నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

92 - బ్రాహ్మపురాణేతిహాసకథనమ్

కలవి? దానినంతటిని నాకు చెప్పుము. చాతుర్వర్ణాశయకథలను నానావ్రతకధలను సృష్టి క్రమముతో వంశకధలను చక్కగాతెలిసిన వారు నీకంటే ఇతరులు లేరు. కావున నాకు నీవు సర్వసందేహభంజకమగు పురాణాఖ్యానమును తెలియజేయుము.

సూతమహర్షిపలికెను :- అంతట జ్ఞానశ్రేష్టుడగు సనాతన మహర్షి నారద భాషితమును విని క్షణకాలము నారాయణుని ధ్యానించి ఇట్లుపలికెను.

 సనాతనమహర్షిపలికెను :- ఓ మునిసత్తమా? పురాణ కధలను తెలియుటకు కోరిక కలుగుట చాలామంచిది. పూర్వము బ్రహ్మదేవుడు పుత్రస్నేహముతో మరీచ్యాది ఋషులకు చెప్పిన దానిని నీకు చెప్పెదను. ఒకపుడు బ్రహ్మపుత్రుడు మరీచిమహర్షి స్వాధ్యాయశ్రుతసంపన్నుడు, వేదవేదాంగపారగుడు లోకభావనుడు తన తండ్రియగు బ్రహ్మను సమీపించి భక్తిచే నమస్కరించి నీవు నన్నడిగిన పురాణాఖ్యానమును ప్రశ్నించెను.  మరీచిరువాచ :-

మరీచిపలికెను :- ఓ భగవంతుడా! దేవదేవేశ! లోకముల సృష్టిలయకారణా! సర్వజ్ఞా! సర్వకళ్యాణా! సర్వాధ్యక్ష్యా! నీకునమస్కారము. ఓ తండ్రీ! నిన్ను సేవించు నాకు పురాణస్వరూపమును, లక్షణమును, ప్రమాణమును, చెప్పువానిని, అడుగువాని గురించి తెలుపుము.

బ్రహ్మపలికేను :- నాయనా. పురాణసముచ్చయమును చెప్పెదను వినుము ఈ పురాణ సముచ్చయమ తెలిసినచో చరాచర సహితమగు వాజ్మయమంతయూ తెలియును. మొదట అన్సీకల్పములలో ఒకటే పురాణముండెడిది. ఇదియే చతుర్వర్గమూలము. నూరుకోట్లశ్లోకములు కల విస్తృతగ్రంథము. సర్వశాస్త్రములు ఈ పురాణము నుండియే ప్రవర్తించినవి. ఎంతకాలము గడచిననూ పురాణమును ఎవ్వరూ గ్రహించకపోవుటను చూచి మహామతియగు శ్రీహరి ద్వాపరయుగమున వ్యాసునిగా అవతరించి నాలుగు లక్షలు శ్లోకములుగా పదునెనిమిది పురాణములుగా భూలోకమున అవతరింపచేసెను. ఇప్పటికి దేవలోకమున పురాణము శతకోటి ప్రవిస్తరముగానున్నది. ఈపురాణసారమునే నాలుగు లక్షల శ్లోకములలో వర్ణించిరి. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణుపురాణము, వాయుపురాణము, భాగవతపురాణము, నారదీయపురాణము, మార్కండేయపురాణము, అగ్నిపురాణము, భవిష్యపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగపురాణము వరాహపురాణము, స్కాందపురాణము, వామనపురాణము, కూర్మపురాణము, మత్స్యపురాణము, గరుడ పురాణము, బ్రహ్మండపురాణము అని పురాణములు పదునెనిమిది. ఒకే కథానకసూత్రము వక్తకుశోతకు ఉండును. దానినంతటిన సంగ్రహముగా చెప్పెదను. వినుము. ఆపురాణములలో మొదటిది సర్వలోకహితమును కలిగించునది బ్రహ్మపురాణము. వేదజ్ఞుడు మహానుభావుడగు వ్యాసమహర్షిచే చెప్పబడినది. ఈ బ్రహ్మపురాణమే అన్నిపురాణములలో మొదటిది. ధర్మకామార్థమోక్షముల నిచ్చునది. నానాఖ్యానేతిహాస సహితము. పదివేలు శ్లోకములు కలది. ఈబ్రహ్మపురాణమున దేవదానవుల ఉత్పత్తి. దక్షాదిప్రజాపతుల ఉత్పత్తి, లోకేశ్వరుడగు సూర్యభగవానుని పరమపవిత్రము మహాపాతకనాశకమగు వంశానుకీర్తనము, పరమానందస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు నాలుగు రూపములుగా అవతరించి శ్రీరామచంద్రుని కథ, సోమవంశ వర్ణనము, జగదీశుడగు శ్రీ కృష్ణ చరితము, సర్వద్వీపముల సర్వవర్షముల వర్లన, పాతాళస్వర్గముల వర్ణన, నరకకథలు, సూర్యస్తుతి కథ, పార్వతీదేవిపుట్టుక, వివాహము, దక్షప్రజాపతికథ, ఏకామక్షేత్రవర్ణనము, ఈ కథలు చెప్పబడినవి. ఇంతటితో బ్రహ్మపురాణమున పూర్వభాగము సమాప్తమగును. ఇక ఉత్తర భాగమున పురుషోత్తమ వర్ణనము. తీర్థయాత్రావిధాన విస్తారవర్ణనము. సవిస్తరముగా కృష్ణచరితము, యమలోకవర్ణనము, పితృశ్రాద్ధవిధానము, వర్ణాశ్రమధర్మముల విపులవర్ణనము, బ్రహ్మవాదసముద్దేశము, పురాణప్రశంస, విపులముగా వర్ణించబడినవి. విష్ణుధర్మముగా ఖ్యానము, ప్రలయవర్ణనము యోగసాంఖ్య సమాఖ్యానములు చెప్పబడినవి. ఇట్లు బ్రహ్మపురాణము రెండు భాగములుగా చెప్పబడినది. ఈ బ్రహ్మపుఠాణము సర్వపాపహారము. సర్వసౌఖ్యప్రదాయకము. సూతశౌనక సంవాదము. భుక్తిముక్తి ప్రదాయకము. వైశాఖ పూర్ణిమ తిథియందు ఈబ్రహ్మపురాణమును వ్రాసి బంగారముతో గోవుతో భక్తితో బ్రాహ్మణునకు దానము చేయవలయును. పౌరాణికుని చక్కగా పూజించి వస్త్ర భోజ్యభూషణదాలునిచ్చి బ్రహ్మపురాణమునిచ్చినచో సూర్యచంద్రులుండువరకు బ్రహ్మలోకమున నివసించును. బ్రహ్మపురాణముననున్న కధానుక్రమణికను చదివినవాడు, వినినవాడు అన్నిపురాణములను చెప్పుట వలన వినుటవలన కలుగు ఫలితమును పొందును. బ్రహ్మపురాణమును సంపూర్ణముగా జితేంద్రియుడై వినినవాడు హవిస్సును మాత్రమే భుజించి నియమబద్దముగా నుండినచో బ్రహ్మలోకమును పొందును. ఇంతయేల? బ్రహ్మపురాణసంకీర్తనమువలన కోరికలన్నింటిని పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున బ్రాహ్మపురాణేతిహాస కథనమను తొంబదిరెండవ అధ్యాయము సమాప్తము.