయమున చాలా ప్రయోగములున్నవు. కాని ప్రయోగమును చేయువారికి పరలోకము కలుగదు. షట్కోణవసుపత్రమున బాహ్యార్కదళమును లిఖించవలయును. షట్కోణములందు షడక్షరములను వ్రాయవలయును. అష్టపత్రమునందు అష్టాక్షరములను ప్రణవసహితములుగా వ్రాయవలయును. రవిదళమున కామబీజమును, మధ్యమున మంత్రావృతమును, బాహ్యమున సుదర్శనావృతమును, దిక్కులలో యుగావృతమును లిఖించవలయును. వజ్రములచే శోభించు భూగృహమున కందరాంకుశపాశములచే భూమియందు కోణాకారముగా లిఖించినది యంత్రరాజముగా పేర్కొనబడినది. భూర్జపత్రమున లిఖించిన యంత్రమున అష్టగంధములచే లేపనము గావించి యథోక్త విధిగా పూజించవలయును. షట్కోణములందు దలారాబములను ఇష్టవృతయుగ్మముగా, కేశరములందు అష్టపత్రము యొక్క స్వరద్వంద్వమును లిఖించవలయును. ఇట్లు లిఖించిన యంత్రమును శుభదినమున కంఠమునకాని, దక్షిణభుజమునకాని, శిరమున కొని ధరించినచో సర్వపాపములు నశించును. శుభదినమున, శుభనక్షత్రమున, శుభప్రదేశమున శల్యవర్జితమున వశ్యాకర్షణవిద్వేషద్రావణ ఉచ్చోటనాదికమును, పుష్యద్వయము, పునర్వసు, ఆర్గామఘా నక్షత్రములలో యథాక్రమముగా దూర్వచే ఏర్పరిచిన లేఖనిని వశీకరణమున, ఆకర్షణకు కరంజమున మారణమున నరాస్థిజమున స్తంభనమున రాజ వృక్షజమున, శాంతి పుష్టి ఆయుష్యము కొఱకు సర్వాపన్నివారణకు, విభ్రమోత్పాతనముననకు శిలయందు వ్రాయవలయును. విద్వేష విషయమున ఖరచర్మము పై ఉచ్చాటనము ధ్వజము పై వ్రాయవలయును. శత్రవులకు జ్వరసంతాప శోకమారణ కర్మల కొఱకు పీతవస్త్రమున లిఖించవలయును. వశీకరణకోజకు, ఆకర్షణ కొరకు అష్టగంధములచే యథావిధిగా పూజించవలయును. తాడోచ్చాటనాదికమునకు చితాంగారాదులచే చేయవలయును. విషార్కజీరయోగముచే మారణము తథ్యము. ఇట్లు యంత్రరాజమును లిఖించి గంధపుష్పాదులచే పూజించవలయును. యంత్రమును త్రిలోహ వేష్టనము గావించి ధరించవలయును. ఈ మంత్రమునకు ఠద్వంద్వము బీజము. ఈ మంత్రము షడక్షరములు కలది.
ఇక ఇపుడు సిద్ధిదాయకమగు మహాసుదర్శనమంత్రమును చేప్పెదను.
