నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

34 - హరిభక్తిలక్షణమ్

నారదమహర్షి పలి కెను :- సర్వజ్ఞా ! మహామునీ ! సర్వయోగాంగములను చక్కగా వివరించితిరి. ఇపుడు కూడా నేనడిగిన విషయములను చేప్పుడు. భక్తి గల వారికే యోగము సిద్ధించునని మీరు చెప్పితీరి. సర్వేశుడు సంతోషించినపుడే భక్తి స్థిరముగా నుండునని చెప్పితిని. సర్వేశుడు దేవదేవుడగు జనార్దనుడు ఎట్లు సంతోషించునో దయానిధివగు నీవు నాకు చెప్పుము.

సనక మహర్షి పలికెను :- ముక్తి పై కోరిక యున్నచో సచ్చిదానన్దవిగ్రహుడు పరదేవుడు అగు నారాయణుని సర్వ విధములా సేవించుము. విష్ణు పరాయణుడగు మానవుని శత్రువులు హింసించజాలరు. గ్రహములు బాధించజాలవు. రాక్షసులు చూడజాలరు. దేవదేవుడగు జనార్ధనుని యందు దృఢమగు భక్తి కలవారికి అన్ని శ్రేయస్సులు సిద్దించును. అందరికంటే భక్తిమంతులే అధికులు. శ్రీహరి మందిరమునకు వెళ్ళు పాదములు సఫలములు. శ్రీహరిని పూజించు కరములు సఫలములు. శ్రీహరిని దర్శించు నేత్రములు సఫలములు. హరినామమును కీర్తించు దానినే సజ్జనులు జిహ్వయందురు. చేతులు పైకెత్తి ముమ్మారులు సత్యమును చెప్పుచున్నాను. గురువుతో సమమగు తత్త్వమును, హితమును, సారమును చెప్పుచున్నాను. నిస్సారమైన ఈ సంసారమున సారము హరి సమర్చనము మాత్రమే. సుదృఢము మహామోహ ప్రదాయకము అగు సంసారపాశమును హరి భక్తి యను గొడ్డలిచే ఛేధించి అత్యన్తానన్దమును పొందుము. విష్ణువు నందు లగ్నమైనదే మనస్సు. విష్ణు నామసంకీర్తన పరాయణమైనదే వాక్కు. విష్ణు కథాసారపూరితములైనవే శ్రోత్రములు. ఆనందము అక్షరము, అవస్థాత్రయశూన్యము అకాశమధ్యగతము పరదైవతమగు శ్రీహరిని సర్వకాలములలో సేవించుము. ఆత్మజ్ఞానము లేనివారు శ్రీహరి స్థానమును, స్వరూపమును చూచుటకు నిర్దేశించుటకు వీలుకాదు. సర్వాంతర్యామి సనాతనుడగు దేవదేవుడు సమస్త కరణములచే కూడియున్నచో మేలుకొని యున్నాడందురు. అంతకరణములతో కూడి స్వేచ్ఛగా సంచరించు చున్నపుడు స్వపితి అని (పడుకొని యున్నాడు) అందురు. స్వాప వివర్జితుడై బాహ్యాంతఃకరణ రహితుడై స్వరూప రహితుడై పుణపాప వివీర్షితుడై యున్నపుడు సర్వోపాధి వినర్ముక్తుడు ఆనంద స్వరూపుడు నిర్గుణుడు విభువు పరబ్రహ్మ స్వరూపుడగు దేవుడు సుషుప్తావస్థలో (నిద్రావస్థలో) ఉండేనందురు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ భావనామయమే. మెరుపువలె చంచలము. కావున జనార్ధనుని సేవించుము. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము అపరిగ్రహము కలవానికి శ్రీహరి సంతోషించును. సర్వభూతదయాపరుడు బ్రాహ్మణపూజా పరాయణుడు అగువాని విషయమున మధు కైటభమర్దనుడగు శ్రీహరి సంతోషించును. సత్కథను విని సంతోషించువాడు, సత్కథను , చెప్పువాడు, సత్సంగమును చేయువాడు, అహంకార రహితుడు అగువానికి శ్రీహరి ప్రీతి చెందును. ఆకలి దప్పులలో, ప్రమాదములలో, సర్వకార్యములలో, సర్వావస్థలలో శ్రీహరినామ సంకీర్తనమును చేయువారికి శ్రీహరి సంతోషించును. పతిప్రాణి పతిపూజా పరాయణ యగు స్త్రీ విషయమున జగన్నాథుడు సంతోషించి తన పదమును ప్రసాదించును. అసూయారహితులకు అహంకార వర్షితులకు దేవపూజాపరులకు శ్రీహరి ప్రసన్నుడగును.

