నారద మహా పురాణము - పూర్వార్థము
91 - మహేశ మంత్ర కథనమ్
సనత్కుమార మహర్షి పలికెను :- ఇక ఇపుడు సర్వార్థ సాధకమగు మహాశమన్తమును చెప్పెదను. ఈ మంత్రోపాసన వలన మానవుడు భుక్తిముక్తులను పొందగలడు. ' నమః శివాయ' అనునది పంచాక్షర మంత్రము. ఓం అను దానిని మొదట చేర్చినచో షడక్షర మంత్రమగును. వామదేవుడు ముని. పంక్తి ఛందస్సు. ఈశ్వరుడు దేవత. సాధకుడు మంత్రములోని షడక్షరములచే షడంగములను న్యాసము చేయవలయును. మంత్ర వర్ణాదికములను మంత్రమూర్తులను యధాక్రమముగా న్యాసము గావించవలయును. తర్జనీ మధ్యమ కనిష్ఠక అంగుష్ఠములందు తత్పురుష అఘోర భవ వామేశ సంజ్ఞలుండును. వక్ర హృత్పద గుహ్యము లందు శిరస్సున, తూర్పు దక్షిణ పశ్చిమోత్తర మధ్య వక్రము లందు అయిదింటి యందు మంత్రాంగన్యాసమును గావించి తరువాత రక్షణ కొరకు గోలకన్యాసమును చేయవలయును. హృదయమున, వక్రము, భుజము లందు, ఊరుపు లందు కంఠనాభి పార్వద్వయములందు, పృష్ఠమున హృదయమున శిరస్సున, వదననేత్ర నాసి కలయందు, బాహువులందు, పాదసంధులందు న్యాసమును చేయవలయును. శిరోవదన హృతుడి ఊరు పాదద్వయ హృదయ వస్త్రాంబుజ టంకమృగా భయకరము లందు, వక్రాస హృత్సపాదోరు జఠరములందు క్రమముగా న్యాసమును గావించవలయును. ఈ స్థానములందు మూలమంత్రము యొక్క అక్షర షట్కమును యథావిధిగా న్యాసమును గావించవలయును. మూర్థ ఫాలోదరాంస హృదయములందు ఆవర్ణములను మరల న్యాసము గావించవలయును. తరువాత ఈ మంత్రముచే వ్యాపకముగా నాచరించవలయును. అనంత రూపునకు, జ్యోతిర్లింగా మృతాత్మకు, చతుర్మూర్తి వపువునకు, ఛాయాభాసితాంగునకు శంభువునకు నమస్కారము. ఇట్లు అంగన్యాసమును గావించి పార్వతీపతిని ధ్యానించవలయును. మహేశ్వరుని రజతాద్రి సన్నిహితుని, చారు చంద్రావతంసుని, రత్నాకల్పోజ్జ్వలాంగుని, పరశ్వధవరాభీతి మృగహస్తుని, శుభాననుని, పద్మాసీనుని, అంతటా దేవతల సమూహములచే స్తోత్రము చేయబడుచున్న వానిని, వ్యాఘ్ర చర్మధారిని, విశ్వాద్యుని, విశ్వరూపిని, త్రినేత్రుని, పంచవక్రుని, సర్వభీతి హరుని, శివుని ధ్యానించవలయును. మూడు లక్షల జపమును చేయవలయును. మూడువేలు పాయసముచే హోమమును గావించవలయును. అపుడు సాధకాభీష్ట ప్రదమగు మంత్రము సిద్ధించును. తరువాత వామాది నవశక్తి యుతమగు పీఠమున దేవుని పూజించవలయును. వామా, జ్యేష్ణా, రౌద్రీ, కాలీ, కలప దారికా, వికారిణీ, బలాద్యా, వికరిణీ, బలప్రమథనీ, సర్వభూత దమనీ, మనోన్మనీ, అనునవి శక్తులు. “ఓం నమో భగవతే సకలాది గుణాత్మశక్తి భక్తాయ అనంతాయ యోగ పీఠాత్మనే న నమః” అనుమంత్రముచే గిరిజాపతికి ఆసనమును కల్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు శివుని ఆవాహన గావించి పూజించవలయును. కర్ణిక యందు మూర్తులను ఈశుని ఈశాన దిగ్గజమును పూజించవలయును. శుద్ధ స్పటిక సంకాశుడగు ఈశుని పూజించవలయును. దిక్కున తత్పురుషా దికులను పీతాంజన శ్వేత రక్తవర్లులను ప్రధాన సదృశాయుధులను, చతుర్వక్తులను యధావిధిగా పూజించవలయును. కోణములందు తేజోరూపులగు నివృత్త్యద్యులను యధాక్రమముగా పూజించవలయును. కేసరములలో నున్న అంగములను విఘేశులను పన్నగులను పూజించవలయును. సుఖనాముడగు అనంతుని, శివోత్తముని, ఏకనేత్రుని, ఏకరుద్రుని, త్రిమూర్తిని, తరువాత శ్రీ కంఠుని, శిఖండిని క్రమముగా రక్తపీత సీతావక్త కృష్ణ రక్తాంజనా సీత వర్ణులను, కిరీటార్పిత బాలేన్గులను పద్మస్థులను, భూషణాన్వితులను, త్రినేత్రులను, శూలవజ్రాస్త్ర చాపహస్తులను మనోరములను పూజించవలయును. తరువాత ఉత్తరాది దిక్కులందు రుద్రుని, చండేశ్వరుని పూజించవలయును. తరువాత నంది మహాకాల గణేశ వృషభములను పూజించవలయును. తరువాత భృంగిని, రిటిని, స్కందుని, పద్మాసనస్థులనగా స్వర్ణతోయారుణ శ్యామ ముత్తేందు సీత పాటల వర్ణులను పూజించవలయును. తరువాత వజ్రాద్యాయుధ సంయుతులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు ఈశ్వరుని పూజించి ప్రతినిత్యము వేయి జపమును చేయవలయును. ఇట్లు జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై అభీష్టమును పొందగలడు. రెండువేలు జపించినచో, రోగముక్తుడగును. మూడువేలు జపించినచో దీర్గాయుష్యమును పొందును. ఇట్లు ఒక్కొక్క వేయి అధికముగా జపించినచో సర్వాభీష్టములను పొందును. నేయి కలిపిన శుద్దతిలలచే లక్ష హోమమును చేసినచో ఉత్పాతముల వలన కలుగు క్లేశములన్నియూ నశించును. కోటి జపించినచో సాక్షాత్తుగా శివుడే యగును.
