నారద మహా పురాణము - పూర్వార్థము
9 - గంగామహాత్మ్యమ్
నారదమహర్షి పలి కెను:- “ఉత్తమ భూపాలుడైన సౌదాసుడు వసిష్ఠమహర్షి శాపమునేట్లు పొందెను? గంగా బిన్హ్వభి షేకముతో మరల ఎట్లు శుద్దుడాయెను దీని నంతటిని వివరముగా నాకు చెప్పుము. గంగా చరితమును వినినవారలకు. చెప్పినవారలకు శుభములు కలుగును”.
సనకమహర్షి పలికేను :- సౌదాసుడు సర్వధర్మములు తెలిసినవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. గుణవంతుడు. పవిత్రుడు. తండ్రివలె ప్రజలను రంజింపచేయుచు పృథివిని అనుభవించుచుండెను. ఏడు సముద్రములతో కూడియున్న ఈ భూమిని పూర్వము సగరచక్రవర్తి పరిపాలించినట్లు సౌదాస మహారాజు ఏ ధర్మమునకు భంగము కలుగని విధముగా పరిపాలించుచు పుత్రులతో పౌత్రులతో కలిసి అన్నిసంపదలు కలవాడై అనుభవించెను.
సౌదాసమహారాజు ఒకమారు వేటయందు కోరిక గలవాడై ఆప్పులైన మంత్రులు ముందుగా పరీక్షించిన అరణ్యమున ప్రవేశించెను. వేటగాళ్ళతో కలిసి మృగసమూహములను చంపుచు ధర్మము తెలిసిన సౌదాసుడు దప్పిగొని రేవానదిని చేరెను. సౌదాసమహారాజు దేవానదిలో స్నానముచేసి సంధ్యావందనాదికములను ముగించుకొని మంత్రులతో కలిసి భోజనము చేసి ఆ రాత్రి అచటనే గడి పెను. మరల ప్రొద్దుననే లేచి ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని మంత్రులతో కలిసి రేవానదీ తీరప్రాంతారణ్యములలో తిరిగెను. తరువాత ఒక్కడే ఒక అరణ్యమునుండి మరొక అరణ్యమునకు వెళ్ళుచు చెవివరకు నారిని లాగి బాణమును ఎక్కు పెట్టి జింకవెంట వెళ్ళెను. అట్లు జింక వెంట గుజ్జముమీద వెళ్ళుచున్న రాజు సైన్యమునకు చాలా దూరముగా వెళ్ళెను. అచట ఒక గుహలో సంభోగము చేయుచున్న పులుల జంటను చూచెను. జింకను విడచి పులుల కెదురుగా వెళ్ళెను. ఎక్కు పెట్టియున్న బాణముతో ఆడపులిని పడవైచెను. ఆ యాడపులి పడుచు ముప్పది యారు యోజనముల విశాలమగు శరీరము కల రాక సీగా మారి ఉరుమువలె భయంకరముగా . ఆరిచెను. పడిపోయిన తన ప్రియురాలిని చూచి ఆ వ్యాఘాసురుడు రాజును ద్వేషించి “ప్రతీకారమును చేసెదను.” అని పలికి అచటనే అంతర్థానమును చెందెను. సౌదాసమహారాజు భయమును చెంది అరణ్యమున తన సైన్యమును చేరి జరిగినదంతయూ వారికి తెలిపి నగరమునకు తిరిగి వెళ్ళెను. రాక్షసుని ప్రతీకారమును శంకించుచు సౌదాస మహారాజు అప్పటినుండి వేటను మానుకొనెను.
