నారద మహా పురాణము - పూర్వార్థము
14 - ధర్మశాన్తినిర్దేశః
ధర్మరాజు పలికెను :- వర్ణాశ్రమములకు క్రమముగా శ్రుతులలో, స్మృతులలో చెప్పిన ధర్మములను వివరించెదను. సావధానముగా వినుము. భోజనము చేయుచు అపవిత్రుని కాని, చండాలుని కాని కోపముతో, అజ్ఞానముతో స్పృశించినచో వరుసగా మూడుదినములు, ఆరుదినములు, మూడు వేళల్లో స్నానము చేసి పంచగవ్యముతో శుద్ధిపొందును. (పంచగవ్యమనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోఘృతము). బ్రాహ్మణుడు భోజనము చేయుచుండగా మలము స్రవించినచో ఏర్పడిన అపవిత్రత తొలగుటకు పాదప్రక్షాళనము చేసుకొని ఆచమనము చేసి ఒక దినము ఉపవాసముండి పంచగవ్యమును సేవించవలయును. భోజనము చేయుచున్నపుడు మూత్రస్రావము జరిగినచో ఒకదినము ఉపవాసముచేసి నేతితో హోమమును చేయవలయును. భోజనము చేయుచుండగా బ్రాహ్మణుడు అపవిత్రుడైనచో చేతిలోని ఆహారమును భూమి పైనుంచి స్నానము చేసినచో శుద్ధిని పొందును. ఒకవేళ ఆ ఆహారమును భుజించినచో ఉపవాసము చేసినచో శుద్ధిని పొందును. మొత్తము ఆహారమును తీసుకొనినచో మూడు దినములుపవసించవలయును. భోజనము చేయుచుండగా వాంతిచేసుకొనినచో ఆనారోగ్యముగా ఉన్నవాడు. మూడువందలు, ఆరోగ్యముగా నున్నవాడు మూడువేలు గాయత్రీ జపమును చేయవలయును. మలమూత్రోత్సర్జనము చేయుచున్నపుడు చండాలుడు కాని, శ్వపచుడు కాని స్పృశించినచో మూడురోజులుపవసించవలయును. భోజనము చేసిన తరువాత అశుచిగా ఉన్నపుడు స్పృశించినచో ఆరు” దినములు పవసించవలయును. రజస్వల అయిన స్త్రీని కాని, ప్రసవించిన స్త్రీని కాని చండాలుడు స్పృశించినచో మూడు దినములు తరువాత శుద్ది పొందును అని శాతాతపమహర్షి చెప్పెను. రజస్వలఅయిన స్త్రీని కుక్కలు, కాకులు, కిరాతులు స్పృశించినచో నిరాహారముగా ఉండి యథాసమయమున స్నానము చేయవలయును. రజస్వలలైన ఇరువురు స్త్రీలు ఒకరినొకరు తాకినచో బ్రహ్మ కూర్చమనువ్రతముతో శుద్ధి పొందెదరు. అపవిత్రుడు స్పృశించినపుడు స్నానము చేయనివాడు కూడా బ్రహ్మకూర్చమను వ్రతముచే శుద్ధిని పొందును. “ఋతుకాలమున గర్భవతి యని శంకించి సంభోగము చేసినవానికి స్నానముతో శుద్ధి కలుగును. ఋతుకాలము కానపుడు స్త్రీ సంగమమును జరిపినచో మూత్ర పురీషోత్సర్జనము చేసినప్పుటి వలె పాదప్రక్షాలనము ఆచమనము చేయవలయును. సంభోగ సమయమున స్త్రీ పురుషులిరువురూ అపవిత్రులగుదురు. శయ్య మీదినుండి లేచినచో స్త్రీ శుద్ధురాలగును. పురుషుడు మాత్రము అశుచిగానే యుండును. దుష్టత్వముతో భర్త శరీరమును సేవించని స్త్రీని ధనమేమీ ఇవ్వకుండగా పన్నెండు సంవత్సరములు త్యాగము చేయవలయును. పతితులు కొని, బంధువులను త్యజించినవారిని ఉత్తమ సాహస దండముచే శిక్షించవలెను. పతితుడైతే కావచ్చును. కాని తల్లి ఎన్నడూ పతితురాలు (పుత్రుని దృష్టిలో) కాదు. తాడుచే ఉరిపోసుకొనుట మొదలగు విధానములతో ఆత్మహత్యకు పాల్పడినచో, మరణించినచో మృతదేహమును పవిత్ర పదార్థములతో పూయవలయును. ఒకవేళ జీవించెనేని రెండువందల నాణెములను అపరాధమును విధించవలయును. ఆత్మహత్య చేసుకొనిన వాని పుత్ర పౌత్రాదులను కూడా ఒకొక్కనాణెము అపరాధముగా విధించి దండించవలయును. తరువాత శాస్త్రముననుసరించి ప్రాయశ్చిత్తము నాచరించవలయును.
