నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

13 -  ధర్మానుకథనమ్

ధర్మరాజు పలికేను :- శివాలయమును కాని విష్ణ్వాలయమును స్వయముగా నిర్మించిననూ, నిర్మింప చేసినను అతను మాత్సవంశమున పితృవంశమున లక్ష కోట్లకులములతో మూడు కల్పములు విష్ణులోకమున నివసించును. సందేహములేదు. మట్టితో దేవాలయమును నిర్మించినవాడు దివ్యదేహమును ధరించి ఉత్తమవిమానమధిరోహించి మూడు కల్పములు విష్ణులోకమున నివసించి బ్రహ్మలోకమున కేగును. అచట రెండు కల్పములు నివసించి స్వర్గమును చేరి ఒక కల్పము నివసించి తరువాత యోగుల కులమున జన్మించి దయకలవాడై వైష్ణవయోగమును అవలంబించి శాశ్వతమైన ముక్తిని పొందును. చెక్కతో దేవాలయమును నిర్మించిన వానికి రెట్టింపు ఫలితము కలుగును. ఇటుకలతో నిర్మించిన మూడు రెట్లు ఫలము కలుగును. శిలలతో నిర్మించిన నాలుగు రెట్లు ఫలితము కలుగును. స్పటికశిలలతో నిర్మించిన పదిరెట్లధికముగా ఫలము లభించును. రాగితో నిర్మించిన నూరు రెట్లు ఫలితము, బంగారముతో నిర్మించినచో కోటిరెట్లధికముగా ఫలము కలుగును. దేవాలయమును కొని తటాకమును కొని గ్రామమును కొని పరిపాలించువానికి నిర్మించు మౌనికన్నా నూరురెట్లు ఫలితము కలుగును, దేవాలయమున నీరుచల్లి, అలికి ముగ్గులువేసి శుశ్రూషచేయువారికి కలుగు పుణ్యఫలమునంతయు వేతనము తీసుకొని కాని, ఇష్టముతో కాని పుణ్యకార్యములలో ప్రవర్తించువారు ఈ భూమీకి ఆధారభూతులై శాశ్వతమైన విష్ణులోకమును పొందేదరు. సరస్సును నిర్మించినచో తటాకమును నిర్మించుదానిలో సగము ఫలమును పొందును. కూపమును నిర్మించినచో నాలుగవ భాగము ఫలము కలుగును. దిగుడు బావి నిర్మించినచో పద్మసరస్సును నిర్మించిన ఫలము కలుగును. కాలువ నిర్మించినచో వాపికి నూరు రెట్లు ఫలము కలుగును. ధనవంతుడు రాళ్ళతో నిర్మించినను, దరిద్రుడు మట్టితో నిర్మించిననూ ఫలము సమానముగా కలుగునని బ్రహ్మ చెప్పెను.

ధనవంతుడు నగరమును, దరిద్రుడు ఒక మూర భూమిని దానము చేసినచో. వారిరువురికి సమానఫలము లభించును అని వేదపండితులు చెప్పేదరు. ఫలమునిచ్చు తటాకమును ధనవంతుడు నిర్మించినను, దరిద్రుడు కూపమును తవ్వించిననూ పుణ్యము సమానముగా లభించును. పలుప్రాణులకుపకరించు ఆశ్రమమును నిర్మించినవాడు మూడు తరముల వరకు బ్రహ్మలోకమును పొందును. ఆ యాశ్రమవృక్షచ్ఛాయలో ఒక ఆవుకొని, బ్రాహ్మణుడు కాని అరక్షణము నిలిచినచో కర్త దేహాంతమున స్వర్గమును పొందును. ఆరామమును నిర్మించిన వారు, దేవాలయమును నిర్మించిన వారు, తటాకమును గ్రామమును నిర్మించినవారు శ్రీహరితో సమానముగా పూజించబడుదురు. ప్రజలందరికొఱకు కాని దేవతల కొఱకు కాని పూలతోటను ఏర్పరచినవారు కోటికులముల వరకు ఆ తోటలో నున్న ఆకుల పండ్ల సంఖ్యలో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. ముళ్ళు బాధించనట్లు ఆ తోటలో ఆవరణమును నిర్మించినవారు, పూలతోటకు ప్రాకారమును నిర్మించినవారు డెబ్బది యొకటి యుగములు బ్రహ్మలోకమున నివసింతురు. తులసీ వృక్షమును నాటిన వారు ఏడు కోట్లకులములవరకు మాత్సవంశమున పితృవంశమున నుండువారితో నూరు కల్పములు నారాయణుని లోకమున నివసించును. తులసీ మూలమృత్తికతో కాని, గోపీ చన్దనముతో కాని, చిత్రకూట మృత్తికతో కాని గంగా మృత్తికతో కాని ఊర్థ్వపుండ్రమును ధరించినవారు గంధర్వాపరోగణములతో కలిసి గానము చేయబడుచు విష్ణు మందిరమున ఆనందింతురు. తులసీ మూలములనుండి ఎన్ని ఆకులు రాలుచుండునో అన్ని బ్రహ్మ హత్యాది పాతకములు నశించును. ఒక చుళుక మాత్రము జలమును తులసీమూలమున తడిపినచో సూర్యచంద్రులున్నంతవరకు శ్రీమహావిష్ణువుతో కలిసి యుండును. బ్రాహ్మణులకు తులసీ దళమును ఇచ్చినవారు మూడు తరముల వరకు బ్రహ్మ లోకమున నివసింతురు. తులసీదళములను శాలగ్రామమున అర్పించినవారు ప్రళయకాలము వరకు విష్ణు భవనమున నివసించును. తులసీ వృక్షమునకు ముళ్ళతీగ ఆవరణముగా, ప్రాకారము కాని చేయించినవారు ఇరువది యొక్కతరములు విష్ణులోకమున ఆనందింతురు. తులసీదళములతో శ్రీహరి పాదపద్మములను అర్చించినవారు విష్ణులోకమును చేరి శ్వాశ్వతముగా మరల తిరిగి రాక అచటనే నివసింతురు.

ద్వాదశీతిథియందు పూర్ణిమాతిథి యందు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో పది వేల తరములతో విష్ణులోకమున ఆనందించును. ఒక గరిటెడు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములతో విష్ణులోకమున నివసించును. ద్వాదశినాడు గరిటెడు నెయ్యితో శ్రీహరిని స్నానము చేయించినచో కోటితరములతో శ్రీహరి సాయుజ్యమును పొందును. ఏకాదశీ తిథిన పంచామృతముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిలక్షల తరములతో శ్రీహరి సాయుజ్యము లభించును. ఏకాదశి, పూర్ణిమ, ద్వాదశీతిథులలో నాలి కేర జలముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిజన్మలలో చేసిన పొపములు, తొలగి రెండువందల తరములతో శ్రీమహావిష్ణువుతో ఆనందించును. చెఱకు రసముతో శ్రీహరిని స్నానము చేయించినచో లకతరములతో విష్ణులోకమున నివసించును. పుష్పోదకముతోకాని, గంధోదకముతో కాని శ్రీహరిని స్నానము చేయించిన విష్ణులోకము లభించును. వస్త్రముచే వడపోసిన జలముచే శ్రీహరిని స్నానము చేయించినచో అన్ని పాపములు తొలగి శ్రీమహావిష్ణువుతో ఆనందించును. సూర్యసంక్రమణమున క్షీరాదులతో శ్రీహరిని స్నానము చేయించినచో ఇరువదియొక్కతరములతో శ్రీవిష్ణులోకమున నివసించును. శుద్దచతుర్ధశి యందు అష్టమీతిథి యందు పూర్ణిమాతిధి యందు ఏకాదశీతిథి యందు, ఆదివారము నందు, ద్వాదశీతిథి యందు పంచమీతిథి యందు సోమ సూర్యగ్రహణములలోను, మన్వాదియుగాది సమయమునందు, సూర్యుని అర్థోదయమున, సూర్యుడు పుష్యమీ నక్షత్రమున ఉన్నపుడు, బుధుడు రోహిణీ నక్షత్రమున నుండగా, శని రోహిణిలో, కుజుడు అశ్వినిలో, శని అశ్వనిలో, శుక్రుడు మృగశిరలో రేవతిలో, బుధుడు అనూరాధలో, సూర్యుడు శ్రవణములో, చంద్రుడు శ్రవణములో, బృహస్పతి హస్తలో ఉన్నప్పుడు, బుధాష్టమియందు, బుధాషాఢలో, ఇతర పుణ్యదినములలో శాంతి కలిగి వాజియమముతో శ్రీహరిని పొలతో స్నానము చేయించవలయును. నేయితో, తేనెతో, పెరుగుతో నైనను స్నానము చేయించినచో అన్నియజ్ఞములు ఆచరించిన ఫలమును పొంది, అన్ని పాపములనుండి విముక్తిని పొంది ఇరువది ఒకటి తరములతో విష్ణుపురమున నివసించి అచటనే జ్ఞానమును పొంది యోగులకు కూడా దుర్లభము పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును.