చాలా దినములు గడిచిన తరువాత ప్రసన్నమైన మనస్సుగల సౌదాస మహారాజు వసిషాది మహర్షులతో అశ్వమేధయాగము చేయ నారంభించెను. ఆ యాగమున బ్రహ్మాది దేవతలను హవిస్సునిచ్చి యజ్ఞమును సమాప్తి గావించి, స్నానము చేయుటకై వసిష్ఠ మహర్షి (నదికి) వెళ్లాను. ఇంతలో సౌదాసునిచే భార్యను పోగొట్టుకొన్న వ్యాఘరాక్షసుడు కోపముతో ప్రతీకారమును చేయుటకు వచ్చేను. ఆ రాక్షసుడు వసిష్ఠ మహర్షి వెళ్ళిన తరువాత వసిష్ఠ మహర్షి వేషమును ధరించి రాజు వద్దకు వచ్చి భోజనములో మాంసము కావలయునని పలికెను. తరువాత ఆ రాక్షసుడు వంటవాని వేషముతో మనిషి మాంసమును వండి రాజునకిచ్చెను. ఆ మాంసమును బంగారు. పాత్రలో ఉంచి గురువుగారి రాకను ఎదురు చూచుచుండెను. వసిష్ఠ మహర్షి వచ్చిన వెంటనే సౌదాస మహారాజు ఆదరముతో ఆ మాంసమునుంచేను. దీనిని చూచిన వసిష్ఠ మహర్షి ఆశ్చర్యముతో ఏమిటిది అని ఆలోచించెను. పరమ సమాధీతో అది నరమాంసమని తెలుసుకొనెను. “ఈ సౌదాసుని దుష్టత్వమేంత వింత. తినరాని దానిని నాకు భోజనముగా పెట్టెను !” ఇట్లు ఆశ్చర్యమును చెంది మిక్కిలి కోపించెను. “ఓ రాజా ! నేను చెడిపోవుటకు తినరాని దానిని ఇచ్చితివి. కావున నీకు కూడా ఇదియే భోజన మగుగాత, రాక్షసుల కొహారమైన నరమాంసమును నాకు ఇచ్చితివి కావున ఆ ఆహారమునకు తగిన రాక్షసత్వమునే నీవు పొందుము.” ఇట్లు వసిష్ఠమహర్షి శాపమిచ్చుచుండగా సౌదాస మహారాజు భయముతో వణుకుచు మీరే మాంసాహారము నీయమని ఆజ్ఞాపించితిరి కదా అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి మళ్ళీ ఆలోచించి దివ్యదృష్టితో రాక్షసుడు రోజును మోసగించెనని తెలుసుకొనెను. సౌదాస మహారాజు కూడా వసిష్ఠ మహర్షిని శపించుటకు జలమును తీసుకొనెను. చాలా కోపముతో వసిష్ఠ మహర్షిని శపించుటకు సిద్దపడిన సౌదాసమహారాజును చూచి ఆతని ప్రియపత్ని మదయంతి ఇట్లు పలి కెను.
మదయంతి పలికెను :- “ఓ మహారాజా ! కోపమును ఉపసంహరింపుము. నీవు అనుభవించవలసిన దానినే పొందితివి. ఈ విషయమున సందేహముతో పనిలేదు. గురువును తిరస్కారముతో దూషించు మూరుడు అరణ్యమున నిర్జల ప్రదేశమున బ్రహ్మరాక్షసుడుగా పుట్టును. ఇంద్రియములను, క్రోధమును జయించినవారు, గురువు సేవలో ఆసక్తులైనవారు బ్రహ్మ లోకమును పొందెదరని శాస్త్ర నిర్ణయము.” ఇట్లు మదయంతి మాటలను వినిన సౌదాస మహారాజు కోపమును విడిచి పెట్టి మదయంతిని అభినందించెను. శాపమునకు గ్రహించిన జలమును ఎక్కడ చల్లవలయునని ఆలోచించెను. ఆ నీటితో చల్లిన ప్రదేశము భస్మమగుట నిశ్చితము. ఇట్లు నిశ్చయించి ఆ జలమును తన పాదముల పై చల్లుకొనెను. ఆ జలము తాకగానే సౌదాస మహారాజ పొదములు కాలి మాడి కల్మషము లాయెను. అప్పటినుండి సౌదాసునికి కల్మాషపాదుడను పేరు ప్రసిద్ధిగాంచేను. బుద్ధిమంతుడగు కల్మాషపాదుడు మదయంతిచే ఓదార్చబడి మనసులో చాలా భయపడుచు గురువు పాదములకు నమస్కరించెను. శరణువేడి చేతులు జోడించి వినయముతో నీతికోవిదుడైన కల్మాషపాదుడు “ఓ మహానుభావా ! క్షమించుము. నేను ఆపరాధమును చేయలేదు” అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి బరువుగా నిట్టూర్చి దుఃఖించినవాడై అవివేకపరాయణుడైన తనను తాను నిందించుకొనెను. “అన్ని ఆపదలకు మూలకారణము అవివేకమే. ఈ లోకమున వివేకము లేనివాడు పశుతుల్యుడే. సంశయముతో పనిలేదు. తెలియని రాజు ఉచితమైన పనినే చేసెను. వివేకరహితుడను. ఆజ్ఞడనైన నేను పాపమును ఆచరించితిని. వివేకము కలవాడు ఏదో ఒక ఆనందమును పొందగలడు. వివేకము లేనివాడు ఏదో ఒక దుఃఖమును పొందగలడు.” ఇట్లు తనను తాను నిందించుకొని వసిష్ఠ మహర్షి “ఈ రాక్షసత్వము శాశ్వతము కాదు పన్నెండు సంవత్సరములుండును. గంగా బిందువులో స్నానమాడి రాక్షసత్వమును విడిచి మొదటి రూపమును పొంది రాజ్యమును పాలించగలవు. గంగాబిందుస్పర్శచే కలిగిన జ్ఞానముచే పాపములు తొలగి శ్రీహరి సేవాపరుడవై ఉత్తమశాంతిని పొందగలవు.” అని పలికెను.
అధర్వవేదమును బాగుగా తెలిసిన వసిష్ఠమహర్షి ఇట్లు పలికి తన ఆశ్రమమునకు వెడలిపోయెను. రాజు కూడా దుఃఖముతో రాక్షస శరీరమును పొంది మిక్కిలి ఆకలిదప్పులచే బాధపడుచు ఎల్లపుడూ కోపము కలవాడై కృష్ణపక్ష రాత్రివలె భయంకరరూపుడై జనులు లేని అరణ్యమున తిరుగుచుండెను. పలువిధములైన మృగములను, మానవులను, పాములను, పక్షులను, వానరులను భక్షించుచుండెను. పచ్చని ఎఱ్ఱని శరీరములతో చాలా ఎముకలతో ఎఱ్ఱని కొనలు గల కేశములతో భూమి విచిత్రముగా భయంకరముగా మారెను. ఆరునెలలు నూరు యోజనముల విశాలమైన భూమిని బాధించి దుఃఖింపచేసి తరువాత మరొక అరణ్యమునకు వెళ్ళెను. అచట కూడా ప్రతిరోజు నరమాంసభక్షణము చేయుచు మునులు సిద్ధులు సేవించుచున్న నర్మదాతీరమును చేరెను.
అన్ని లోకములకు భయమును కలిగించువాడై సౌదాసుడు నర్మదాతీరమున తిరుగుచు ప్రియురాలితో రమించుచున ఒక మునిని చూచెను. ఆకలి అనేడు అగ్నిచే పరితపించుచున్న ఆ సౌదాసుడు ముని కొఱకు పరుగెత్తి వేటగాడు మృగశిశువును పట్టుకొనినట్లు పట్టుకొనెను. ఆ ముని భార్య రాక్షసుని చేతిలో నున్న - తన భర్తను చూచి భయముతో తొట్రు పడుచు చేతులు జోడించి రాక్షసునితో ఇట్లు పలికెను.
