నారద మహా పురాణము - పూర్వార్థము
12 - ధర్మాఖ్యానమ్
నారదుడు పలికెను :- ఓ భ్రాతా ! నేను కోరిన, పాపములను నశింపచేయు గంగామాహాత్మ్యమును వింటిని. ఇపుడు దాన లక్షణమును పాత్రలక్షణమును చెప్పుము.
సనక మహర్షి పలి కెను :- అన్ని వర్ణములలో బ్రాహ్మణ వర్ణము ఉత్తమము. ఇచ్చిన దానము అక్షయము కావలయునని తలచువారు బ్రాహ్మణునకే ఈయవలయును. బ్రాహ్మణుడు భయములేనివాడై అందరి నుండి దానమును తీసుకొనవలయును. క్షత్రియులు, వైశ్యులు ఎప్పుడూ దానమును తీసుకోరాదు. తీవ్రస్వభావము కలవానికీ, పుత్రులు లేని వానికి, డాంబికా చొరమును అవలంబించిన వానికి, తన కర్మలను విడచిన వానికి ఇచ్చినది నిష్పలమగును. పరభార్యల యందు ఆసక్తి కలహానికి, పరద్రవ్యమును అభిలషించువానికి, జ్యోతిష్యము చూచువానికి, ఇచ్చినది నిష్పలమగును. అసూయ నిండిన మనసు గలవానికి, కృతఘ్నునికి, కపటికీ, యాగమునకు అనర్హుడైన వానిచే యాగము చేయించువానికి, ఇచ్చినది నిష్పలమగును. ఎపుడూ యాచించు వానికి, హింసకునికి, ఖలునికీ, రసములను అమ్మువానికి ఇచ్చునది నిష్పలమగును. వేదములను స్మృతులను అమ్ముకొను వానికీ, ధర్మమును అమ్ముకొను వానికి, ఇచ్చినది నిష్పలమగును. గానముతో జీవించువానికి, వ్యభిచారము చేయు స్త్రీ భార్యగా - కలవానికి, ఇతరులను పీడించు వానికి ఇచ్చినది నిష్పలమగును. ఖడ్గముతో జీవించువానికి, సిరాతో జీవించువానికి, దేవాలయమున ధనమును తీసుకొని అర్చించువానికీ, గ్రామపురోహితునికి, గ్రామాధికారము చేయువానికి, ఇచ్చునది నిష్పలమగును. ఇతరులకు వంట చేయువానికి, కలికి, వైద్యునికి, తినరాని వాటిని తిను వానికి ఇచ్చినది. నిష్పలమగును. శూద్రుల అన్నమును తిను వానికి, శూద్ర శవములను దహనము చేయువానికి, వ్యభిచారిణుల అన్నము తినువానికి, ఇచ్చునది నిష్పలమగును. విష్ణునామములను అమ్మువానికి, సంధ్యావందనమును చేయని వానికి, దుష్టదానములను స్వీకరించువానికి ఇచ్చునది నిష్పలమగును. పగలు నిద్రించు వానికి, పగలు సంభోగము చేయువానికి, సంధ్యాసమయమున తినువానికి ఇచ్చునది నిష్పలమగును. మహాపాతకములు కలవానికి, జ్ఞాతులు బంధువులు వీడచిన వానికి విధవాపుత్రునికి, వ్యభిచారిణి పుత్రునికి ఇచ్చినది నిష్పలమగును. తన కంటే ముందు పెళ్లి చేసుకొన్న వాని అన్నకు, అన్నకు వివాహము కాకమునుపే వివాహము చేసుకొన్న వానికి, స్త్రీల వశములో నున్న వానికి అతిదుష్టునికి ఇచ్చినది నిష్పలమగును. మద్యమాంసములను తినువానికి, స్త్రీవిటులకు, అతిలోభికి తస్కరునికి, చాడీలు చెప్పువానీకి ఇచ్చినది నిష్పలమగును. పాపనిరతులకు ఇతరులచే నిందించబడువారికి ఈయరాదు. వారి నుండి తీసుకోరాదు. సత్కర్మనిరతునకే ప్రయత్నముచేసి ఈయవలయును.