శక్తి రుద్ధమగు షడక్షర మంత్రము. అట్లే అష్టాక్షర మంత్రము కూడా కలదు. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు పూర్వ మంత్రమునకు వలెనే యుందురు. ఉమాపతి దేవత. అంగములన్నియూ పూర్వోత్తములే. ప్రశాంతుడగు ఈశ్వరుని ధ్యానించవలయును. బంధూక పుష్ప సన్నిభుడు, త్రినేత్రుడు, బాలేందు ధరుడు, చిరునవ్వు ముఖము గలవాడు, కరములలో శూలమును కపాలమును, వరదాభయములను ధరించువాడు, చారు భూషణ భూషితుడు, వామోరువున నున్న పార్వతిని బాహువులచ ఆశ్లేషించే యున్న ఈశ్వరుని మనసుచే హృదయమున ధ్యానించవలయును. తొమ్మిది లక్షలు జపించవలయును. తొమ్మిదివేలు యధావిధిగా మధుప్లుతములగు ఆరగ్వధ సమిధలచే హోమమును చేయవలయును. ప్రాగుక్త పీఠమున గంధ పుష్పములచే ఉమాపతిని పూజించవలయును. పూర్వమువలె అంగావృత్తులచే హృల్లేఖాదులను పూజించవలయును. మధ్య ప్రాగ్దాక్షిణోదీచ్య పశ్చిమ దిక్కులందు యధావిధిగా పూజించవలయును. పూర్వాది పత్రములందు వృషభాదులను యధాక్రమముగా పూజించవలయును. శూలటంకాక్షవలయ కమండలులచే శోభించు హస్తములు కలవాడు, రక్త కారుడు, త్రినయనుడు, అగు చండేశుని పూజించవలయును. తరువాత చక్రశంఖాభయాభీష్టకరురాలు మరకత ప్రభయగు దుర్గను సౌమ్యను త్రినేత్రను చారుభూషణను పూజించవలయును కల్పశాఖాంతరమున ఘంటాధారిని, ద్వాదశనేత్రుని, బాలార్క సన్నిభుని, శిశువును, సుందరుని షణ్ముఖుని పూజించవలయును. తరువాత సౌమ్యుడగు నందిని పూజించవలయును. తరువాత రత్న భూషణ మండితుని పరశ్వధవరా భీతిటంక ధారిని శ్యామ విగ్రహుని, పాశాంకుశ వరాభీష్ట ధారిని, కుంకుమ సంకాశుని విఘ్న నాయకుని పూజించవలయును. తరువాత చంద్రార్థ కృతశేఖరుడు, శ్యాముడు, రకోత్సలకరుడు, వామాంకన్యస్త సత్కరుడు, ద్వినేత్రుడు, రక్తవస్త్రాడ్యుడు యగు సేనాపతిని పూజించవలయును. తరువాత యధోక్త లక్షణములు కల బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలను పూజించవలయును. తరువాత వారి వారి దిక్కులందు ఇంద్రాది లోకపాలురకు వారి ఆయుధములను బయట పూజించవలయును. ఇట్లు సాధకుడు ఉమాపతియగు శంకరుని పూజించినచో అన్ని లోకములలో అతను సౌభాగ్యశ్రేయస్సులలో ఉత్తముడగును.