బ్రాహ్మణి పలికెను :- “ఓ రాజ శ్రేష్ఠా ! భయముతో వణుకుచున్న నన్ను కాపాడుము. నా ప్రాణప్రియుని నాకిచ్చి నా కోరికను నెరవేర్చుము. నీవు సూర్యవంశమున పుట్టినవాడవు. మిత్రసహుడు అను పేరు గలవాడవు. జాతిచే రాక్షసుడవుకావు. నిర్జనమైన అరణ్యములో అనాధగా ఉన్న నన్ను కాపాడుము. భర్త లేని స్త్రీ బ్రతికున్ననూ మరణించిన దానితో సమానమే. అందులో చిన్నతనములో వైధవ్యము మరీ సహించరానిది. నాకు తలిదండ్రులు లేరు. బంధువులు లేరు. నాకు భర్తయే బంధువు. భర్తయే జీవనము. నీకు అన్ని ధర్మములు తెలియును. స్త్రీ జీవనము తెలియును. కావున బంధువులు లేని దానిని చిన్న పిల్లవాని తల్లిని అయిన నన్ను కాపాడుము. భర్త లేనిదే ఈ నిర్జనారణ్యమున ఎట్లు బ్రతుకగలను ? నేను నీకు కూతురు వంటిదానను. ప్రతిదానము చేసి, నన్ను కాపాడుము. ప్రాణదానమును మించిన దానము ఇదివరకు లేదు. ఇకముందు ఉండబోదు. ఇట్లు ప్రాజ్ఞలు చెప్పెదరు. కావున నాకు ప్రాణదానమును చేయుము.” ఇట్లు పలికి ఆ బ్రాహ్మణి రాక్షసుని పాదాలముందు పడిపోయెను. ఆ ముని భార్య ఇట్లు ప్రార్థించుచున్ననూ రాక్షసుడు మునిని లేడి పిల్లను పెద్దపులి వలె భక్షించేను. తరువాత ముని భార్య పలువిధములుగా విలపించి ఇదివరకే శాపముననుభవించుచున్న రాజును కోపముచే మరల శపించెను. సంభోగములోనున్న నా భర్తను హింసించితివి కావున నీవు కూడా స్త్రీ సంగమసమయమున మృతి చెందేదవు. ఇట్లు శపించిననూ కోపము చల్లారక మరల ఇంకొక శాపమునిచ్చెను. నా భర్తను భక్షించితివి కావున నీవు రాక్షసత్వమునే ఎప్పటికీ వహించి యుండుము. ఈ రాక్షసుడు కూడా శాపద్వయమును విని బాగా కోపించి కనులనుండి నిప్పులను చెఱుగుచు ఇట్లు పలికెను. “ఓ దుష్టురాలా! నాకు రెండు శాపములను వ్యర్థముగా నిచ్చితివి. ఒక అపరాధమునకు ఒక శాపము యోగ్యము. నీవు రెండవ శాపమును ఇచ్చితివి కావున పుత్రునితో పాటు నీవు పిశాచత్వమును పొందుము.” ఇట్లు రాక్షసుని శాపమును పొందిన ఆ బ్రాహ్మణి వెంటనే పిశాచత్వమును పొందెను. ఆ బ్రాహ్మణి పిశాచరూపముతో ఆకలితో పీడించబడి భయంకరముగా రోదించెను. ఆ నిర్జనారణ్యమున రాక్షసుడు, పిశాచి అరచుచు నర్మదాతీరమున రాక్షస సేవితమైన అరణ్యమునకు వెళ్ళిరి.
గురువును ఉపేక్షించి రాక్షస దేహమును పొంది దుఃఖించుచు లోక విరోధమును చేసిన ఒక బ్రాహ్మ రాక్షసుడు ఆ యరణ్యమున ఉండెను. తానున్న మట్టి చెట్టువద్దకు వచ్చిన రాక్షసుని, పిశాచిని చూచి కోపముతో ఇట్లు పలికెను. “భయంకరులైన మీరు నా మట్టిచెట్టువద్ద కెందుకు వచ్చితిరి. ఈ రూపమును ఏ పాపముతో పొందితిరో నాకు నిజమును చేప్పుడు.” ఆ బ్రహ్మరాక్షసుని మాటలను వినిన సౌదాసుడు తాను, పిశాచీ చేసిన దానినంతయు తెలిపి తరుపోత ఇట్లు పలికెను.
