నారద మహా పురాణము - పూర్వార్థము
86 - యక్షిణీ మంత్ర సాధన నిరూపణమ్
సనత్కుమార మహర్షి పలికెను :
ఇంతవరకు నీకు సరస్వతీ అవతారములను చెప్పితిని. ఇక ఇపుడు సర్వసిద్ధి ప్రదములగు లక్ష్మ్యవతారములను చెప్పెదను. వాణీ మన్మథ శక్తి నామములతో మూడు బీజములు చెప్పబడినవి. దక్షిణామూర్తి ఋషి, పంక్తి ఛందస్సు. బాలాత్రిపుర దేవత. మధ్యాంతములందు శక్తి బీజములుండును. నాభి నుండి పాదముల వరకు మొదటిది. హృదయము నుండి నాభి వరకు రెండవది. శిరస్సు నుండి హృదయము వరకు మూడవది. ఈ మూడిటి యందు మూడు బీజముల నుంచ వలయును. మొదటి దానిని వామకరమున దక్షిణ కరమున, రెండవది రెండు కరములందు, మరల బీజ త్రయన్యాసమును శిరస్సున గుహ్యమున, వక్ష సృలమున నుంచి నవయోని న్యాసమున తొమ్మిది మార్లు మంత్రన్యాసమును గావించవలయును. కర్ణములందు, చిబుకము నందు, శంఖములందు, ముఖ పంకజము నందు, నేత్రము లందు, నాసిక యందు, స్కంధములందు, ఉదరము నందు, కూర్చరములందు, నాభియందు, జానువులందు, లింగమునందు, మస్తకము నందు, పాదములందు, గుహ్యము నందు, పార్శ్వములందు, హృదయము నందు, స్తనములందు, కంఠము నందు, వామాంగాదులందు న్యాసము గావించవలయును. వాగ్భవాద్యమగు రతిని గుహ్యమున, ప్రీతి మత్యాదికమును హృదయమున, కామబీజాదికములను భ్రూమధ్యమున మనోభవమును న్యాసము గావించవలయును. మరల వాగాది న్యాస త్రయమును గావించవలయును. అమృతేశి, యోగేశి, విశ్వయోని అను మువ్వురిని శిరస్సున వక్రమున హృదయమున, గుహ్యమున, పాదములందుంచ వలయును.పంచ బీజాఢ్యమగు వామేశిని మన్మధుని నుండి పంచన్యాసమును గావించవలయును. మాయ, కామ, వాక్, లక్ష్మి, కామేశి అనునవి అయిదు బీజములు కలవి. మనోభవ, మకరధ్వజ, కందర్ప, మన్మధ, కామదేవ, స్మరులు న్యాస సిద్ధిదులుగా చెప్పబడిరి. శిరస్సున పాదములందు, ముఖమున, గుహ్యమున హృదయమున ద్రావిణీ మొదలగు బాణ దేవతలను బాణేశా బీజ పూర్వకముగా న్యాసముగావించవలయును. ద్రాం, దీం, క్లీం,సం, కం అనునవి బాణేశ బీజములు. ద్రావిణీ, క్షోభిణీ, వశీకరణీ, ఆకర్షణీ, సంమోహనీ అనునవి అయిదు బాణ దేవతలు. మూడవది వాజ్మధ్యమమగు కామ బీజముచే షడంగములను కల్పించవలయును. షడ్డీరస్వర యుక్తముచే దేవిని ధ్యానించవలయును. రక్తపద్మమున నుండునది రక్తవస్త్ర త్రిలోచన, ఉద్యదరనిభ, విద్యాస్వరూపిణి, మాలా భయవరధారిణి యగు దేవిని ధ్యానించవలయును. మూడు లక్షలు జపించవలయును. దశాంశమును మోదుగు పూవులచేకాని, హయారి పుష్పములచే కానీ మధుర మిశ్రితములుగా హోమము గావించవలయును. నవయోన్యాత్మక యంత్రమును లిఖించి, బయట అష్టదల పద్మమును లిఖించి కేసరములందు స్వరములను, దలములందు అష్ట వర్గలను న్యాసము గావించవలయును. దలాగ్రములందు త్రిశూలములను, పద్మమున మాతృకావృతిని