నారద మహా పురాణము - పూర్వార్థము
76 - అధ్యాయము
నారద మహర్షి పలికేను : తమ తమ కర్మానుసారముగా కార్తవీర్యార్జునుని వంటి రాజులు పుట్టుచుందురు. గిట్టుచుందురు. అయినపుడు ఇతర రాజులను కాదని ఒక్క కార్తవీర్యార్జునుడే లోకమున సేవించదగినవాడెట్లగును .? నా ఈ సంశయమును తొలగించుము.
సనత్కుమార మహార్షి పలికెను : ఓ నారదా ! నీ సందేహమును తొలగించుటకు కార్తవీర్యార్జునుడు ప్రాణులచే సేవించదగిన వాడెట్లాయెనో తెలి పెదను. వినుము. కార్తవీర్యార్జునుడు సుదర్శనావతారము. దత్తాత్రేయుని ఆరాధించి గొప్ప తేజస్సును పొందెను. ఆ కార్తవీర్యార్జునుని స్మరించుట మాత్రముననే యుద్ధమున శత్రువులను జయించును. నష్టవస్తువులు లభించును. కావున కార్తవీర్యార్జునుని మంత్రమును పూజాదికము అన్నితంత్రములలో రహస్యముగా రక్షించబడియున్నది. ఇట్లు సర్వసిద్ధి ప్రదాయకమగు కార్యవీర్యార్జున మంత్రాదీకమును నీకు తెలి పెదను. నహ్నితారయుతారౌద్రి అగ్నీందుశాంతియుతమగు లక్ష్మి, వేధాధరేందు శాంత్యాఢ్యము నిద్రాయాశాన్ని బిందుయుతము, పాశము మాయాంకుశము పద్మా వర్మాస్త్రములు కార్తవీర్యపదము, అనన్హాసనము వహ్నిజములు కర్ణ సంస్థితములు. దీర్ఘసహితమగు మేషము, పవనుడగు, హృదంతిమమగు మనమిది. ఈ మంత్రము పందొమ్మిది వర్ణములుగలది. ఈరాది నఖ వర్ణకము. దత్తాత్రేయుడు ముని. అనుష్టుప్పనస్సు. కార్తవీర్యార్జునుడు దేవత. బీజశక్తి ధ్రువ హృదయము శేషాగ్య భీజయుగ్మముచే అధోభాగమున హృదయన్యాసము గావించవలయును. శాంతియుక్త చతుర్థమగు కామాద్యముచే శిరోంగన్యాసమును గావించవలయును. ఇంద్వొడ్యమగు వామకర్ణాద్యము వీశయుక్తముచే న్యాసము చేయవలయును. అంకుశ పద్మములచే శిఖను, వాక్సహితములచే అస్త్రమును, శేషవర్ణములచే వ్యాపకమునాచరించవలయును. హృదయమున, జఠరమున, నాభియందు, గుహ్య దేశమున, దక్షిణపొదమున, వామపాదమున, సక్లియందు, జానువున, జంఘలయందు, ప్రణవద్వయమధ్యన నున్న బీజదశకమును న్యొ సించవలయును. తారాదులగు శేషవర్ణములను మస్తకమున, లలాటమున, కనుబొమలలో, కర్ణములలో, నేత్రములలో, నాసికయందు, వస్త్రమున, గలమున, భుజమున, సర్వమంత్రముచే సర్వాంగమున ఆదరముచే వ్యాపకము నాచరించి సకలాభీష్టసిద్ధికోటకు ఉద్యదరస హస్రసన్నిభుని సర్వభూతపతివందితుని అయిదువందల దక్షిణబాహువులచే బాణములను, అయిదువందల పామబాహువులచే ధనువులను ధరించిన వానిని, స్వర్ణమాలాశోభితుని, రక్తవస్త్రసమావృతుని, శ్రీవిష్ణుచక్రావతారము అగు కార్తవీర్యార్జునచక్రవర్తిని ధ్యానించవలయును. మస్త్రమును ఒక లక్ష జపించవలయును. దశాంశమును తండులమిశ్రములగు నువ్వులచే, పాయసముచే హోమము సౌచరించవలయును. విష్ణుపీఠమున పూజించవలయును. షట్కోణములందు షడంగములను, దిక్కులందు విదిక్కులందు చోరమదవీభంజనుని, మారీమద విభంజనుని, అరిమదవిభంజనుని, దైత్యమదవీభంజనుని, దుష్టనాశకుని, దుఃఖనాశకుని, దురితములను ఆపదలను నశింప చేయువానిని, పూజించి, దిక్కులయందు అసితప్రభలగు అష్టశక్తులను పూజించవలయును. క్షేమకరి, వశ్యకరి, శ్రీకరి, యశస్కరి, ఆయుఃకరి, ప్రజ్ఞాకరి, విద్యాకరి, ధనకరి, అనునది అష్టశక్తులు. తరువాత అస్త్రసంయుతులను లోకేశులను పూజించవలయును. ఇట్లు సాధించబడిన మంత్రము ప్రయోగార్హమగును. ఇక ఇపుడు కార్తవీర్యార్జునుని పూజా యంత్రమును చెప్పెదను.