సౌదాస మహారాజు పలికెను :- “ఓ మహానుభావా ! నీ వెవరవు ? పూర్వము నీవేమి చేసితివి. . మిత్రుడవైన నాకు మిక్కిలి స్నేహముతో దీనినంతటిని వివరించుము. మిత్రుని విషయమున మోసమును చేసినవాడు పాపఫలమును అనుభవించును. పదివేల యుగములు యాతనలననుభవించును. మిత్రుని చూచుట వలన ప్రాణులకు అన్ని దుఃఖములు తొలగిపోవును. కావున బుద్ధిమంతులెవ్వరూ మిత్రుని విషయమున మోసమును తల పెట్టరు.” ఇట్లు కల్మష పాదుడు చెప్పిన మాటలను విని మట్టిచెట్టు మీదున్న బ్రహ్మ రాక్షసుడు ప్రీతిచెంది ధర్మ వాక్యమును పలికెను.
బ్రహ్మరాక్షసుడు పలికెను :- “నేను పూర్వము వేదములను బాగుగా అధ్యయనము చేసిన బ్రాహ్మణుడను. మగధదేశనివాసిని. నా పేరు సోమదత్తుడు. నేను ధర్మపరాయణుడనుగా ఉంటిని. విద్యచేత, ధనముచేత, యౌవనములచేత బాగుగా మదించిన నేను గురువుగారిని ఉపేక్షించి ఈ గతిని పొందితిని. ఆహారమును జయించికూడా సుఖమును పొందలేక దుఃఖమునే పొందుచున్నాను. నేను మొదట నూర్లకొలది వేలకొలది బ్రాహ్మణులను భక్షించితిని. ఎల్లప్పుడూ ఆకలిదప్పుల బాధతే మనస్తాపముచే జగత్తునకు భయమును కలిగించుచు మాంసాహారమునందొసక్తుడనైతిని. మానవులు గురువును అవమానించినచో రాక్షసత్వము ప్రాప్తించును. నేను దీనిని అనుభవించితిని. కావున శ్రేయోభిలాషి గురువును అవమానించరాదు.”
కల్మాషపాదుడు పలికెను :- “గురువు ఎటువంటివాడు ? నీవు కొనియాడినదేవరిని ? దానినంతటిని నాకు తెలుపుము. వినవలయుననీ చాలా కుతూహలమున్నది.”
బ్రహ్మరాక్షసుడు పలికెను :- ఓ, మిత్రమా ! పూజించదగినవారు, ఆదరముతో నమస్కరించదగినవారు, చాలామంది గురువులున్నారు. వారిని గూర్చి నేను వివరముగా చెప్పెదను. ఏకాగ్రమనస్సుతో వినుము. వేదములను అధ్యపనము చేయువారు, వేదార్థమునకు సంగతిని బోధించువారు, శాస్త్రమును చెప్పువాడు, ధర్మమును చెప్పువాడు, నీతిశాస్త్రము ఉపదేశించువాడు, మస్త్రమును ఉపదేశించువాడు, మస్త్రములను వ్యాఖ్యానము చేయువాడు, వేదములలో కలుగు సందేహములను పరిహరించువాడు, వ్రతములనుపదేశించువాడు, భయమునుండి కాపాడువాడు, అన్నము పెట్టువాడు, కన్యాదానమును చేసినమామ, మేనమామ, పెద్దలన్న, కన్నతండ్రి, ఉపనయనము చేసినవాడు, ని షేకమును చేసినవాడు, సంస్కరించినవాడు వీరందరూ గురువులే. వీరిని ఆదరముతో పూజించవలయును. నమస్కరించవలయును.
కల్మాషపాదుడు పలికెను :- “ఓ ! మిత్రమా ! చాలామంది గురువులను గూర్చి చెప్పితివి. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు లేదా అందరూ సమానులేనా ? ఈ విషయమును నాకు యథావిధిగా తెలుపుము.”
