నారద మహా పురాణము - పూర్వార్థము

Table of Contents

51 -  అధ్యాయము

ఓ మునీశ్వరా ! ఇక ఇపుడు కల్పగ్రంథమును చెప్పెదను. కల్పమును తెలుసుకొనిన మానవుడు కర్మ కుశలుడు కాగలడు. వక్షత్ర కల్పము, వేదకల్పము, సంహితా కల్పము, ఆంగిరస కల్పము, శాంతి కల్పము అని అయిదు కల్పములు కలవు. నక్షత్రాధీశ్వరలను నక్షత్ర కల్పము విస్తరముగా వివరించిరి. ఇట్లు నక్షత్ర కల్పమును కూడా విస్తరముగా తెలియవలయును. వేదకల్పమున ధర్మార్థకామ మోక్షముల సిద్ధికొఱకు ఋగాది చతుర్వేదములు విస్తారముగా చెప్పబడినవి. సంహితా కల్పమున మంత్రముల ఋషులు, ఛందస్సులు, దేవతలు తత్త్వము తెలిసిన మునులచే చెప్పబడినవి. అట్లే ఆంగిరస కల్పములో బ్రహ్మ ఆభిచారవిధానముచే షట్కర్మలను విస్తరముగా వివరించెను. శాంతి కల్పమున దివ్యభౌమ అంతరిక్షముల ఉత్పాతముల శాంతులు వివరించబడినవి. ఇది సంక్షేపముగా కల్పలక్షణము. శాఖాంతరములలో విడిగా ఈ కల్పముల లక్షణములు విస్తరముగా చెప్పబడినవి. గృహ్యకల్పమున అందరి ఉపయోగము కొఱకు చెప్పబడిన వాటిని ఇపుడు విస్తరముగా చెప్పెదను. సావధానముగా వినుము. పూర్వము బ్రహ్మ కంఠమును బోధించుకొని ఓంకారము, అథయను శబ్దములు వెలువడినవి. కావున ఈ రెండు శబ్దములు శుభకరములు. ఇట్లు చెప్పబడిన కర్మలను ప్రారంభించు మానవుడు. మొదట అథశబ్దమును ప్రయోగించినచో అనన ఫలము కలుగును. దర్భలు పరిసమూహము కొఱకు విడివిడి శాఖలుగా చెప్పబడినవి. తక్కువైనను, అధికమైనను అభిమత ఫలము నీయజాలవు. భూమి మీద కృమికీటపక్ష్యాదులు భ్రమించుచుండును కావున వాటి నుండి, వాటిని రక్షించుట కొఱకు పరిసమాహాము చెప్పబడినది. మూడు రేఖలు చెప్పబడినవి. ఆరేఖలు సమముగా నుంచవలయును. ఎక్కవగా చేయరాదు. ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మేదస్సుతో నిండియున్నది. కావున భూమిని గోమయముతో అలుకవలయును, గొడ్రాలు, దుష్టురాలు, దీనాంగీ, పుత్రులు చనిపోయిన స్త్రీ యజ్ఞము కొఱకు గోమయమును తేరాదు. ఆకాశమున తిరుగు భయంకరములగు పక్ష్యాదుల ప్రహరణము కొఱకు ప్రోద్దరణము చెప్పబడినది. స్రువముతో కాని దర్భతో కాని భూమిని ఉల్లేఖనము చేయవలయును. అట్లు చేసినచో అస్థి కంటకాదుల శుద్ధి కలుగునని బ్రహ్మ చెప్పియుండెను. జలమే అన్ని దేవగణములు పితృగణములు. కావుననే 'వీధిని తెలిసిన మునులు జలముచే ప్రోక్షణమును చేయవలయునని చెప్పిరి. సౌభాగ్యవతులగు స్త్రీలు మాత్రమే యజ్ఞాగ్నిని తేవలయును. పవిత్రమైన మృణ్మయపాత్రను నీటితో శుద్ధిచేసి పాత్రలో అగ్నినుంచి కేవలయును. బ్రహ్మ దులగు దేవతలందరు అమృత క్షయమును చూచి దర్భలలోని అగ్నిని యజ్ఞవేదిలో నుంచిరి. యజ్ఞమునకు దక్షిణ దిక్కున దానవాదులుందురు. వారి నుండి రక్షణ కొఱకు బ్రహ్మను దక్షిణ దిక్కున నుంచవలయును. ప్రణీత మొదలగు పాత్రలను ఉత్తరమున నుంచవలయును. పశ్చిమమున యజమాని ఉండవలయును మిగిలిన బ్రాహ్మణులందరు తూర్పుదిక్కున నుండవలయును. ద్యూతములో, వ్యవహారములో యజ్ఞకర్మలో కర్త ఉదాసీనచితుడైనచో ఆ కర్మ నశించును. బ్రహ్మ ఆచార్యులు యజ్ఞకర్మలో యజమాని శాఖ గలవారే యుండవలయును. ఋత్విజుల. విషయమున నియమము లేదు. లభించిన విధముగా ఏ శాఖవారి నైనను నియమించవచ్చును. మూడు అంగుళముల పరిమాణము గల రెండు పవిత్రములు కావలయును. ప్రకణి . నాలుగంగుళములుండవలయును. ఆజ్యపాత్ర