నారద మహా పురాణము - పూర్వార్థము
84 - దేవీ మంత్ర నిరూపణమ్
సనత్కుమార మహర్షి పలికెను :
ఓ బ్రాహ్మణోత్తమా! కలి కల్పాంతరమున అవ్యక్త జన్మయగు బ్రహ్మలోక పద్మమున సృష్టి కొరకు తపస్సు చేయుచుండగా విష్ణు కర్ణమలము నుండి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి. వారిద్దరూ పుట్టిన వెంటనే ప్రలయ లక్షణమగు జాను మాత్ర జలమున నిలిచి కమలముననున్న బ్రహ్మను చూచి భక్షించుటకు ముందుకు రాగా బ్రహ్మ జగదంబికను స్తుతించెను. తరువాత జగత్కర్తి శైవీ శక్తి యగు దేవి నారాయణ నేత్రమున నుండునదై ప్రీతి చెందెను. ఇపుడు ఆ దేవి యొక్క మంత్రాదికము నంతటిని చేప్పెదను వినుము. సొరుణా క్రోధనీ శక్తి చంద్రాలంకృత శేఖరా. “హీం” అను ఏకాక్షరీ బీజ మంత్రము. గాయత్రీ ఛందస్సు. భువనేశ్వరి దేవత. షడ్డీర్ఘ యుక్త బీజముచే అంగన్యాసమును చేయవలయును. సంహార సృష్టి మార్గముతో మాతృ కాన్యస్త విగ్రహుడై మంత్ర న్యాసమును దేవతా భావ సిద్ది కొఱకు చేయవలయును. హృల్లేఖను మూర్థ యందు వచనమున, హృదయాంబుజమున గగనమును, రక్త కరాలికను గుహ్యమున, పదద్వయమున మహోచ్చుష్మమును ఊర్థ్వప్రాగ్గక్షిణాదీచ్య పశ్చిమోత్తరములందు సద్యాదిహ్రస్వ బీజాదులను న్యాసమును చేయవలయును. తరువాత జాతీయుక్త షడంగములను క్రమముగా న్యాసమును చేయవలయును. గాయత్రీ సహితుడగు బ్రహ్మను ఫాలమున నుంచవలయును. సావిత్రీ సహితుడగు విష్ణువును దక్షిణ కపోలమున, వాగేశ్వరీ యుక్తుడగు మహేశ్వరుని వామగండమున, శ్రీ యుక్తుడగు ధన పతిని వామ కర్ణాగ్రమున రతీయుతుడగు స్మరుని ముఖమున న్యాసము చేయవలయును. పుణ్యా గణపతిని సవ్యకర్లో పరిభాగమున కర్ణాంగండాంతరాలము లందుంచ వలయును. వదనమున మూలము నుంచి తరువాత కంఠమూలమున, స్తనద్వంద్వమున, వామ భుజమున హృదయాంబుజమున, వామ భుజమున, పార్శ్వయుగలమున, నాభి దేశమున చైత్రముల నుంచవలయును. ఫాలములను పార్శ్వ జఠరమున పొర్వాంసమున, హృదయమున నుంచవలయును. బ్రహ్మణ్యాదులను యథావిధిగా శరీరము నందుంచి, మూలముచే దేహమున వ్యాపకము నుంచి దేవిని ధ్యానించ వలయును. ఉదయించు సూర్యుని కాంతి గలది, ఉన్నత వక్షోజములు గలది, త్రిలోచన, చిరునవ్వుమోము కలది, ఇందుమకుట, వరపాశాంకుశాభయ ధారిణి యగు దేవిని ధ్యానించి, మంత్రమును ముప్పది రెండు లక్షలు జపించవలయును. దశాంశమును త్రిమధు మిశ్రితములగు అష్టద్రవ్యములచే, బ్రహ్మవృక్ష సమిధలచే కాని హోమమును గావించ వలయును. ద్రాక్ష, ఖర్జూర, కాలూద, శక్కర, నాలికేర, తండుల, ఆజ్య, తిలములు అష్టదవ్యము లనబడును. పార్వతిని ధ్యానించుచు సూర్యున - కర్యము నీయవలయును. తద్బాహ్యమున షోడశదలములచే కూడియున్న అష్టదల పద్మమును లిఖించవలయును. కర్ణికా మధ్యమున షట్కోణమును లభించవలయును. తరువాత నవశక్తి సమన్వితమగు పీఠమును పూజించవలయును. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్రీ, అఘోరా, మంగలా అనునవి నవశక్తులు. బీజయుతమగు నాసనమునిచ్చి, ఆ బీజముచేతనే మూర్తిని కల్పించి, దాని యందు దేవిని ఆవాహించి ఆవరణలచే క్రమముగా పూజించవలయును. మధ్య ప్రొగ్యామ్య ఉత్తరము లందు అంగ దేవతలను పూజించవలయును. షట్కోణములందు మిధున దేవతలను పూజించవలయును. ఇంద్రకోణమున (తూర్పున) దండకుండికా అక్షగుణాభయ ధారిణి యగు గాయత్రిని, ఇట్టి బ్రహ్మను కూడా పూజించవలయును. నైరుత దిక్కునందు శంఖ చక్ర గదా పద్మ ధారిణీ, పీత వసనయగు సావిత్రిని, అట్టి విష్ణువును పూజించవలయును. వాయు కోణమున పరశు, అక్షమాలా అభయ వరాన్వితయగు, స్వచ్చ వర్ణయగు సరస్వతిని, అట్టి లక్షణములు గల రుద్రుని పూజించవలయును. ఆగ్నేయ కోణమున రత్నకుంభమును, మణి కరండకమును, కరములచే ధరించియున్న, పీతవర్ణయగు దేవిని, ధనదాయకుడగు తుందిలుని వామ హస్తముచే ఆలింగనము చేసుకొని, దక్షిణ హస్తమున తాంబూలమును ధరించియున్న ధనదారిక సమారూఢయగు మహాలక్ష్మిని పూజించవలయును. పశ్చిమ కోణమున బాణపాశాంకుశ ధనువులను ధరించి జపొరక్త వర్ణుడు, రక్త భూషణుడగు మన్మధుని పూజించవలయును. దక్షిణ భుజముచే భర్త నాలింగనము చేసుకొని, వామ హస్తమున ఉత్పలమును ధరించియున్న, భర్త వడిలో కూర్చొనియున్న రతీదేవిని చక్కగా పూజించవలయును. ఐశాన్య కోణమున ప్రియాన్వితుడు, సృణపాశధరుడు, సుందరుడు, వరాంగ సృక్కలాంగులి, మాధ్వీపూర్ణ కపాలాఢ్యుడు, దిగంబరుడు, పుష్కరమున విగలద్రత్న స్ఫురచ్చషక ధారియగు విఘ్నరాజును పూజించ వలయును. సింధూర సదృశాకారము గలది, ఉద్దామమద విభ్రమ, రక్తాత్పల ధారిణి, ఇతర హస్తముచే ధ్వజమును స్పృశించునది, భర్తను ఆలింగనము చేసుకొనియున్న, దిగంబరయగు పుష్టిని కర్ణికయందు పూజించవలయును. షట్కోణ పార్శ్వము లందు అంగములను పూజించవలయును. తరువాత కేశరము లందు పత్రములందు ఈ దేవీ మణులను పూజించవలయును. అనంగకుసుమ, ఆనంగమేఖల, ఆనంగ గమనా, అనంగ మదనాతుర, భువనపాలా, గగనవేగా, శశిరేఖ గగనలేఖ యనెడు అష్టశక్తులు. ఖడ్గ ఖేటకధారిణులు, శ్యామ వర్ణములు కల మాతృకలను పూజించవలయును. పద్మ బాహ్య ప్రదేశమున శక్తులను పరిచారికలను పూజించవలయును. అనంగ ద్వయా, అనంగమదన, మదనాతురా, భువనవేగా, భువనపాలికా, సర్వశిశిరా, అనంగవేదనా, అనంగమేఖల, అనువారు పరిచారికలు శక్తులు. చషకమును, తాలవృంతమును, తాంబూలమును, ఉజ్జ్వల ఛత్రమును, చామరములను, అంశుకమును పుష్పములను చేతులలో ధరించి యుందురు. సర్వాభరణ భూషితులగు లోకపాలురను బాహ్య ప్రదేశమున పూజించవలయును. తద్బాహ్యమున వజ్రాదులను పూజించవలయును. ఇట్లు దేవీ పూజ గావించవలయును. త్రిమధుర మిశ్రితములగు అశ్వత్త సమిధలచే హోమమును గావించి బ్రాహ్మణులను వశము చేసుకొన వచ్చును. పద్మముల హోమముచే క్షత్రియులు వశములో నుందురు, పలాశ పుష్ప హోమముచే వారి పత్నులు వశులగుదురు. కలువలచే హోమము చేసినచో