అనునది మంత్రము. అరువది యెనిమిదక్షరములు - గలది. ఈ మంత్రము యనసంవేషనమునకు ఉపయోగించును. “ఓమ్ నమో భగవతే రఘనందనాయ రక్షోఘ్న విశదాయ మధురప్రసన్నవరదానాయ అమిత తేజసే బాలాయ రామాయ విష్ణవే నమః” అనునది నలుబది యేడక్షరములు గల మంత్రము. దీనిని మాలామంత్రమందురు. ఈ మంత్రమునకు విశ్వామిత్రమహర్షి ముని. గాయత్రీ ఛన్దస్సు శ్రీరాముడు దేవత ధ్రువబీజము కద్వయము శక్తి షడ్రీరస్వరయుగ్మబీజముచే అంగన్యాసమును గావించవలయును. ఈ మంత్రమునకు ధ్యాన పూజాదికమంతయు పూర్వము వలే ఆచరించవలయును. ఇట్లు ఆరాధించబడిన ఈ మంత్రము సర్వకామముల నిచ్చును. స్వకామసత్యవాగ్లలక్ష్మీ తారాడ్యము పంచవర్ణకము. షడక్షర మంత్రము షడ్విధము చతుర్వర్గఫల ప్రదము. బ్రహ్మ సంమోహనము. దక్షిణామూర్తి శక్తి అగస్త్యుడు శ్రీ శివుడు మునులు. తేజోకామబీజానికి విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛన్దస్సు శ్రీరాముడు దేవత. బీజశక్తి ఆధమాంత్యము. మంత్రవర్ణములచే షడంగన్యాసము చేయవలయును. షడ్డీరయుక్త బీజములచే మంత్రవర్ణన్యాసము చేయవలయును. కల్పవృక్షమూలమున సువర్ణమయమండపమున పుష్పకవిమానాంతర్భాగమున సింహాసనము పై భాగమున అష్టదల పద్మమున ఇంద్రనీల సమప్రభుడు, వీరాసనసమాసీనుడు జ్ఞానముద్రోపశోభితుడు వామోరున్యస్తహస్తుడు, సీతాలక్ష్మణ సేవితుడు రత్నాకల్పుడగు శ్రీరామ విభుని ధ్యానించి అక్షర లక్షమంత్రమును జపించవలయును. లేదా స్మారాది మంత్రములను జయాభుడగు హరిని స్మరించవలయును. కామ్యకర్మలయందు ప్రయోగములను, పూజను షడక్షర మంత్రము వలె చేయవవలయును. “ఓం రామచంద్రాయనమః” “ఓం రామభద్రాయనమః” అనునవి రెండు మంత్రములు. అష్టాక్షరములు కలవి తారాంత్యములైనచో నవాక్షరములు కలవి. ఈ మంత్రములకు పూజాదికమంతటిని షడక్షరీవలెనే చేయవలయును. “ఓం జానకీ వల్లభాయనమః” అనునది దశాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు వశిష్ఠమహర్షి ముని. స్వరాట్చనస్సు. దేవత సీతాపతి ఆదిమబీజము. స్వాహాశక్తి. షడంగన్యాసమును యథోక్తముగా నాచరించవలయును. శిరోలలాట భ్రూమధ్యతాలు కంఠహృదయనాభి అంఘీ జొనుపాదములందు మంత్రముల దశాక్షరములను న్యాసము చేయవలయును. అయోధ్యానగరమున రత్నచిత్రసువర్ణ మండపమున మందారపుష్పబద్దవితానమున తోరణయుతమైన సింహాసనమున పుష్పకోపరి భాగమున నున్న వానిని, రాక్షసులచే వానరులచే దేవతలచే విమానముల నుండి స్తుతించబడు వానిని, వినయశీలుడగు మునులచే సేవించబడువానిని, వామభాగమున సీతాదేవిచే శోభించువానిని, లక్ష్మణసహితుని, శ్యామాంగుని, ప్రసన్నవదనుని, సర్వాభరణభూషితుని, రామచంద్రుని ధ్యానించి అక్షరలక్ష జపము నాచరించవలయును. దశాంశమును కమలములచే హోమమును గావించవలయును. పూజాదికమును షడక్షరి మంత్రము వలె చేయవలయును. “రామాయ ధనుష్పాణయే స్వాహా” అను మంత్రము దశాక్షరములు కలది. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ విరాట్చనస్సు. రాక్షసమర్ధనుడగు రామచంద్రుడు దేవత, బీజము ఆద్యము, ద్వితము శక్తి. బీజముచే అంగన్యాసమును చేయవలయును. వర్ణన్యాసమును, ధ్యానమును, పురశ్చర్య అర్చనాదికమును దశాక్షరమంత్రమునకు వలె చేయవలయును. చాప బాణధరుడగు రాముని స్మరించవలయును. “ఓం నమో భగవతే రామచంద్రాయ” “ఓం నమో భగవతే రామ భద్రాయ” అనునవి ద్వాదశాక్షరి మంత్రములు. ఋషి ధ్యానాదికమును పూర్వము వలె నాచరించవలయును. రామనామము శ్రీ పూర్వము జయ పూర్వము అని రెండు విధములు. ఇట్లు చేసినచో పై మంత్రములు త్రయోదశాక్షరములు కలవగును. బ్రహ్మముని, విరాట్చన్లస్సు పాపసమూహానాశకుడగు రాముడు దేవత. మూడు పదములచే ద్విరావృత్తిచే షడంగన్యాసమును చేయవలయును. ఈ మంత్రమునకు ధ్యానార్చనాదికమునంతటిని దశాక్టరోక్తముగా నాచరించవలయును.
“ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః” అను మంత్రము పదునెనిమిదకరములు కలది. ఈ మంత్రమునకు విశ్వామిత్రుడు మహర్షి. ధృతి ఛన్దస్సు. రాముడు దేవత ఓం అనునది బీజము. నమః ఆనునది శక్తి. 1,3,4,6,2 మంత్రవర్ణములచే షడంగన్యాసము చేయవలయును. నిశ్శాణభేరీపటహ శంఖతూర్యాది ధ్వనులచే చుట్టూ నృత్యము జరుగుచుండగా, జయమంగలనాదములు చెలరేగుచుండగా, చందనాగురు కస్తూరీ కర్పూరాది పరిమళ వస్తువులు నిండగా పయి . విధముల పుష్పముల సువాసనలను వాయువు తెచ్చుచుండగా, పాడుచున్న దేవగంధర్వ స్త్రీలచే శోభించుచుండగా, సింహాసనమున పుష్పకోపరిభాగమున సమాసీనుడైన సీతా లక్ష్మణ సహితుడు, జయామకుట శోభితుడు, చాపబాణధరుడు,శ్యామసుందరుడు, సుగ్రీవ విభీషణాదిసహితుడు త్రైలోక్యరక్షకుడు యుద్ధమున కొచ్చిన రావణుని చంపినవాడు అగు రామచంద్రుని ధ్యానించి అక్షర లక్ష జపించి, దశాంశమును నేయి కలిపిన పాయసముచే హోమమును చేయవలయును. పూజాదికమును పూర్వము వలె నాచరించవలయును. “ఓం నమో సీతాపతయే రామాయ హన హన హుం ఫట్ స్వాహా"అనునది పందొమ్మిది అక్షరముల మంత్రము. సర్వార్థ సాధకము. విశ్వామిత్రుడు ఋషి అనుష్టుప్ఛనస్సు. రామభద్రుడు దేవత. జం అనునది బీజము. నమః అనునది శక్తి మంత్రవర్ణములచే అంగన్యాసము గావించి పూర్వము వలే ధ్యానమును చేయవలయును. పూజనోదికమంతయు షడక్షరివలే నాచరించవలయును. “ఓం నమో కమలా రామభద్ర మ హేష్వాస రఘు వీర నృపోత్తమ దశాస్యాంతక మాం రక్ష దేహి పరమాం శ్రియమ్.” అనునది ముప్పదేడక్షరములు గల మంత్రము. బీజములు లేనిచో ముప్పది రెండక్షరములు గల మంత్రమిది. సర్వఫలదాయకము. విశ్వామిత్ర మహర్షి ఋషి. - అనుష్టుప్ఛన్లస్సు. రామభద్రుడు దేవత, స్వం బీజము. ఇందిరా శక్తి బీజత్రయోద్యములు గల పదములచే పంచాంగన్యాసము చేయవలయును. శిరస్సున, ఫాలభాగమున, నేత్రములలో, శ్రోత్రములలో గండద్వయమున, నాసికయందు, ఆస్యమున, బాహువులందు, సంధులందు, స్తనములందు, హృదయమున, నాభియందు, కటియందు, మేడ్రమున, పాయుపొద సంధులలో మంత్రాక్షర న్యాసమును గావించవలయును. ధ్యానొర్చనాదికమును పూర్వమువలే నాచరించవలయును. లక్షత్రియ జపము, పొయసహవనము పురశ్చర్య పీత వర్ణుడగు రాముని ధ్యానించి నావధానముచే లక్షజపము చేయవలయును. దశాంశమును కమలములచే హోమమును గావించి ధనపతి యగును. ఓఓఓం రమారమా దశరధాయ నమః” అనునది ఏకాదశాక్షర మంత్రము. మున్యాదికము పూజాదికమంతయు పూర్వము వలే నాచరించవలయును. “త్రైలోక్యనాధాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. న్యాస ధ్యానాదిక మంతయు పూర్వమువలే నాచరించవలయును. “ఆంజనేయగురవే నమః” అనునది నవాక్షర మంత్రము. ఈ మంత్రమునకు పూజాదికమును పూర్వము వలె నాచరించవలయును.