భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

65. ఆదిత్యమహాత్మ్య వర్ణనమున రహస్యా సప్తమి వర్ణనము

 తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. ఇక పైన 'రహస్యాసప్తమి' గూర్చి చెప్పెదను. ఈ వ్రతానుష్టానము వలన గడచిన ఏడు తరముల వారు, రాబోవు ఏడు తరములవారును జనన మరణ రూప సంసారము నుండి ముక్తులగుదురనుటలో సంశయములేదు. అంతేకాక దారుణములైన రోగములు నశించిపోవును. దుర్జయులైన శత్రువులు జయింపబడుదురు-1, 2. దుస్సాధ్యములగు ప్రయోజనములు నెరవేరును. వివాహము కానీ వానికి వివాహమగును. ధనము కావలసినవాడు ధనవంతుడగును-3. కొడుకులు కావలసిన వారికి కొడుకులు కలుగుదురు. ధర్మము కోరెడు వానికి ధర్మము లభించును. విచక్షణుడు సమయమును పాలించుచు దీనిని చేయవలెను-4. శ్రేయస్సు కొఱకు ఈ సమయములను (ఆచార నియమములు) చెప్పెదను. వినుము. సూర్యుని భక్తుడైన మనుష్యుడు సప్తమినాడు-5, అందజీయెడ స్నేహభావమున నుండవలెను. సూర్య దేవుని చింతన చేయుచుండవలెన. ఆ దినమున నూనెను ముట్టకూడదు. నీలపు రంగు వస్త్రమును ధరింపకూడదు-6. ఉసిరికలతో స్నానము చేయకూడదు. ఎవరి తోడను జగడమాడరాదు. “దిండి ఇట్లనెను” ఓ బ్రహ్మదేవా! సప్తమినాడు తైలము నెందులకు స్పృశింపరాదు-7. నీల వస్త్రమును ధరించుటచే నెట్టి దోషము కలుగును?” ఈ ప్రశ్నలు విని బ్రహ్మదేవుడిట్లు సమాధానము చెప్పెను. "దిండీ! నీల వస్త్ర ధారణము వలన-8. ఏమి దోషము కలదో విశదముగ చెప్పెదను వినుము-8. పశ్వాదులను పాలించుట, అమ్ముట, సద్వృత్తి పై ఆధారపడి జీవించుట (జీవిక కొఱకు యతి వృత్తి నవలంబించుట)-వీనిచేత బ్రాహ్మణుడు పతనమగును. మూడు కృచ్చ వ్రతములచేత శుద్దుడగును. (మూడు దినములు పగలు మాత్రము, మూడు దినములు రాత్రి మాత్రము, బోజనము, మూడు దినములయాచిత భోజనము, మూడు దినములు కేవలము ఉపవాసము కృచ్ఛమనబడును. నీలవస్త్రము ధరించి చేసిన కర్మవ్యర్థమగును.

తా॥ నీల సూత్రముతో చేయబడిన వస్త్రమును ధరించి చేసిన స్నానము, దానము, జపము, హోమము, వేదాధ్యయనము, పితృతర్పణము, మహాయజ్ఞము లేవియైనను వ్యర్థములగును-11. బ్రాహ్మణుడు నీలిరంజన గల వస్త్రము నొకమారు ధరించిన యెడల దాని వలన కలుగు దోషము ఒక పగలు ఒకరాత్రి ఉపవాసము చేసి పంచగవ్యప్రాశన చేసిన యెడల శుద్ధి యగును.-12. నీలవర్ణమేదేని రోమకూపములందు ప్రవేశించిన యెడల అట్టివాడు పతితుడగును. మూడు సాంతపనములు (కృచ్చములు) ఆచరించినచో శుద్దుడగును-13. బ్రాహ్మణుడెప్పుడేని పొరపాటున ద్రోణి వృక్షముల మధ్యకు పోయినచో అహోరాత్రములుపవసించి పంచగవ్యప్రాశన చేసినచో నాదోషము పోయి పరిశుద్దుడగును-14. నీలికట్టి బ్రాహ్మణుల శరీరమునందు తగిలి రక్తము కనబడినచో చాంద్రాయణ వ్రతము నాచరింపవలెను -15. ఎవడేని అజ్ఞాన వశమున నీలి పుల్లతో దంతధావనము చేసికొనిన యెడల రెండు కృచ్ఛ వ్రతములతో శుద్ధియగును. సంశయములేదు-16. నీలి చెట్లను నాటిననేల అపవిత్రమగును. పన్నెండు సంవత్సరములు దాటిన తరువాతనే ఆభూమి తిరిగి శుచియగును-17. ఇక సప్తమినాడు తైల స్పర్శచేసిన యెడల ప్రియమైన భార్య నశించిపోవును. ఈ విధముగ నీలి-తైలముల దోషములను చెప్పితిని-18. సప్తమీవ్రతమునాచరించువాడు మాంసభక్షణ చేయరాదు. మద్యము త్రాగరాదు. ఎవరికిని ద్రోహము చేయరాదు. కఠినముగా ప్రవర్తింపరాదు -19. చండాలుని పలుకరింపరాదు. స్త్రీతో, రజస్వలతో మాటాడరాదు. హీనుని తాకరాదు. మృతాశౌచము గలవానిని చూడరాదు.