కృష్ణపక్ష చతుర్దశీ తిథి యందు సోమవారమునాడు శివుని పాలతో అభి షేకము చేసినచో శివసాయుజ్యమును పొందును. అష్టమీతిథి యందు కొని, సోమవారమునాడు కాని తొలి కేర జలముచే శివాభి షేకము చేసిననూ శివసాయుజ్యమును పొందును. శుక్లపక్ష చతుర్దశినాడు, అష్టమినాడు నేతితోకాని తేనేతో కాని-శివాభి షేకము చేసినచో శివసామ్యమును పొందును. నువ్వుల నూనెతో శివుని కాని విష్ణువును కాని అభి షేకము చేసినచో ఏడు తరములతో శివవిష్ణు సారూప్యమును పొందును. చెరుకు రసముతో శివుని స్నానము చేయించినచో ఏడు తరములతో శివలోకమున ఒక కల్పము నివసించును. ఉత్థాన ద్వాదశినాడు పాలతో కాని నేతితో కాని అభి షేకము చేసినచో "పది వేల జన్మలలో చేసిన పాపములనుండి విముక్తుడై కోటి తరములతో శివసామ్యమును పొందును. ఏకాదశితిథినాడు గంధపుష్పములతో శ్రీవిష్ణువును ఆరాధించి పదివేల జన్మలలోని పాపముల నుండి విముక్తుడై శ్రీవిష్ణుపదమును పొందును. పద్మములతో శివుని కాని శ్రీమహావిష్ణువును కొని పూజించినచో కోటి తరములతో విష్ణుభవనమును చేరును. శ్రీహరిని మొగిలి పుష్పములతో, శివుని ఉమ్మేంత పూవులతో రాత్రిపూట పూజించినచో పాపములు నశించి శ్రీవిష్ణు నగరమున ఒక యుగమున నివసించునుసం పెంగ పూలతో శ్రీహరిని, జిల్లేడు పూలతో శంకరుని పూజించి హరి శివసాలోక్యములను పొందును. శంకరునికి కాని విష్ణువునకు కాని నేతితో సాంబ్రాణి ధూపమును వేసినచో అన్ని పాపములనుండి విముక్తుడగును. నువ్వుల నూనెతో దీపమును శ్రీమహావిష్ణువునకు కాని శంకరునికి కాని అర్పించినచో అన్ని కోరికలు తీరును. శంకరునికి కాని శ్రీమహావిష్ణువునకు కాని నేతితో దీపము పెట్టినచో అన్ని పాపముముల నుండి విముక్తుడై గంగా స్నానఫలమును పొందును. గ్రామ్యములైన ఏ నూనెలతో నైనను శ్రీమహావిష్ణువునకు, శివునికి దీపమును వెలిగించినచో అన్ని పాపముల నుండి విముక్తుడై సర్వేశ్వర్యములతో కూడి విష్ణు శివసాలోక్యములను పొందును. అత్యంతము ఇష్టమైన భోజనమును విష్ణువునకు కాని శివునికి కానీ అర్పించి విష్ణులోకమును శివలోకమును చేరును. అత్యంతము ఇష్టమైన వస్తువును బ్రాహ్మణునకు దానము చేసినచో పునరావృత్తిరహితమైన వైకుంఠమును చేరును.

