భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

104. సప్తమీ కల్పమున త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణము

తా. బ్రాహ్మదేవుడిట్లనెను. “ఓ విష్ణు దేవా! ఏ యే కామనలతో లేక నిష్కామముగా సూర్య భగవానుని గూర్చిన యుపవాస వ్రతములతో మానవుడు తన మనోవాంఛల. నీడేర్చుకొనునో అట్టి యుపవాస వ్రతములను గూర్చి చెప్పుచున్నాను. వినుము, ఫాలున మాస శుక్ల పక్ష సప్తమీ నాడు మానవుడు భక్తితో సూర్య దేవుని నామమును మఱల మల భక్తితో జపించుచుండవలయును'. స్నాతుడై, శుచిర్భూతుడై దేవతార్చన సందర్భమున నూట యెనిమిది పర్యాయములు సూర్య నామమును జపింపవలెను. ప్రయాణ కాలమున, లేచునప్పుడు, తొట్రుపాటు సమయమున, తుమ్మినప్పుడును సూర్య నామోచ్చారణ చేయవలెను. ప్రతి యగు వాడు పాఖండులతో, పతితులతోను, అన్యాయ శీలురతోను సంభాషింపరాదు. శ్రద్దాయుక్తుడై సూర్య భగవానుని పూజింప 'వలేను. మనస్సును సూర్యభగవానుని యందేకాగ్రముగ నిలిపి పరమ తాత్పర్యముతో నీ మంత్రమునుచ్చరింపవలెను. “పరమాత్మ స్వరూపుడవుగునో సూర్య భగవానుడా! నీవు దయా మయుడవు. గతి లేని వారికి నీవే గతివగుము. ఓ దివాకరా! సంసార సముద్రమున మునిగియున్న వారిని రక్షింపుము-5. ఇటులా దేవదేవుని ప్రసన్నుని గావించుకొని నియత మానసుడై యువవాస వ్రతమాచరించి, పూర్వాహ్లకాలముననే యొకసారి యాచమించి. స్నానమాడి సూర్య దేవునర్చించి 'హంస హంస కృపాలుస్త్వ' మ్మను మంత్రమును మఱల జపింపవలెను. సూర్య దేవుని పాదములందు మూడు పర్యాయములు జలధారలర్పింపవలెను. చైత్ర వైశాఖ మాసములందు, అట్లే జ్యేష్ఠ మాసమున సూర్యార్చన చేయు మానవుడు మర్త్యలోకమునందు శ్రేష్ఠమైన గతిని పొందును. ఓ విష్ణు దేవా! మరణించిన పిమ్మట కూడ నతడు దీవ్యము శుభకరమునైన సూర్య లోకమును పొందును. శివ ప్రసాదమున నింద్ర వైభవముల ననుభవించును. ఆషాడ శ్రావణ భాద్రపదేశ్వయుజ మాసములలోను ఇదే విధానమున. ఉపవాస వ్రతమాచరించి సూర్య దేవుని మార్తాండ నామముతో కీర్తింపుచు పూజింపవలెను. గో మూత్రప్రాశనముతో పరిశుదుడై ధనికుడై కుబేరలోకమును పొందును.

 తా॥ లోక పూజితుడు, జగదీశ్వరుడు, అవ్యయాత్ముడునైన భాస్కర దేవునినుత్రాంతి కాలమున స్మరించుట సూర్యలోక ప్రాప్తి కలిగించును , కార్తికము మొదలు నాలుగు మాసములు శాస్త్ర వీధి యందు చెప్పబడినట్లు క్షీర ప్రాశనము చేయవలెను. పూర్వోక్త విధానముననే ఈ నాలుగు మాసములును సూర్య దేవుని భాస్కర నామముతో కీర్తింపవలెను. అంత్యకాలమున భాస్కరుని స్మరించువాడు భాస్కర లోకమును పొందును. ప్రతిమాసమున బ్రాహ్మణులకు వారు కోరిన దానములీయవలెను, నాలుగు మాసములిట్లు వ్రతమాచరించి పూర్తియైన పిమ్మట పురాణ ప్రవచనము నేర్పాటు చేయించి. భాస్కర సంబంధ కథా గానములను జరిపింపవలెను. సూర్య భగవానునకు ధర్మ కథా శ్రవణము చేయించుట యిష్టము. వాచకుని పూజించి, విద్వాంసుడైన ప్రతి, వాచకద్విజుని సహాయముతో, దివ్యమైన పక్వాన్నముతో యధే యుక్తముగా శ్రాద్దము నాచరింపవలెను. మానవుడిట్లు దేవతా సంకీర్తనము చేత ధర్మార్థ కామములతో కూడినది త్రైలోక్యమను పేరు గలదియునైన శ్రేష్ఠమైన గతిని పొందును. నీకుఁ దెలిపిన మొదటి పారణమున మానవుడు గోవులు, భూ సంపద, ధనము, ఆధిపత్యము, భోగములు పొందును. రెండవ పారణముచేత సూర్య లోక ప్రాప్తిని బడయును. ఇట్లుత్తమ గతి ప్రాపకమైన సప్తమీ వ్రత విధానము నీకు చెప్పఁబడినది. శుక్ల సప్తమీ వ్రతమును శ్రద్దతో నాచరించు పురుషుడు పొందు తైవిధ్య సుగతినే స్త్రీయును భక్తితో నాచరించినచో పొందును. ఈ సప్తమీ తిథి నెల్లకాలముపాసించినచో పాపములను హరించును. కృతార్థతనొదవించును. సప్తమీ తిథులను సూర్య పూజకొఱకై వినియోగించువారలకు. చదివిన వారికీ, వినిన వారికినీ సర్వపాపములును, భయములును తొలగిపోవును. ఈ విధముగ నీతిథి ధన్యమైనది. పుణ్య ప్రదమైనది. ఎల్లపుడు త్రివర్గాద్యభీష్ట ఫలముల నిచ్చునది.

శ్రీ భవిష్య మహా పురాణము నందలి బ్రహ్మపర్వమున, సప్తమీ కల్పమునందు త్రివర్గ సప్తమీ వ్రత నిరూపణమను నూట నాల్గవ అధ్యాయము సమాప్తము.