నీటిచే అగ్నిచే బంధనముచే ఆత్మహత్య చేసుకొనవలయునని ప్రయత్నించి విఫలమైనవారు, సన్యాసవ్రతమును భంగము చేసి పతితులైనవారు, విషపొనము చేసినవారు, పైనుండి క్రిందపడినవారు, శస్త్రప్రహారముచే ఆత్మహత్యను ప్రయత్నించినవారు ప్రాయశ్చితార్హులుకారు సమాజమున వ్యవహారమునకు యోగ్యులు కారు. అందరిచే బహిష్కరించదగినవారు. చాంద్రాయణవ్రతముచే కాని, తప్తకచవ్రతమును రెండుమార్లు ఆచరించికొని శుద్దులగుదురు. మాహాపాతకములను ఉపపాతకములను ఆచరించి భ్రష్టులైనవారు, నల్లని పశువును వినియోగించే యజ్ఞముచేయుటకు అనర్హులు. వీరు రెండు చాంద్రాయణవ్రతములచే శుద్దులగుదురు లేదా గోవును, వృషభమును దానముచే కొని శుద్దులగుదురు.కావలెనని కాక అచింతితముగా శునక జంబుక వానరాదులు, పతిత పురుషులు, పగలు, సంధ్యాసమయమున, రాత్రి పూట స్పృశించినచో వెంటనే స్నానము చేసినచో శుద్ధి కలుగును. తెలియక చండాలాన్నమును భుజించిన పోరు పది హేను రోజులు గోమూత్రములో వండిన ఆహారమును భుజించినచో శుద్దులగుదురు. బ్రాహ్మణ గృహమును, గోనివాసమును దాహము చేసినవాడు, ఉరిపోసుకొని మరణించవలయునని ప్రయత్నించినవారు, ఉరితాడును ఛేదించి ఒక కృచవ్రతము నాచరించినచో శుద్దులగుదురు. తెలియక చండాలపుల్కసుల భోజనము చేసినవారు, స్త్రీని వధించినవారు రెండు చాంద్రాయణవ్రతములగోచరించవలయును. తెలిసి చేసినచో అర్థకృచ్చవ్రతము నాచరించవలయును. గోపాలకుల అన్నమును భుజించినవారు, వారి స్త్రీలతో రమించినవారు, పొందరాని స్త్రీలను పొందినవారు, మద్యపానము చేసిన బ్రాహ్మణులు, గో మాంసభక్షణము చేసిన విప్రులు తప్తకృచ్చవ్రతముచే కాని, నూనెలో తడిపిన దారములతో హోమమును చేసిన కాని శుద్ధులగుదురు. నాలుగు మహాపాతకములను ఆచరించినవారు అగ్నిప్రవేశముతో కాని, మహాక్రతుప్రవేశముతో కాని శుద్దులగుదురు. రహస్యముగా పాపముల నాచరించినవారు ఒకనెల నీటిలో నిలిచి అఘమర్షణ సూక్తమును జపించినచో శుద్ధలగుదురు. రజకులు, చర్మ కారులు, నటులు, బురుడులు, కైవర్తులు, మేదులు భిల్లులు” అను ఏడుగురు అన్యజులు. తెలిసి వీరి అన్నమును తినిననూ, స్త్రీలతో రమించిననూ, నీరు త్రాగినను, దానము పరిగ్రహించినను అర్ధకృచవ్రత మాచరించవలయును. తెలియక చేసినచో రెండు చాంద్రాయణ వ్రతములగొచరించవలయును. తల్లిని, గురుపత్నిని, పుత్రికను, చెల్లెలును, కోడలును సంగమించినచో అగ్నిప్రవేశము తప్ప మరొక ప్రాయశ్చిత్తము లేదు. మహారాణిని, సన్యాసినిని, పెంపుడుతల్లిని, ఉత్తమవర్ణసంజాతను సంగమించినచో రెండు కృచ్చవ్రతముల నాచరించవలయును. సమాన గోత్రము కల స్త్రీని పొందినను రెండు కృచ్చవ్రతముల నాచరించవలయును. మాత్సగోత్రము కల స్త్రీలను, పిత్సగోత్రము కల స్త్రీలను, పరదారలను సంగమించినచో అర్థక్పచువ్రతము నాచరించవలయును. వేశ్యాగమనము చేసిన బ్రాహ్మణులకు కూడా అర్థకచవత్రముచే శుద్ధి కలుగును. గురుపత్నీసంగమము చేసిన బ్రాహ్మణుడు బాగుగా వేడిగా