గర్భస్థ శిశువును చంపినవాడు సువర్ణమును దానము చేసినచో ఆ పాపము తొలగి పరిశుద్దుడగును. అన్నదానముతో జలదానముతో సమానమైన దానము " ఇదివరకు లేదు. ఇకముందుండబోదు. అన్నదానము చేసినవాడు ప్రాణదానము చేసిన వానితో సమానుడు. ప్రాణదానము చేసినవాడు అన్నిదానములు చేసిన వానితో సమానుడు. కావున అన్నదానము చేసినవాడు సర్వదానములు చేసిన వాని ఫలితమును పొందును. అన్నదానమును చేసినవాడు తన పదివేల మంది వంశస్థులతో బ్రహ్మ లోకమును చేరును. మరల తిరిగి రాడని శాస్త్రములు నిశ్చయించినవి. జలదానము వెంటనే తృప్తి కలిగించునది కావున అన్నదానము కం టే జలదానము ఉత్తమమని బ్రాహ్మవాదులు నిర్దేశించిరి. మహాపాతకములతో కూడియున్నను ఉపపాతకములతో కూడియున్ననూ జలదానము చేసినవాడు విముక్తుడగునని బ్రహ్మ చెప్పెను. శరీరము అన్నము వల్లనే పుట్టును. ప్రాణములు కూడా అన్నము వల్లనే కలుగును. కావున అన్నదానము చేసిన వాడు ప్రాణదానము చేసిన వాడే యగును. అన్నదానము వెంటనే తృప్తి కలిగించునది. అన్ని కోరికలను తీర్చునది. కావున ఈ భూలోకమున అన్నదానముతో సమానమైన దానము మరియొకటి లేదు. అన్నదానము చేసిన వారి కులములో పుట్టిన వారు వేయి. తరముల వరకు నరకమును చూడరు. కావున అన్నదానము చేసినవాడు సర్వ శ్రేష్ఠుడు. అతిథికి పొదప్రక్షాళనము చేసినవాడు గంగాస్నానముతోపాటు అన్ని పుణ్యతీర్ణములలో స్నానముచేసిన ఫలము పొందును.. బ్రాహ్మణులకు తైలాభ్యంగనమును చేయించినవాడు గంగలో నూట ఎనిమిది స్నానములు చేసినవాడగును. వ్యాధిగ్రస్తులైన బ్రాహ్మణులను ప్రేమతో రక్షించువాడు కోటితరములతో బ్రహ్మ లోకమున నివసించును. పేదవానిని కాని రోగిని కాని రక్షించువానికి విష్ణువు ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. రోగముతో నున్న వానిని మనసుతో వాక్కుతో కర్మతో త్రికరణ శుద్ధిగా రక్షించువాడు అన్ని పాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలను నెరవేర్చుకొనును.