సాంత పద్యాంత సంయుక్తము బిందు భూషిత మస్తకము ప్రాసాదమను మంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ఫలప్రదము. షడ్దర్భయుక్త బీజములచే సడంగ కల్పన చేయవలయును. ఈ మంత్రమునకు కూడా షడక్షర మంత్రమునకు వలె మున్యాదులు చెప్పబడిరి. సాధకుడు అంగుష్టాదులందు ఈశానాదులకు న్యాసము గావించవలయును. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అని క్రమముగా తెలియవలయును. ఉకొరాదులకు పంచహ్రస్వములచే విలోమములను సంయుతముగా ఆయా యంగుళములచే ఆయా బీజములను న్యాసము చేయవలయును. శిరోవదన హృద్దుహ్య పాదదేశమున యధాక్రమముగా ఊర్థ్వప్రాగ్దాక్షిణోదీత్య పశ్చిమ ముఖములందు న్యాసము చేయవలయును. తరువాత ప్రాజ్ఞుడు తన శరీరము నందు ముప్పది యెనిమిది కలలను న్యాసము గావించవలయును. ఈశానాదీ ఋక్కులను క్రమము ననుసరించి అంగుష్ఠాది కనీషానము అంగుళుల యందు న్యాసమును గావించవలయును. మరల అదే ఋక్కులను మూర్దాస్యహృదయ పాదముల యందుంచవలయును. మరల వక్రమూర్ణాదులందు అంగకల్పన గావించవలయును. తార పంచకమునుచ్చరించి “సర్వజ్ఞాయ నమః” అని హృదయమున, అమృత తేజోమాలినీ తృప్తాయ బ్రహ్మశిరసే అని శిరస్సున “జ్వలితం శిఖి. శిఖాయా నాది బోధాయ” అని శిఖ యందు, “వజ్రణే వజ్రహస్తాయ స్వతంత్రాయ కవచమ్” అని కవచమున “సౌంఖాం హోంతం గుహ్య శక్తయే” అని నేత్రమున, “క్లిపశుం హుంఫట్” అని అస్త్రమును ఇట్లు షడంగ కల్పన చేయివలయును. పూర్వదక్షిణ పశ్చాత్ ప్రాక్ సౌమ్య మధ్యములను అయిదు దిక్కులందు, అయిదు వక్రములందు ఈశాన కలలను అయిదింటిని న్యాసమును గావించవలయును. "ఈశాన స్సర్వ విద్యానాం “అనునది శశినీ అను పేరు గల ప్రథమ కళ. “ఈశ్వర స్సర్వ భూతానాం” అనునది మంగళ రెండవ కల. “బ్రహ్మధిపతి బ్రహ్మణోధిపతిః అనునది బ్రహ్మేష్టద యను మూడవకల “బ్రహ్మా శివోమే అస్తు” అనునది మరీచి యను నాలుగవ కళ సదా శివుని యందుంచవలయును. అయిదవ కళ అంశుమాలిని యనునది. ఇవియన్నియు ప్రణవాదులు నమోంతములుగా చెప్పుకోనవలయును. పూర్వ పశ్చిమయ్యా దజ్ వక్రములందు నాలుగు పురుష కలలను న్యాసమును గావించవలయును. “తత్పురుషాయ విద్మహే” అనునది మొదటి కల. దీనిని శాంతి యందురు. “మహా దేవాయ ధీమహి” అనునది రెండవది. “తన్నో రుద్రః” అనునది తృతీయ. “ప్రచోదయాత్” అనునది నాలుగవది ఈ నాలుగు మొదట ప్రణవము చివరకు అనునవి కలుగు యుండును. హృదయమున, భుజద్వయమున, నాభియందు, కుక్షియందు, పృష్ఠమున, వక్ష స్థలమున, ఉరస్సున ఎనిమిది కలలను యధావిధిగా న్యాసమును చేయవలయును. “అఘోరేభ్యః" అనునది మొదటి కల. “అధఘోరేభ్యః" అనునది మోహయను రెండవ కళ. “అఘోర అనునది క్షమా, అను మూడవ కల. ఘోరతరేభ్యః అనునది నాలుగవకల. “సర్వేభ్యః” అనునది అయిదవకల. 'సర్వశర్వేభ్యః' అనునది ఆరవకల. “నమస్తే అస్తు” అని క్షుధా అను ఏడవకల. 