తా॥పొడచుట, చీల్చుట, చచుట కూడదు. అతిమాత్రమైన నవ్వుకూడదు. పాటలు పాడకూడదు. మిక్కిలి వ్యామోహపడుచు నాట్యము చేయరాదు. వాద్యములు వాయించుట ని షేధము-21. స్త్రీతో కూడి పరుండరాదు. జూదమాడరాదు. కన్నీటి పర్యంతముగ నేడ్వరాదు. శోకాకులమైన వాక్యములు మాట్లాడకూడదు-22. తల పేలు తీయరాదు. వ్యర్థతర్కములు చేయరాదు. ఇతరులకు సంబంధించిన అనీష్ణకథనము, మిక్కిలిగా శోకించుటవదల వలెను-23. జంతువులను కొట్టుట, మితి మీరి భుజించుట, పగలు నిద్రించుట డంబము, శఠము-24. పౌరులవెంటతీరుగుట- వీనినీ ప్రయత్నపూర్వకముగ విడువవలెను. ఇక తరువాత వీధులను వినుము-25. చైత్రమాసము మొదలుకొని ఈ 'సర్వదాసప్తమి'ని అనుష్టింపుచుండవలెను. సూర్యభగవానుని చైత్రమున “థాత' యని,-26 వైశాఖమున ఆర్యముడుగ, జ్యేష్ఠమున మిత్రుడుగ, అషాఢమున వరుణుడుగ, శ్రావణమున నింద్రుడుగ-27. భాద్రపదమున వివస్వంతుడుగ, ఆశ్వయజమున పర్జన్యుడుగ, కార్తీకమున పూషగా, మార్గశీర్షమున ఇషుడుగ, పుష్యమున భగుడుగ, మాఘమున త్వష్టగ, ఫాల్గునమునందు విష్ణువుగ పూజింపుచుండవలెను-29. ప్రతి సప్తమి దినమున తినువారందఱికి నేతితో కూడిన భోజనము పెట్టించవలేను. సలక్షణముగ భోజన సంతర్పణము ముగించి-30. భుజించిన విప్రులకు ఐదు గురిజల ప్రమాణముగ బంగారము దక్షిణలీయవలెను. సఘృత భోజనమునే ఏర్పాటు చేయవలెను. ఎఱ్ఱని (లేక వివిధ వర్ణముల) వస్త్రములనీయవలెను-31. భోజక బ్రాహ్మణులు లేని యెడల ద్విజోత్తములందకి దక్షిణలీయవలెను. ఉన్నచో వారికి మిక్కిలి శ్రద్ధగా అన్నదానము చేయవలెను-32. ముఖ్యముగా సప్తమీ కల్పమును తెలిసిన ప్రవచకునకు భక్తి శ్రద్దలతో భోజన తాంబూల దక్షిణలు సమర్పింపవలెను. ఇట్లు నీకు సప్తమీ వ్రత విధానమును వివరించి చెప్పితిని-33. ఇది వినినవారికి పాపములు హరించిపోయి సూర్యలోక ప్రాప్తి కలుగును.

శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున బ్రహ్మదిండి సంవాదమున సప్తమీ కల్పము నందలి ఆదిత్య మాహాత్యవర్ణనమను అటువది యైదవ అధ్యాయము సమాప్తము.