బ్రాహ్మణునకు గృహదానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై తన లోకమునిచ్చును. వేదాధ్యయనపరుడైన బ్రాహ్మణునకు పాలిచ్చు ఆవును దానము చేసినవాడు ఇతరులకు దుర్లభమైన బ్రహ్మలోకమున కేగును. తన వద్ద లేనిచో ఇతరుల నుండి తీసుకొనైనను పాలిచ్చు ఆవును బ్రాహ్మణునకు దానము చేసిన దానికి కలుగు పుణ్యఫలమును నేను చేప్పజాలను. వేదములు తెలిసిన బ్రాహ్మణునికి కపిలగోవును దానము చేసినవాడు అన్ని పాపములనుండి విముక్తుడై స్వయముగా రుద్రుడే యగును. వేదములు చక్కగా తెలిసిన బ్రాహ్మణునికి ప్రసవించుచున్న ఆవును దానము చేసిన వానికి కలుగు ఫలమును నూరు సంవత్సరములలో కూడా లెక్కించలేరు. సంపూర్ణముగా ఉత్తమ దక్షిణలిచ్చు అన్ని యాగములు, ప్రాణభయముతో నున్న ప్రాణి ప్రాణములను కాపాడుట ఈ రెంటి వలన కలుగు ఫలితము ప్రసవించు ఆవును దానము చేసిన వానికి కలుగును. భయముతో వణుకుచున్న బ్రాహ్మణుని రక్షించిన వానికి సర్వతీర్థస్నానఫలము, సర్వయజ్ఞదీక్షాఫలము కలుగును. వస్త్రదానము చేసిన వానికి రుద్రలోకము, కన్యాదానము చేసిన వానికి బ్రహ్మ లోకము కలుగును. బంగారము నిచ్చినవాడు విష్ణులోకమును పొందును. అలంకరించిన కన్యను అధ్యాత్మజ్ఞానము కలవానికి దానము చేసిన వాడు నూరుతరములతో బ్రహ్మలోకమున కేగును. కార్తీక పూర్ణిమనాడు, ఆషాడ పూర్ణిమనాడు శివుని ప్రీతి కొఱకు వృషభమును విడచినవాడు ఏడు జన్మల పాపములనుండి విముక్తుడై రుద్రరూపమును పొంది డెబ్బది తరములతో రుద్రునితో కలిసి ఆనందించును. శివలింగ చిహ్నమును చిత్రించి మహిషమును వదలిన వానికి యాతనా లోకము (నరకము) కలుగదు. తాంబూల దానము చేసిన దానికి శ్రీహరి ప్రసన్నుడై ఆయుష్యమును కీర్తిని సంపదను ఇచ్చును. పొలు పెరుగు నెయ్యి తేనెలను దానము చేయువారు పదివేల దీవ్యవర్షములు స్వర్గమున నివసింతురు. చెరుకును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరును. గంధమును పుణ్యఫలమును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరుదురు. గుడమును చెరుకు రసమును దానము చేయువారు క్షీరసాగరమునకేగెదరు.

రాజ భటులకు మంచినీరిచ్చిన వారు సూర్యలోకమును పొందును. విద్యాదానము చేసినవారు హరి సాయుజ్యమును పొందెదరు. విద్యాదానము, భూదానము, గోదానము పరమోత్తమములు. కావున నరకమును తప్పించును. అన్ని దానములలో విద్యాదానము విశిష్టమైనది. విద్యాదానముతో విష్ణు సాయుజ్యమును పొందును. వంట చెరకును దానము చేసినచో ఉపపాతకములనుండి విముక్తి లభించును. శాలగ్రామశిలాదానము మహాదానమని చెప్పబడుచున్నది. కావున శాలగ్రామదానమును చేసిన వారు మోక్షమును పొందెదరు. లింగదానమును చేసిన వారు కోటిబ్రహ్మాండములను దానము చేసిన వారికంటే రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామదానమును చేసినవారు లింగదానమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామ శిలారూపమున నున్నది. శ్రీమహావిష్ణువేనని ప్రసిద్ధి కలదు. కావున ఇంటిలో దానము చేసిన వారు గంగా స్నాన ఫలమును పొందును. రత్నములతో