'రుద్రరూపేభ్యః' అని తృషాయను అష్టమికల. ఇవన్నియూ ధ్రువాదికములు నమోన్వితములుగా నుండును. గుహ్యయుగ్మ ఊరు యుగ్మములందు జాను జంఘసిజములందు, కటియందు, పార్వద్వయము నందు పదమూడు వామకలలను న్యాసము గావించవలయును. “ఓం వామదేవాయ నమః” అని మొదటి కలనురు జాయందురు. “ఓం జ్యేష్ఠాయ నమః” అనునది రక్షాయను రెండవ కల. “ఓం శ్రేష్టాయ నమః” అనునది మూడవది ఓం కాలాయనమః' అనునది నాలుగవది. “ఓం బలాయనమః” అనునది ఏడవది. ఓం వికరణాయ నమః” అనునది ఎనిమిదవది. “ఓం బలాయనమః” అనునది తొమ్మిదవది. “ఓం ప్రమథనాయనమః” అనునది పదియవ కల. “ఓం సర్వభూత దమనాయనమః:” అనునది పదకొండవ కల. “ఓం నమః” అనునది పన్నెండవ కల. “ఓం మనోన్మన్యై నమః” అనునది జ్వరాయను పదమూడవ కల. పాద బాహుస్తన నాసామూర్తా భుజ యుగ్మములందు న్యాసము చేయవలయును. సద్యోజాత భవములగు ఎనిమిది మంత్రములు కలలుంచవలయును. “సద్యో జాతం ప్రపద్యామి” అనునది సిదియను మొదటి కల. “సద్వో జాతాయ నమః” అనునది వుధియను రెండవ కల. “ఓం భవాయ నమః” అనునది మూడవది “ఓం అభవాయ నమః” అనునది నాలుగవది. లక్ష్మీ అనునది. “ఓం నాతి భవాయ నమః” అనునది అయిదవది. “ఓం భవాయ నమః” అనునది ప్రాజ్ఞా అను ఆరవకల. “ఓం అభవాయ నమః' అనునది ఏడవది. “ఓం ఉద్భవాయ నమః” అనునది ఎనిమిదవ కల. ఇట్లు మొత్తము ముప్పది యెనిమిది కలలు చెప్పబడినవి. ఇందులో అయిదు బ్రహ్మ పదాదికములు. ఇట్లు న్యాసదేహుడగు వాడు స్వయముగా గంగాధరుడగును. అపుడు సావధాన మనస్కుడై ఇట్లు సదాశివుని ధ్యానించవలయును. సీత పీత అసిత శ్వేత జపావర్ణములు కల అయిదు ముఖములతో నేత్రములతో నున్నవాడు, బాలేందు శేఖరుడు, కోటీ పూర్ణేందు నిభుడు, శూలటంక కృపాణ వజ్రాగ్యహిపతులను ధరించువాడు సర్వభూషణ భూషితుడు, ఘంటాపాశ వరాభయములను ధరించువాడుగానున్న సదాశివుని ధ్యానించిమంత్రమును అయిదు లక్షలు జపించవలయును. తేనె కలిపిన గన్నేరు పూవులచే హోమమును చేయవలయును. పూర్వోక్త పీఠమున పూజించవలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి దేవుని ఆవాహన గావించి ఆమూర్తియందు ఆవరణలచే పూజించవలయును. శక్తిని డమరుకాభయ వరములను ధరించువానిని త్రినేత్రుని ఈశానుని శుభ్రవర్లుని ఈశాన్య దిక్కున పూజించవలయును. పరశు ఏణ వరాభీతులను ధరించువాడు విద్యుదుజ్జలుడు, చతుర్ముఖుడు, త్రినేత్రుడు అగు తత్పురుషుని తూర్పు దిక్కున పూజించవలయును. అక్షసజమును, వేద పాశములను ఋషిని డమరుకను, ఖట్వాంగమును, నిశిత శూలమును, కపాలమును ధరించువాడు, అంజనాభుడు, చతుర్వక్రుడు, భీమదంతుడు భయావహుడు, త్రినేత్రుడు అగు అఘోరుని దక్షిణదిక్కున పూజించవలయును. కుంకుమ సంకాశుడు, చతుర్వక్రుడు, త్రిలోచనుడు, హరిణాక్ష గుణాభీతి వరహస్తుడు, చతుర్ముఖుడు బాలేందుశేఖరుడు యగు వామదేవుని పశ్చిమమున పూజించవలయును. కర్చూరేందు నిభుడు సౌమ్యుడు త్రిలోచనుడు వరాభయాక్ష వలయ కుఠారములను ధరించువాడు, విలాసి, స్మేర వక్రుడు అగు సద్యోజాతుని ఉత్తరమున పూజించవలయును. కోణములందు నివృత్త్యాదులగు తేజారూపులగు కలలను క్రమముగా పూజించవలయును. చుట్టూ పత్రములందు అనన్హాదులగు విఘ్నేశ్వరులను పూజించవలయును. తరువాత బాహ్యమున ఉమాదీకమును. ఆయుధ సహితలగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు ఉత్తమ భక్తి కలవాడై దేవేశుని చక్కగా పూజించి నృత్యగీతాదులచే సుందరములగు స్తోతములచే దేవేశుని సంతోషింప జేయవలయును.