బ్రహ్మరాక్షసుడు పలికెను. :- “ఓ ! ప్రాజ్ఞుడా ! బాగుగా అడిగితివి. నీవడిగిన దానిని చేప్పెదను. గురువు మహాత్మ్యమును చెప్పుట, వినుట, ఆమోదించుట అందరికి మేలును చేకూర్చును. కావున నేను చెప్పెదను. నేను మొదట చెప్పిన గురువులు అందరు సమానముగా పూజించదగిన వారే. ఈ విషయమున సందేహము లేదు. అయిననూ సకలశాస్త్రనిశ్చయసారమును చెప్పెదను వినుము. వేదాధ్యాపకులు, మస్త్రములకు వ్యాఖ్యానము చేయువారు, తండ్రి, ధర్మమును చెప్పువారు విశ్లేషించి గురువులు. వీరిలో కూడా శేషులను చేప్పెదను వినుము. ఈ విషయమును అన్ని శాస్త్రార్థముల తత్త్వము తెలిసిన వారు చెప్పిన దానినే తెలి పెదను. సంసార పాశములను ఛేదించగల ధర్మములతో కూడిన పూరాణములను చెప్పువారు ఉత్తమ గురువులు. దేవతలను పూజించుటకు తగిన కర్మలు, దేవతలను పూజించుటవలన కలుగు ఫలము పురాణముల వలన కలుగును. కావున పురాణములే దేవతలు. ఓ రాజా ! పుణ్యములు అన్ని వేదార్థసారములని మునులు కూడా చెప్పుచున్నారు. కావున పురాణములను చేప్పువారు. పరమ గురువులు. సంసార సాగరమను దొటుటకు ప్రయత్నము చేయువారు పురాణములను వినవలయుననీ శాస్త్ర విభాగములను చేసినవారు చెప్పుచున్నారు. ఓ రాజా ! పురాణములలో అన్నిధర్మములను చెప్పియున్నారు. తర్కశాస్త్రము పాదమునకు కారణము. నీతి శాస్త్రము ఇహఫలసాధనము. పురాణములు ఇహపరములలో సుఖదోయకములు. ఎపుడూ భక్తితో పురాణములను వినువారలకు ధర్మ పరాయణమైన, నిర్మలమైన బుద్ధి కలుగును. పురాణములను వినుటవలన శ్రీహరియందు, శుభకరమైన భక్తి కలుగును. విష్ణుభక్తి గల వారలకు ధర్మమునందు బుద్ధి ప్రవర్తించును. ధర్మమువలన పాపములు నశించును. జ్ఞానము శుద్ధమగును. ధర్మార్థకామమోక్షముల ఫలములను పొందగోరువారు పురాణములను వినవలయునని ప్రొజులు చెప్పేదరు. నేను బ్రహ్మవొది సర్వజ్ఞుడు అయిన గౌతమమహాముని వలన సర్వధర్మార్థములను, సుందరమైన గంగాతీరమున వినియుంటిని. ఒకపుడు పరమేశ్వరుని పూజించుటకు నేను వెళ్ళితిని. అచటికి వచ్చిన గురువుగారికి నమస్కారమును చేయలేదు. తేజోనిధి, శాంతుడు, మహాబుద్దీయైన గౌతమ మహర్షి మంత్రప్రోక్తవీధుల నాచరించుచున్నాడని సంతోషించేను. కాని సర్వజగద్గురువైన శంకరుడు నా పూజలందుచు గురువు నవమానించినందున నొకు రాక్షసత్వమును ప్రసాదించేను. తెలిసికొని, తెలియక కానీ గురువును అవమానించిన వారికి బుద్ధి, విద్య, తాను చేసిన సుకృతములు అన్నియూ నశించును. గురువును సేవించువారికి అన్నిసంపదలు కలుగునని పండితులు చెప్పుదురు. ఆ శాపముతో పాటు ఆకలిచే దహింపబడుచుంటిని. ఈ రాక్షసత్వము నుండి ఎపుడు విముక్తుడనగుదునో తెలియను.” ఇట్లు మట్టిచెట్టు పైనున్న బ్రహ్మ రాక్షసుడు చెప్పుచుండగా ధర్మ శాస్త్రముల చర్చ జరిపిరి కావున వారి పాపము నశించినది.
