భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

133. ప్రతిమా ప్రతిష్ఠా కల్పమున విశ్వరూప వర్ణనము

తా॥ నారదుడిట్లనెను. 'ఇట్లు విగ్రహనిర్మాణము చేసిన పిమ్మట శాస్త్రవిధి ననుసరించి యధివాసనము చేయవలెను. ఈశాన్య దీశయందు ప్రత్యేకముగ నధీవాసన మండపమును నిర్మింపవలెను-1. మండపమునకు నలుదిక్కుల తోరణములతోను, వివిధాభరణములతోను శోభాయమాసముగ నలంకరింపవలెను. అన్ని పార్శ్వములందు పతాకములతో నలంకరింపవలెను-2. ఆగ్నేయమున నెఱ్ఱనివి, దక్షిణనైరృతి దిశలందు నల్లనివి, పడమర దిక్కున తెల్లనివి, వాయవ్యమున తెలుపుమించిన పచ్చనివి-3. ఉత్తర పార్శ్వమున చిత్రవర్ణము గలవి, ఈశాన్యము నుండి తూర్పున పసుపు వన్నెగలవి కూర్పవలెను. దారు ప్రతిమ ధనమును, ఆయువును, జయమును, బలమును, కీర్తిని యిచ్చును-4. ఆది సంపత్కరమనుటనో సంశయములేదు. మృణ్మయ ప్రతిమ సర్వలోకహితకరము-5. మణులచే నిర్మితమైన ప్రతిమ సుభిక్షమును, క్షేమమును కలిగించును. బంగారముతో చేయబడిన పుష్టిని, వెండితో చేయబడినది కీర్తిని కలుగజేయును-6. రాగి ప్రతిమ నిస్సంశయముగ ప్రజావృద్ధిని కలిగించును. శిలానిర్మిత మగు ప్రతిమ విపులమైన భూసంపదను లభింపఁజేయును-7. సీసము, ఇనుముతో చేయబడిన ప్రతిమలు ప్రధానవ్యక్తిని చంపునుగావున నట్టివి నిర్మింపరాదు. సాంబా! ఇట్లు సర్వదేవమయుడైన సూర్యభగవానుని మూర్తిని శ్రద్దగా నిర్మింపవలెను-8. అనవివి సాంబుడిట్లనెను. “మునివర్యా! సూర్యదేవుని సర్వదేవ మయత్వమెట్టిదో నాకుఁతెలుపుడు. ఈతడు సర్వదేవమయుడని యేల పేర్కొనబడెనో చెప్పుడు.

 తా॥నారదుడిట్లనెను. “మంచిది, సాంబా! చెప్పుచున్నాను. నామాటలను శ్రద్ధగా వినుము బుధుడు, చంద్రుడును సూర్య భగవానునకు, నేత్రములు, అతని ఫాల భాగమున నీశ్వరుడుండును-10. ఆ దేవదేవుని శిరమున బ్రహ్మదేవుడు, కపాలమున బృహస్పతి, కంఠమునందేకాదశరుద్రులుందురు-11. నక్షత్రములు, గ్రహములును అతని దంతములనాశ్రయించి యుండును. ధర్మాధర్ములు పెదవుల పై నుందురు-12. సర్వశాస్త్రమయియగు సరస్వతి యాతని నాలుక పై నుండును. దిక్కులు విదిక్కులు శ్రోత్రములయందు గలవు-13. దేవతలతో పూజింపబడు బ్రహ్మ, ఇంద్రుడు దవడల పైనను, ద్వాదశాదిత్యులు కనుబొమల నడిమీ భాగముననుందురు-14. అతని రోమ కూపములందు ఋషులు, జఠరమున సముద్రములు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పిశాచములు, రాక్షసులు-15. దానవులు-వీరందఱును హృదయస్థానముననుందురు. బాహుప్రదేశములలో నదులు, చంకలలో నాగులు-16. వీఁపునడిమి భాగమున మేరువు, స్తనమధ్య ప్రదేశమున కుజుడు, అతని కుమారుడైన యమధర్మరాజు నాభిప్రదేశమునను ఉండును-17. పృధివ్యాదులు కటీదేశమున, సృష్టియంతయు లింగమున, అశ్వినీ దేవతలు మోకాళ్ళయందును, పర్వతములు తొడలందును-18. పాతాళలోకములేడును గోటినడుమ, సముద్రములతో గూడిన భూలోకము పాద మధ్యమునను -19. క్రొలగ్నిరుద్రుడు పలుకొసలయందును ఉండును. ఇట్లు సూర్యదేవుడు సర్వదేవమయుడు, సర్వదేవాత్మకుడు-20. అతని యమూర్తాంగములందు వాయువులుండును. ఆ ప్రభుని క్రియామయరూపమగు వాయువుచేతనే సకల చరాచర సృష్టి వ్యాప్తమై యున్నది-21. అట్టి యా సూర్యభగవానుడు సకల భూతములననుగ్రహించుటయందు తత్పరుడైయుండును. ఇది యంతయు తెలియుట పరమ జ్ఞానమగును. ఇదియే నీకు పరమ పదమగును-22. ఇక సూర్యదేవుని ప్రతిమ నెట్లు స్థాపింపవలెనో పూర్వము బ్రహ్మదేవునిచే వివరింపబడిన రీతిగ స్థల విభాగముతో నీకు నేను సాకల్యముగ విశదము చేసెదను.

శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పాంతర్గత సాంబోపాఖ్యానమునందలి ప్రతిమా ప్రతిష్టాకల్పమునందు విశ్వరూపవర్ణనమను నూటముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.