స్వబీజానంగధ్రువవాక్కర్ణికముగా అష్టదలపద్మమును లిఖించవలయును. తారాది వర్మాంతదళమును, శేషవర్ణములను మధ్యదలములనుగా, ఊష్మాంత్యస్వరములు కింజల్కములుగా శేషార్ణపరివేష్టితముగా కోణములందు అలంకరించబడిన భూత వర్లగృహముగా కార్తవీర్యార్జు యంత్రమును పరిశుద్ద భూమియందు అష్టగంధములతో లిఖించి, ఆ యంత్రమున కుంభమును ప్రతిష్టించి, కుంభమున ఆవాహన గావించి రాజును అర్పించవలయును. కుంభమును స్పృశించి జితేంద్రియుడే ఒకవేయి జపించవలయును. ఆ కుంభోదకముచే అభి షేకము చేసినచో సర్వాభీష్టములు సిద్ధించును. పుత్రులు, కీర్తి రోగనాశము, ఆయుష్యము, స్వజనరంజనము, వాక్సిద్ధి, చక్కని నేత్రములు కుంభోదకాభి షేకముచే లభించును. శత్రువులవలన ఉపద్రవము సంభవించినపుడు, గ్రామమున ఉపద్రవములు సంభవించినపుడు. శత్రుభీతినివృత్తి కొరకు ఈ యంత్రమును స్థాపించవలయును. ఆవాలు, మినుములు, వుల్లి, పత్తి వీటి చే హోమముగావించినచో శత్రు సంహారము జరుగును. ఉమ్మేంతచే శత్రుస్తంభనము, నిమ్మకాయలచే ద్వేషము, పద్మములచే వశ్యత కలుగును. ఉచ్చాటనలో విభీతక సమిధలచే చంద్రసమిధలచే హోమమును చేయవలయును. కటు తైలమహిష్యాజ్యములను హోమద్రవ్యములుగా కూర్చుకొనవలయును. యవహోమముచే 'శ్రీప్రాప్తి, తీలలచే నేతిచే పాపనాశము, తిలతండుల సర్టపములచే రాజవశ్యత, ఉత్తరేణి దూర్వలచే హోమము చేసిన లక్ష్మీప్రదము పాపనాశము. ప్రియంగు హోమము స్త్రీ వశకరము. మురహోమము భూతశాంతి ప్రదము. రాగి, మేడి, జువ్వి మజ్జి, మారేడు సమిధలచే హోమము గావించిన పుత్రులు ఆయుష్యము ధనము, సుఖము లభించును. నిర్మోకముచే, హోమముచే, ఆవాలచే, లవణములచే హోమముగావించినచో చోరనాశము జరుగును. రోచనాగోమయములచే స్తంభనము, శాలిహోమముచే భూప్రాప్తి కలుగును. అంతట ఆయాకార్యలాఘవ గౌరవములననుసరించి హోమసంఖ్యను వేయి నుండి పదివేలు వరకు బుద్దిమంతులు నిర్ణయించుకొనవలయును. పండితులు కార్తవీర్యార్జున మంత్ర లక్షణము నిట్లు చెప్పుదురు. అన్ని మస్త్రములలో కార్తవీర్యార్జునొయ అని చెప్పవలయును. స్వబీజము ఆద్యముగా ఈ మంత్రము దశాక్షరము, మిగిలిన మంత్రములు నవ ఏకాదశాక్షరములు. ఆద్యబీజద్వయముచే ఇదియే రెండవ మంత్రమగును. స్వకామములచే తృతీయమన్త్రమగును. స్వభ్రువులచే చతుర్థము, స్వపాశములచే పంచమము. స్వమాయ షష్ఠము, స్వాంకుశములచే సప్తమము, స్వరములచే అష్టమము, స్వవాగృవములచే నవము, వర్మాస్త్రములచే దశమము. రెండవ మంత్రమునుండి తొమ్మిదవ మంత్రము వరకు బీజవ్యతిక్రమము జరుగును. దశమ మంత్రమున నవవర్మాస్త్రమధ్యగములు ఈ మంత్రములలో తమకు అనుకూలమగు మంత్రమును సేవించవలయును. ఆ మంత్రములలో మొదటి