నారద మహా పురాణము - పూర్వార్థము
57 - సంక్షిప్త ఛందోవర్ణనమ్
సనందన ఉవాచ :-
సనందన మహర్షి పలికెను :-
ఓ నారద మహామునీ! ఛందస్సు వైదికము, లౌకికము అని రెండు విధములు. ఈ రెండు విధముల చందస్సు మాత్రా, వర్ణము అను భేదముచే మరల రెండు విధములు. ఛందశ్శాస్త్ర విశారదులు మగణము, యగణము, రగణము, సగణము, తగణము, జగణము, భగణము, నగణము అని ఎనిమిది గణములు. గురువు లఘువులు ఛందశ్శాస్త్రమునకు కారణములు అని చెప్పిరి. మూడు గురువులు కలది మగణము. ఆది లఘువు యగణము. మధ్యలఘువు రగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము, మధ్యగురువు జగణము, ఆది గురువు భగణము, మూడు లఘువులు కలది నగణము. ఒక్కొక్క గణమున మూడు వర్ణములుండును. నాలుగు లఘువులుకలగణములు అయిదున్నవి ఆర్యాదిసమ్మతములు. సంయోగముకొని, విసర్గలు కాని, అనుస్వారము కాని లఘువు తరువాత ఉన్నచో ఆ లఘువు. ల అనగా లఘువు. శ్లోకములోని నాలుగవభాగమును పాదమందురు. వచ్చేదమును యతి అందురు. వృత్తములు సమము, అర్థసమము, విషమము అని మూడు విధములు. నాలుగు పాదములు ఒకే లక్షణముతో నున్నయెడల సమవృత్తమందురు. మొదటి మూడవపాదములు, రెండవ నాలుగవ పాదములు ఒకేవిధముగా నున్నచో అర్థసమమందురు. ప్రతిపోదము వేరు వేరు లక్షణములు కలిగియున్నచో విషమవృత్తమందురు. ఒక అక్షరము నుండి మొదలిడి ఒక్కొక్క అక్షరమును పెంచుచు ఇరువదియార్డు అక్షరముల వరకు పొదములు విడివిడిగా ఉండును. తరువాత చండవృష్టి మొదలగు దండదండకములు చెప్పబడినవి. మూడు ఆరు పాదములచే గాధలు చెప్పబడినవి. ఇపుడు వరుసగా ఆ ఛందస్సు పేర్లను చెప్పెదను వినుము. ఉక్త, అత్యుక్తా, మధ్యా, ప్రతిషా, సుప్రతిష్ఠ, గాయత్రీ, ఉషైక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్ణుప్, జగతీ, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్ట, అత్యష్టా, ధృతి, విధృతి,కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంస్క స్కృతి, అతిక్పతి, ఉత్కృతి అని ఛందస్సు లకు సంజలు ప్రసారమును బటి భేదమును పొందినవి. అన్నిగురువులు కల పొదమును తీసుకొని మొదటి నుండి గురువు క్రింద లఘువును నుంచవలయును. పైన చేసినట్లే ముందు కూడా మొదటి వలె నుంచవలయును. దీనినే ప్రస్తారమందురు. ఈ ప్రస్తారము అన్ని లఘువులు వచ్చేవరకు చేయవలయును. ప్రస్తారమున గురువునకు = చిహ్నముండును. లఘువునకు చిహ్నముండును. నష్టాలకార్డ సమమున లఘువుండును. విషమమున అదియే ఊర్ధ్వగమగును. ఉద్దిష్టమున మొదటినుండి రెట్టింపుగా అంకములను తీసుకొని లఘువులలో ఉన్నవాటిని కలిపి ఆరెంటిని ఒకటిచేసి సంఖ్యను చెప్పవలయును అని ప్రాచీనజ్ఞులు చెప్పేదరు. ఉత్తరాధరములుగా నున్న, వృత్తముల నుండి పుట్టిన వర్ణములను ఒకటి మొదలుకొని వరుసగా ఒక్కొక్కదొని ఉపరిభాగమున ఉంచవలయును. చివరిదానీ సమీపమున ఆపవలయును. పై నుండి ఒక్కొక్క దానిని విడిచి పెట్టవలయును. పై భాగమున మొదటి గురువునుండి ఒకటి రెండు మొదలగు లగక్రియలను చేయవలయును. అనగా లఘువు గురువులను ఉంచవలయును. లగక్రియాంక సందోహమును కలిపినచో సంఖ్యయగును. ఉద్దిష్ణాంకము కాని, సమాహారము కాని, సైకము కాని ఈక్రియను కలిగించును. సంఖ్యయే ద్విగుణము, ఏకోనము అగును. అని సత్పురుషులు ఛందోమార్గమును బోధించిరి ఇట్లు కొంచెము ఛందస్సుల లక్షణమును చెప్పితిని. ప్రస్తారమున చెప్పబడిన భేదములకు అంతములేదని చెప్పబడినది.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున సంక్షిప్త ఛందోవర్ణనమను యాబయేడవ అధ్యాయము సమాప్తము.