లిఖించిన యంత్రమున షట్ శక్తులకు పూజించవలయును. ఇచ్ఛా, జ్ఞానాక్రియా, కామినీ, కామదాయినీ, రతీ, రతిప్రియ, నందా, మనోన్మని అనునవి తొమ్మిది పీఠ శక్తులు. ఈ శక్తులను పూజించి పీఠమంత్రముచే పీఠమును నిర్దేశించ వలయును. “సదా శివాయ మహా ప్రేత పద్మాసనాయ నమ:” అనునది పీఠమంత్రము ఈ మంత్రము పదునారు అక్షరములు కలది. తరువాత మూల మంత్రముచే మూర్తిని కల్పించి దేవిని ఆవాహన గావించి వివిధ ఉపచారములచే పూజించి జపించవలయును. త్రికోణ రూపమగు మధ్య యోనియందు రతి పూర్విక యగు దేవిని పూజించి, వామ కోణమున రతిని, దక్షిణ కోణమున ప్రీతిని, ముందు మనోభవను, యోన్యంతర్భాగమున వహ్నికోణాదులందు అంగములను, అగ్నియొక్క విదిక్కులందు కూడా పూజించవలయును. మధ్యయోని బయట పూర్వాది దిక్కులందు అగ్రభాగాన స్మరులను, అష్టయోనులందు బాణ. దేవులను, శక్తులను అట్లే పూజించవలయును. సుభగా, భగా, భగసర్పిణీ, భగమాలా, అనంగా, నగాకుసుమా, ఆనంగమేఖలా, అనంగమదనా అనునవి అష్టశక్తులు. పత్రములందు పద్మకేసరగతులగు బ్రాహ్మీముఖులగు భైరవులను పూజించవలయును. దలాగ్రము లందు అష్ట పీఠములనుంచ వలయును. మొదటిది కామరూపము మలయము, కోల్లగిరి, చౌహారము, కులాంతము, జాలంధరము, ఉన్నసము, కోట పీఠము అనునవి అష్ట పీఠములు. భూ గృహమున దశ దిక్కులందు హేతుకుని, త్రిపురాంతకుని, వైతాలుని, అగ్ని జిహ్వుని, కమలాంత, కపాలులను, ఏకపాదుని, భీమరూపునీ, విమలుని, హాటకేశ్వరుని పూజించి వారి వారి దీక్కులందు శక్రాదులను సాయుధులను పూజించవలయును. దాని వెలుపల బటుకుని యోగినిని క్షేత నాయకుని పూజించవలయును. విదిక్కులందు గణేశుని వస్తువులను, సూర్యులను, శివులను అర్చించవలయును. ఇట్లు బాలా త్రిపురను సేవించువాడు విద్యా ధనములకు అధిపతి కాగలడు. రక్త పద్మములచే హోమము చేసిన స్త్రీలు వశమగుదురు. ఆవాలచే హోమము చేసిన రాజులు వశమగుదురు. నంద్యా వర్తములచే రాజవృక్షములచే, మల్లెలచే, పాటల చంపకములచే, పుష్పములచే బిల్వఫలములచే హోమము చేసిన లక్ష్మి స్థిరమగును. పాలు కలిపిన గుడూచిచే హోమము గావించిన అపమృత్యువును జయించును. దూర్వాహోమముచే రోగములు లేని ఆయుష్యము కలుగును. చంద్రా గురుసురములచే హోమము గావించిన జ్ఞానమును కవిత్వమును పొందును. మోదుగు పూవులచే హోమము చేసిన వాక్సిద్ధి, అన్నహోమముచే అన్నము లభించును. ఆవుపాలు కలిపిన పేలాలచే హోమమును చేసిన రోగములను జయించును. రక్త చందన కర్పూరం కర్పూరాగురు చందనకేశర, మాంసీ చయమును క్రమముగా భాగములను చేయవచ్చును. 