తారము మాయా వియదిందు మనుస్వర సమన్వితముగా పంచాక్షరయుక్తమగు అష్టాక్షరీ మంత్రము తంత్ర శాస్త్ర సమ్మతము. ఈ మంత్రమునకు అంగన్యాసాది కమంతటిని పంచాక్షరీ మంత్రమునకు వలెనే ఆచరించవలయును. సిందూర సంకాశుడు శోభించు రత్నకిరీటము కలవాడు, చంద్రమౌళి, దివ్య భూషాంగరాగములు కలవాడు, నాగ యజ్ఞోపవీతమును ధరించినవాడు, వామోరువున నున్న ప్రియురాలి స్తనములపై నుంచిన చేయి కలవాడు, వేదటంకేష్టా భయధారి యగు శివుని ధ్యానించవలయును. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలయును. ఎనిమిది వేలు నేయితో కలిపిన పాయసముతో హోమమును గావించవలయును. పీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి మొదట అంగములచే ఆవరణ పూజను గావించి, తరువాత ఉమాదులతో కూడియున్న వారిని పూజించి, లోకానాయకుల నారాధించి, వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు సాధకోత్తముడు ప్రతిదినము పూజించ వలయును. ఇట్లు చేసినచో పుత్ర పౌత్ర ధనాదులను పొంది ఆనందించును. ఓంకారము లం సవర్ణేందు భృగువు సర్గ సమన్వితము అక్షరాత్మకమగునది మృత్యుంజయ మంత్రముగా చెప్పబడినది. (ఓం లం త్ర్యంబకాయ నమః) అనునది. ఈ మంత్రమునకు కహోల ఋషి గాయత్రీ ఛందస్సు. మహా దేవుడగు మృత్యుంజయుడు దేవత. దీర్ఘ యుక్తమగు భృగువుచే షడంగ న్యాసమును చేయవలయును. సూర్య చంద్రాగ్ని నేత్రుడు, స్మితాస్యుడు, యుగ్మ పద్మగుడు, ముద్రాపాశైణాక్షసూత్రల సత్పాణి, శశిప్రభుడు, ఫాలేందు విగలత్పీయూష ఫ్లుతాంగుడు, హారాదులచే నిజకొంతిచే అలంకృతుడగు విశ్వమోహినుని ధ్యానించవలయును. మంత్రమును ఆరులక్షలు జపించవలయును. దశాంశమును శుద్ద దుగ్లాజ్య సమభి పుతములగు అమృత కలశలములచే హోమమును గావించ వలయును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పీఠమున శివుని పూజించవలయును. అంగావరణములను పూజించి లోకపాలకులను పూజించవలయును. తరువాత బాహ్య ప్రదేశమున వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు జప పూజాదికములచే మంత్రము సిద్ధించిన తరువాత అభీష్ట ఫలసిద్ధి కొరకు కల్పోక్త విధానముచే ప్రయోగముల నాచరించవలయును. ప్రతిదినము ఆదరముచే క్షీరసిక్తములగు సుధాఖండములచే హోమమును వేయిచొప్పున ఒకనెల చేసినచో ఆయుష్యమును, ధనమును పుత్రులను పొందును, సుధామిశ్రితములగు క్షీరములు నేయి, పాలు హవిస్సు మొదలగు ఏడు ద్రవ్యములను ఏడువారములలో క్రమముగా వేయి హోమమును గావించి ప్రతిదినము ఏడుకంటే ఎక్కువ మందిని బ్రాహ్మణులను మధుర పదార్థ యుక్తముగా భోజనమును చేయించవలయును. ఋత్విజులకు పాలనిచ్చు అరుణ వర్ణము గల గోవును దక్షిణనీయవలయును. గురువును దైవబుద్దిచే ధనాదులను సమర్పించి ప్రీతుని గానించవలయును. ఈ విధానముగా ఆచరించినచో కృత్యాద్రోహ జ్వరాదులచే విముక్తుడగును. నూరు సంవత్సరములు ఆరోగ్యానందములచే జీవించును. అభిచారమున, జ్వరమున, స్తంభనమున, ఘోరోన్మాదమున, శిరోవ్యాధియందు, అసాధ్యమగు రోగము నందు, శ్వేతార్తి యందు మోహ దాహ మహాభయములందు ఈ హోమము శాంతిని ప్రసాదించి సర్వాభయ ప్రదానము గావించును. ఈ ద్రవ్యములచే మూడు వేళలలో యథావిధిగా హోమము నాచరించవలయును. వేద పారగులగు బ్రాహ్మణులను మధుర పదార్థములచే భోజనము చేయించవలయును. ఇట్లు చేసినచో దీర్ఘాయుష్యమును కోరిన సంపదను పొందగలడు. పండితుడు ప్రతిదినము గరకతో ఏకాదశాహుతుల నీయవలయును. ఇట్లు చేసినచో అపమృత్యువును జయించి ఆయురారోగ్యములు వృద్ధి పొందును. మూడు వేళలలో సుధావల్లీ కాశ్మీరవకుల సమిధలచే హోమమును గావించినచో మృత్యు భయము వీడి సర్వరోగములు తొలగి ఆనందించును. ఆవాలచే హోమమును గావించినచో మహా జ్వరము నశించును. ఉత్తరేణి సమిధలచే చేయు హోమము సర్వరోగ నివారకము.