మూడంగుళములు, చరు పాత్ర ఆరంగుళములు గలదిగా నుండవలయును. ఉపయమనము రెండంగుళములు కలది, సమ్మార్జనము ఏకాంగుళముండవలయును, సువము ఆరంగుళములు కలది, సుచము మూడన్నర అంగుళములు కలది . సమిధలు ప్రాదేశమాత్రములుగా నుండవలయును. పూర్ణపాత్రము ఆరంగుళములు కలది కావలయును. ప్రోక్షణి పొత్రకు ఉత్తర భాగమున ఎనిమిదిఅంగుళములు గల ప్రణీతి పాత్రనుంచవలయును. భూమండలముననున్న సమస్త నదులు సముద్రములు ప్రణీతిలో చేరియుండును. కావున ప్రణీతిపాత్రను - నీటిచే నింపవలయును. వస్త్ర హీనమగు వేదిక నగ్నమనబడును. కావున దర్భలను పరిచి వస్త్రమును పరచవలయును. ఇంద్రవజ్రము, విష్ణుచక్రము, శివత్రిశూలము అను వాటిని దర్భలతో చేయవలయును. ఈ మూటినే పవిత్రఛేదనములందురు. ప్రణీతజలముతో కూడిన ప్రోక్షణి చేయవలయును. అట్లు చేసినచో మహా పుణ్యమును ప్రసాదించును. కావుననే దానిని పవిత్రమందరు. పలమాత్రప్రమాణము కలదానిని ఆజ్యపాత్రనేర్పరుచవలయును. కులాల చక్రముతో నిర్మించబడిన మృణ్మయ పాత్రను ఆసురమందురు. ఆ పాత్రయే హస్తమున ధరించినచో దైవికర్మకు యోగ్యమగు స్థాల్యాదులుగా మారును. సువమున శుభాకర్మలన్నియూ నుండును. కావుననే పవిత్రత కొఱకు స్రువమును అగ్నిచే తప్తము చేయవలయును. స్రువమున అగ్రభాగమున ధరించినచో వైధవ్యము, మధ్యభాగమున సంతాన క్షయము మూలమున హోతృమరణము సంభవించును. కావున చక్కగా విచారించి ధరించవలయును. అగ్ని, సూర్యుడు, యముడు, చంద్రుడు, బ్రహ్మ, వాయువు అను నీ షడ్రేవతలు స్రువమున ప్రతి అంగుళమున నుందురు. అగ్ని, భోగార్ధనాశమును, సూర్యుడు వ్యాధిని, సోముడు ఫలరాహిత్యమును కలిగించును. బ్రహ్మ సర్వకామములనిచ్చును. వాయువు వృద్దిని కలిగించును. యముడు మృత్యువునిచ్చును. సంమార్జన- ఉపయమనములుగా రెండు దర్భలను ఏర్పరచవలయును. శ్రీపర్ణము, శమీ, ఖదిరము, వికంకము పలాశము అయిదు శాఖలను స్రువమున, సుచమున ఉంచవలయును. స్రువము హస్తపరిమితము, స్రుచము ముప్పదియంగుళముల పరిమాణముండవలయును. ఈ పరిమాణము బ్రాహ్మణులకు విధించబడినది. ఇతరులకు ఒక అంగుళము తక్కువగా నుండవలయును. శూద్ర పతిత : ఖరాది దృష్టిదోషనివారణమునకు పాత్రలను ప్రోక్షించవలయును. పూర్ణపాత్రను ఏర్పరచనిచో యజ్ఞచ్ఛిద్రము కలుగును. పూర్ణపాత్రనుంచినచో యజ్ఞ పూర్తీ జరుగును. అష్టముష్టి పరిమితములు నాలుగైనచో పుష్కలమనబడును. నాలుగు పుష్కలములను పూర్ణపాత్ర యందురు. హోమకొలమున ఎవరికి ఆసనము నీయరాదు. అట్లిచ్చినచో అగ్ని అసంతృప్తుడై దొరుణ శాపమునిచ్చును. ఆధారపాత్రలను నాసికలందురు. ఆజ్యభాగములను చక్షువులందురు. ప్రాజాపత్యమును ముఖమని వ్యాహృతులను కటియని యందురు. పంచవాగుణములను శీర్షము హస్తములు పొదములు అందురు. సిష్టకృతము పూర్ణాహుతి శ్రోత్రములందురు. రెండుముఖములు, ఒక హృదయములు, నాలుగు శ్రోత్రములు, రెండునొసీకలు, రెండు తలలు, ఆరునేత్రములు, పింగళవర్ణము, ఏడు జిహ్వలు, వామభాగమున మూడు హస్తములు, దక్షిణ భాగమున నాలుగు హస్తములు, సుకువములు, జపమాల, శక్తి దక్షిణకరము నందు, మూడుమేఖణలలు, మూడు పాదములు, ఘృత. పాత్రము, రెండు చామరములు కలిగియుండును. మేషవాహనము, నాలుగు శృంగములు, బాలసూర్యకాంతి కలిగి యుండును. ఉపవీతముతో కూడి యుండును. జటాకుండలమండితుడుగా నుండును. ఇట్లు అగ్ని దేహమును తెలుసుకొని హోమ కర్మనారంభించవలయును.