మంత్రముల విరాట్చనస్సు, మిగిలిన తొమ్మిదింటిలో త్రిష్టప్పందస్సు. ఈ దశమంత్రములు ప్రణవాదికములైనచో మొదటి మంత్రము ఏకాదశాక్షరి, మిగిలిన మంత్రములు ద్వాదశాక్షరులగును. ప్రణవాదికమైనపుడు మొదటి మంత్రము త్రిషుప్పందస్సు. మిగిలిన వాటిలో జగతి ఛందస్సుండును. ఇట్లు ప్రణవరహితములు పది, ప్రణవాదిమములు పది మొత్తము ఇరువది "మంత్రములకు పూజాదికమంతయు పూర్వమువలె నాచరించవలయును. ఈ మంత్రములకు దీర్జాడ్యమగు మూలబీజముచే షడంగ కల్పన చేయవలయును. తారము, హృదయము, కార్తవీర్యార్జునాయ అనునది కవచము. ఈ ద్వయము అస్త్రము. ఈ మంత్రము పదునొలుగక్షరములు కలది. దీని పూజాదికమంతయు పూర్వమువలే నాచరింపవలయును. 1, 3, 2, 3, 3 వర్ణములచే పంచొంగ కల్పన చేయవలయును. “ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హుం ఫట్ స్వాహా” అనునది పదినెనిమిదిక్షరములు గలది. 3, 4, 1, 2, 3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలయును. “నమో భగవతే శ్రీకార్తవీర్యార్జునాయ సర్వదుష్టాన్లకాయ తపోబలపరాక్రమపరిపాలితసప్తద్వీపాయ సర్వరాజన్య చూడామణయే మహాశక్తిమతే సహస్ర దహన హుం ఫట్” అనునది మహామంత్రము. అరువది మూడు వర్ణములు కలది. ఈ మంత్రమును స్మరించినంతనే సర్వవిఘ్నములు తొలగిపొవును. రాజన్య చక్రవర్తీ, వీరః, శూర, మాహిష్మతీపతి, రేవాంబు పరితప్తః, హస్తప్రచాదిత దశాస్య?" అను ఈ ఆరుపదములకు చతుర్ధి విభక్యంతములుగా షడంగకములను కల్పించవలయును. నర్మదా నదీ జలములలో యువతులచే నీరు చల్లబడగా ఆడుచున్న హస్తములచే జలప్రవాహమును అరికట్టుచున్న మదించిన రాజశేషుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానించి మంత్రమును పదివేలు జపించవలయును. మిగిలిన దంతయూ పూర్వము వలె నాచరించవలయును. మొదటి మంత్రమును లక్ష జపించవలయును. పూజోధ్యానాదికము పూర్వము వలెనే కార్తవీర్యార్జునుడను పేరుగల రాజు వేయి చేతులు కలవాడు. అతని స్మరించినంత మాత్రముననే, హరించబడినది నశించబడినది లభించును. ఈ మంత్రము ముప్పది రెండు వర్ణములు కలది. సర్వపోదములచే పంచొంగ కల్పన చేయవలయును. ధ్యానపూజాదికమంతయు పూర్వము వలె నాచరించవలయును. “కార్త వీర్యాయ విద్మహే మహావీర్యాయధీమహితన్న్వోర్టునః ప్రచోదయాత్” ఇది కార్తవీర్యార్జున గాయత్రి ప్రయోగాదులందు దీనిని జపించవలయును. అనుష్టుప్ మంత్రమును - రాత్రిపూట జపించినచో చోరభయము నశించును. చోరులు ఆ ఇంటినుండి దూరముగా పారిపోవుదురు. తర్పణము గావించినను హోమము గావించిననూ చోరులు పారిపోవుదురు. ఇక ఇపుడు కార్తవీర్యార్జునునకు ప్రీతికరమగు దీపవిధిని చేప్పెదను.