ఇంతలో కళింగదేశమున పుట్టిన గరుడను పేరుగల అతి ధార్మికుడైన బ్రాహ్మణుడొకడు భుజముపై గంగా జలకలశమును మోయుచు జగన్నాథుడైన విశ్వేశ్వరుని స్తోత్రము చేయుచు, విశ్వేశ్వర నామ సంకీర్తనము చేయుచు ఆనందముచే వంటి పై పులకింతలు రాగా అచటికి వచ్చెను. అట్లు వచ్చిన బ్రాహ్మణుని చూచి ఆ ఇద్దరు రాక్షసులు, పిశాచి మాకాహారము దొరిగినదని పలికి చేతులు పైకెత్తి పరుగెత్తిరి. ఆ బ్రాహ్మణుడు కీర్తించు పేర్లను విని దూరములో నిలిచిరి. ఆ బ్రాహ్మణుని హింసించుటకు శక్తి లేనివారై ఆ రాక్షసులిట్లు పలికిరి. “ఓ మహానుభావా! బ్రాహ్మణోత్తమా ! మహాత్ముడవైన నీకు నమస్కారము. నామకీర్తన మహాత్మ్యముచే రాక్షసులమైన మేము దూరములో నుంటిమి. మేము ఇదివరకు వేలమంది బ్రాహ్మణులను భక్షించితిమి. నీవు కీర్తించు నామకవచము నిన్ను గొప్ప ఆపదనుండి కాపొడుచున్నది. నీవు కీర్తించు సొమములను వినినంతనే రాక్షసులమైన మేము కూడా శ్రీహరి మహిమచే గొప్పశాంతిని పొందితిమి. కావున నీవు అన్ని వేళలా రాగద్వేషాదులు లేనివాడవే. ఓ మహానుభావా ! గంగాజలమును మా పై చల్లి మమ్ములను పాపరాశినుండి కాపాడుము. హరి సేవాపరుడే తనను తరింప చేసుకొనినవాడు మొత్తము జగమును తరింపచేయునని జ్ఞానులు, చెప్పుదురు. భయంకరమైన సంసారమునకు ఔషధమైన హరి నామమును వదిలి పెట్టి అంతటా దుర్లభమైన ముక్తిని ఎట్లు పొందగలరు ? ఇనుముతో ఏర్పరిచిన పడవనెక్కి నదిని దాటగోరువారు నీట మునుగునట్లు పుణ్యములను చేయని వారు ఇతరులనెట్లు తరింప చేయగలరు ? మహానుభావుల చరిత్ర అన్నిలోకములకు ఆనందమునిచ్చును. చంద్రుడు లోకముల ఆనందము కొరకే కదా ఉదయించును. ఈ భూమండలమున పావనములైన పుణ్యతీర్థములన్నియు గంగా జలబిందువుతో సమానములు కావు. తులసీ దళముతో కలిసిన గంగోజల బిందువు ఆవగింజంతదైనను (21) ఇరువదియొక్క తరములను తరింపచేయును. కావున ఓ మహానుభావుడవైన బ్రాహ్మణోత్తమా ! అన్ని శాస్త్రార్థములు తెలిసినవాడా ! గంగా జలమునిచ్చి పొషములు చేసిన మమ్ములను కాపొడుము.” ఇట్లు రాక్షసులు చెప్పిన గంగా మాహాత్మ్యమును వినిన బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యమును పొందెను.