కూడిన బంగారమును దానము చేయుట మహాదానము కావున ఆ దానమును చేసిన వారు భోగమును మోక్షమును పొందెదరు. మాణిక్యదానముతో మోక్షమును పొందును. వజ్రదానముతో ధ్రువలోకమును పొందును. పగడమును దానము చేసినచో స్వర్గమును, వాహనమును దానము చేసినచో రుద్రలోకమును, ముత్యములను దానము చేసినచో చంద్రలోకమును, వైడూర్యదానమున రుద్రలోకమును పొందెదరు. పుష్పరాగ దానముతో ఇహపరములలో సుఖమును పొందెదరు. అశ్వదానమున అశ్వలోకమును, గజదానమున సర్వకామములను పొందును. వాహనమును దానము చేసినచో దివ్యవిమానమునధిరోహించి స్వర్గమును పొందును, గేదెను దానము చేసిన వారు అపమృత్యువును జయించును. గోవులకు తృణము నొసగిన వారికి రుద్రలోకము లభించును. లవణ దానముచే వరుణలోకమును పొందెదరు. తమ తమ ఆశ్రమాచారములలో నుండువారు అన్ని ప్రాణుల హితమును కోరువారు, డంబాచారములు లేనివారు, అసూయ తొలగినవారు బ్రహ్మ లోకమును పొందెదరు. ఇతరులకు మంచిని ఉపదేశించువారు, రాగములేనివారు, మాత్సర్యము తొలగినవారు, శ్రీహరి పాదములను అర్చించువారు శ్రీహరి లోకమును పొందెదరు. సజ్జనులతో కలిసి యుండవలయునని అభిలషించువారు, సత్కర్మలను చేయువారు ఇతరుల పై అపవాదు వేయనివారు శ్రీహరి మందిరమును పొందెదరు. బ్రాహ్మణులకు, గోవులకు ఎపుడూ హితమునే చేయువారు, పరస్త్రీ సంగమమును కోరని వారు యమలోకమును చూడరు. ఇంద్రియ జయము, ఆహారజయము కలవారు, గోవుల విషయమున క్షమాపరులు, సౌశీల్యము కలవారు, బ్రాహ్మణుల విషయమున క్షమాశీలురు శ్రీహరి లోకమును చేరెదరు. అగ్నిని, గురువులను, భర్తను సేవించువారలు సంసారమున బడరు. ఎపుడూ దైవార్చనను, కోరువారు హరినామ సంకీర్తనమును చేయువారు, ఎవరినుండి దేనిని గ్రహించనివారు పరమపదమును పొందెదరు. దిక్కులేని బ్రాహ్మణ శవమును దహనము చేసిన వారికి వేయి అశ్వమేధయాగముల ఫలము లభించును.

పూజలులేని లింగమును పత్రములతో ప్పుములతో ఫలములతో జలముతో పూజినంచివారు దివ్య విమానము నధిరోహించి గంధర్వాపురోగణములచే స్తుతించబడుచు శివసాన్నిధ్యమును చేరెదరని బ్రహ్మ చెప్పియుండెను. చారెడు నీటితో శివలింగమునకు అభి షేకమును చేసిన వారికి లక్షాశ్వమేధయాగముల ఫలము లభించి తీరును. సంశయముతో పనిలేదు. పూజలులేని శివలింగమును పుష్పములతో పూజించిన వారికి పది వేల అశ్వమేధయాగముల ఫలితము లభించును. భక్ష్యభోజ్యఫలములతో పూజలులేని శివలింగమును పూజించినవారికి పునరావృత్తిరహితమైన శివలోకము లభించును. పూజలులేని శ్రీహరిని జలముతో పూజించిననూ విష్ణుసాలోక్యమును పొందును. దేవాలయమున మార్జనము చేసినచో ధూళిరేణువుల సంఖ్యగల సంవత్సరములు విష్ణులోకమున నివసించును. భిన్నమైన స్పటిక లింగమును సంధానము చేసినవారు నూరు జన్మల పాపములనుండి విముక్తడగును. దేవాలయమున గో చర్మమాత్రమైనను భూమిని నీటితో చల్లి తడిపినచో స్వర్గమును పొందును. దేవాలయమున గంధోదకమును చల్లినచో తడిసిన ధూళికణముల సంఖ్య గల సంవత్సరములు దేవలోకమున నివసించును. మట్టితో కాని, రంగురంగుల ధాతువులచే కాని దేవాలయమును అలికినచో కోటి తరములనుద్దరించి