మంత్రులు వశులగుదురు. ఇరువది అయిదు మార్లు జపించిన జలముచే ప్రతి దినము స్నానము గావించినచో సర్వసౌభాగ్యవంతుడగును. ఇరువది మార్లు జపించిన జలమును ప్రతిదినము ప్రాతః కాలమున పానము గావించినచో సాటిలేని ప్రజ్ఞను పొంది కవులలో శ్రేష్టుడు కాగలడు. కర్పూరాగరు కస్తూరీ సంయుక్తమగు కుంకుమను చక్కగా మంత్రించి తిలకముగా ధరించినచో రాజులు వశులగుదురు. మధురాన్వితమగు వరిపిండిచే బొమ్మను చేసి జపించి ప్రాణ ప్రతిష్ట గావించి ఆదివారమున భక్షించినచో రాజును కానీ పురుషుని కాని స్త్రీని కాని వశము చేయును. కంఠమాత్ర జలమున నిలిచి జలము నుండి వచ్చు సూర్యుని చూచి మూడు లక్షలు జపించినచో ఇష్టమగు కన్యను పొందును. సంపద కొరకు మంత్రితాన్నమును భుజించవలయును. భస్మముచే సాధించ దగిన మాటును ఫలకాదులందు లిఖించి, ఆ సమయమున యంత్రమును చూపినచో సుఖ ప్రసవము జరుగును. ఈమెయే సహస్ర భుజ సంభవయగు భువనేశ్వరి యనబడును. తలచు మానవులకు భుక్తిముక్తి ప్రదురాలుగా పేర్కొనబడినవి.
ఒకకల్పమున ఒకపుడు మహిషారుడు లోకపాలురను తన బలముచే గెలిచి జగత్రయమును అనుభవించుచుండెను. అంతట అతనిచే పీడించబడిన దేవతలు శ్రీ మహా విష్ణువును శరణు వేడిరి. అపుడు మహాలక్ష్మీ దేవి చక్రాద్యంగ ప్రభవ తేజస్సుచే మూర్తిని ధరించి, జగత్రయమును వ్యాపించి మహిషాద్యసురలను సంహరించి అరవిందవనమును చేరి, సేవించువారి అభీష్టములనిచ్చు చుండెను. ఇపుడు ఈ దేవీ పూజా విధానమును సంక్షేపముగా చెప్పెదను వినుము.
గురువగు మృత్యు క్రోధముచే బిందు భూషిత మస్తకము శ్రీ బీజ మంత్రము. అనగా “శ్రీం” అనునది బీజమంత్రము. భజించు వారికి అభీష్ట ప్రదము. భృగువు మహర్షి నివృత్ ఛందస్సు. శ్రీ దేవత. షడ్డీరయుక్త బీజముచే షడంగములను క్రమముగా కల్పించవలయును. తరువాత జగద్వేద్య సంపత్తి దాయిని, కాంచనాభ, నాలుగు తెల్లని యేనుగులు తమ తొండములచే ధరించిన బంగారు కలశములతో అమృతాభిషేకము చేయుచుండగా పద్మమున నున్న, వరాభయాబ్జ స్రగ్ధరిణీ, క్షామ వస్త్ర కిరీటధారిణి, యగు మహా లక్ష్మిని ధ్యానించ వలయును. ఎనిమిది లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును సుగంధకుసుమములచేకాని, మధుర పుతములగు కమలములచే కాని హోమము చేసి మహాలక్ష్మికి చెప్పబడిన పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూర్వోక్త విధానముగా అంగములను అర్చన చేయవలయును. అష్టదలము లందు పూజించవలయును. వాసుదేవుని సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని హిమ పీత తమాలేన్ల నీల వర్ణులను పీత వస్త్ర ధారులను, శంఖ చక్ర గదా పద్మధారులను, చతుర్భుజులను పూజించవలయును. దిక్కులందు పత్రములందు దమకొదులను పూజించవలయును. దమకమును, పుండరీకమును గుగులు కురింటకము అనుగజములు. దక్షిణ భాగమున ప్రమదాన్వితనుగు శంఖ నిధిని