యున్న నీటిని ఒకసారి త్రాగి దర్భజలమును అయిదు మార్లు త్రాగి యథావిధిగా వ్రతము నాచరించవలయును. గో హత్య చేసిన వానికీ, మహాపాతకముల నాచరించిన వారికి కూడా ఇదే ప్రాయశ్చిత్తము నిర్ణయించబడినది. దండముతో ప్రహరించి ఆవును క్రిందపడవేసిన వానికి రెట్టింపు గోవ్రతము (గోదండము) ప్రాయశ్చిత్తముగా వీధించబడినది. అంగుష్ఠమంత లావు, బాహువంత పొడవుగానున్న పచ్చి మోదుగు దండము గోదండమనబడును. ఆ దండముతో ప్రహారమే గోవ్రతము. గోవును దండముతో ప్రహరించినపుడు గర్భపాతము సంభవించినచో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కృచ్ఛవ్రతము నాచరించవలయును. ఆవును బంధించినపుడు అడ్డగించినపుడు, పోషించినపుడు గోవుకు పీడ కలిగినచో లేదా మరణము సంభవించినచో, దండప్రహారము చేయవలయును. ఆ ప్రహారముచే మూర్చపోయి లేచిన తరువాత అయిదారేడు పది అడుగులు నడిచి వెళ్ళవలయును. గడ్డి తిని నీరు త్రాగి వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తము లేదు. అనగా వ్యాధిగ్రస్తమైన గోవునకు దండముతో వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తముతో పనిలేదు. వ్యాధి లేని గోవును దండన చేసినచో అతనినిట్లు శిక్షించవలయును. ఇదే ప్రాయశ్చిత్తము. దండముతో మట్టిగడ్డలతో రాళ్ళతో ఆయుధములతో గోవును ప్రహరించినచో ఒక్కొక్క ప్రహారమునకు విడిగా ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి. దండప్రహారముతో డురణించినచో సాంతపనప్రతమును, మట్టిగడ్డతో మరణించినచో ప్రాజాపత్య వ్రతమును పొషాణ ఘాతమునకు తప్త కచ్ఛవ్రతమును, శస్త్రఘాతమునకు ఆబను ఆచరించి గో బ్రాహ్మణులకు ఔషధమును, ఆహారమును తెలమును దానము చేయవలయును. ఒకవేళ దానము చేసిన ఔషధాదులు సేవించుట వలన మరణము సంభవించిన చో ప్రాయశ్చిత్తముతో పని లేదు.
ఇచ్చిన ఔషధమును కాని, తైలమును కాని పానము చేసినపుడు మరణము సంభవించినచో ఇచ్చిన వారికి ప్రాయశ్చిత్తముతో పనిలేదు. దూడలకు మందు త్రాగించుటకు కంఠమున త్రాడు కట్టునపుడు, సాయంకాలము రక్షణ కొఱకు బంధించినపుడు దోషము లేదు. పాదప్రాయశ్చిత్తమునకు కేశములను కర్తనము చేయవలయును. రెండు పాదముల ప్రాయశ్చిత్తమునకు మీసములు తీయవలయును. మూడు పాదముల ప్రాయశ్చిత్తమునకు శీఖను, పూర్తి ప్రాయశ్చిత్తమునకు సంపూర్ణముగా క్షౌరము చేయవలయును. స్త్రీకి ప్రాయశ్చిత్తము చేయవలసివచ్చినపుడు మొత్తము కేశములను పట్టుకొని రెండంగులములను మాత్రము కర్తనము చేయవలయును, స్త్రీలకు ఇదియే శిరోముండనము. స్త్రీలకు పూర్తిగా వపనము కొని, వీరాసనము కాని వీధించబడియుండలేదు. స్త్రీలకు గోశాలలో నివాసము కాని, నడుచుచున్న ఆవు వెంట వెళ్ళుట కాని విధించబడలేదు. రాజు కాని, రాజపుత్రుడు కాని, విద్వాంసుడైన బ్రాహ్మణుడు కాని పాపమును ఆచరించినచో శిరోముండనము కాక ఇతర ప్రాయశ్చిత్తము నాచరించవలయును. కేశరక్షణ కొఱకు రెట్టింపు వ్రతముల నాచరించవలయును. రెట్టింపు