వైశాఖ శ్రావణ మార్గశీర్ష కార్తిక ఆశ్వయుజ పౌష్య మాఘ ఫాల్గుణ మాసములలో దీపారంభము నాచరించవలయును. రిక్తవిహీనతిథియందు, శని మంగళ వారములు తప్ప మిగిలిన వారములలో, హస్త, ఉత్తర, అశ్విని, ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, అనూరాధ, విశాఖ రోహిణీ నక్షత్రములలో దీపారంభము శుభావహము. చరమమునందు, వ్యతిపాతనందు, ధృతి, వృద్ధి, సుకర్మ ప్రీతి, హర్ష సౌభాగ్య, శోభన ఆయుష్మత్ యోగములందు, విష్టిరహిత కరణమునందు గ్రహణమున అక్టోదయా యోగములందు రాత్రియందు కానీ, పూర్వాహ్లామున కాని దీపారంభమును చేసిన శుభావహము. కార్తీక శుద్ధ సప్తమీ నిశీధ కాలము అతిశుభప్రదము. ఆ దినమున ఆదివారము, శ్రవణా నక్షత్రముండుట అత్యంత శుభప్రదము కాని ఇట్లు కలియుట అతిదుర్లభము. అత్యావశ్యక కార్యములందు మాసాదులను చూడవలసిన అవసరములేదు. మొదటి దినమున ఉపవసించి, నియమ బద్ధుడై, బ్రహ్మ చారియై, ప్రాతఃకాలమున స్నానమాచరించి గోమయోదకములచే అలికిన పరిశుద్ధమైన భూమియందు, ప్రాణాయామముచేసి సంకల్పముచెప్పి పూర్వోక్తన్యాసములాచరించి రక్తచందన తండులములచే భూమియందు షట్కోణము నేర్పరిచి, దాని పై మన్మథుని లిఖించి షట్కోణములందు నవాక్షరములచే పరివేష్టించి, దాని వెలుపల త్రికోణమును లిఖించవలయును. ఇట్లు లిఖించిన యంత్రమునందు దీపపాత్రను ఉంచవలయును. బంగారు, వెండి, రాగి, కంచు, మట్టులలో దేనితోనైనను దీపపాత్రను చేయవచ్చును. ఇనుపపాత్ర అధమాధమము. శాంతికొఱకు పెసరుపిండి, సంధి విషయమున గోధుమ పిండిని చేయవలయును (పాత్రగా) వేయి పలముల నేయికి నూరు పలముల పాత్ర ఉండవలయును. పదివేల పలముల నేయికి అయిదొందల పలముల పాత్ర ఉండవలయును. మూడు వేల పలముల నేయి ఉన్నచో పాత్ర వేయి పలములది యుండవలయును. రెండు సహాస్రముల పలముల నేయికి రెండొందల పలముల పాత్రయుండవలయును. ఇట్లే ఇతర మానములను' కూడా ఊహించవవలయును. నిత్యదీపమున నాలుగు పలముల పాత్ర ఒక పలము నేయి ఉంచవలయును. ఇట్లు పాత్ర ప్రతిష్టచేసి సూత్రములనుండి ఏర్పరిచిన వత్తులనుంచవలయును. ఈ వత్తులు ఒకటి, మూడు అయిదు, ఏడు కొని - విషమ సంఖ్యలు గలవి, తిధి మానము ననుసరించి వేయివరకు తంతుసంఖ్య ఉండవచ్చును. శుద్ద వస్త్రశోధితమగు గోఘృతమును ఆ పాత్రలో నుంచవలయును. కార్య గౌరవ లాఘవముల ననుసరించి వేయి పలముల నుండి నూరు పలముల వరకు నేయిని ఉంచవలయును. సువవదులచే చేయబడిన సుందరమగు పదునొరంగుళముల శలాకను కొని ఎనిమిదంగులముల శలాకను కాని, నాలుగంగుళముల శలాకను కొని సూక్ష్మా గ్రము, స్థూలమూలము