ధ్యానై కనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే హుంఫట్” అను ఈ మంత్రము ముప్పది యారు అక్షరములు కలది. సర్వాభీష్ట ఫలప్రదము. శుకమహర్షి ముని. అనుష్టుప్చందస్సు. దక్షిణామూర్తి నామముగల శంభువు దేవత. తారాశక్తి యుతములగు హీమాద్యంతముల షట్ సప్త అష్ట వర్ణములందు హృదయాద్యంగ కల్పన గావించవలయును. శిరస్సున, ఫాలమున, నేత్రములందు, కర్ణములందు, గండయుగ్మమున, నాసికయందు, ఆస్యదోస్సంధులందు గలము, స్తనహృన్నాభి మండలములందు, కటి ప్రదేశమున గుహ్యమున, మరల పాదసంధులందు మంత్ర వర్ణన్యాసమును గావించవలయును. తరువాత దేహమున తారశక్తులచే వ్యాపకము నాచరించవలయును. సుందరమగు హిమాచల తటమున, సిద్ద కిన్నర సేవితమున, వివిధ ద్రుమ శాఖలచే అంతట ఆతపమును వారించుచోట పూలతో నిండిన తీగలచే చుట్టబడిన చెట్లు గల ప్రాంతమున, శిలా వివరముల నుండి వెలువడు సెలయేళ్ళ నుండి వచ్చు చల్లని గాలి గలిగినచోట, గానము చేయుచున్న దేవాంగనా సంఘములు కలిగి, నాట్యము చేయుచున్న నెమళ్ళు కలిగి కోకిల కూతలచే దిక్కులు ధ్వనించుచుండగా పరస్పరము వైరమును విడిచిన మృగములచే సేవించబడుచున్న ప్రదేశమున జలజ స్థలజ పుష్పములచే సుగంధము గలదై ఆది ఋషులగు శుకాదులచే ఆనందముగా సేవించబడుచున్న, అంగనా సహితులగు పురందరాదులచే చూడబడుచున్న ప్రదేశమున, గొప్ప నీడ గలిగి పద్మరాగ ఫలోజ్జ్వలమగు, గరుత్మత పత్రములు దట్టముగా వ్యాపించియున్న నవరత్నమయములకు ఊడలు వేలాడుచున్న సంసార తాప విచ్చేద కుశలమగు ఛాయకల అద్బుతమగు వట వృక్షమూలమున సుసంక్లుప్తము శుభము అగు రత్న సింహాసనమున ఆసీనుడైయున్న అసీతా భుని, శరచ్చన్రనిభాననుని, కైలాసాద్రినిభుని, త్రినేత్రుని, చంద్రకాంతి కపర్డుని, నాసాగ్రాలోకన పరుని, వీరాసన సమస్థితుని, ఛద్రాటక కురంగాఢ్య జానుస్థ కరపల్లవుని, కక్షా బద్ధ భుజంగుని, సుప్రసన్నుడగు హరుని స్మరించవలయును. ఆరు లక్షల ఇరవై వేలు జపించవలయును. దశాంశము పాలు కలిపిన శుద్ద తిలలచే హోమమును గావించవలయును. పంచాక్షరోక్త పీఠమున యధావిధిగా పూజించవలయును. భిక్షాహారుడై ఒకనెల ఈ మంత్రమును జపించవలయును. ప్రతి దినము నాలుగువేలు జపించినచో వాకంపదను పొందును. ఈ మంత్రముచే జపించిన పాలను మూడు మార్లు త్రాగి దక్షిణామూర్తిని ధ్యానించినచో శాస్త్రములను వ్యాఖ్యానము చేయగల పాండిత్యమును పొందును.
“ఓం నమోభగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్ఛస్వాహా" అనునీమన్తము ఇరువది రెండక్షరములు కలది. చతుర్ముఖబ్రహ్మఋషి, గాయత్రీఛందస్సు. ఓంకార సహితమగు దీరస్వరములలో (ఆరు) అంగకల్పన చేయవలయును. లేదా మంత్రములోని ఆరుపదములచే కాని చేయవచ్చును. “ఫ్రోం, రీం, క్లీం” అనునది బీజత్రయాన్వితంత్రము. ఇది నీలకంఠమవ్ర మనబడును. ఇది విషద్వయమును పూరించును. “హరహరస్వాహా" అనునది హృదయము “కపర్దినేమ” అనునది శిరోమంత్రము. “నీలకంఠాయస్వాహా” అనునది శిఖామంత్రము. “కాలకూటవిషభక్షణాయ హుంఫట్” అనునది కవచమంత్రము. “నీలకంఠనే స్వాహా" అనునది అప్రమంత్రము. ఇవి మంత్రమునకు పంచాంగములు. శిరస్సున కంఠమున, హృదయమున, క్రమముగా బీజత్రయ న్యాసమును గావించవలయును. పదివేల