“రామాయనమః” అనునది పంచాక్షర మంత్రము. మునిధ్యాన పూజాదికమంతయు షడక్షరిమంత్రమువలె నాచరించవలయును. రామచంద్రాయ స్వాహా” “రామ భద్రాయ స్వాహా" అను రెండుమంత్రములకు కూడా మునిధ్యానార్చనాదికము పూర్వము వలె నాచరించవలయును. శేషాన్వితుడగు వహ్ని చంద్ర భూషితమస్తకుడు రామచంద్రుని ఏకాక్షర మంత్రము. మరియొక కల్పవృక్షము. ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు శ్రీరామచంద్రుడు దేవత. షడ్దర్గాఢ్యమంత్రముచే షడంగములనాచరించవలయును. సరయూ తీరమున మందార వేదిక పై పద్మాసనమున, వీరాసనాసీనుడు శ్యామాంగుడు, జ్ఞానముద్రోపశోభితుడు, వామోరున్యస్త హస్తుడు సీతాలక్ష్మణసహితుడు, ఆత్మదర్శి మన్మధాతీత తేజస్కుడు, శుద్ధస్ఫటిక సంకాశుడు పరమాత్మ అయిన శ్రీరామచంద్రుని మోక్షాభిలాషులు ధ్యానించి మంత్రమును ఆరు లక్షలు జపించవలయును. హోమనిత్యార్చనాదికమును షడక్షరమంత్రమువలె నాచరించవలయును. శేషాసన వహ్నిభాంతమున ద్వ్యక్షరమనువు ఏకాక్షరమంత్రమువలె సర్వము నాచరించవలయును. త్ర్యక్షర మంత్రరాజము సకలాభీష్టప్రదము. చంద్రభద్రాంతము చతురక్షరము " ద్వివిధము. ఈ మంత్రములన్నింటిని మునిధ్యానార్చనాదికమంతయు ఏకాక్షరమంత్రము వలె నాచరించవలయును. “ఓం రామాయ హుం ఫట్ స్వాహా” అనునది అష్టాక్షర మంత్రము. మునిధ్యేనార్చనాదికమంతయు షడక్షరమంత్రము వలె నాచరించవలయును. ఇట్ల శివోమారామమంత్రములు అష్టాక్షరములు గల మంత్రములు సర్వాభీష్టప్రదములు. సదాశివుడు ఋషి గాయత్రీ ఛన్దస్సు శివోమారామచంద్రుడు దేవతా. షడ్వీర్యయుతమగు పంచాక్షరయుక్తమగు ధ్రువముచే షడంగన్యాసము నాచరించి, హృదయమున సురార్చితుడగు రాముని, సోమార్ధధారి, త్రినేత్రుడు, శూలి, భస్మోద్ధూలిత సర్వాంగుడు కపర్ది అయిన శివుని ధ్యానింతుము. రామాభిరామ, సౌందర్య సీమ, సోమాభరణ, పాశాంకుశధనుర్బాణధారిణి, త్రిలో చనయగు సీతను ధ్యానించి అక్షరలక్ష జపించవలయును. బిల్వపత్రములతో. ఫలములతో పుష్పములతో 'పద్మములతో హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో దేవతలచే అభిలషించబడు నిధులు సిద్ధులు స్వయముగా వచ్చి చేరును. తారము