విష్ణుసామ్యమును పొందెదరు. దేవాలయమున ముగ్గులు దిద్దినచో, స్వస్తికాదులను చిత్రించినచో వారికి లభించేడు పుణ్యము అనంతము. దేవాలయమున దీపమునుంచిన వాని పుణ్యమును నూరు సంవత్సరములలో కూడా లేక్కించలేము. విష్ణువునకు కాని, శంకరునకు కాని అఖండదీపమునుంచిన వారికి ప్రతిక్షణము అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. పూజించిన శంకరుని కాని, విష్ణువును కొని చూచి నమస్కరించినవారు శ్రీ విష్ణులోకమును చేరి మహావిష్ణువుతో కలిసి ఆనందింతురు. దేవికి ఒక ప్రదక్షిణమును, సూర్యునికి ఏడు ప్రదక్షిణములును, వినాయకునికి మూడు ప్రదక్షిణములు, విష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేసి, వారివారి లోకములను చేరి లక్షయుగములు ఆనందింతురు. భక్తి భావముతో విష్ణువునకు, గోవునకు, బ్రాహ్మణులకు ప్రదక్షిణములను చేసినవారికి అశ్వమేధయాగఫలము లభించును. కాశీలోని మహేశ్వర లింగమును పూజించి నమస్కరించిన వారికి కర్మ, సంసారము ఉండదు. యథావిధిగా సవ్యముగా శివునికి ప్రదక్షిణము చేసినవారు శివుని అనుగ్రహము వలన స్వర్గమునుండి పతనమును పొందరు.

నిర్మలుడు జగన్నాథుడు అయిన నారాయణుని స్తోత్రములతో స్తుతించి మనసున కోరిన కోరికలనన్నింటిని పొందగలడు. దేవాలయమున భక్తిగల వాడై నృత్యమును కాని, గానమును కాని చేసినచో రుద్రలోకమును పొందును. దేవాలయమున వాద్యములను మోగించినవారు హంసవాహనమధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. దేవాలయమున కరతాళ ధ్వనిచేయువారు అన్నిపాపములనుండి విముక్తిని పొంది విమానమధిరోహించి దేవలోకమున పదివేల యుగములుందురు. దేవాలయమున ఘంటా నాదమును చేసినవారికి కలుగు పుణ్యమును స్వయముగా శివుడు కూడా చెప్పజాలడు. దేవాలయమున భేరీ మృదంగ పటహ మురజ డిండిమలతో దేవాధీశుని సంతోషింపచేసిన వారు దేవతా స్త్రీ గణములతో కూడి అన్నికోరికలను నెరవేర్చుకొని స్వర్గలోకమును చేరి అయిదు, కల్పములు ఆనందింతురు. దేవాలయమున శంఖనాదమును చేసినవారు అన్ని పాపముల నుండి విముక్తిని పొంది విష్ణువుతో కూడి ఆనందింతురు. విష్ణుమందిరమున కంచుతాళముల ధ్వని చేసినవారు అన్ని పాపములనుండి విముక్తిపొంది విష్ణులోకమును చేరును. శ్రీమహావిష్ణువు సర్వదర్శి; జ్ఞానరూపుడు; నిరంజనుడు. అతడు సంతోషించినచో పరిపూర్ణముగా సర్వ ధర్మఫలములను ప్రసాదించును. దేవదేవుడైన శ్రీమన్నారాయణుని స్మరించినచో సర్వకర్మలు సఫలములగును. పరమాత్మ జగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మల ఫలములనిచ్చువాడు. సత్కర్మలను చేయువారు నిత్యము స్మరింతురు. శ్రీహరి అందరి ఆర్తిని తొలగించును. శ్రీమహావిష్ణువును ఉద్దేశించి చేసినదేదైనను ఆనన్త్యమును ప్రసాదించును. ధర్మములు, ధర్మఫలములు, కర్మలు, కర్మఫలములు, కర్మఫలభోక్త, కార్యము, కరణములు అన్నియూ శ్రీమహావిష్ణువే. శ్రీమహావిష్ణువు కంటే భిన్నమైన దేదీ మరియొకటిలేదు.

ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మానుకథనమను పదమూడవ అధ్యాయము సమాప్తము.