కావున ఓ దేవరీ ! నా మాటను వినుము. ఎప్పుడూ శ్రీహరినే సేవించుము. మెరుపు వలె చంచలమైన సంపదచే అహంకరించకుము. ఈ శరీరము మృత్యువుతో కలిసియుండునది. జీవితము అతి చంచలము. ధనము రాజ తస్కరాదులచే అపహరించబడును. సంపదలు కణ భంగురములు. ఓ దేవరీ ! సగము ఆయుష్యము నీద్రలో గడుచుటను నీవు చూచుట లేదా ? భోజనాది వ్యవహారములచే ఎంత ఆయుష్యము గడుచుచున్నది. బాలభావముచే కొంత వృద్ధాభావముచే కొంత వ్యర్థమగుచున్నది. మరికొంత యౌవనమున విషయ భోగములచే వ్యర్థమగుచున్నది. ఇక ధర్మములనోచరించునదెపుడు? బాల్యమున వార్థక్యమున అచ్యుతార్చన చేయజాలరు. కావున యౌవనముననే అహంకారమును విడిచి ధర్మా చరణమును చేయుము. సంసార గహ్వరమున మునిగి నశించకుము. ఈ శరీరము నాశనమునకు నిలయము ఆపదలకు స్థానము. ఈ శరీరము భోగనిలయము. మలమూత్రాదులచే పరిదూషితము. కావున శాశ్వతమని భావించి మానవుడేల పాపమునాచరించవలయును? నానా దుఃఖములతో కూడుకొని నిస్సారమైన సంసారమున విశ్వాసమునులచరాదు. ఎప్పుడు మృత్యువు గ్రహీంచునో తెలియదు. కావున ఓ మునీనా ! నేనీ సత్యమును చెప్పుచును. వినుము. దేహసంబన్ల నివృత్తికొఱకు వెంటనే అభిమానమును కామక్రోధలోభములను విడిచి శ్రీహరిని భజించుము. మానవత్వము చాలా దుర్లభము. కొన్ని వేల కోట్ల జన్మలు స్థావరాదులలో భ్రమించిన తరువాత అతి కష్టముతో మనుష్యత్వము లభించును. ఆ మానవ జన్మలో దైవతాబుద్ధి భోగబుద్ధి కలుగుట పూర్వజన్మ తపః ఫలమే. మానుష్యమును పొంది కూడా శ్రీహరిని సేవించనిచో అతనికంటే అజ్ఞాని 'మందబుద్ది మూర్ఖుడు మరియొకడుండడు. దుర్లభమైన మానుష్యమును పొంది శ్రీహరిని కోరిన ఫలములనిచ్చును. సంసారాగ్నిచే దహించబడిన వాడెవ్వడు శ్రీహరిని ఆరాధించడు? విష్ణుభక్తి కలవాడు చండాలుడైనను ద్విజుని కంటే శ్రేషుడే. విష్ణు భక్తి హీనుడగు ద్విజుడుకూడా చండాలుని కంటే అధముడే. కావున కామాదులను విడిచి అవ్యయుడగు శ్రీహరిని సేవించవలయును. శ్రీహరి సర్వగతుడు కావున శ్రీహరి సంతోషించినచో విశ్వమంతయూ ప్రీతి చెందును. హస్తిపదమున పొదమంతయూ లీనమగునట్లు చరాచర ప్రపంచమంతయూ శ్రీహరిలో లీనమగును. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ ఆకాశముతో వ్యాపించబడియున్నట్లు ఈ ప్రపంచమంతయూ శ్రీహరి చే వ్యాపించబడియున్నది. జన్మ నుండి మరణము సంభవించును. జన్మమే మృత్యుసాధనము. జన్మ మరణములు అతి సన్ని హితములు. శ్రీహరి సేవచే జన్మ మరణములు నశించును. శ్రీహరిని ధ్యానించిననూ, స్మరించిననూ, పూజించిననూ ప్రణామములాచరించిననూ సంసారపాశమును ఛేదించును. కావున శ్రీహరిని పూజించనివాడెవ్వడు? శ్రీహరి నామోచ్చారణముచే సర్వపాపములు నశించును. పూజించినచో మోక్షమే లభించును. శ్రీహరి నామముండగా జనులు సంసారమున నుండుట ఎంత ఆశ్చర్యము ! ఎంత ఆశ్యర్యము ! అందువలననే మరల మరల చెప్పుచున్నాను. ఇది సత్యము. వినుము. యమభటులు తీసుకొని పోవుచున్నప్పుడు ధర్మాచరణను చేయజాలవు. ఇంద్రియవైకల్యము వ్యాధులు కలుగనపుడే ముక్తిని కోరువారు శ్రీహరిని పూజించవలయును.