లోకమాతయైన గంగపై ఇటువంటి రాక్షసులకు కూడా ఇంతటి భక్తియున్నదనిన పుణ్యాత్ములు మహానుభావులు గొప్పజ్ఞానము కలవారి కేంతుండునో ఏమి చెప్పగలము ? అన్ని ప్రాణులకు హితమును కోరుభక్తుడు శ్రీవిష్ణువుయొక్క పరమపదమును చేరగలడను ధర్మమును మనసులో నిశ్చయించుకొనిన ఆ గర్గుడు పొరిపై దయకలవాడై సాటిలేని మహిమ గల, తులసీదళముతో కలిసియున్న గంగాజలమును ఆ రాక్షసులపై చల్లేను. ఆవగింజంత గంగాజల బిందువుచే తడుపబడిన ఆ రాక్షసులు రాక్షస భావమును విడిచి దేవతల రూపమును పొందిరి. పుత్రునితో కూడియున్న బ్రాహ్మణి, సోమదత్తుడు కోటి సూర్యప్రకాశముగలవారై దేవోత్తములయిరి. శంఖచక్రగదా చిహ్నములతో హరి సారూప్యమునుపొంది ఆ బ్రాహ్మణుని బాగుగా స్తుతించుచు హరి మందిరమును చేరిరి. కల్మాషపాదుడగు మహారాజు కూడా నిజరూపమును పొంది సోమదత్తుడు బ్రాహ్మణి ఆమె పుత్రుడు మోక్షమును పొందుట చూచి తాను పొందలేనందుకు విచారించుచుండెను. ఆట్లు రాజు చింతించుచుండగా రహస్య రూపమున సరస్వతీదేవి. ధర్మమూలమైన, మహావాక్యమును స్పష్టమైన, గాఢరూపములోనున్న వాక్కుచే ఇట్లు పలికెను. “మహానుభావుడవైన ఓ రాజా ! దుఃఖించదగవు. నీవు కూడా కర్మభోగములను అనుభవించిన తరువాత గొప్ప మేలును (ముక్తిని) పొందగలవు. సత్కర్మలచే పాపములు తొలగిన హరిభక్తి పరాయణులు పరమపదమును పొందెదరు. ఈ విషయమున సంశయించవలసిన పనిలేదు. అన్ని ప్రాణులయందు దయగలవారు ధర్మమార్గమున ప్రవర్తించువారు, గురుపూజా పరాయణులు పరమపదమును పొందగలరు.” ఇట్లు సరస్వతీదేవి చెప్పిన మాటలను వినిన రాజు మనసులో తృప్తిని పొంది గురువుగారి మాటలను తలచేను.
గురువగు వసిష్ఠమహర్షిని బ్రాహ్మణ శ్రేష్ఠుడగు ఆ గర్ణుని, శ్రీహరిని, స్తుతించుచు మిక్కిలి సంతోషముతో మొదట జరిగిన వృత్తానమునంతటిని ఆ బ్రాహ్మణునకు తెలియజేసెను. తరువాత మిత్రసహా మహారాజు కాళింగునికి నమస్కరించి శ్రీహరినామసంకీర్తనమును చేయుచు వెంటనే వారాణసీ పట్టణమునకు వెళ్ళెను. ఆ పట్టణమున ఆరుమాసములు నివాసముచేసి గంగలో స్నానముచేసి సదాశివుని దర్శించి బ్రాహ్మణీ శాపమైన శాశ్వత రాక్షసత్వమునుండి విముక్తుడాయెను. ఆ తరువాత తన నగరమును చేరి మహానుభావుడైన వసిష్ఠ మహర్షిచే రాజ్యమున ప్రతిష్టింపబడి తన రాజ్యమును పరిపాలించేను. సమస్త భూమండలమును పరిపాలించి స్త్రీభోగమును తప్ప అన్ని భోగములననుభవించి, వసిష్ఠ మహర్షి వలన సంతానమును పొంది మోక్షమును పొందెను. ఇది వింతయేమియు కాదు. వారాణసి గుణములను శ్రీమహావిష్ణువు గుణములను కీర్తించుచు, వినుచు, స్మరించుచు గంగోజలమును పానము చేయుచు మానవుడు మోక్షమును పొందును. కావున ఓ బ్రాహ్మణోత్తమా ! గంగా మాహాత్మ్యమును వివరించుటకు ఇంద్రుడు, బ్రహ్మ విష్ణుమ హేశ్వరులు కూడ శక్తులు కారు. గంగా నామస్మరణ మాత్రముననే మానవుడు పాతక రాశులనుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఈ విషయమున ఎట్టి సంశయములేదు. ఒకసారైనా “గంగా గంగా” అని గంగా నామమును ఉచ్చరించినచో వెంటనే అన్ని పాపములనుండి విముక్తుడై బ్రహ్మలోకమున ప్రకాశించును.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