శ్రద్దతో ఇచ్చినది, విష్ణువునకు అర్పించినది, యోగ్యుడైనవాడు అడిగినపుడు ఇచ్చినది, ఉత్తమ దానమనబడును. పరలోక ఫలము కొఱకు ఇహలోకమున యోగ్యునికి ఫలాకాంక్షతో నిచ్చు దానము మధ్యమము. డాంబికము కొఱకు, హింసించుటకు విధిరహితముగా, కోపముతో అశ్రద్దతో. అయోగ్యుడైన ఇతరునికి ఇచ్చునది మధ్యమము. అధమ దానము బలిచక్రవర్తి ప్రీతి కొఱకు, మధ్యమ దానము స్వార్థ సిద్ధికీ, ఉత్తమదానము హరిప్రీతికొఱకు అని వేదార్థములు తెలిసిన వారు చెప్పెదరు. ధనమునకు దానము, అనుభవము, వినాశము అని మూడు గతులుండును. దానము చేయని, అనుభవించని ధనము వినాశకారణమగును. ధనము ధర్మఫలము కావలయును. ధర్మమును శ్రీహరి సంతోషము కొఱకాచరించవలయును. చెట్లు బ్రతుకుచున్నవి కదా ! కాని అవికూడా పరార్థము కొఱకే జీవించు చున్నవి. మూలములతో (గడ్డలతో)ఫలములతో చెట్లు పరులకు ఉపకారమే చేయుచున్నవి. ఇతరుల కొఱకు జీవించనీ మనుజులు చనిపోయిన వారితో సమానులే. శరీరముతో, మనసుతో, మాటతో పరోపకారము చేయని మనుజులు పాపులు. ఓ నారదా ! ఈ విషయమున నీ కొక కథను చెప్పెదను వినుము.
ఈ కథలోనే దానాదికముల లక్షణములు గంగామహాత్మ్యము చెప్పబడినది. ఈ కధ అన్ని పాపములను నశింపచేయును. భగీరథయమధర్మరాజ సంవాదము అన్ని పుణ్యములను కలిగించును. సగరవంశమున బుట్టినవాడు భగీరథుడను పేరుగల వాడొక రాజుండెను. సప్తద్వీపములతో సప్తసాగరములతో కూడిన ఈ భూమండలమునంతయు పరిపాలించెను. అన్ని ధర్మములందు ప్రీతి కలవాడు, సత్యవ్రతము గలవాడు, అమిత పరాక్రమము కలవాడు, రూపమున, మన్మథుని బోలువాడు, యజ్ఞములను చేయువాడు, వివేకము కలవాడు, ధైర్యమున హిమాద్రిని బోలినవాడు ధర్మమున ధర్మరాజుతో సమానుడు అన్ని లక్షణములు కలవాడు, అన్ని శాస్త్రార్ధములు తెలిసినవాడు, అన్ని సంపదలు కలవాడు అందరికీ ఆనందమును కలిగించువాడు, ఎల్లప్పుడు అతిథులను పూజించుటయందే ఆసక్తి కలవాడు, శ్రీమన్నారాయణుని పూజించుటలో మనసు కలవాడు, అన్ని మంచి గుణములకు నిధి స్నేహశీలి, భూతదయ కలవాడు, మంచి బుద్ధి గలవాడు. ఇంతటి ఉత్తముడైన భగీరథ చక్రవర్తిని గూర్చి తెలుసుకొని సంతోషించిన యమధర్మరాజు ఒకప్పుడు చూచుట కొచ్చెను. భగీరథ చక్రవర్తి వచ్చిన ధర్మరాజును యథావిధిగా పూజించేను. భగీరథుని పూజలంది సంతోషించిన యమధర్మరాజు అతనితో ఇట్లు పలికెను.
ధర్మరాజు పలికెను :- “ఓ రాజా ! ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్టుడవని ప్రసిద్ది చెందితివి. ఈ మూడు లోకములలో విస్తరించిన నీ కీర్తిని విని ధర్మరాజునైన నేను నిన్ను చూచుటకు వచ్చితిని. సన్మార్గమునందు ఆసక్తుడైన వాడవు, సత్యసంధుడవు అన్నీ ప్రాణులకు హితమును చేయలయునని కోరువాడవు అయిన నిన్ను నీ ఉత్తమ గుణములయందలి ప్రీతిచే దేవతలు చూడ గోరుచున్నారు. ఓ రాజా ! కీర్తి, నీతి, సంపద, ఉన్న చోట సద్గుణములు సత్పురుషులు దేవతలు తప్పకనుందురు. ఓ రాజా ! నీ చరితము అత్యాశ్చర్యకరము. సుందరము. అన్ని ప్రాణులకు హితమును చేయవలయుననేడు, బుద్ది మావంటి వారికి కూడా దుర్లభమే.” ఇట్లు పలుకుచున్న ధర్మరాజును “భగీరధ చక్రవర్తి నమస్కరించి వినయముతో సంతోషముతో మృదుమధురమైన మాటలతో ఇట్లు పలి కెను.”