1,1,1, 9,4,6,7, 4 సంఖ్యలతో భాగములు చేయవచ్చును. శ్మశానమున నల్లటి రాత్రియందు నీహార సౌధమును కుమారిచేత మర్థన చేయించి మంత్రముచే అభిమంత్రించి తిలకమును ధరింప చేయవలయును. ధరించిన వానిని చూచిన జనము వశమగును. గజ సింహాది భూతగణము రాక్షసీగణము శాకినీ గణము కూడా వశమగును. ప్రయోజన సిద్ది కోటకు దేవీ శాపమును వర్తింపచేసి ఉత్కీలమును గావించి తరువాత ఈ జపము నాచరించవలయును. మొదట జపమున వరాహ భృగు పావకములను జపించి, మధ్యమాది యందు నభోహంసలను, మధ్యమాంతమున పావనుని, ఆద్యంతములలో తృతీయ క్రమముచే ధూమ్రకేతనుని నూరుమార్లు జపించినచో ఈ మంత్రము శాపహీనమై ఫలప్రదమగును. లేదా ఆది బీజమున చరమ బీజమున రేఫా వియోగమును చేయరాదు. ఈ శాపోద్దారమునకు మరియొక విధానముకూడా కలదు. ఆద్యము ఆద్యము, తృతీయము, కాముడు, కాముడు, వాగ్భవము, అంత్యాంత్యము, అనంగుడు, బాలా త్రిపుర శాపము నివృత్తి యగును. చైతన్య హోదినీ మంత్రములు జపించి నచో నిషీలమగును. మూడు స్వరములు, చేతనా, శాంతి, అనుగ్రహము, తారాది మూడు మంత్రములచే సుదీప్తములను గావించి, మొదట ఆ మంత్రములను జపించవలయును. “వదవద" సుదీరాంబు స్మృతి కాలములు ఆనుగాములుగా సనేత్ర సత్యము వాగ్వర్ణోద్యములు క్లేదినిక్లిన్నము కాగా వైకుంఠము, దీర్ఘము, స్వము, సద్యోగాంతిమము, సచంద్రా, నిద్రా, ఈ మంత్రము ఏకాదశాక్షరి. 'ఇది మధ్యదీపిని, తారము మోక్షమును చేయును. ఇది వర్ణస్య దీపిని కాదు. దీపిని లేనిదే బాలత్రిపుర మంత్రమును సాధించిననూ సిద్ధించదు. శత్రుక్షోభ కొఱకు వారంత్య కామములను జయించవలయును. త్రైలోక్యమును వశము చేసుకొనుటకు కామవారంత్య బీజములను జపించవలను, మోక్షము కొఱకు కామాంత్యవాణీ బీజములను జపించవలయును. బాలా త్రిపుర పూజారంభమున త్రివిధ గురువులను పూజించవలయును. దీవోఘము, సిద్ధాఘము మానవొఘము అని గురువులు త్రివిధము పరప్రకాశుడు, పరమే శానుడు, పరశివుడు కామేశ్వరుడు, మోక్షము, కామము, అమృతము ఈ యేడుగురే దివ్యౌఘము. ఆనందప్రద పశ్చిమములు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అను అయిదుగురు సిదౌఘులు. స్వగురు సంప్రదాయమునను. సరించి మానవోఘములను తెలియవలయును. నవయోన్యాత్మక యంత్రమున మధ్యయోని నుండి లేఖనము ప్రారంభించవలయును. ప్రదక్షిణాక్రమముచే బీజములను మూడుమార్లు వ్రాయవలయును. గాయత్రి యొక్క మూడు మూడు వర్ణములను అష్టపత్రములందు వ్రాయవలయును. వెలుపల మాతృకావేష్టనము గావించి, దాని వెలుపల భూపుర ద్వయమును వ్రాయవలయును. కామ బీజ లసత్కోణమున పరస్పర వ్యతిభిన్నముగా పత్రమున తైపురము జప సంపాత సౌధితమును గావించ వలయును. అట్లు సాధించిన పత్రమును చేతిలో ధరించినచో ధనమును, కీర్తిని, సుఖమును, సుతులను ఇచ్చును. కామాంతమున “త్రిపురాదేవీం విద్మహే కవిష భహింబకం ఖడ్గ సమారూడ సనేత్రాగ్నిం ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్” అనునది బాలాత్రిపుర గాయత్రి సర్వసిద్ధి ప్రద. సుసేవిత.