పాలు పెరుగు, నెయ్యి నూనేతో వండిన దానిని చేతితో హోమమును చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మ హత్యా పొపమును పొందును.మానవుడు తాను భుజించు ఆహారమునే తన దేవతలకు సమర్పించవలయును. సర్వకామ సమృద్దికి తిలాధిక్యములు కల హవిస్సును సమర్పించవలయును. హోమమున మృగీ, హంసీ, సూకరీయని మూడు ముద్రలుండును. అభిచార హోమమున మాత్రము సూకరీముద్రనుపయోగించవలయును. శుభకరయాగములో హంసీ, మరీ ముద్రలను ఉపయోగించవలయును. చేతి అన్ని వేళ్ళను కలిపినచో సూకరీ ముద్రయగును. కనిష్ఠికను వదిలినచో హంసీ ముద్రయగును. మధ్యమ అనామికొంగుష్ఠలను కలి పినచో మరీ ముద్రయగును. మొదట చెప్పిన ప్రమాణముననుసరించి పంచాంగులములతో హవిస్సును దధిమధు ఆజ్యయుక్తముగా స్వీకరించి తిలలతో కలిపి ఋత్విక్కులు హోమమును చేయవలయును. శుభకర్మలలో దర్భలను అనామికొంగుళులతో, ధరించవలయును. వినాయకుడు కర్మముల విఘ్న సిద్ధికి నియమించబడియుండెను. అట్లే గణాధిపత్యమున కూడా బ్రహ్మరుద్రులు వినాయకుని నియమించిరి. అట్టి వినాయకుడు స్పృశించిన వాని లక్షణములను తెలుపుచున్నాను వినుము. తన నీటిలోనే తాను మునుగును. కేశఖండనము చేయబడిన ముండులను చూచును. కామారుడై వస్త్రాభిలాషియే రాక్షసులనావేశించును. అంత్యజులతో రాసభములతో ఒంటెలతో కలిసి ఒకే చోట నివసించును. దొరిలో నడుచుచు తననెవరో వెంబడించుచున్నారని తలంచును. ఎపుడూ వేదనచే నిండిన మనసు కలవాడై యుండును. ప్రారంభించిన ప్రతీపని విఫలమగును. కారణము లేకనే కలత చెందును. వినాయకునిచే స్పృశించబడిన రాజపుత్రులు రాజ్యమును పొందజాలదు. కన్య భర్తను పొందలేదు. వివాహిత స్త్రీ సంతానమును పొందజాలదు. శ్రోత్రియుడు ఆచార్యత్వమును, శిష్యుడు అధ్యయనమును పొందజాలడు. వైశ్యుడు తన వ్యాపారమున లాభమును పొందజాలడు. రైతు పంటను పొందజాలడు. కావున వినాయకోపసృష్టుడైన వానికి శుభదినమున విధి పూర్వకముగా స్నపనమును చేయవలయును. పచ్చని ఆవాలచే బ్రాహ్మణులు స్వస్తి వాచనమును చేయవలయును. అశ్వశాలనుండి, గజశాలనుండి, పుట్టనుండి, నదీసంగమము నుండి, సరస్సునుండి మట్టిని, రోచనమును, గంధమును, గుగ్గులును తెచ్చి నిక్షిప్తము చేయవలయును. ఒకేరంగు కల నాలుగు కలశములతో యోగ్యమగు ప్రదమునుండి జలమును తేవలయును. ఎఱ్ఱని వృషభ చర్మమున భద్రాసనమును స్థాపించవలయును. వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని ఋషులు పావనము చేసిన జలముచే నిన్ను అభి షేకించేదను. పవమానదేవతలు నిన్ను పవిత్రుని చేయుదురు గాక. వరుణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు నీకు ఐశ్వర్యమును ప్రసాదింతురు గావు, నీ కేశములలో, పాపిటలో శిరస్సులో, లలాటమున,చెవులలో, నేత్రములలో నున్న దౌర్బాగ్యమును జలము తొలగించుగావుత, స్నానము మేడిస్రువము ద్వారా ఆవనూనెతో శిరస్సున సవ్యముగా దర్భలను గ్రహించి ఉంచవలయును. నొలుగు దొరుల కూడలిలో దర్భలను పరీచి అంతటా మీతసంఘిత