తల్లి గర్భము నుండి బయటపడిన వెంటనే మృత్యువు ప్రాణి సన్నిహితమగును. కావున ధర్మపరుడు కావలయును. వినశ్వరమగు శరీరమును పొంది ధర్మము నాచరించకపోవుట ఎంతకష్టము ? ఎంత కష్టము ! చేతులు పైకెత్తి ఇది ముమ్మాటికి నిజమని మరల చెప్పుచున్నాను. దంభాఖాచారమును విడిచి వాసుదేవుని పూజించవలయును. చేతులు పైకెత్తి మరల హితమును చెప్పుచున్నాను. సర్వవిధములా విష్ణువును పూజించవలయును. అసూయను అనృతమును వదిలి పెట్టుము. క్రోధము వలన మనస్తాపము కలుగును. క్రోధమువలన సంసారబంధము కలుగును. క్రోధము ధర్మమును క్షీణింపచేయును. కావున క్రోధమును విడువవలయును. ఈ జన్మ కామమూలము. కామమే పాపమునకు కారణము. కామము కీర్తిని క్షీణింపచేయును. కావున కొమమును పరిత్యజించవలయును. సమస్త దుఃఖజాలములకు మాత్సర్యమే కారణము. నరకసాధకము కావున మాత్సర్యమును విడవవలయును. మానవుల బంధమోక్షములకు. మన సే కారణము. కావున ఆ మనసును పరమాత్మయందు లగ్నముచేసి సుఖమును పొందవలయును. జగన్నాధుడగు శ్రీమహావిష్ణువుండగా భజించకపోవుటకు మానవుల కేంత ధైర్యము ! సర్వధాత అచ్యుతుడు అగు జగన్నాధుని సేవించక సంసారసాగరమున మునిగిన వారెట్లు తీరమును చేరెదరు. అచ్యుతానంతగోవింద నామోచ్చారషధము వలన అన్ని రోగములు నశించును. నేను నిజమును చెప్పుచున్నాను. నారాయణ జగన్నాథ వాసుదేవ జనార్ధన అని కీర్తించువారు అంతటా వందితులగుదురు. ఇప్పటికీ బ్రహ్మదులచే కూడా తెలియశక్యముకాని ప్రభావముగల శ్రీహరిని శరణు వేడుము. హృదయపద్మములో నివసించియున్న శ్రీహరిని తెలియలేని దుర్జనుల మూఢత్వము ఎంత వింత ? ఓ మునిశ్రేషా ! నేను మరల మరల చెప్పుచున్నాను. వినుము. శ్రద్దగల వారికి శ్రీహరి సంతుష్టుడగును కొని ధనములచే బంధుత్వముచే కాదు. విష్ణుభక్తి గల వారికి ప్రతిజన్మలో బంధువులు ఐశ్వర్యము పుత్రులు వృద్దీ చెందెదరు. ఈ దేహము పాపమూలము. పాపకర్మరతము. ఈ విషయమును తెలిసీ జనార్ధనుని పూజించుము. హరిపూజాపరాయణులకు పుత్రమిత్ర కళత్రాదీబహుసంపదలు కలుగును. సంశయమే లేదు. ఇహపరములలో ఆనందమును కోరువారు సర్వకాలములలో శ్రీహరిని పూజించవలయును. ఇహపరములలో దుఃఖమును కోరువారు పరనిందాపరులు కావలయును. దేవదేవుడగు జనార్ధనుని యందు భక్తి లేని వారి జన్మము వ్యర్థము. సతాత్ర దానములేని ధనము వ్యర్థము. ఓ మునిసత్తమా ! కర్మకయమును కలిగించు శ్రీమహావిష్ణువును నమస్కరించని వాని శరీరము సర్వపాపములకు నిలయము. సల్పోత్రదానశూన్యమగు ధనమును కాపాడుట చౌర్యముచేసిన ధనమును కొపొడుట వంటిదని తెలియును. మెరుపునలే చంచలమైన సంపదలచే మదించిన క్షణభంగురులు ప్రాణులు సంసారపాశవిమోచకుడుగు విశ్వేశుని పూజించరు. దైవి, ఆసురియని సృష్టి రెండు విధములు. హరిభక్తి కల సృష్టి దైవీయని, హరిభక్తి లేని సృష్టి ఆ సురియని తెలియవలయును. సుదుర్లభమైన హరిభక్తి కలవారు సర్వ శేషులు. అంతటా ప్రసిద్ధులు. అసూయా రహితులు విప్రరక్షణను చేయువారు కామాది రహితులైన వారి విషయమున శ్రీహరి సంతోషించును. విష్ణ్వాలయమున సమ్మారనాది శుశ్రూష చేయువారు సత్పాత్రదోననిరతులు పరమపదమును చేరెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున హరిభక్తి లక్షణమను ముప్పదినాలుగవ అధ్యాయము సమాప్తము.