మాయ"భరతాగ్రజరామమనోభవస్వాహా” అనునది ద్వాదశాక్షరి మంత్రము" ఇది "మరియొక కల్పవృక్షము ముని అంగిరసుడు. గాయత్రీ ఛందస్సు-శ్రీరామచంద్రుడు - దేవత భువనబీజము స్వాహా శక్తి ,,,, మంత్రాక్షరములచే షడంగన్యాసమునాచరించవలయును. ధ్యానపూజాది కమంతయు షడక్షరివలే నాచరించవలయును. “ఓం నమస్సీతాపతయే రామాయ హనహన ఫట్” అనునది షోడశాక్షర మంత్రము. అగస్త్యమహర్షిముని. బృహతీ ఛందస్సు. శ్రీరామ చంద్రుడు దేవత. అహం బీజము, రాం శక్తి 1,1,7,1,3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలయును. ధ్యాన పూజాదికమంతయు షడక్షరమంత్రమువలె నాచరించవలయును. “ఓం నమో బ్రహ్మణ్య సేవ్యాయ రామాయ అకుంఠతేజ సే ఉత్తమ శ్లోకధుర్యాయ" అనునది మరియొక మంత్రము. శుక్రుడు ఋషి అనుష్టుప్పన్లస్సు. శ్రీరామచంద్రుడు దేవత. షడక్షరిమంత్రమువలె పానములచే పంచాంగకల్పన చేయవలయును. మంత్రమును ఒక లక్ష జపించవలయును. దశాంశము పాయసముచే హోమము నాచరించవలయును. ఈ మంత్రము సిద్ధించినచో సర్వపాపములు నశించును. భుక్తిముక్తులు లభించును.
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్"' అనునది రామగాయత్రి ఈ గాయత్రి సర్వాభీష్టఫలప్రదాయిని. “పద్మా సీతాయై ఫట్" అనునది షడక్టరి వాల్మీకి ముని. గాయత్రీ ఛందస్సు భగవతి సీత దేవత, శ్రీం అనునది బీజము. స్వాహా శక్తి. షడ్డీర్ఘయుక్తమగు బీజముచే అంగకల్పన చేయవలయును. తరువాత త్రైలోక్యపూజిత మహాదేవి తప్తకాంచన సన్నిభ, హస్తద్వయమున పద్మద్వయమును ధరించి రత్నభూషణములచే శోభించు దివ్య దేహము గలది, శుభాత్మక, నానావస్త్రధారిణి, చంద్రముఖి, పద్మాక్షి, సంతుష్టాంతరంగ, పావనుడగు రామచంద్రుని చూచుచుండునది, షడ్గుణేశ్వరి యగు సీతను ధ్యానించవలయును. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును అక్షరలక్ష జపించవలయును. దశాంశమును కమలములతో హోమము చేయవలయును. పూర్వోక్త పీఠమున పూజించవలయును. మూల మంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు జానకి నావాహించి, దక్షిణ భాగమున రామచంద్రుని, అగ్రభగమున హనుమంతుని, పృష్ఠభాగమున లక్ష్మణుని పూజించి, షట్కోణములందు అంగపూజ గావించి, పత్రములందు మంత్రిముఖ్యులను బాహ్యభాగమున లోకాధిపతులను, వజ్రాదులను పూజించి సర్వ సిద్ధీశ్వరుడగును. చందనము నలదీశ జాతీపుష్పములచే హోమమును గావించిన రోజులు వశులగుదురు. కమలములచే హోమము గావించిన జగత్తు