శాలకంటకములను గుమ్మడికాయను రాజపుత్ర అను పదము అంతమందు కల మంత్రములతో, నమస్కారములతో నీయవలయును. ఉడికి ఉడకని బియ్యమును,మాంసమును అన్నమును, వండిన మత్స్యములను, వండని వాటిని సమర్పించవలయును. పలువిధములగు పుష్పములను, గంధమును, మూడువిధములగు సురనర్సించవలయును. మూలములను పూర్లాపూపములను, పూలమాలలను, పెరుగన్నమును, పొయసమును బెల్లముతో కలిపిన పిండిని తగిన నీటితో కలిపి, . వీటినన్నింటిని ఒకచోట చేర్చి, భూమియందుంచి నమస్కరించి, వినాయకుని తల్లియగు పొర్వతిని ప్రార్థించవలయును. గరక ఆవాలపూలచే పూర్లోంజలిచే ఆర్యము నీయవలయును. రూపమును, కీర్తిని, ఐశ్వర్యమును ప్రసాదించుము. పుత్రులను, ధనమును అన్ని కోరికలనీయుము. అని శివుని పతియగు పొర్వతిని పూజించి తరువాత శివుని ధూపదీప గంధమాల్యాదులచే నైవేద్యములచే పూజించవలయును. తరువాత తెల్లని వస్త్రములను, తెల్లని పుష్పమాలలను ధరించి బ్రాహ్మణులకు అన్నదానమును చేయువలయును. గురువుగారికి రెండు వస్త్రములను కూడా దానము చేయవలయును. ఇట్లు వినాయకుని పూజించి పిదప గ్రహములను కూడా పూజించవలయును. సంపదను, శాంతిని, "పుష్టి బుద్ది ఆయుష్యములను కోరువారు గ్రహములను పూజించవలయును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నీ నవగ్రహములను క్రమముగా స్థాపించవలయును. ఈ గ్రహములను రాగితో, వెండితో రక్త చందనముతో బంగారముతో, ఉక్కుతో, సీసముతో కాని శుభము కొఱకు చేయవలయును లేదా వస్త్రములందు వారి వొరి వర్ణములతో లిఖించవలయును. మండలములలో కూడా లిఖించవచ్చును. ఆయా గ్రహములకు నియమించబడిన వర్ణములు గల వస్త్రములను పూవులను సమర్పించవలయును.

 గంధములను బలులను గుగ్గులు ధూపమును సమర్పించవలయును. మంత్రములతో చరువును సిద్దము చేయవలయును. “ఆకృ షైన"అను మంత్రముతో సూర్యుని, ‘ఇమం దేవా’ అను మంత్రముతో చంద్రుని, “అగ్నిర్మూర్ధా” అను మంత్రముతో కుజుని, “ఉద్బుధ్యస్వ" అను మంత్రముచే బుధుని, “యదర్య"అను మంత్రముచే గురువును, “అన్నాత్పరిస్రుత" అను మంత్రముచే శుక్రుని, “శం నో దేవీ" అను మంత్రముచే శనిని, “కాండాత్" అనుమంత్రముచే రాహువును, “కేతుం కృణ్వన్న కేతవ” అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును. జల్లేడు, మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్లు కాని హోమమును చేయవలయును. అట్ల తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కొని హోమము చేయవలయును. బెల్లముకలిపిన అన్నమును, పాయసమును, హవిస్సును, క్షీరములను, దధ్యోదనమును, హవిశూర్ణమును మాంసమును, చిత్రాన్నమును యథాక్రమముగా ఆయాగ్రహములకర్పించవలయును. తరువాత బ్రాహ్మణులను భుజింప చేయవలయును. శక్తి ననుసరించి యథావకాశముగా శాస్త్రముననుసరించి బ్రాహ్మణులను సత్కరించి, ధేనువును, శంఖమును, వృషభమును, తెల్లని వస్త్రములను, గుఱ్ఱమును, కపిలగోవును, ఇనుము, మేక వీటిని యథాక్రమముగా దక్షిణగా సమర్పించవలయును. ఏ గ్రహమునకు ఏ ద్రవ్యము, ఫలము నిర్ణయించబడినదో ఆ ద్రవ్యాదులచే పూజించవలయును. ఇట్లు పూజించిన వారిని గ్రహములు. అనుగ్రహించునని శాస్త్రము చెప్పుచున్నది. మానవుల ధన, జాతి అభివృద్దులు గ్రహాధీనములే. జగత్తు స్థితినాశములు కూడా గ్రహాధీనములే కావున ఆయాగ్రహములను పూజించవలయును. ఎపుడూ సూర్యుని పూజించి, స్వామీయైన మహాగణపతికి తిలకము నుంచిన వారు సిద్ధిని పొందెదరు. అన్ని కర్మలు ఫలించును. సాటిలేని సంపదలను పొందును. మాతృదేవతల పూజ చేయక గ్రహపూజచేసినచో మాతృదేవతలు కోపింతురు. ఓవసోః పవిత్రం అను మంత్రముచే వసుధారను కల్పించి గౌరీమొదలగు మాతృదేవతలను, శుభకర్మల యందు శ్రేయోభిలాషులు పూజించవలయును. గౌరీ, పద్మా, శచీ, మేధా, సావిత్రీ, విజయా, జయ, దేవ సేనా, స్వధా, స్వాహా, వైధృతి, ధృతి, పుష్టి, హృష్టి, తుష్టి, ఆత్మ దేవత యను పదునారు మాతృదేవతలు, గణేశునితో షోడశ మాతృకలను శుభకర్మలయందు వృద్ధి కొఱకు పూజించవలయును. ఆ వాహనము పాద్యము, అర్ఘ్యము, స్నానము, చందనము, అక్షతలు, పుష్పములు, ధూపము, దీపము, పండ్లు, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, పోకలు, నీరాజనము, దక్షిణలను మాతృదేవతల సంతోషము కొఱకు క్రమముగా నీయవలయును.

సంపదలను, సంతానమును వృద్దిగావించు పిత్సకల్పమును ఇపుడు చెప్పెదను. ఉత్తరాయణ పుణ్యకాలమున దక్షిణాయన పుణ్యకాలమున, అమావాస్యాతిథి యందు, అష్టకములలో, తిథివృద్ధిలో నున్నపుడు, ద్రవ్యము లభించినపుడు, సదాహ్మణులు వచ్చినపుడు, విషువత్కాలమందు, సూర్యసంక్రమణమున, వ్యతీపాద్యోగమునందు, గజచ్ఛాయలో, సూర్య చంద్రగ్రహణ కాలమున శ్రాద్దమును చేయవలయునని ప్రీతి కలిగిన కొలమున శ్రాద్ధమునోచరించవలయును. ఈ సమయములు శ్రాద్దకొలములుగా పెద్దలచే పేర్కొనబడినవి. ఉత్తమపంశ సంజాతుడు, సర్వ వేదములను అధ్యయనము చేసినవాడు, శ్రోత్రియుడు, బ్రహ్మ జ్ఞానము కలవాడు, - యువకుడు, వేదార్దజ్ఞుడు, సామవేదమును చదివిన వాడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు, చెల్లెలు కొడుకు, ఋత్విజుడు, అల్లుడు, యాగము చేయువాడు, మామ, మేన మామ, త్రికాలములలో సంధ్యావందనము నాచరించువాడు, పుత్రికా పుత్రుడు, శిష్యుని సంబంధులు, బంధువులు, కర్మనిషులు, తపోనిషులు, పంచాగ్నిపరాయణులు, బ్రహ్మ చారులు, పితృమాతృభక్తి గలవారు, అగు బ్రాహ్మణులు శ్రాద్ధమున నియోగించుటకు యోగ్యులు. రోగము కలవాడు, అంగవికలురు, అంగాధిక్యులు, గ్రుడ్డివారు, కవలలలో తరువాత పుట్టినవాడు, దీనుడు, విధవాపుత్రుడు, వ్యభిచారిణీ పుత్రుడు, గోళ్ళను పెంచుకొనినవాడు, దంతధావనమును చేయని " వాడు, వేతనను తీసుకొని విద్యను బోధించువాడు, నపుంసకుడు, కన్యను దూషించువాడు, పలువురిచే నిందించబడువాడు, మిత్రద్రోహి, లోభి, సోమరసమునమ్మువాడు, అన్నకంటే ముందు వివాహము చేసుకొనినవాడు. తల్లిని, తండ్రినీ, గురువును త్యజించినవాడు, అయోగ్యుల భోజనము చేయువాడు, శూద్రుని వలన