బాలార్కుల తేజస్సు కలవాడు, జటాజూటేందు శోభితుడు, నాగభూషుడు, జపమాలను, శూలమును, బ్రహ్మకపాలమును, ఖట్వాంగమును ధరించువాడు, త్రినేత్రుడగు శివుని ధ్యానించవలయును. మంత్రమును మూడు లక్షలు జపించి దశాంశమును నేయి కలిపిన హవిస్సుతో సంస్కృతాగ్నిలో హోమమును చేయవలయును. శైవపీఠమున నీలకంఠుని పూజించవలయును. మృత్యుంజయవిధానముచే విషద్వయ వినాశుని పూజించవలయును. అగ్నిసంవర్తనాదిత్యఅనిలులు షష్టి బిందుమత్, చింతామణి యను పేరుగల బీజము సరస్వమృద్ధిప్రదము. ఈ బీజమునకు కశ్యపుడు మహర్షి, అనుష్టుప్చందస్సు. అర్థ నారీశ్వరుడు దేవత రేఫాదులగు ఆరువ్యంజనములచే అంగన్యాసమును చేయవలయును. త్రినేత్రుడు నీలమణి సన్నిభుడు, శూలపాశములను, కపాలములను, రక్తాత్పలములను ధరించువాడు, చారు భూషణుడు, బాలేన్లు బద్దముకుటుడు, అగు అర్థనారీశ్వరుని ధ్యానించవలయును. ఒక లక్ష జపించవలయును. పీఠమున శైపోంగావరణలచే పూజించవలయును. వృషాది మాత్న కలను, సాయుధులగు లోకపాలకులను పూజించవలయును. ప్రాసాదాద్య మంత్రమును రోగశాంతికి పదివేలు జపించవలయును. స్వాహావృత్తమగు నీ బీజము స్రవించు అమృతము వంటిది. దీనిని ధ్యానించినచో అనగా (అం) అను బీజము ధ్యానించినచో క్షేడరోగము శాంతించును. ప్రతిలోమ స్వరాఢ్యము వహ్ని గృహమున నున్న బీజము రేఫాది వ్యంజనోల్లాసి, బహిర్భాగమున షట్కోణాభివృతమును స్మరించినచో భూతార్జునకు భూతశాంతి జరగును. పీడితాంగమున స్మరించినచో ఆయా పీడను తొలగించును. “ఓం నమ: పశుపతయే, ఓం నమో భూతాధిపతయే నమో రుద్రాయ నమో రుద్రాయ ఖడ్గ రావణ విహర విహర నరీ నృత్య నరీ నృత్య శ్మశాన భస్మారచిత శరణ్యాయ ఘంటా కపాల మాలాది ధరాయ, వాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృతశేఖరాయ, కృష్ణ సర్పయజ్ఞోపవీతినే బల బల చలా చలా నివర్తక పాలినే హనుహను భూతాంస్త్రాసయ త్రాసయ,మండల మధ్యే కట కట రుద్రాంకుశేన శమయ ప్రవేశయ ప్రవేశయ, ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి రుద్రీయం జ్ఞాపయతి స్వాహా" అనునది ఖడ్గ రావణ మంత్రము. నూటా డెబ్బది అక్షరములు గలది. “భూతాధి పతయే స్వాహా" అనునది పూజా మంత్రము. ఇది సిద్ధ మంత్రముగా చెప్పబడినది. కావున జపించి నంత మాత్రముననే సిద్దించును. ఇరువది వేలు జపించిన తరువాత భూతాది నిర్బంధమున సమర్థుడగును. “హీం స్ఫుర స్ఫుర, ప్రస్పుర ప్రస్పుర, ఘాతయ ఘాతయ హుంఫట్” అనునది చివర చేర్చిన యాబది యొక అక్షరములుగల ఈ మహామంత్రము అఘోరాస్త్రమనబడును. ఈ మంత్రమును అఘోరముని. త్రివృచ్ఛందస్సు. అఘోర రుద్రుడు దేవత. అయిదింటిచే హృదయమును, ఆరింటిచే శిరమును, పదింటిచే శిఖను, తొమ్మిదింటిచే కవచమును. ఎనిమిదింటిచే నేత్రమును, పదింటిచే అస్త్రమును చేయవలయును. శిరోనేత్రస్య కంఠములందు, హృదయ భ్యూరువులందు జాను జంఘ పదద్వంద్వములందు రుద్రభిన్నాక్షరములచే న్యాసమును గావించవలయును. ఈన్యాసమును 5,6,8,6,2,2,6,3, వర్ణములచే చేయవలయును. శ్యాముడు, త్రినేత్రుడు, సర్వాఢ్యుడు, రక్త వస్త్రాంగ రాగకుడు, నానా శస్త్రధరుడు అగు అఘోరుడను పేరు గల సదా శివుని ధ్యానించవలయును. ఈ మంత్రము భూత భేతాళ నిగ్రహ సమర్థము.