అన్ని ధర్మములు తెలిసిన భగవానుడా ! సమదర్నీ ! సురేశ్వరా ! నా మీద పరమకృప కలవాడవై నేనడిగిన వాటిని చెప్పుము. ధర్మములు ఎటువంటివి ? ధర్మశీలురకు లభించులోకములేవి ? నరకములెన్ని ? ఆ నరకములెవరికి ప్రాప్తించును ? నీవు ప్రేమతో ఆదరించునదెవరిని ? శాసించునదేవరిని ? దీనినంతటిని నాకు విస్తరముగా తెలుపుము.
ధర్మరాజు పలికెను :- “ఓ మహాబుద్దీ ! బాగు ! బాగు ! నీ బుద్ధి నిర్మలమైనది ప్రసన్నమైనది. ధర్మాధర్మములను గూర్చి చెప్పెదను. భక్తితో వినుము. పలువిధములుగా ధర్మములుండును ఈ ధర్మములు పుణ్యలోకములను ప్రసాదించును. భయంకరములైన ఆ ధర్మములు కూడా బహువిధములు. లక్షసంవత్సరముల కాలమున కూడా ధర్మాధర్మములను విస్తరముగా చేప్ప శక్యముకొదు. కావున ధర్మాధర్మ విషయములను సంగ్రహముగా చెప్పెదను. బ్రాహ్మణులకు బ్రతుకు తెరువును కల్పించుట మహాపుణ్యమని చెప్పబడినది. అట్లే ఆధ్యాత్మజ్ఞానికి దానము చేసిన ఫలము తరగనిదెను. శాస్త్రములు తెలిసిన కుటుంబిని, సద్గుణ వంతుడైన శ్రోత్రియుని బ్రతుకుతెరువు కల్పించి గ్రామమున ఉంచినచో తల్లివంశములు తండ్రి వంశములు కోటి తరములు విష్ణుభవనమున ప్రవేశించి ఒక కల్పము నివసించును. భూరేణువులను లెక్కించవచ్చును. వర్షబిందువులను, లెక్కించవచ్చును. బ్రాహ్మణునికి వృత్తి కల్పించిన పుణ్యములను బ్రహ్మ కూడా లెక్కించలేడు. బ్రాహ్మణుడు సమస్త దేవతా స్వరూపుడుగా చెప్పబడుచున్నాడు. అటువంటి బ్రాహ్మణునికి బ్రతుకుతెరువునిచ్చిన వాని పుణ్యమును ఎవడు చెప్పగలడు ? బ్రాహ్మణులకు హితమును చేయువాడు. అన్ని యజ్ఞములను చేసినవాడే. అన్ని పుణ్యతీర్థములలో స్నానము చేసినవాడు, అన్ని తపములను చేసిన వాడూ అగును. బ్రాహ్మణునకు బ్రతుకుతెరువును కల్పించమని ఇతరులను ప్రోత్సహించిన వానికి కూడా అంతియే ఫలము కలుగును. ఇక వేయి మాటలేల ? స్వయముగా చెరువును తవ్వించిననూ, ఇతరులచే తవ్వింప చేసిననూ అతని పుణ్యఫలమును నూరేండ్లకాలములోనైనను చెప్పలేము. ఒక్క బాటసారి అయిననూ ఆ చెరువులో నీరు త్రాగినచో చెరువును త్రవ్వించిన వాని పాపములన్నియూ నశించును. సంశయములేదు. ఒక దినమునకు సరిపోవు నీటిని చెరువులో ఉంచగలవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై స్వర్గమున నూరు సంవత్సరములు నివసించును. చెరువును త్రవ్వించువానికి శక్తి కొలది సాయము చేయువాడు, ఆకార్యమును చూచి ఆనందించువాడు, చెరువును త్రవ్వించమని ప్రోత్సహించువాడు కూడా అంతియే. ఫలమును పొందును. ఆవగింజంత మట్టిని చెరువునుండి తీసి బయట పడవేసినవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై నూరు సంవత్సరములు స్వర్గములో నివసించును. దేవతలను గురువులను సంతోషింపచేసిన వాడు చెరువును త్రవ్వించినవాని పుణ్యమును పొందును అని శ్రుతి చెప్పుచున్నది.