పుట్టినవాడు, స్త్రీకి రెండవ భర్తగా నున్నవాడు, మొదటి భర్త గా నున్నవాడు, చోరుడు, కర్మ భ్రష్టులు శ్రాద్దమున నిమంత్రణమునకు అయోగ్యులు. శ్రాద్ధము చేయువాడు మనోనిగ్రహము కలవాడై, పవిత్రుడై మొదటి దినముననే బ్రాహ్మణులను నిమంత్రణ చేయవలయును. అట్లు నియంత్రణ చేయబడిన బ్రాహ్మణులు కూడా కాక వాచిక మానసిక నిగ్రహము కలిగియుండవలయును. శ్రాద్ధదినమున వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము పలికి అపరాప్లకాలమున పూజించవలయును. పవిత్రమును ధరించి బ్రాహ్మణులకు ఆచమనమునిచ్చి ఆసనముల యందు కూర్చోబెట్టవలయును. విశ్వేదేవతల స్థానమున శక్తిననుసరించి, పితృస్థానమున బేసి సంఖ్యతో అనగా మూడు, అయిదు, మొదలగు సంఖ్యలో బ్రాహ్మణులను ఉంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన ప్రదేశమున దక్షిణాభిముఖముగా నుండి విశ్వదేవతలను ఇద్దరిని ప్రాబ్ముఖముగా, పితృస్థానమున నియోగించిన ముగ్గురిని. ఉత్తరాభిముఖముగా ఒక్కొక్కరిని కూర్చుండ బెట్టవలయును. మాతామహుల విషయమున కూడా ఇట్లే ఆచరించవలయును. హస్తప్రక్షాలణమునాచరించి ఆసనమునకు దర్భలనుంచ వలయును. బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది విశ్వేదేవాస”అను ఋక్కుచే ఆవాహనము చేయవలయును. పవిత్రముతో కూడిన పొత్రయందు యవలను చల్లి "శం నో దేవీ" అను మంత్రముచే నీరునుంచి, “యవోసి”అనుమంత్రముచే యవలనుంచి, “యా దివ్యా”అను మంత్రముచే హస్తమున పాద్యము నర్పించవలయును. తరువాత ఉదకమునిచ్చి, గంధమాల్యముల నర్పించి దీపమునుంచి అన్నప్రదానము గావించవలయును. తరువాత అపసవ్యము చేసుకొని పితృస్థానమున నియోగించిన పోరికి ప్రదక్షిణము చేసి, రెట్టింపు దర్భలనిచ్చి, “ఉశంతః” అను మంత్రముచే అనుమతిని పొంది ఆవాహనము చేయవలయును. తరువాత పితృమంత్రమును జపించవలయును. పితృదేవతలకు యవలకు బదులుగా నువ్వులను వాడవలయును. ఆర్ష్యాదులను పూర్వము వలె నాచరించవలయును. యవలతో అర్ఘ్యమునిచ్చి పాత్రలో యవలను విధానముగా నుంచి ఈ పితృభ్యః స్థానమసి అను మంత్రముచే కొద్దిగా వేడిచేసిన పాత్రను తలక్రిందులుగా చేయవలయును. అన్నమును హోమము చేయునపుడు అనుమతిని పొంది నేతితో కలిపిన అన్నమును హోమము గావించవలయును. హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో నుంచవలయును లభించిన విధముగా పాత్రలనుంచవలయును. బంగారు పాత్రలు శ్రేష్ఠములు. అట్లు పాత్రలలో అన్నము నుంచి ఉపృథివీ తో పొత్రం” అను మంత్రముచే పాత్రలను అభిమంత్రించవలయును. “ఇదం విష్ణుః” అను మంత్రముచే అన్నమున బ్రాహ్మణాంగుష్ఠమునుంచవలయును. వ్యాహృతులచే కూడిన గాయత్రీమంత్రమును, “మధు వాతా” అను మంత్రమును జపించి ‘యథాసుఖం’అని చెప్పవలయును. బ్రాహ్మణులు కూడా మౌనముగా భుజించవలయును. కోపమును, త్వరను విడిచి ఇష్టమగు అన్నమును, హోమము చేసిన హవిస్సును, ఈయవలయును. తృప్తి చెందువరకు వడ్డించవలయును. వారు భోజనము చేయుచుండగా పూర్వము వలె గాయత్రీజపమును