వశమగును. మారేడు దళములచే హోమముచేసినచో సంపద, దూర్వాదళములచే హోమము గావించిన రోగములు శాంతించును. ఇంకను ఏమి చెప్పవలయును. సీతారాధన వలన ధనము, ధాన్యము, సౌభాగ్యము పుత్రులు, పౌత్రులు, ఉత్తమ సుఖము, మోక్షము లభించును. “ఓం లక్ష్మణాయ నమః” అనునది, సప్తాక్షరీ మంత్రము. ఈ - మంత్రమునకు అగస్త్యమహర్షిముని, గాయత్రీ ఛందస్సు మహావీరుడగు లక్ష్మణుడు దేవత, నమః అనునది బీజము, శక్తి షడీరాడ్యమగు బీజముచే షడంగముల నాచరించవలయును. బాహుద్వయములు కలవాడు, స్వర్ణనిభదేహుడు, పద్మాకుడు, ధనుర్బాణధరుడు, రామ సేవాసంసక్తమానసుడు అగు లక్ష్మణుని ధ్యానము గావించి మంత్రమునను అక్షరలక్ష జపించవలయును. దశాంశమును తేనే కలిపిన పొయసముచే హోమముగావించి రామపీఠమున పూజించవలయును. రామమంత్రము వలెనే పూజాదికమును గావించవలయును. ఈ మంత్రము సర్వసిద్ధిప్రదము. రామపూజ సంపూర్ణము కావలయునని భావించినచో ఆదరముచే లక్ష్మణార్చన గావించవలయును. శ్రీరామచన్దమంత్రములలో చాలా భేదములు సిద్దిప్రదములు గలవు. ఆ మంత్ర సిద్ధిని కోరువారు. లక్ష్మణారాధనను తప్పకగొచరించవలయును. అష్ణోత్తర సహస్రము కాని, అష్టోత్తర శతము కొని లక్ష్మణ మంత్రమును సావధానముగా ముముక్షువులు జాడ్యమును వీడి జపించవలయును. లక్ష్మణ మంత్రమును జపించక రామమంత్రమును జపించినవారికి సిద్ది కలుగక పోగా ప్రతిక్షణము హానియే కలుగుచుండును. ఏకాంతమున లక్ష్మణ మంత్రమును జపించువారు, సర్వపాపవినిర్ముక్తులై సర్వాభీష్టములను పొందెదరు. ఈ మంత్రమునకు ముఖ్యఫలము జయము. రాజ్యప్రాప్తికి ఉత్తమ సాధనము, నష్టరాజ్యప్రాప్తికి ఈ మంత్రమును ఒక లక్ష సావధానమనస్కుడై జపించినచో వెంటనే స్వరాజ్యమును పొందును. అనన్యమనస్కుడై అయోధ్యాభిషిక్తుడగు రాముని ధ్యానించుచు, మంత్రమును యాబది వేలు జపించినచో నష్టరాజ్యము లభించును. నాగపాశ వినిర్ముక్తుడగు లక్ష్మణుని ఆదరముచే ధ్యానించి మంత్రమును పది వేలు జపించినచో బంధముక్తుడగును. హనుమంతునిచే తేబడిన ఔషధములచే గతవ్యధుడగు లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో అపమృత్యువును జయించును. మేఘనాధుని సంహరించుచున్న లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో జయింప శక్యముకాని శత్రు బలమును కూడా త్వరలో జయించును. శూర్పణఖ నాసికను ఛేదించు ప్రయత్నమున నున్న లక్ష్మణుని ధ్యానించి ఒకవేయి జపించినచో ఇంద్రాదులను సైతము జయించును.