పూజించవలయును. ముక్తామాణిక్య సంకాశులు, కించిత్స్మిత ముఖాంబుజులు, అన్యోన్యాలింగన పరులు, శంఖ పంకజధారులు రత్నములను వర్షించు శంఖ పద్మములచే శిరస్సున గుర్తించబడిన తుందిలుని, కంబుక నిధిని, వసుధారను, ఘనస్తనిని, వామ భాగమున పంకజనిధిని ప్రియా సహితుని పూజించవలయును. సింధూర వర్ణముగల, భుజ క్లిష్టులు రక్త పద్మోత్సలాన్వితులు రత్నములను వర్షించు పద్మములచే మూర్థ భాగమున చిహ్నితములు అగు తుంగీలునీ, పంకజ నిధిని తత్త్యమును, వసుమతిని దలాగ్రములందు పూజించవలయును. బలాకాదులను పూజించవలయును. బలాకి విమల, కమల వనమాలిక, విభీషిక, మాలికా, శాంకం, వసుమాలిక అనువారు రెండు పద్మములను ధరించినవారు ముక్తాహార సమప్రభలు అగువారిని పూజించవలయును. అంతమున లోకేశులను వారి అస్త్రములను పూజించవయలును. ఇట్లు దేవిని సేవించువారు ధనధాన్య సమృద్ధిని పొంది గొప్ప సంపదను పొందును. వక్షస్తల మాత్ర జలమున నిలిచి ఈ మంత్రమును జపించవలయును. సూర్య మండల గతుని ధ్యానించుచు మూడు లక్షలు జపించినచో లక్ష్మీనివాసమగును. విష్ణ్వాలయములోనున్న మారేడు చెట్లు మూల భాగమున మూడు లక్షలు జపించవలయును. ఇట్లు చేసినచో కోరిన ధనరాశులు లభించును. అశోక సమిధలచే ఏర్పరిచిన అగ్నిలో నేయి కలిపిన తండులములచే హోమమును గావించినచో జగత్తు వశమగును. చండ్రనిప్పులో మధుప్లుతములగు తండులములచే హోమమును గావించినచో రాజు వశమగును. మహా సంపదను పొందును. మారెడు నీడలో ఉంటూ మారెడు కలిసిన హవిస్సును భుజించుచు మూడు సంవత్సరములు హోమము గావించినచో, మారెడు ఫలములచే కాని అంబుజములచేకాని హోమమును గావించినచో మహాలక్ష్మిని స్వయముగా కన్నులతో చూడగలడు.
ఓ బ్రాహ్మణోత్తమా? మరియొక కల్పమున దేవ రాజ్యమున హరించువారు లోకకంటకులు శుంభ నిశుంభులను ఇరువురు రాక్షసులు పుట్టిరి. వారి వలన రాజ్య భ్రష్టులైన ఇంద్రాది దేవతలు ప్రార్థించగా మహా సరస్వతీదేవి అవతరించెను. అతి సుందరము అతి పవిత్రమగు హిమాలయ ప్రాంతమున అవతరించి శుంభ నిశుంభులను సంహరించి దేవతలచే పూజించబడును. వారికి వరములనిచ్చి మానస సరస్సున ప్రవేశించెను. ఆ సరస్వతీ మంత్రమును చెప్పెదను. సావధానముగా వినుము. జ్ఞానామృత స్వరూపురాలు చంద్ర కలను శిరమున ధరించిన శోభించు దేవత. వాగీజము ఆ దేవతా మంత్రము. వాజముచే అంగకల్పన చేయవలయును. సదాశివుడు ఋషి. అనుష్టుప్చందస్సు. వాగ్దేవి దేవత. సేవించు వారికి అభీష్టముల నొసంగును. శ్వేతాంబర బిసశ్వేత, వీణా పుస్తకధారిణీ, దివ్యాభరణ భూషిత యగు సరస్వతీ దేవిని ధ్యానించవలయును. మహా సరస్వతీ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు దేవి నావాహన గావించి అంగాద్యావరణలచే చక్కగా పూజించవలయును. మొదట అంగావరణము, తరువాత అంబికాదులు, ద్వితీయా వరణము మాతృకలు. తృతీయా వరణము అష్టశక్తులు. నాలుగైదు ఆవరణలు ముప్పది రెండు