భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

38. పంచమి కల్ప సమాప్తి కథనము

 తా॥ సుమంతుముని యిట్లనెను. “అటులే ఆశ్వయుజ మాసమునందలి పంచమీ తిథియందు దర్బలతో నాగా కృతులను చేసి గంధాదులచే పూజింపవలేను, నేయి, నీరు, పాలు అభి షేకమునందు వినియోగింపవలెను. గోధమలను (పిండిని) పాలతో తడిపి చేసిన వివిధములైన భక్ష్యములను నివేదింపవలేను. ఈ దినమున యథావిధిగ శుచియై భక్తి యుక్తుడై నాగులను పూజించువానికి శేషుగడు మొదలగు. సర్పములు సంప్రీతులైనందున శాంతి కలుగును. అనేక సంవత్సరముల వఱకు నతడు శాంతి లోకమున సుఖసంతోషములనులనుభవించును. ఇట్లు పంచమీకల్పముత్తమమైనదిగా వివరింపబడినది. ఈ దిగువ మంత్రము ఎచట ఉచ్చరింపబడునో అచట సర్పములు నిషేధింపబడును. “ఓం కురు కుల్లే ఫట్ స్వాహా".

శతార్ధ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహాపురాణము నందలి బ్రహ్మపర్వమున, పంచమీకల్పమునందు సమాప్తికథనమును ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.