ఓ రాజా! ఇచట నీకు ఒక కథను చెప్పెదను వినుము. ఈ కథను వినినచో అన్ని పాపములు నశించును. గౌడదేశమున వీరభద్రుడను ప్రసిద్ది చెందిన మహారాజు కలడు. మహాప్రతాపము కలవాడు, - విద్యావంతుడు, ఎప్పుడూ బ్రాహ్మణులను పూజించువాడు. వేదశాస్త్రకులాచారములు కలవాడు. మిత్రులను పెంచువాడు. అతని భార్య మహానుభావురాలు చంపకమంజరి. వీరభద్రుని మంత్రులు కృత్యాకృత్యవిచారములు కలవారు. ధర్మశాస్త్రములచే ధర్మములను నిర్ణయించువారు. ప్రాయశ్చిత్తమును, చికిత్సను, జ్యోతిషశాస్త్రమును, ధర్మ నిర్ణయమును, శాస్త్రము ప్రమాణముగా లేక చెప్పువాడు బ్రహ్మఘాతకుడగును. ఇట్లు మన్వాదులు చెప్పిన ధర్మములను ఎప్పుడూ గురువుల నుండి విధి. పూర్వకముగా వినుచుండును. వీరభద్రుని రాజ్యమున అన్యాయముగా ప్రవర్తించువాడొక్కడునూలేడు. తక్కువ వాడు కూడా రాజ్యమున లేడు. ఆ రాజు ధర్మ బద్ధముగా రాజ్యపాలన చేయుచుండెను.
వీరభద్రుని సౌరాజ్యము స్వర్గముతో సమానమాయెను. ఒక మారు వీరభద్రమహారాజు మంత్రులతో కలిసి వేటకు బయలుదేరి మహారణ్యమున మధ్యాహ్నము వరకు తిరిగెను. దైవ వశమున వేటాడు మృగములు లభించక మిక్కిలి అలసిన మహారాజు పరివారముతో వెళ్ళి ఒక సరస్సును చూచెను. కాని ఆ సరస్సు నీరు లేక ఎండిపోయి యుండుట జూచి ఈ భూమి పై ఎత్తు ప్రాంతమున ఇట్లు సరసునెవరు నిర్మించిరి ? ఈ సరస్సులో నీరెట్లు లభించును ? ఆ నీరును త్రాగి ఈ రోజు ఎట్లు బ్రతుక వలయును ? అని (మంత్రి) చింతించెను. అపుడు ఆతనికి ఈ సరసును త్రవ్వవలయునని ఆలోచన కలిగెను. వెంటనే ఒక మూర లోతు సరస్సును త్రవ్వగా నీరు వచ్చెను. ఆ నీటిని త్రాగి రాజు తృప్తి చెందెను. బుద్దిసాగరుడను పేరుగల మంత్రికూడా నీరు త్రాగి తృప్తి చెందెను. తరువాత బుద్దిసాగరుడు రాజుతో నిట్లు పలికెను. “ఓ మహారాజా! ఈ సరస్సు వర్షపునీటితో మాత్రమే నిండియుండును. వర్షములు లేనపుడు ఎండిపోయి యుండును. కావున ఈ సరస్సును లోతుగా త్రవ్వలయునని నాకు ఆలోచన వచ్చినది. కావున మీరు దీనిని ఆమోదించి నాకొజ్జనీయుడు.” ఈ మాటలను వినిన వీర భద్రమహారాజు మిక్కిలి సంతోషించి తాను కొడా అట్లు త్రవ్వించ సంకల్పించెను. అట్లు ఆ సరస్సును చక్కగా త్రవ్వించు శుభకార్యమున ఆ బుద్దిసాగరునే నియమించెను. అపుడు రాజాజ్ఞను పొందిన పుణ్యాత్ముడైన బుద్ధిసాగరుడు సంతోషముతో ఆ సరస్సును సాగరమును. చేయుట సిద్దపడెను. అట్లు ఆ సరస్సును మూడువందల అడగులలోతు అంతయే వెడల్పుగా త్రవ్వించి చుట్టూ రాతిగోడ కట్టించి చాలా లోతుగా సరస్సును నిర్మింపచే సెను. అట్లు సరస్సును నిర్మించి బుద్ధిసాగరుడు వీరభద్రమహారాజునకు నివేదించెను. అప్పటి నుండి ఆ యరణ్యములో నుండు వారు బాటసారులు దప్పిగొనినపుడు ఆ సరస్సులోని నీరు త్రాగుచుండెడివారు.