వ్రతము నాచరించి రెట్టింపు దక్షిణల నీయవలయును. శ్రుతి స్మృతులలో విధించబడని ప్రాయశ్చిత్తమును చెప్పినచో హంతకునికి పాపము నశించదు. చెప్పినవాడు నరకమునకు వెళ్ళును. అట్లు ధర్మమునకు వీఘ్నములను కల్పించువారిని రాజు దండించవలయును. ఇట్లు ధర్మ విఘాతకలను రాజు కామమోహితుడై దండించనిచో అతని పాపము నూరు రెట్లు పెరిగి రాజును పీడించును. ప్రాయశ్చిత్తము జరిపిన తరువాత బ్రాహ్మణ భోజనమును జరిపించవలయును. ఇరువది ఆవులను ఒక వృషభమును బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వవలయును. గోవును దండాదులచే ప్రహారము చేసినపుడు గాయమేర్పడి గడ్డిలో పుట్టిన పురుగులచే మక్తి కొదులచే గాయము పెరిగినపుడు అర్ధకృచ్ఛవ్రతము నాచరించవలయును. శక్తి ననుసరించి దక్షిణ నీయవలయును. ప్రాయశ్చిత్తము నాచరించి బ్రాహ్మణులకు భోజనమునుంచి కొంచెము బంగారమును దానము చేసి శుద్ధిని పొందును. రాత్రిపూట చండాల శ్వపచుల స్పర్శ ఏర్పడినపుడు రాత్రిలేనిచో వెంటనే స్నానముచే శుద్ది కలుగును. ఒకవేళ స్పర్శ కలిగినచో ప్రాతఃకాలమున స్నానముచే శుద్ధి యేర్పడును. తెలియక రాత్రి అంతయు చండాలాదులతో కలిసి యున్నచో ఆ పాపము నూరురెట్లు పెరుగును. గ్రహములు కాని, నక్షత్రములు పైనుండి వెళ్ళుచున్నపుడు కిరణస్పర్శ కలిగినచో జలస్నానముచే శుద్ధి యేర్పడును. నీటిలోపలనున్న మట్టిని, పుట్టలోని మట్టిని, మూషిక బిలములోని మట్టిని, చౌడు భూమిలోని మట్టిని, మార్గములోని మట్టిని, శ్మశానములోని మట్టిని, శౌచశేషములోని మట్టిని ఈ సప్తమృత్తికలను గ్రహించరాదు. బ్రాహ్మణుడు గట్టి ప్రయత్నముతో నైనను ఇష్టాపూర్తమును ఆచరించవలయును. ఇష్టముచే స్వర్గము, పూర్తముచే మోక్షము లభించును. ద్రవ్యమును విరివిగా దానము చేయుట ఇష్టమనబడును. తటాకాదులను నిర్మించుట పూర్తమనబడును.
జీర్ణములైన ఆరామములను, దేవాలయములను, వాపీ కూప తటాకములను ఉద్దరించిన వారికి కూడా పూర్తి ఫలము లభించును. శుక్లగోవు నుండి మూత్రమును, కృష్ణగోవునుండి పేడను, తామ్రవర్ణపు గోవు నుండి పాలను, శ్వేతగోవు నుండి పెరుగును, కపిలగోవు నుండి నేతిని తీసుకొని పంచగవ్యమును సిద్ధము చేసుకొనవలయును. ఇట్లు సిద్ధము చేసిన పంచగవ్యము మహాపాతకములను నశింపచేయును. దర్బలచే తీర్థ నదీ జలముచే పంచగవ్యములోని ప్రతిద్రవ్యమును విడివిడిగా ప్రణవముతో కలుపవలయును. ప్రణవముతో పైకి తీసుకొనవలయును. ప్రణవముతో చక్కగా ఆలోడనము చేసి ప్రణవముతో పానముచేయవలయును.