శక్తులచే చేయవలయును. అరువది నాలుగు శక్తులచే ఆరవ ఆవరణము. సప్తమావరణము లోకపాలకులు. అష్టమావరణము వారి ఆయుధములు. ఇట్లు వాకంభవయగు దేవతను పూజించవలయును. పూర్వోక్త స్థానములందు అంగములను పూజించవలయును. అంబికా, వాగృవ, దుర్గ. శ్రీ శక్తి మొదలగు వార శక్తులు. తరువాత బ్రహ్మాదులను పూజించ వలయును. కరాలి, వికరాలి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, లక్ష్మి, ధృతి, స్మృతి, శ్రద్దామేధా, రతి, కాంతి ఆర్యా అనునవి పదునారు శక్తులు. వీరందరు ఖడ్గ భేటక ధారిణులు శ్యామ స్వరూపిణులు, స్వలంకృతులుగా ఉన్న వీరిని పూజించవలయును. విషఘ్ని, పుష్టి, ప్రజ్ఞా, సినీవాలి, కుహూ, రుద్రవీర్య, ప్రభ, నష్ణ, పోషణ, వృద్దిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాలి, కపర్దినీ, వికృతి, దండీ, ముండీ, సేన్దుఖంతో, శిఖండిని, నిశుంభ శుంభమధని, చండముండ వినాశిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిణీ నారీ, నారాయణి, త్రిశూలినీ, పాలిని, అంబికా, హోదిని, అనువారు ముప్పది రెండు శక్తులు. వీరందరు చక్ర హస్తలు, పిశాచాస్యలు, చారు భూషణలుగా నున్నవారిని చక్కగా పూజించవలయును. పింగలాక్షి, విశాలాక్షి, సమృద్ధి, బుద్ధి, శ్రద్ద, స్వాహా, స్వధా, భిక్షా,మాయ, సంజ్ఞా, వసుంధర, త్రిలోకధాత్రి, గాయత్రి, సావిత్రి, త్రిదశేశ్వరి, సరూప, బహురూప, స్కన్దమాత, శ్రుతి ప్రియ, విమలా, కమలా, అరుణీ, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యా, మాత, సతీ, హంసీ, మర్థికా, వజ్రకా, పరా, దేవమాత, భగవతి, దేవకీ, కమలాసన, త్రిముఖి, సప్తవదనా, సురాసుర విమర్దిని, లంబోష్ఠీ, ఊర్థ్వకేశి, బహు శిశ్నా, వృకోదరి, రధరేఖా, శశిరేఖ, గగన వేగా, పవనవేగా, వేగా, భువన పాల, మదనాతురా, అనంగా, అనంగవదన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సుభయంకరి, అక్షోభ్యా, సప్తవాహినీ, వజ్రరూపా, శుచివ్రత, వరదా, వాగేశీ, అనువారాలు అరువది నాలుగు శక్తులు. చాప బాణ ధారిణులు, జ్వాలా జిహ్వలు, మహాప్రభలు, దంష్టిణులు, ఊర్థ్వకేశినులు, యుద్దోపక్రాంత మానసలు, సర్వాభరణ భూషితలుగా పూజించవలయును. లోకేశులను, వజ్రాదులను పూర్వోక్త విధిగా ఆరాధించవలయును. పదునారు లక్షలు జపించవలయును. దశాంశమును నేతితో చండ్ర నిప్పులో హోమము చేసిన మంత్రము సిద్ధించును. కమలములచే పదివేలు హోమమును చేసినచో రాజు వశమగును. కలువలచే హోమము చేసినచో మహాలక్ష్మి పుట్టును. మోదుగు పూలచే హోమమును గావించిన సంవత్సరమున కవియగును. రాజీవలవణ- హోమముతో స్త్రీవశమగును. వాణీ బీజమును జపించువారు సకల భోగములననుభవించి అంతమున విష్ణులోకమును చేరును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున దేవీమంత్ర నిరూపణమను ఎనుబది నాలుగ - అధ్యాయము ముగిసినది.