రామపాదపద్మములను సేవించుట కొఱకు ప్రయత్నించు లక్ష్మణుని ధ్యానించి ఏకాంతమున లక్ష జపించినచో మహా రోగమునుండి విముక్తుడగును. మూడు మాసములు ఆహారనియమముతో ప్రతి నిత్యము నూటా ఎనిమిది పుష్పములచే కాని నిశ్చిద్రములైన పద్మముల చే కాని పూజించి, ఏడువేల మార్లు జపించినచో కుష్టురోగమునుండి వినిర్ముక్తుడగును. ఏకొంతమున ఆహార నియమముతో ఆరు మాసములు ఈ విధానమును అనుసరించినచో క్షయ రోగము నుండి వినిర్ముక్తుడగును. ప్రాతఃకాలమున సావధానమనస్కుడై మూడు మార్లు మంత్రించిన జలమును మూడు మార్లు మూడువేళలలో త్రాగినచో అన్ని రోగములనుండి వినిర్ముక్తుడగును. దారిద్ర్యము తోలగి కుబేరుడంతటి వాడగును. విషాది దోషస్పర్శకూడా కలుగదు. మంత్రించిన జలముచే ప్రతి నిత్యము ముఖ ప్రక్షాళనమును గావించు కొనినచో ముఖానేత్రాదులకు సంభవించు భయంకర రోగములను జయించగలుగును. మంత్రించిన జలమును పానముచేసినచో కుస్తీరోగములు తొలగిపోవును. లక్ష్మణప్రతిమను చేసి యథావిధిగా భక్తి చే బ్రాహ్మణునికి దొనము గావించినచో సర్వరోగములనుండి ముక్తుడగును. కన్యార్థియైనవాడు విమలాపాణిగ్రహణాసక్తమానసుడై ధ్యానము చేయుచు లక్ష జపించిన దశాంశమును పద్మములచే హోమమును గావించినచో త్వరలో తాను కోరిన కన్య లభించును. దీక్షితుని, జృంభణాస్తాది మంత్రములందు నియతవ్రతుని లక్ష్మణుని ధ్యానించి విధి విధానముచే ప్రతినిత్యము ఏడు వేలు జపించుచు మూడు నెలలు నియమము నాచరించి పూజాదులనుగావించినచో సర్వవిద్యాతత్త్వజ్ఞుడగును. విశ్వామిత్రయాగమున అద్భుత పరాక్రమమును చూపిన లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో మహా భయము నుండి ముక్తుడగును. నిత్యానుష్టానము నాచరించి ప్రీతి నిత్యము మూడు వేళలా పరిశుద్దుడై మంత్రమును జపించినచో సర్వపాపనిర్ముక్తుడై శ్రీ మహావిష్ణులోకమగు పరమపదమును పొందును. విధివిధానముగా దీక్షితుడై సద్గుణములచే గతకల్మషుడై స్వాచారనియతుడై అంతరింద్రియనిగ్రహము కలవాడై, గుహస్తుడు బహిరింద్రియములను జయించినవాడై, ఐహికములన పేక్షింపక నిష్కాముడై లక్ష్మణుని అర్చించినవాడు సర్వపాపపుణ్యరాసులను భస్మము గావించి నిర్మలమనస్కుడై పునరావృత్తి రహితమగు శాశ్వత పరబ్రహ్మలోకమును పొందును. సకొమునిగా పూజించినచో కోరిన కోరికలను పొంది, మనసున తలచిన భోగములననుభవించి చాలా జన్మలు పూర్వజన్మజ్ఞానము కలవాడై అన్యమున పరమ పదమును పొందును.
శ్రీ భరతాయనమః” అనునది సప్తాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు, దేవతా, పూజాదికమంతయు పూర్వమంత్రమునకు వలెనే అని తెలియవలయును. “శ్రీ శత్రుఘ్నాయ నమః” అనునది సప్తాక్షర శత్రుఘ్నమంత్రము. సకలాభీష్టప్రదము.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున సనత్కుమారవిభాగమున తృతీయపాదమున రామాద్యుపాసనా వర్ణనమను డెబ్బదిమూడ - అధ్యాయము ముగిసినది.
