భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

39. షష్ఠి కల్ప వర్ణనము

 తా॥ సుమంతుముని యిట్లనెను. “షష్ఠినాడు, ముఖ్యముగా కార్తీక మాసమునందలి షష్ఠినాడు, కేవలము ఫలహారముతో నుపవసించి షష్ఠీవ్రతము నాచరించువానికి తాను కోల్పోయిన రాజ్యము తిరిగి లభించును. ఈ షఫీతిథి అన్నింటినీయగలుగునది. అన్ని కోరికలను నెరవేర్పగలుగునది. జయమును వాంఛించు వారలు ఈ తిథినాడు సర్వదా ఉపవాస వ్రతమనుష్ఠింపవలెను. ఇది కుమారస్వామికి ప్రియమైన మహాతిథి. ఆ మహాత్ముడీ దినముననే దేవ సేనకు నాయకత్వమును పొందెను. స్కందుడీ దినమున ప్రఖ్యాతముగ నగ్రణికాగలిగినందున, భక్తుడీ దినమున రాత్రిమాత్రమే భోజనము చేసి ప్రతాచరణము చేసినచో ఆస్వామి అనుగ్రహమున కోరికలన్నియుఁదీరును. దక్షిణముఖముగా నుండి కార్తికేయునకర్ష్యమిచ్చి, ఈ మంత్రములుచదువుచు, పెరుగు, నేయి, నీరు పూలు మొదలైన వానిచే అతనిని పూజింపవలేను. “సప్తఋషుల భార్యల కుమారుడవైన ఓ స్కందా! అగ్నిసముద్భవా! రుద్రార్యమాగ్నిసంభవా! ప్రభో! గంగచేత గర్భమున ధరింపబడినవాడా! నీకు నమస్కారము. దేవ సేనాని యగు కుమారస్వామి మనోరథమును పూర్తిచేయుగాక ఈ ప్రార్థన చేసి, తన ఆహారమును బాహ్మణునకు పెట్టి, మిగిలినదానిని తాను రాత్రికి భుజించి నేలపై పరుండవలెను. ఇట్లు షష్ఠినాడు చేయవలసిన వ్రతము లోకానుగ్రహము కొఱకు స్కందునిచే చెప్పబడినది. ఆవివరమంతయు నేను చెప్పుచున్నాను. వినుము. షష్ఠినాడు పండ్లుమాత్రము తిని రాత్రిపూట భోజనము చేయవలెను. నియమనిష్ఠలతో, బ్రహ్మచర్యము బూని, సమాహితచిత్తుడై శుక్లపక్ష కృష్ణపక్ష షష్ఠీతిథులందు ఈ వ్రతమాచరింపవలెను. అట్లు ఆచరించిన వానికి సకల వాంఛసిద్ధి, ధైర్యము, సంతోషము, రాజ్యము, రోగములు లేని దీర్ఘాయువు, లభించును. స్కందుడైహికాముష్మిక ఫలములిచ్చును. సందేహము లేదు. రాత్రి ఉపవసించినవాడు రాత్రియే ప్రతి యగును. ఈలోకమున, పరలోకమునను అతడు ఉత్తమమైన ఖ్యాతిని పొందును. అతనికి దీర్ఘకాలము స్వర్గవాస సౌఖ్యము లభించును. కాలాంతరమున నీ లోకమునకు వచ్చి దేవతలకు కూడ వంద్యుడై చక్రవర్తి స్థానములంకరించును. కురుకులో ద్వహా! ఈ షష్ఠికల్పమును వినువానికి కూడ వాంఛాసిద్ధి, తుష్టి, ధృతి, కీర్తియు లభించును.

శతార్ధ సాహస్రసంహిత యగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున షష్టీకల్ప వర్ణనమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.