చేయుచుండవలయును. అన్నమును తీసుకొని తృప్తినిచెందితిరా యని యడిగి, శేషాన్నమును అనుమతిని పొంది భూమి మీద చల్లవలయును. ఒక్కొక్కమారు జలము నీయవలయును. మొత్తము అన్నమును నువ్వులతో తీసుకొని దక్షిణాభిముఖుడై బ్రాహ్మణులు భోజనము చేసిన ప్రదేశమునకు సమీపమున పిత్స యజ్ఞము నందు వలె పిండ ప్రదానమును గావించవలయును. మాతా మహాదులకు కూడా ఇట్లే చేయవలయును. తరువాత ఆచమనమునకు జలము నీయవలయును. తరువాత స్వస్తివాచనము గావించి అక్షయోగకము నీయవలయును. శక్తిననుసరించి దక్షిణలనిచ్చి స్వధాకారమును చేయవలయును. వాచ్యతాం అని అనుమతిని పొంది, స్వధాకారమును చేయుడు అని పలికి బ్రాహ్మణులు స్వధా అని పలుకగా జలమును భూమి పై చల్లవలయును. విశ్వదేవతలు తృప్తి చెందుదురు గాక అని విప్రులు పలుకగా బ్రాహ్మణులు ఇట్లు జపించవలయును. ఉదోతారో నోభి వర్గస్తోం వేదాస్పంతతిదేవ చ, శ్రద్ధా చ నో మావ్యగమద్బహు దేయం చ నోస్తు”అని అనగా మాకు దొనము చేసినవారు, వేదములు, సంతతివృద్ధి చెందుగాక. మాలో శ్రద్దలోపించకుండుగాక. మాకు చాలా ఇవ్వగల సంపదలు దాతలకు కలుగు గాక అని అర్థము. ఇట్లు బ్రాహ్మణులు ప్రియవచనములను పలుకగా నమస్కరించి పంపించవలయును. “పోజే పోజే”అను మంత్రములచే ప్రీతిపూర్వకముగా మొదట పితృదేవతలను పంపవలయును. మొదట యవాదుల నుంచిన అర్ఘ్యపాత్రను (తలక్రిందులుగా నుంచిన దానిని) యథా. ప్రకారముగా చక్కగా నుంచి తరువాత పంపవలయును. బ్రాహ్మణులకు ప్రదక్షిణముచేసి పంపిన తరువాత పితృభుక్త శేషమును తాము భుజించవలయును. ఆ రాత్రి శ్రాద్ధకర్తలు భోక్తలగు బ్రాహ్మణులు బ్రహ్మ చర్యమును పాటించవలయును. ఇట్లు వృద్ధి కార్యమున సాందీముఖ్యులగు పితృదేవతలను దధి కర్కంధు మిశ్రితములగు, యవలచే చేయబడిన పిండములచే పూజించవలయును. ఏకోద్దిష్టమున మాత్రము దేవస్థానరహితముగా ఏక్తార్ఘ్యపాత్రముతో, ఆవాహనాగ్ని కార్యరహితముగా. నాచరించవలయును. అపసవ్యముతో చేయవలయును. స్థానోపవేశన సమయమున “ఉపతీషతోం”అని, విప్రవిసర్జనలో ‘అభీరమ్యతాం’ అని పలుకవలయును. బ్రాహ్మణులు అభిరతాస్స్మ”అని పలుకవలయును. నువ్వులతో కలిపిన గంధోదకముతో నాలుగు పాత్రలనుంచవలయును. పితృపాత్రలయందలి జలముతో అర్ఘ్యము కొఱకు ప్రీతిపాత్రను తడుపవలయును. “యే సమానా” అను మంత్రములతో రెండు పాత్రలతో తడుపవలయును. మిగిలినదంతయు పూర్వము వలె నాచరించవలయును. ఈ సపిండీ కరణము ఏకొద్దిష్టము స్త్రీవిషయమున కూడా నాచరించవలయును. ఇట్లు సంవత్సరము వరకు తరువాత సపిండీకరణమును చేయవలయును. సంవత్సరము తరువాత మరణించినట్లు తెలిసిననూ తరువాత ఒక సంవత్సరము ఉదకుంభముతో అన్నదానమును బ్రాహ్మణునకు చేయవలయును. ఒక సంవత్సరము ప్రతిమాసమున చనిపోయిన దినమున శ్రాద్ధమును చేయవలయును. సంవత్సరము తరువోత ప్రతిసంవత్సరము చనిపోయినదినమున శ్రాద్ధమునాచరించవలయును. పిండములను గోవులకు కానీ, మేకలకు కాని, బ్రాహ్మణులకు కానీ ఈయవలయును. లేదా అగ్నిలో కాని జలమున కాని విసర్జించవలయును. సదాహ్మణులకే దానమీయవలయును. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని ఊడ్వరాదు. హవిస్సుకుయోగ్యమగు అన్నమును ఒకనెలహోమము చేయవలయును. పాయసముతో సంవత్సరము హోమమును చేయవలయును. చేపల, లేళ్ళ, పావురముల, ఇతర పక్షుల, మేకల, దుప్పుల, జింకల, ఏదుల, వరాహముల కుందేళ్ళ మాంసములతో యథాక్రమముగా ఒక్కొక్క నెలలో పితరుల నర్పించినచో పితృదేవతలు తృప్తి చెందెదరు. పితామహులు తృప్తి చెందేదరు. ఖడ్గమృగమాంసముతో చేయు పితృయజ్ఞము మహాకల్పమనబడును. తేనెచే మునుల ఆహారముచే కూడా శ్రాద్ధము చేయవచ్చును. డేగమాంసము మహాశాకము కోడిమాంసమునర్పించవచ్చును. గయాక్షేత్రమున పైన చెప్పబడిన వాటిచే శ్రాద్దమును చేసినచో ఉత్తమ ఫలములను పొందును. ఇట్లే వర్షర్తువులోని త్రయోదశి తిథిన మఘలలో చేసినచో విశేషఫలమును పొందెదరు. ఇట్లు శాస్త్రోక్తముగా శ్రాద్దమునాచరించి వారికి కన్యలు, పశువులు, సత్పుత్రులు, కలిగెదరు. ద్యూతమున, వ్యవసాయమున, వ్యాపారమున లాభములను పొందెదరు. రెండు గిట్టలుకల పశువులను, ఒకగిట్టగల పశువులను, బ్రహ్మ తేజస్సుగల పుత్రులను, బంగోరువెండి నాణేములను, ఉత్తమ జ్ఞాతులను, సర్వకామములను పొందెదరు. ప్రతిపత్తు మొదలగు తిథులలో ఒక్క చతుర్ధశినీ వదిలి మిగిలిన తిథులలో, శస్త్రపతులైన వారికి శ్రాద్ధమునాచరించవలయును. ఇట్లు శ్రాద్ధము నోచరించిన పోరు, స్వర్గమును, సత్సంతానమును, తేజస్సును, బలమును, శౌర్యమును, భూమిని, ఉత్తమ పుత్రులను, సౌభాగ్యమును, సమృద్ధిని, కీర్తిని, శుభమును, మంచినడవడిని, రాజ్యమును, వ్యాపారాదులలో లాభమును, ఆరోగ్యమును, కీర్తిని, దుఃఖరాహిత్యమును, ఉత్తమగతిని, ధనమును, విద్యను, మంచి వైద్యుని, గోమహిష్యాది పశుసంపదను అశ్వములను పొందెదరు. కృత్తికొది భరణ్యంత నక్షత్రములలో శ్రాద్ధమునాచరించినవారు అన్ని కామనలను పొందగలరు. భగవంతుని యందు విశ్వాసము కలవాడై, శ్రద్దకలవాడై, మదమత్సరములను విడిచి వసురుద్రాదిత్యులను, పితరులను, శ్రాద్దదేవతలను తృప్తిపరచినచో, అట్లు ప్రీతిచెందిన శ్రాద్ధదేవతలు ఆయువును సంతానమును, ధనమును, విద్యను, సుఖములను, మోక్షమును ప్రసాదింతురు. ప్రీతిని చెందిన పితామహులు నరులకు రాజ్యమును ప్రసాదింతురు. ఇట్లు విశేషమగు కల్పాధ్యాయమును కొంచెము చెప్పితిని. వైదికతంత్రమున, ఇతర పురాణముల నుండి విస్తరముగా తెలియవలయును. ఇట్లు ఈ కల్పాధ్యాయమును చదువువారు, కర్మలలో కుశలులై ఇహపరలోకములలో సద్గతిని పొందెదరు. దైవకార్యములందు పితృకార్యములందు ఈ కల్పాధ్యాయమును వినువారు కల్పాధ్యాయమున చెప్పబడిన దేవపితృకార్యముల నాచరించిన ఫలమును పొందెదరు. ధనమును, విద్యను, ఉత్తమ కీర్తిని, పుత్రులను, పరలోకమున సద్ధతిని పొందెదరు. ఇక ఇపుడు వేదమునకు ముఖము అనబడు వ్యాకరణమును సంగ్రహముగా తెలి పెదను సావధానముగా వినుము.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున యాబదియొకటవ అధ్యాయము సమాప్తము.