ఇపుడు నరులకు సిద్ది నిచ్చు మహాలక్ష్మి యొక్క మరియొక అవతారమును చెప్పెదను. “ఓం గిరిజాయై భగవత్యై మాహేశ్వర్యై అన్నపూర్ణాయై స్వాహా" అనునది ఇరువది అక్షరములు గల మంత్రము. ద్రుహిణఋషి. ధృతి ఛందస్సు. అన్నపూర్ణ దేవత. షడ్దరాడ్యమగు హృల్లేఖ బీజముచే షడంగ కల్పన గావించవలయును. ముఖనాసాక్షివర్ణింసగుదములను నవాంగము లందు న్యాసమును చేయవలయును. తొమ్మిది పదములు. ఇపుడు ఆవర్ణముల సంఖ్యను చెప్పెదను. 1,11,1,2,4,4,4,2. ఇవి వర్ల సంఖ్యలు. తరువాత సురేశ్వరిని ధ్యానించవలయును. స్వర్ణకాంతులీను అంగములు కలది, త్రినయన, వస్త్రాలంకార శోభిత, భూరమా సంయుత, స్వర్ణామత్ర కరాంబుజ యగు దేవిని ధ్యానించి ఒక లక్ష జపమును గావించి, పదివేలు నేయి కలిపిన పొంగలిచే హోమమును గావించవలయును. జయాది నవశక్తి యుతమగు పీఠమును పూజను చేయవలయును. త్రికోణము, చతుష్పత్రము, అష్టపత్రము, షోడశ పత్రములు గల భూపుర యుతమగు యంత్రమున మాయచే మంత్రదానమును చేయవలయును. అగ్న్యాది కోణత్రితయమున శివరాహ మాధవులను వారి మంత్రములచే పూజించవలయును. ఆ మంత్రములను ఇపుడు చెప్పెదను, మను చంద్రాఢ్యమగు ప్రణవము, గగనము హృదయము, శివా, మారుతము ఇది శివమంత్రము ఏడక్షరములు కలది. వారాహ నారాయణ మంత్రములను మొదట ఉచ్చరించవలయును. షడంగములను పూజించి వామ దక్షిణములందు భూమిని లక్ష్మిని ఆయా మంత్రములచే అర్చించవలయును. ఇపుడా మంత్రములను చేప్పెదను. “అన్నం దేహి అన్నం మే దేహి అన్నాధిప! నయేమ మన్నం ప్రాణం నాపయ స్వాహా” అనునది ఇరువది రెండక్షరముల మంత్రము. భూపూజ యందు భూ సంపుటముచే జపించవలయును. లక్ష్మీ పూజయందు శ్రీపుటము స్మృతి లభాను చంద్రయుతము. భూ బీజము. శ్రీ బీజమును ముందే చెప్పితిని. మంత్రాదిలో నున్న నాలుగు బీజములు పూర్వములుగా పూజించవలయును. చతుష్పత్రములందు నాలుగు శక్తులుండును. పర, భువనేశ్వరి, కమల సుభగయని, అష్టపత్రములందు బ్రాహ్మి మొదలగు వారిని పూజించవలయును. షోడశ పత్రములందు మానదా, తుష్టి పుష్టి, ప్రీతి, రతి, స్త్రీ, శ్రీ, స్వధా, స్వాహా, జ్యోత్స్నా, హైమవతీ, ఛాయ, పూర్ణిమా, సంహతి, అమావాస్య అను వారిని మంత్రాది దేవతలను ప్రాణ ప్రతిష్టా పూర్వకముగా పూజించవలయును. భూపురము నందు లోకపాలురు, వారిముందు వారి అస్త్రములుండును. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించినచో ధనరాశులచే కుబేర సదృశుడగును. జనులచే పూజించబడును.
ఇపుడు మరియొక లక్ష్మ్యవతారమును చెప్పెదను. ప్రణవము శాంతి అరుణ క్రియాఢ్యమగు చంద్ర భూషితములు బగలాముఖి సర్వాంతమున ప్రోదినీయుతమగు ఇందిర జరాయుతమగు పీతా ప్రతిష్ఠ దీరేందు తరువాత బీజము ఓంకారము స్వాహా "అనునది బలా మంత్రము నారదర్షి బృహతీ ఛన్దస్సు. 2,5,5,9,8 వర్ణములచే అంగములను కల్పించి, పీతాంబరను స్వర్ణాసనస్థను, హేమాభను, స్తంభినిని, ఇందు శేఖరను. ముద్గర పాశవజ రసనలను ధరించిన దేవిని ధ్యానించి లక్ష జపించవలయును. బాలా పీఠమున ఈ దేవిని పూజించవలయును. చందనాగరు చంద్రాదులచే పూజించుటకు యంత్రమును లిఖించవలయును. త్రికోణ, షడ్డల, అష్టదల, షోడపత్ర పీఠమున పూజించవలయును. మంగల, స్తంభినీ. జృంభిణి, మోహిని, వశ్యా, చలా, బలాకా, కల్మషా, ధాత్రీ, కలనా, కొలకర్షిణీ, భ్రామికా, మందగా, భోగస్తా, భావికా, షోడశీ అను వారిని భూగృహము యొక్క నాలుగు దిక్కులందు