ఇతి శ్రీబృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే ధర్మాఖ్యానే ద్వాదశోఽధ్యాయః .
కొంతకాలమునకు ఆయుష్యము పూర్తి కాగా బుద్ధిసాగరుడు మరణించి లోకపాలకుడైన నా లోకమునకు వచ్చెను. ధర్మలిపిని వ్రాయు చిత్రగుప్తుని నేను బుద్ధిసాగరుని విషయమున అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు సాతో బుద్ధిసాగరుడు చేసిన దానిని తెలి పెను. ఈ బుద్ధిసాగరుడు మహారాజునకు ధర్మ కార్యమునుపదేశించెను. కావున ఇతను ధర్మవిమానము నధిరోహించుటకు యోగ్యుడు. ఇట్లు చిత్రగుప్తుడు తెలుపగా ధర్మ విమానమునధిరోహించమని నేను బుద్దిసాగరుని ఆజ్ఞాపించితిని. మరికొంతకాలమునకు ఆ వీరభద్రమహారాజు మరణించి నాలోకమునకు వచ్చి సంతోషముతో నాకు నమస్కరించెను. నేను ఆ రాజు విషయమున కూడా చిత్రగుప్తుని అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు రాజు త్రవ్వించిన సరస్సు ధర్మమును తెలి పెను. అపుడు నేను రాజును గూర్చి ఇట్లు సరస్సు చరిత్రను తెలిపితిని” వినుము. సైకతపర్వత శిఖరము పై ఈ లకుముకి సీట్ల తన ముక్కుతో నీటిలో రెండంగుళములను త్రవ్వను. “తరువాత కొంతకాలమునకు ఈ వరాహము తన తుండముతో ఒక మూరలోతు త్రవ్వను. తరువాత కొంతకాలమునకు ఈ వరాహము రెండు మూరలు త్రవ్వను. అట్లు త్రవ్విన దానిలో నీరు రెండు నెలలుండెను. దప్పిగొనిన చిన్న జంతువులు ఆ నీరు త్రాగినవి. తరువాత మూడు సంవత్సరములకు యేనుగుల గుంపొచ్చి మూడు మూరలు త్రవ్వినది. ఎక్కువ నీరు వచ్చినది. ఆ నీరు మూడు మాసములున్నవి. చిన్న చిన్న జంతువులు ఆ నీటిని త్రాగి బ్రతికినవి. ఆ నీరేండి పోయిన తరువాత నీవచటికోచ్చితివి. నీవు ఒక మూరత్రవ్వి నీటిని పొందితివి. తరువాత మంత్రి - ఉపదేశముతో మూడువందల అడుగుల లోతు తవ్వించితివీ. అందులో చాలా నీరు వచ్చినది. రాతితో చక్కగా కట్టించినందున గొప్ప సరసాయేను. దాని తీరమున లోకులకుపకరించు చెట్లను నాటించితివి. కావున పొరి వారి పుణ్యములతో ఈ అయిదు ప్రాణులు ధర్మ విమానమును అధిరోహించినవి. నీవు కూడా ఈ విమానమునధిరోహించుము.” ఇట్లు చెప్పిన నా మాటలను వినిన వీరభద్రవమహారాజు ధర్మ విమానమధిరోహించి ఆరవ భాగమును స్వీకరించెను. ఇట్లు నీకు తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమునంతయు తెలిపితిని. ఈ కథను వినిన వారు పుట్టిన నాటి నుండి మరణించువరకు చేసిన పాపములనుండి విముక్తిని పొందెదరు. ఈ చరితమును శ్రద్దతో వినినవారు చదివిన వారు కూడా తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమును పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మాఖ్యానమున పన్నెండవ అధ్యాయము సమాప్తము.