తారము వాంతము ధరాసంస్థము వామనేత్రేందు భూషితము పాశీ బకము కర్ణనేత్ర వర్మాస్రాంతమగు ఈ మంత్రము ఆరక్షరములు కలది. ఇది పాశుపతమంత్రము. క్షుద్రగ్రహ నివారకము. ఆరువర్ణములచే ఆరంగములను కల్పించవలయును. ప్రత్యంగకల్పనలో హుంఫడంతములచే చేయవలయును. మధ్యాహ్నసూర్య సంకాశుడు, భయంకరుడు, త్రినేత్రుడు, పన్నగ భూషణుడు, నానా శస్త్రధరుడు, చతుర్వక్రుడు, అగు పశుపతిని ధ్యానించవలయును. మస్తమును అక్షరలక్ష (ఆరులక్షలు) జపించ వలయును. దశాంశము గోఘృతముచే సంస్కృత్నాలో హోమమును చేయవలయును. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును గ్రహ గ్రస్తుని ముఖమున నుంచవలయును. మహామంత్ర ప్రభావము వలన వెంటనే గ్రహ విముక్తుడగును.యుద్ధమున ఈ మంత్రముచే మంత్రించబడిన బాణములను ప్రయోగించినచో అర్జునునివలె సకల శత్రువులను జయించును. “ఓం హం క్షేతపాలాయ నమ:” అనునది ఎనిమిదిక్షరములు గలది క్షేతపాల మంత్రము. షడ్డీరయుక్త బీజముచే షడంగన్యాసమును చేయవలయును. నీలాద్రి సన్నిభుడు, దిగంబరుడు, సర్పభూషణుడు, త్రిలోచనుడు, పింగోర్డ్వకేశుడు, కపాల గదాధారిని స్మరించవలయును. మన్తమును ఒక లక్ష జపించవలయును. దశాంశము ఘృతసిక్త చరువుతో హోమమును గావించవలయును. తరువాత క్షేత్రమున అర్చించవలయును. ధర్మాదులచే కల్పించిన పీఠమున ఆదరముచే సాంగావరణములను పూజించవలయును. తరువాత సరిపరివారుడై నక్షేత్రపాలునకు ఈ మంత్రముచే బలిని అర్పించవలయును. “ఏహి ఏహి విద్విషం పురుషం భంజయ భంజయ నర్తయ నర్తయ విఘ్న విఘ్న మహా భైరవ ! క్షేత్రపాల బలిం గృష్ణ గృష్ణ స్వాహా" అనునది బలి మంత్రము. ఈ మంత్రము సర్వకామ ఫలప్రదము. సాధకుడు రాత్రులందు సోపదేశముగా బృహత్పిండములను చేసి యధోకక్షేత్రపాలకుని ధ్యానించి క్షేత్రపాలుని హస్తమున బలిని అర్పించవలయును. ఈ బలిచే సంతోషించిన క్షేత్రపాలుడు కాంతిని, మేధను, బలారోగ్యములను, తేజస్సును, పుష్టిని, యశస్సును, సంపదను ఇచ్చును.
“ఓం బటుకాయ ఆపదుద్ధరణం కురు కురు వటుకాయ స్వాహా” అనునది ఇరువది రెండక్షరముల మంత్రము. 24,7,4,1 అక్షరములచే అంగన్యాసమును చేయవలయును. బాలుడు, స్ఫటిక సంకాశుడు, స్ఫటికలోలలసీతాననుడు, దివ్యాభరణ భూషితుడు త్రినేత్రుడు, దండ త్రిశూలధారి, సుప్రసన్నుడు, భక్తాభయకరుడగు బటుకుని ధ్యానించవలయును. హవిస్సును భుజించుచు జితేంద్రియుడై అక్షర లక్షలు జపించవలయును. దశాంశమును మధుర సంఫుత తిలలచే హోమమును చేయవలయును. ధర్మాది కల్పిత పీఠమున అతి శోభనమగు పంకజమున లోక త్రికోణములు గల షట్కోణమున వ్యోమ పంకజ సంయుతమున సాంగావరణములతో ఆదరముచే వటుకుని పూజించవలయును. ప్రతిదినము శత్రుపక్షరుధిరమును మాంసమును గణములతో కలిపి సారమయ సమన్వితుడవై భక్షించుము అను అర్థముగల “శత్రు పక్షస్య రుధిరం పిశితం చ దినేదినే భక్షయస్వ గజై స్సార్థం సారమేయ సమన్విత:” అన ఈ బలిమంత్రము శత్రనామాంకితముగా బలిని అర్పించవలయు. ఈ బలిచే సంతుష్టుడైన బటుకుడు పరసైన్యమును ఛేదించి కోపముచే గణములకు శత్రుమాంసమును విభజించి ఇచ్చును. “శ్రీం హ్రీం ఫట్" అనునదీ చండమంత్రము. త్రివర్ణాత్మకముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు త్రితముని. అనుష్టుప్ఛన్లస్సు. చండేశుడు దేవత. “దీప్త ఫట్" అనునది హృదయము జ్వలపట్' అనునది నేత్రము. “సర్వ జ్వాలిని ఫట్" అనునది కవచము. ఇట్లు షడంగ న్యాసమును గావించి దేవుని ధ్యానించవలయును. రక్తదేహుడు త్రినేత్రుడు, రక్తాంబరావృతుడు. త్రిశూలాక్షమాలాటంక కమండలుధారియగు చండేశుని ధ్యానించవలయును. మూడు లక్షలు జపించవలయును. దశాంశమును మధురత్రయసంక్తములగు పరిశుద్దతిలతండులములచే హోమమును గావించవలయును. పంచాక్షరోక్తపీఠమున మూర్తిని మూలమంత్రముచే సంకల్పించవలయును. అం చండేశ్వరాయనమ: “అనునది చండీశ్వర పూజా మంత్రము. ఆంగమాతృకలోకపాలాయుధములకు ఆవరణపూజగావించవలయును. దైవమంత్రనిష్ణాతుడు మాత్రమే చండేశ్వర మంత్రమును జపించవలయును. సర్వాభీష్టములను పొంది ఇహపరములలో ఆనందించును.