మోదుగాకులో కాని, రాగి కలశములో కాని, తామరాకులో కాని, మట్టి పాత్రలో కాని దర్భలతో నుంచి పానము చేయవలయును. సూతకము (ఆశౌచము) ఒకటి వచ్చిన అది పూర్తి కాకమునుపే మరియొక సూతకము వచ్చినచో తరువాత వచ్చిన సూతక దోషము మొదటి దానితో పోవును. జాతాశౌచముతో జాతాశౌచము, మృతాశౌచముతో మృతాశౌచము తొలగిపోవును. గర్భస్రావము జరిగినచో మూడుదినములు ఆశౌచముండును. ఎన్ని మాసముల గర్భస్రావమైనచో అన్ని దినములు ఆశౌచముండును. రజస్వల అయిన స్త్రీ రజోదర్శనము ' ముగిసినపుడు స్నానముచే శుద్ది పొందును. వివాహమున ఏడడుగులు నడచుటచే స్త్రీ తన గోత్రమునుండి విడిపోవును. ఆ స్త్రీకి పిండోదకకర్మలు భర్త గోత్రముచే చేయవలయును. పిండదానమునకు ప్రతి పిండమును రెండు పేర్లతో ఇచ్చుట ఉద్దేశ్యము. కావుననే ఆరుగురికి మూడు పిండములుంచవలయును. ఇట్లు చేసినచో దాత మోహమును, చెందడు. మాత తన భర్తతో వేయి సంవత్సరములు పిండములను భుజించును. అట్లే పితామహికూడా తన భర్తతో వేయి సంవత్సరములు భుజించును. ఇట్లే ప్రపితామహి కూడా అని తెలియవలయును. తలిదండ్రులకు ప్రతి సంవత్సరము శ్రాద్దమును జరుపవలయును. విశ్వేదేవతారహితముగా శ్రాద్దము జరుపపలయును. ఒక పిండమును అర్పించవలయును. నిత్యము నైమిత్తకము, కామ్యము, వృద్ధిశ్రాద్ధము, పార్వణము. అని శ్రాద్ధము అయిదు విధములు. గ్రహణ సమయమున, సూర్య సంక్రమణమున, పర్వదినములలో, ఉత్సవ. దీనములలో మూడు పిండముల నుంచవలయును. ఆబ్దికమున ఒక పిండమునుంచవలయును. వివాహము కొని కన్యకు పిండదానమున సూతకమున విడిగా గోత్రముండదు. వివాహమైన తరువాత వేరు గోత్రముండును. యే వర్ణముతో కన్యావివాహము జరుగునో ఆ వర్ణముతోనే సూతకము పింగోదకములు జరుగును. వివాహము జరిగిన తరువాత నాలుగవ దినము రాత్రినుండి కన్య భర్త గోత్రముతో ఏకత్వమును పొందును. మరణించిన దినమున కాని, రెండు మూడు నాలుగవ దినములలో హిత బుద్ధులైన బంధువులు అస్థి సంచయనమును పంచదశోధ్యాయః చేయవలయును. వర్ణానుక్రమముగా నాలుగు అయిదు ఏడు తొమ్మిది దినములలో అస్తి సంచయనము చేయవలయునని చెప్పబడినది. చనిపోయిన తరువాత పదకొండవదినమున వృషభమును వదిలినచో పేతలోకమునుండి విడివడి స్వర్గలోకమును చేరును. నాభిమాత్రజలమున నిలిచి హృదయమున ధ్యానము చేయవలయును. ఓ పితృదేవతలారా ! మీరొచ్చి ఈ జలాంజలులను స్వీకరించుడు. రెండు చేతులను దగ్గరికి చేర్చి నీటితో నింపి గోశృంగ పర్యంతము పైకి హస్తములు తెచ్చి నీటి మధ్యలో విడువవలయును. నీటిలో దక్షిణాముఖముగా నిలిచి జలమును ఆకాశమున చల్లవలయును. ఆకాశము పితృస్థానము. పితరుల దిక్కు దక్షిణము. జలములు దేవగణములు. జలములే పిత్సగణములు. కావున పితరుల హితమును కోరువారు పితరులకు జలతర్పణము చేయవలయును. పగలు సూర్యకిరణములచే తప్తములై, రాత్రి నక్షత్రములచే వాయువుచే, మధ్యకాలమున రెంటిచే జలములు పవిత్రములగుచున్నవి. సహజముగా జలము కలశములో నున్నను, భూమి పై నున్నను సర్వదా పవిత్రమే. దేవతలకు, పితరులకు జలాంజలీయవలయును. సంస్కారరహితులై మరణించినవారికి స్థలమున జలతర్పణము చేయవలయును. శ్రాద్ధమున హోమ సమయమున ఒక చేతితో నీయవలయును. తర్పణమున రెండు చేతులతో నీయవలయును అని ధర్మము వ్యవస్థీకరించబడినది.
ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున ధర్మశాంతి నిర్దేశమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