పూజించవలయును. గణేశుని, బటుకుని, యోగినులను, క్షేత్రపాలకుని పూజించవలయును. వారి వెలుపల స్వాయుధ సముపేతులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకుడు దేవతాదులను స్తంభింప చేయవచ్చును. పీత వస్త్రమును ధరించి, పీతవర్ణాసనమున కూర్చుండి పీతమాల్యములను ధరించి, పీత చందనమును వ్రాసుకొని, పచ్చని పుష్పములచే పచ్చని మాలలచే దేవిని పూజించి పసుపు కొమ్ములచే చేసిన జపమాలచే జపించవలయును. పాలమధ్యన ఉంచిన పీతవర్ణదేవిని ధ్యానించుచు పదివేలు జపించవలయును. మూడు మధువులు నేయి కలిసిన నువ్వులచే హోమము చేసిన నరులు వశమగుదురు. త్రిమధుర మిశ్రితములకు లవణములచే హోమమును గావించిన ఆకర్షణ కలుగును. నూనె కలిపిన నింబపత్రములచే హోమము విద్వేషకారకము. తాలలోణహరిద్రలచే హోమము శత్రుస్తంభనము గావించును. రాత్రిపూట అంగారధూమము, రాజులు, మహిష గుగ్గులులను శ్మశానాగ్నిలో హోమమును గావించిన త్వరలో శత్రునాశము జరుగును. గరుడ గృధ్రకాహకటుతైలము, విభీతకము గృహధూమము చితాగ్నిలో హోమము గావించినచో శత్రూచ్చాటకము జరుగును. దూర్వా గుడూచీ లాజములను మధురత్రయ మిశ్రితములుగా చేసి హోమము గావించిన వానిని చూచిననూ అఖిల రోగ శాంతి కలుగును. పర్వతాగ్రమున, మహారణ్యమున, నదీసంగమమున, శివాలయమున బ్రహ్మచర్యారతుడగుచు అఖిలసిద్ధి కొజుకు లక్ష జపించవలయును. ఒకే వర్ణము గల గోవు యొక్క పాలను శర్కరా మధుమిశితముగా మూడు వందల మార్లు మంత్రించి పానము చేసినచో శత్రుపరాభవమును తొలగించును. తెల్లని మోదుగు చక్కతో సుందరమగు పాదుకలను సిద్ధముచేసి లత్తుకపూసి లక్ష జపముతో మంత్రించవలయును. ఆ పాదుకలనధిరోహించినచో ఒక క్షణములో నూరు యోజనములు వెళ్ళగలడు. పాదరసమును, శిలను, తాలపిష్టమును మధు మిశ్రితముగా. చేసి లక్ష జపముతో మంత్రించి శరీరమంతట వ్రాసుకొనవలయును. అట్లుచేసిన వాడు అదృశ్యమగును. ఈ ఆశ్చర్యమును చూడుము. సాధ్యనామ సమన్వితముగా షట్కోణ బీజమును వ్రాసి హరితాల నిశాచూర్ణములచే ఉమ్మెంత రసముచే కలిపి శేషాక్షరములచే తేబడి భూగృహమున స్థాపించబడి ప్రాణ ప్రతిష్ఠ గావించి పీత సూత్రముచే వేష్టించి వలయును. తిరుగుచున్న కుమ్మరి చక్రము మిద నున్న మట్టిని తీసుకొని సుందరమగు ఋషభమును చేసి యంత్రమధ్యమున నుంచి, ఆ ఋషభమును ప్రతిదినము పూజించవలయును పూజించే ముందు ఋషభమును హరితాలముచే లేపన గావించవలయును ఇట్లు చేసిన శత్రువుల వాక్కును, గతిని, కాశ్యపరం పరను స్తంభింప చేయును. వామహస్తముచే శ్మశాన భూమిలో నున్న కర్పరమున తీసుకొని, చితిలోనున్న అంగారముచే అచట యంత్రమును లిఖించి, మంత్రించి భూమిలో స్థాపించినచో శత్రు గతిని స్తంభింపచేయును. ప్రేతవస్త్రమున బొగ్గుతో యంత్రమును లిఖించి పీతసూత్రముచే పరివేష్టించి మండూక వదనమున నుంచి, పచ్చని పూవులచే పూజించినచో శత్రువాక్కును స్తంభింపచేయును. దివ్యత్వమున్న భూమియందు యంత్రమును లిఖించవలయును. పాత్రలచే మార్జన చేసినచో దివ్యత్వమును స్తంభింపచేయును. ఇంద్రవారుణి కామూలమును ఏడుమార్లు మంత్రించి జలమున పడవేసినచో జలస్తంభనమును గావించును. ఇంకనూ ఏమి చెప్పవలయును? సాధకుడు మంత్రమును చక్కగా ఉపాసించినచో శత్రువుల గతి బుద్ఘ్యాదులను స్తంభింప చేయవచ్చును. ఈ విషయమున సంశయముచే పనిలేదు
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున యక్షిణీ మంత్ర సాధన నిరూపణ మను ఎనుబది యార - అధ్యాయము సమాప్తము.