గలదానిని పాత్ర మధ్యమున దక్షిణ భాగమున నుంచవలయును. పాత్ర దక్షిణ దిగ్భాగమున అంగులచతుష్టయమును వదిలి దక్షిణాధారముగా అధోగ్రముగా ఛూరికను భూమిలో నుంచవలయును. గణేశుని స్మరించుచు దీపమును వెలిగించవలయును. దీపమునకు పూర్వదిగ్భాగమున సర్వతో భద్రమండలమున కొని తండులరచితమైన అష్టదల పద్మమున కాని యథావిధిగా కుంభమును ప్రతిష్ఠించవలయును. ఆ కుంభమున కార్తవీర్యార్జునుని ఆవాహనగావించి పూర్వమువలే పూజించవలయును. జలాక్షతలను తీసుకొని దీపసంకల్పమును చేయవలయును. ఇది దీపసంకల్పమంత్రము, ప్రణవము, పాశమాయలు, శిఖా తరువాత “కార్తవీర్యార్జుసాయ మాహీష్మ తీనాధాయ సహస్రబాహవే సహస్రక్రతుదీక్షితహస్తాయ దత్తాత్రేయప్రియాయ ఆత్రేయాయానసూయాగర్భ రత్నాయ నమః” అని పలికి గ్రీవామకర్లేన్దుస్థితములుగా పాశమును ఏర్పరిచి, “ఇమం దీపం గృహాణ అముకం రక్ష రక్ష, దుష్టాన్నాశయ నాశయ పాతయ పాతయ, ఘాతయ ఘాతయ, శత్రూన్జహిజహి” అని పలికి మాయాతారము స్వబీజము ఆత్మ భూ స్వాహా" అను మంత్రముచే పశ్చిమాభిముఖముగానున్న దీపరాజముచే “అముకం రక్ష అముకంప్రద” అనవలయును. మాయా ఆకాశద్వయము, వామనేత్ర , చన్దయుతము శివా వేదాది కామ చాముండలు స్వాహా పూ, బిందుకొ, ప్రణవము, స్వాహా కలిసిన మంత్రము నేత్ర బాణాధరాక్షరము. ఈ మాలామంత్రమునకు దత్తాత్రేయుడు ముని. అమిత ఛందస్సు కార్తవీర్యార్జునుడు దేవత. అఖిలాభీష్టదుడు చాముండచే షడంగములను కల్పించవలయును. ఇట్లు కార్తవీర్య దేవుని ధ్యానించి మంత్రమును పఠించి జలమును విడువవలయును. గోవిందాడ్యుడు గుహలి సెందును, చాముండీ బీజము. తరువాత నవాక్షరమంత్రమున వేయి జపించవలయును. తారము అనంతము బిన్దుయుక్తము మాయాస్వము వామనేత్రయుతము కొర్మాగ్రి శాంతిబింద్వాఢ్యములు స్వాహా అంకుశము ధ్రువము. పూర్వోక్త ఋషి అనుష్టుపుందస్సు. మిగిలినదంతయు పూర్వోక్త ముగా చూడవలయును. మంత్రమును వేయి మార్లు జపించి కవచమును పఠించవలయును. ఇట్లు దీప ప్రదానము గావించినవాడు సకలాభీష్టములను పొందును. దీపము వెలుగుచున్న సమయమున అశుభమును మాటలాడరాదు. దీపము వెలుగుచున్నపుడు బ్రాహ్మణదర్శనము శుభప్రదము. శూద్రదర్శనము మధ్యమము. మేచ్చ దర్శనము వధ బంధాదికమును కలిగించును. ఎలుకను 'పిల్లిని చూచుట అశుభము. గోవును, అశ్వమును చూచుట శుభప్రదము. దీపజ్వాల సమముగానున్నచో సిద్దికలుగును. వక్రముగానున్నచో నాశకరము. ధ్వని కలిగినచో భయమునిచ్చును. చక్కగా ప్రకాశమున్నచో సుఖమునిచ్చును. నలుపు వర్ణము కలదైనచో శత్రు భయమును కలిగించును. నేయిని కక్కుచున్నచో పశునాశకము. దీపముంచినపుడు దైవవశమున పాత్ర భగ్నమైనచో పది హేను రోజులలో పే యజమాని యమాలయము చేరును. దీపమున మరియొక వత్తి చేర్చినచో కార్య సిద్ధి విలంబమగును. ఆ దీపమున మరియొక దీపమును వెలిగించినచో కర్త నేత్రహీనుడగును. అపరిశుద్దుడు స్పృశించినచో వ్యాధి కలుగును. దీపము వెలిగినచో చోరభయము కలుగును. కుక్క, పిల్లి, ఎలుకలు స్పృశించినచో రాజభయము కలుగును. పాత్రారంభమున ఎనిమిది పలములచే చేసిన దీపము అఖిలాభీష్టప్రదము. కావున దీపమునకు విఘ్నము కలుగకుండ ప్రయత్నించి రక్షించవలయును. వ్రత సమాప్తివరకు బ్రహ్మ చర్యమును, భూశయనమును అనుష్ఠించవలయును. స్త్రీ శూద్ర పతితులచే మాటాడరాదు. నవాక్షర మంత్రరాజమును సహస్రము జపించవలయును. ప్రతిదినము స్తోత్రమును పఠించవలయును. నిశీధకాలమున పఠించినచో విశేష ఫలప్రదము. దీపము ముందర ఒంటి పాదముచే నిలిచి రాత్రిపూట మంత్రమును వేయిమార్లు జపించినచో అభీష్టమును త్వరగా పొందును. శుభదినమున సమాప్తి చేయు బ్రాహ్మణులకు భోజనదొనము కావించి, మంత్రమును జపించుచు కుంభోదకముచే కర్తను అభి షేకించవలయును. కర్త బ్రాహ్మణులను సంతోషింప చేయుటకు సమృద్ధిగా దక్షిణనీయవలయును. గురువు సంతోషించినచో కార్తవీర్యార్జునుడు ఇష్టమును ప్రసాదించును.. గురువాజ్ఞచే తాను కూడా చేయవచ్చును. లేదా గురువు చేయించవచ్చును. గురువునకు ధనాదికమునిచ్చి చేయించవలయును. గురువాజ్ఞ లేనిదే స్వేసిద్ది కొఱకు కర్త ఆచరించినచో కార్య సిద్ధి కలుగక పోగా ప్రతి క్షణము హాని కలుగుచుండును. దీపమునకు గోఘృతము ఉత్తమము, మహేషీ ఘృతము మధ్యమము. నువ్వుల నూనె కూడా మధ్యమమే అజాది ఘృతము అధమము. ఆస్యరోగము సంభవించినపుడు సుగంధ తైలముచే దీపము నుంచవలయును. శత్రునాశమునకు ఆవాల నూనెచే దీపమునుంచవలయును. సహస్ర పలముల ఘృతముచే దీపమును వెలిగించిననూ కార్యసిద్ధి కలుగనిచో మూడు మార్లు దీపమును వెలిగించిననూ కార్య సిద్ధి కలుగనిచో మూడు మార్లు దీపవిధి నాచరించవలయును. అపుడు అతిదుష్కరమగు కార్యము కూడా సిద్ధించియే తీరును. కార్తవీర్యార్జునుడు దీప ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మహా విష్ణువు స్తుతి ప్రియుడు. గణేశుడు తర్పణ ప్రియుడు. దుర్గా అర్చనా ప్రియురాలు. శివుడు అభిషేక ప్రియుడు. కావున వారి వారి సంతోషము కొఱకు ఆయావిధుల నార్చించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున కార్తవీర్యమాహాత్మ్యమౄదీపకథనమును డెబ్బది యార - అధ్యాయము సమాప్తము.
